బెస్ట్ అవైలేబుల్ పాఠశాల విద్యార్థుల అవస్థలు
విద్యార్థులను హాస్టల్లో చేర్చుకొని యాజమాన్యం
ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు
సిరిసిల్ల జిల్లా:(నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని శ్రీ సరస్వతి పాఠశాలలో బెస్ట్ అవైలేబుల్ ద్వారా చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు సంవత్సరాల నుండి శ్రీ సరస్వతి స్కూలుకు బిల్లులు రాకపోవడంతో విద్యార్థులను హాస్టల్ కు తీసుకు రాకూడదని తల్లిదండ్రులకు స్కూల్ యజమాన్యం సూచించింది. దీంతో దిక్కు తోచని స్థితిలో సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో సరైన విద్య ప్రమాణాలు లేవని మరియు భోజనం వసతి సౌకర్యాలు అంతంతే నని, పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు బెస్ట్ అవైలబుల్ కింద సీటు రావడంతో అక్కడ ఎంతో నాణ్యమైన విద్య అందుతుందని మొదట మురిపించిందని ఇలా పాఠశాల యజమాన్యం ఇబ్బందులకు గురిచేయడం వల్ల విద్యార్థులు మానసిక అందోలోనాలతో కృంగిపోతున్నారని వెంటనే కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశామన్నారు.