మద్యం మత్తులో యువకుడు ఆత్మహత్య.

మద్యం మత్తులో యువకుడు ఆత్మహత్య

జైపూర్,నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2.wav?_=1

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రానికి చెందిన బొమ్మన సంపత్ (30) అనే వ్యక్తి మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రాజేందర్ సోమవారం తెలిపారు.జూలై 11న రాత్రి తాగిన మైకంలో పురుగుల మందు తాగినట్లు కుటుంబ సభ్యులు గమనించి చెన్నూరు ఆసుపత్రికి తరలించారు.అనంతరం కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు మృతుడికి భార్య స్వప్న, సోదరుడు రాజేందర్ ఉన్నారని తెలిపారు.

ఉపాధి కూలీల పెండింగ్ వేతనాలు చెల్లించాలి…

ఉపాధి కూలీల పెండింగ్ వేతనాలు చెల్లించాలి…

సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా…

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-1.wav?_=2

నేటి ధాత్రి -బయ్యారం :-.

మహబూబాబాద్ జిల్లా,బయ్యారం మండలంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో పనిచేసిన కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులుమరియు బయ్యారం మాజీ సొసైటీ చైర్మన్ రామగిరి బిక్షం డిమాండ్ చేశారు. సోమవారం న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మండల అభివృద్ధి అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో జి.విజయలక్ష్మి కి అందజేశారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి రామగిరి బిక్షం మాట్లాడుతూ,2024 – 2025 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కూలీలు పనులు చేసిన ఆరు వారాల డబ్బులు విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సరం చేస్తుందని అన్నారు.ఒక వారానికి 300 రూపాయలు ఆటో కిరాయి పెట్టుకొని పని ప్రదేశానికి వెళ్లి పని చేయడం జరిగిందని, ఇలా సుమారు మూడు నుంచి ఆరు వారాల వరకు పని చేసినా డబ్బులు కార్మికుల ఖాతాల్లో పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి నుండి పనిచేసిన వారికి కాకుండా మధ్యలో వచ్చిన వారికి డబ్బులు చెల్లిస్తున్నారని విమర్శించారు. కొంత మంది కార్మికులు పని చేసినా వారికి హాజరు వేయకుండా ఆబ్సెంట్ వేసారని అన్నారు. ఉపాధి హామీ పనిలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని, అధికారులకు డబ్బులు ఇస్తేనే బ్యాంకుల్లో డబ్బులు పడే విధంగా చేస్తున్నారని అనేక మంది కార్మికులు వాపోతున్నారని అన్నారు.వేసవిలో ఎర్రటి ఎండలో కష్టపడి పని చేస్తే వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేయడం దుర్మార్గమని విమర్శించారు.ప్రతి సంవత్సరం ఉపాధి హామీ కూలీలకు రెండు నుండి మూడు వారాలు డబ్బులు చెల్లించకుండా ఎగవేస్తున్నారని విమర్శించారు. తక్షణమే పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ డబ్బులు చెల్లించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఉపాధి హామీ కార్మికులను సమీకరించి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు తుడుం వీరభద్రం, నేతకాని రాకేష్, గ్రామ నాయకులు బి రెడ్డి సంగన్న,జరిపోతుల బుచ్చయ్య, రెడ్డి మల్ల విశ్వనాధం, సోమారపు సుధాకర్, జినక లక్ష్మీనారాయణ, ఉపాధి కూలీలు జినుక రేణుక, గాజుల వెంకన్న, అబ్బరబోయిన రేణుక, విజయ, కాశమ్మ తదితరులు పాల్గొన్నారు.

పంట పొలాలకు తాలిపేరు నీటిని విడుదల చేసిన..

పంట పొలాలకు తాలిపేరు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

నేటిదాత్రి చర్ల

చర్ల మండలం పెదమిడిసిలేరు గ్రామంలో తాలిపేరు ప్రాజెక్టు నుంచి ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పంటలకు సాగునీరు అందించడం కొరకు కాలువ గేట్లు ఎత్తి నీళ్లును విడుదల చేసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

MLA Dr. Tellam Venkat Rao

ఈ ప్రాజెక్ట్ 0. 5 టిఎంసి నీటిని ఉపయోగించుకుంటూ ఈ ఆయకట్టు ద్వారా చర్ల దమ్ముగూడెం మండలాల్లోని గ్రామాలకు చెందిన సుమారు 25000 ఎకరాలకు సాగునీరును అందిస్తుందని తెలిపారు

MLA Dr. Tellam Venkat Rao

ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు మాజీ ప్రజా ప్రతినిధులు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

