బడిబాట ముగింపులో.. దాతలకు సన్మానం

— బడిబాట ముగింపులో.. దాతలకు సన్మానం

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

 

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం జూన్ 6 నుండి 19వ తేదీ వరకు కొనసాగిందని చివరి రోజు ముగింపు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు పద్మా రెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలంలోని రాంపూర్ గ్రామంలో గురువారం ముగింపు సన్మాన కార్యక్రమం లో భాగంగా పాఠశాలకు కంప్యూటర్ బహుకరించిన శ్రీకాంత్, మినరల్ వాటర్ అందిస్తున్న అంజా గౌడ్ లను ప్రధానోపాధ్యాయులు పద్మా రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు ఈశ్వరయ్య, అర్జున్, సుకన్య, నరేష్, చంద్రకాంత్, కుమారస్వామి లు ఉన్నారు.

కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం.

కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లాలో యుటీఎస్ ఆధ్వర్యంలో బడిబాట చేపట్టారు. మునిపల్లి, కోహీర్, జహీరాబాద్, మొగుడంపల్లి తదితర మండలాలలోని వివిధ గ్రామాల్లో బడిబాట జీపీ యాత్ర కొనసాగించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల క్షేత్ర పర్యటన.!

విద్యార్థుల క్షేత్ర పర్యటన

క్షేత్ర పర్యటన ద్వారా ప్రత్యక్ష అనుభవంతో విజ్ఞానం

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి దాత్రి

మండలంలోని శ్రీ వివేకవర్ధిని హై స్కూల్ విద్యార్థులు బుధవారం క్షేత్ర పర్యటనలో భాగంగా మల్యాల లోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారని పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ తెలిపారు. పాఠశాలకు చెందిన 8 , 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులను క్షేత్ర ప్రదర్శనకు తీసుకువెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా యాకాంతం గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలలో ఉన్న జ్ఞానాన్ని మాత్రమే ఇవ్వకుండా క్షేత్ర పర్యటన ద్వారా ప్రత్యక్ష అనుభవంతో ఎక్కువ విజ్ఞానాన్ని పొందుతారన్నారు. కృషి విజ్ఞాన కేంద్రంతోపాటు హార్టికల్చర్ సెంటర్ ను విద్యార్థులు సందర్శించడం జరిగింది. విద్యార్థులు శాస్త్రవేత్తలను తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ మాలతి, క్రాంతి కుమార్, ఉపాధ్యాయులు మహమ్మద్ అఫీజ్, సుభాష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version