ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పినచ్చాలి
పాఠ్యపుస్తకాలు యూనిఫాంలో సకాలం లో అందజేయాలి
విద్య హక్కు చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలి
కార్పొరేట్, ప్రైవేటు విద్య సంస్థల ఫీజు దోపిడీని అరికట్టాలి
విద్యాసంస్థల్లో స్టేషనరీ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలి
గుండాల మండల కార్యదర్శి గడ్డం వరుణ్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
మండల లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మౌలికవసతులు కల్పించాలని,ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్య హక్కు చట్టాన్ని అమలు చేయాలి. ఫీజు దోపిడీని అరికట్టాలినీ, విద్యాసంస్థల్లో స్టేషనరీ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలినీ డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఏంఈఓ కి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో గుండాల మండల కార్యదర్శి వరుణ్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం పున ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నసందంగా కనిపించడం బాధాకరం అని అన్నారు. తక్షణమే పాఠ్యపుస్తకాలు యూనిఫాంలో విద్యార్థులకు అందజేయాలని డిమాండ్ చేశారు. మండలంలోని ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కొన్నిచోట్ల అరకొర వసతులు మాత్రమే ఉన్నాయని సరిపడ గదులు లేక విద్యార్థుల అవస్థలు పడుతున్నారని . ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు పిలుపునిస్తామని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో తరుణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.