MLA Dr. Tellam Venkat Rao

 

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download.wav?_=3

 

ఉపాధి కూలీల పెండింగ్ వేతనాలు చెల్లించాలి…

ఉపాధి కూలీల పెండింగ్ వేతనాలు చెల్లించాలి…

సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా…

నేటి ధాత్రి -బయ్యారం :-

మహబూబాబాద్ జిల్లా,బయ్యారం మండలంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో పనిచేసిన కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులుమరియు బయ్యారం మాజీ సొసైటీ చైర్మన్ రామగిరి బిక్షం డిమాండ్ చేశారు. సోమవారం న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మండల అభివృద్ధి అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో జి.విజయలక్ష్మి కి అందజేశారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి రామగిరి బిక్షం మాట్లాడుతూ,2024 – 2025 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కూలీలు పనులు చేసిన ఆరు వారాల డబ్బులు విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సరం చేస్తుందని అన్నారు.ఒక వారానికి 300 రూపాయలు ఆటో కిరాయి పెట్టుకొని పని ప్రదేశానికి వెళ్లి పని చేయడం జరిగిందని, ఇలా సుమారు మూడు నుంచి ఆరు వారాల వరకు పని చేసినా డబ్బులు కార్మికుల ఖాతాల్లో పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి నుండి పనిచేసిన వారికి కాకుండా మధ్యలో వచ్చిన వారికి డబ్బులు చెల్లిస్తున్నారని విమర్శించారు. కొంత మంది కార్మికులు పని చేసినా వారికి హాజరు వేయకుండా ఆబ్సెంట్ వేసారని అన్నారు. ఉపాధి హామీ పనిలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని, అధికారులకు డబ్బులు ఇస్తేనే బ్యాంకుల్లో డబ్బులు పడే విధంగా చేస్తున్నారని అనేక మంది కార్మికులు వాపోతున్నారని అన్నారు.వేసవిలో ఎర్రటి ఎండలో కష్టపడి పని చేస్తే వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేయడం దుర్మార్గమని విమర్శించారు.ప్రతి సంవత్సరం ఉపాధి హామీ కూలీలకు రెండు నుండి మూడు వారాలు డబ్బులు చెల్లించకుండా ఎగవేస్తున్నారని విమర్శించారు. తక్షణమే పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ డబ్బులు చెల్లించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఉపాధి హామీ కార్మికులను సమీకరించి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు తుడుం వీరభద్రం, నేతకాని రాకేష్, గ్రామ నాయకులు బి రెడ్డి సంగన్న,జరిపోతుల బుచ్చయ్య, రెడ్డి మల్ల విశ్వనాధం, సోమారపు సుధాకర్, జినక లక్ష్మీనారాయణ, ఉపాధి కూలీలు జినుక రేణుక, గాజుల వెంకన్న, అబ్బరబోయిన రేణుక, విజయ, కాశమ్మ తదితరులు పాల్గొన్నారు.

అక్రమంగా కే ఎల్ ఐ మట్టి రాళ్లు తరలింపు.

అక్రమంగా కే ఎల్ ఐ మట్టి రాళ్లు తరలింపు.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని కురుమిద్ద గ్రామ శివారులో గల కె.ఎల్.ఐ కాల్వ పక్కన ఉన్న రాళ్లను ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు బడా బాబుల అండదండలతో బయటకు టిప్పర్ల ద్వారా విక్రయించడంతో గ్రామస్తులు యువకులు టిప్పర్లను అడ్డగించి కల్వకుర్తి పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో టిప్పర్లను పోలీస్ స్టేషన్ ముందు ఉంచారు కానీ సంబంధిత అధికారులు మాత్రం స్పందించలేదు గ్రామస్తులు చరవాణి ద్వారా సమాచారం ఇవ్వడంతో మాకు ఏం తెలియదు మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పారు ఏది ఏమైనా సరే టిప్పర్లను సీజ్ చేయాలని గ్రామస్తులు కల్వకుర్తి ఎస్ఐ కి ఫిర్యాదు చేశారు. కే ఎల్ ఐ కాల్వ పక్కన ఉన్న రాళ్లను మట్టిని బయటికి తరలిస్తే భవిష్యత్తులో ఏమైనా వరదలు వచ్చి పంట పొలాలు గ్రామంలోని గృహాలు మునిగిపోయి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కనుక సంబంధిత అధికారులు ఇప్పటికైనా ఈ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.

సెక్రటరీల బాధలు వర్ణాతితం.

