అనాధ పిల్లలను పాఠశాలలో చేర్పించిన జిల్లా న్యాయ సేవాధికార.

అనాధ పిల్లలను పాఠశాలలో చేర్పించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు:-

వరంగల్/హన్మకొండ నేటిధాత్రి (లీగల్):

 

వరంగల్ మరియు హన్మకొండ న్యాయ సేవాధికార సంస్థల ఆధ్యర్యంలో ఇరువురు అనాధ బాలురలను వివేకానగర్ లోని సాయి స్పందన పాఠశాలలో జాయిన్ చేశారు.గీసుకొండ మండలం పోతరాజుపల్లి గ్రామానికి చెందిన ఓని రమేష్, తిరుపతమ్మలకు  గౌతం వయస్సు 11 సంవత్సరాలు మరియు గర్విక్ వయస్సు 6 సంవత్సరాల కుమారులు కలరు. అనారోగ్య కారణాల వల్ల ఆరు నెలల క్రితం రమేష్ మరియు తిరుతమ్మలు మరణించడంతో  గౌతం మరియు గర్విక్ లు అనాదలైనారు. వీరు అనాథలుగా మిగిలిపోవడంతో  పెద్ద నానా అయిన ఓని విజయ్  వీరిని తనవద్ద ఉంచుకున్నాడు. తరువాత వీరిని పాఠశాలలో చేర్పించడానికి స్థోమత లేక పోవడం తో తేదీ:- 05- 06-2025 రోజున జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు దరఖాస్తు చేశారు. వెంటనే  వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయి కుమార్, క్షమాదేశ్ పాండే గార్లు స్పందించి వారిని సాయి స్పందన పాఠశాలలో చేర్పించి వారికి అండగా ఉంటామని చెప్పారు. ఇట్టి కార్యక్రమం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహకారంతో జరిగింది

అనాధ వృద్ధురాలికిఆశ్రయం కల్పించిన శ్రీధర్ రెడ్డి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఐదో వార్డ్ కు చెందిన వృద్ధురాలు కూకట్ల రాజవ్వ వయసు 85. సంవత్సరాలు దిన స్థితిలో ఉండి పోషించేవారు ఎవరూ లేక వృద్ధుల వివరాలు తెలుసుకొని తెలుసుకొని మేనల్లుడు కూకట్లతిరుపతి ద్వారా తంగలిపల్లి గ్రామానికి చెందిన ఎడమల్ల శ్రీధర్ రెడ్డి లింగాల జలంధర్ జిల్లా సంక్షేమ అధికారి కి సమాచారం అందించి తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ గ్రామంలోని అమ్మ అనాధవృద్ధాశ్రమం నిర్వాహకులు గడ్డం తిరుమల శ్రీనివాస్ గారికి అప్పగిస్తూ అమ్మ అనాధ వృద్ధాశ్రమంలో స్వచ్ఛందంగా చేర్పించడంజరిగింది ఇందుకుగాను మా పరిస్థితి దిన స్థితిలో ఉండి తమ బాగోబాగులు తెలుసుకొని వృద్ధాశ్రమంలో చేర్పించిన ఎడమల శ్రీధర్ రెడ్డి కి లింగాల జలంధర్ కి నిర్వాహకులు గడ్డం తిరుమల శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version