యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక సెన్సేషన్ – మోతె రాజిరెడ్డి…

యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక సెన్సేషన్ – మోతె రాజిరెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

 

యువగళం పాదయాత్ర రాష్ట్ర చరిత్రలో ఒక సెన్సేషన్స్ అని టిడిపి వేములవాడ కమిటీ సభ్యులు, టిఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ మాజీ అధ్యక్షులు మోతె రాజిరెడ్డి అన్నారు. రాష్ట్ర ఐటి,విద్య శాఖా మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చేసి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని,తెలుగుజాతిని కాపాడడానికి చేసిన పాదయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. బడుగులు, బలహీనులు, పేదలు, మహిళలు, యువకులు, రైతులు వారి కష్టాలను, కన్నీళ్లను తెలుసుకుంటూ రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడువేల ముఫ్ఫైరెండు కిలోమీటర్లు తోంభైఏడు నియోజకవర్గాలు రెండువేల తోంభైనాలుగు గ్రామాలు ఒకటిన్నర కోట్ల మంది గుండె తలుపులను తడుతూ ఆనాడు మంత్రి నారా లోకేష్ యువగళం సాగిందని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి రావడానికి యువగళం గేమ్ చెంజర్ గా పని చేసిందన్నారు.

మహాత్మా పూలేకు ఘన నివాళి

సామాజిక న్యాయదిక్సూచి జ్యోతిరావు పూలే

టి,ఎన్,ఎస్,ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి

సిరిసిల్ల టౌన్,నేటిధాత్రి:

 

సామాజిక న్యాయదిక్సూచి మహాత్మా జ్యోతిరావు పూలే అని టి,ఎన్,ఎస్,ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు,టిడిపి వేములవాడ నియోజకవర్గ అడాహాక్ కమిటీ సభ్యులు మోతె రాజిరెడ్డి అన్నారు.
సామాజిక న్యాయం,మహిళా విద్య, సమాన హక్కుల కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్థంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి వారికి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీనజన భాందవుడు అని పేర్కొన్నారు. సమసమాజ స్థాపనలో భావితరాలకు నిత్యస్పూర్తిగా నిలిచిన వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మిద్దె ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version