సెక్రటరీల బాధలు వర్ణాతితం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలో పంచాయతీ సెక్రటరీల అవస్థలు బిల్లులు రాక, సొంత ఖర్చులతో సేవల నిర్వహణ జహీరాబాద్ నియోజకవర్గంలో పంచాయతీ సెక్రటరీలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన పని పూర్తి చేసినా ఇప్పటి వరకు బిల్లులు విడుదల కాకపోవడంతో, వారు తమ సొంత డబ్బులతోనే గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. మండలాల్లో సాగుతున్న గ్రామ శుభ్రత, మరమ్మత్తులు, నీటి సరఫరా, ఎలక్ట్రికల్ పనులు వంటి ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాలన్నీ సెక్రటరీలే ముందుండి నిర్వహిస్తున్నారు. కానీ వాటికి రావాల్సిన నిధులు లేకపోవడంతో తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒక పంచాయతీ సెక్రటరీ మాట్లాడుతూ – “ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదు. కానీ గ్రామ అభివృద్ధి ఆగిపోకుండా చూడాలి కదా అని సొంత డబ్బులతో పనిచేస్తున్నాం. వేతనం కంటే ఎక్కువ ఖర్చు అవుతోంది. అయినా సేవ చేయాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నాం” అన్నారు. ఈ పరిస్థితులు ప్రభుత్వానికి తెలియజేసినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యాలయాల్లో కనీస వసతులు లేక, పనుల నిర్వహణలో అనేక అవరోధాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నిధులు విడుదల చేసి, తమ బాధలు తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ సెక్రటరీలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామ స్థాయిలో సేవల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న సెక్రటరీల సమస్యలు ప్రభుత్వం త్వరగా గుర్తించాలన్నది వారి ఆకాంక్ష.

మల్లన్న పై దాడిని ఖండిస్తున్నాం..

మల్లన్న పై దాడిని ఖండిస్తున్నాం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గ ము. బీసీ ముద్దు బిడ్డ, రాష్టం లో బీసీ ల రాజ్యాధికారం కోసం నిరంతరం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న యం యల్ సి మల్లన్న పై న జరిగిన దాడిని జహీరాబాద్ బీసీ కుల సంఘాల ఐక్య వేదిక తీవ్రంగా ఖండించింది. ఇప్పుడిప్పుడే బీసీలు రాజకీయాలు చేస్తున్న తరుణం .రాష్టం లో ఎన్నో పార్టీలు ఉన్న ఎక్కువ శాతం ఉన్న బిసి లకు ఓటు బ్యాంక్ గానే చూస్తున్నారు.ఓట్లన్నీ బిసిలవి సీట్లన్నీ వాళ్ళవి అయిపోతున్నాయి. బీసీల కష్టాలు తీరాలంటే బీసీ నే ముఖ్యమంత్రి ఉండాలి అయితేనే బీసీ ల కున్న అవసరాలు తీరుతాయి అనే ఉదేశ్యం తో రాష్ట్ర మంత తిరుగుతూ ఎన్నో వ్యయ ప్రాయసాలకు ఓర్చుకుంటు బిసిలను మమేకం చేస్తూ వారితో పాటు ఎస్సి, ఎస్టీ, మైనారిటీ లకు ఒక్కటి చేస్తూ రాజకీయాల్లో అందరూ క్రియ శీలంగా పాల్గొనాలి అని హిత బోధ చేస్తూ న్నా మల్లన్న పైన దాడి చేసి బిసి ఉద్దేమాని నీరు కార్చాలని చూస్తున్నారు.మల్లన్న పై దాడి కేవలం వ్యకి గతంగా కాదు? యావత్తు బిసి లపైనే దాడిగా జహీరాబాద్ బీసీ కుల సంఘాల ఐక్య వేదిక తీవ్రంగా ఖండిస్తున్నాం.ఎవరెన్ని కుట్రలు చేసిన,ఎన్ని దాడులు చేసిన రాష్టం లో అధికారంలోకి వచ్చేది బిసి ల పార్టీనే అని బీసీ కోర్ కమిటీ సభ్యులు డా.పెద్దగొల్ల నారాయణ అన్నారు.ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే 42 శాతం బిసిలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కలిస్తాం అంటున్నారు. 42 శాతం బిసి బిల్లుకు ఆర్డినెన్స్ పాస్ చేస్తూ బిల్ పాస్ చేయించాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిసి కోర్ కమిటీ సభ్యులు కొండాపురం నర్సింహులు, ఇమ్రాన్ ,విశ్వనాథ యాదవ్, కోట ధనరాజ్ గౌడ్ ,మహేష్ ముదిరాజ్,దశరత్,తదితరులున్నారు.

గిరిజన సంస్కృతికి ప్రతీక తీజ్ పండుగ…

గిరిజన సంస్కృతికి ప్రతీక తీజ్ పండుగ…

నేటి ధాత్రి -మహబూబాబాద్ -గార్ల :-

బంజారాల సంస్కృతి, సాంప్రదాయానికి చాటి చెప్పే పండుగలలో అతి ముఖ్యమైనది తీజ్ పండుగ. ఈ పండుగ బంజారాల జీవన విధానాన్ని వారి సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేస్తుంది.బంజారాల కట్టు,బొట్టు,సంస్కృతి, సాంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రతికగా నిలుస్తుంది. ఒక ప్రాంత ప్రత్యేకతను అక్కడి ప్రజల జీవన విధానాన్ని పండుగలు చాటి చెబుతాయి.వారి సంస్కృతి, చారిత్రక నేపథ్యం, వారసత్వాలకు,సంప్రదాయ, జానపద నృత్యాలు ప్రతీకగా నిలుస్తాయి. ఇలా ప్రత్యేకమైన అహార్యం, కళలు, పండుగలు తమ పూర్వికులు ఇచ్చిన ఆస్తిగా అవి అంతరించిపోకుండా చూసుకుంటున్నారు గిరిజన ప్రజలు.తరతరాల నుండి వస్తున్న బంజారా సంస్కృతి, సాంప్రదాయాలను రక్షించడం తీజ్ పండుగ ఉద్దేశం.తండాలో వర్షాలు బాగా కురిసి,ప్రతి తండా ప్రకృతి,పచ్చదనంతో కలకలలాడుతూ ఎల్లప్పుడూ పచ్చగా హరిత భరితంగా ఉండాలనే ఉద్దేశంతో జరుపుకుంటారు.ముఖ్యంగా పెళ్లి కాని ఆడపిల్లలు శ్రావణమాసంలో భక్తిశ్రద్ధలతో 9 రోజులు అత్యంత వైభవంగా తీజ్ పండుగను జరుపుకుంటారు.ఈ పండుగను తెలంగాణ రాష్ట్రం తో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర,గోవా, కర్ణాటక, దక్షిణ భారతదేశం,ఉత్తర భారత దేశంలోని ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్,ఛత్తీస్గడ్,రాజస్థాన్, గుజరాత్ మొదలైన రాష్ట్రాల్లో చాలా గొప్పగా జరుపుకుంటారు.వెదురు బుట్టలోనే కాకుండా మోదుగు ఆకులతో గుల్లగా చేసి అందులో మట్టిని పోసి గోధుమలను చల్లుతారు. పెళ్లి కానీ ఆడపిల్లలు ప్రతిరోజు మూడు పూటలు అందంగా ముస్తాబై వెదురు బుట్టలో ఉన్న గోధుమలకు నీళ్లు జల్లుతారు.ఆడపిల్లలు పులియాగొన్నో- పూర్ణకుంభం తలపై పెట్టుకుని బావినీళ్లు, బోరింగ్ నీళ్లు గాని,చెరువు నీళ్లు కానీ తీసుకువచ్చి తీజ్ కి పోస్తారు.గోధుమ మొలకలను తీజ్ గా పిలుస్తారు.తొమ్మిది రోజులపాటు ఎంతో నిష్టతో ఆడపిల్లలు ఉపవాసం ఉండి భక్తిశ్రద్ధలతో తీజ్ పండుగను జరుపుతారు.పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. ఊరి ప్రజలు ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో తిజ్ వద్దకు చేరుకుంటారు.

 

లాంబీ లాంబి ఏ లాంబడి ఏ కేరియో,దొకా కేరియే లాంబడి ఏ కెరియ, తోనకున బోరయో తీజ పావ్ లేనా,సేవా భయా బోరయో తిజ బయిరో పావ్ లేనా అంటూ పాటలు పాడుతారు. 9 రోజుల తీజ్ పండుగ సందర్భంగా ఆడపిల్లలకు కఠినమైన నియమాలు ఉంటాయి.ఉప్పు, కారం లేని భోజనం తినాలి. అత్యంత పవిత్రంగా ఉండాలి. భక్తితో దేవతలను పూజించాలి. తండా నుంచి బయటికి వెళ్ళకూడదు. మాంసం నిషేధం. బావి నుంచి నీటిని తెచ్చే బిందెను నేలపై పెట్టకుండా నేరుగా పందిరిపై నీరు పోయాల్సిందే.నృత్యాలు చేసినంత సేపు బిందెను నెత్తిపై పెట్టుకుని నిలబడాల్సిందే.నానబెట్టిన శనగలను రేగి మూళ్లను గుచ్చే ఒక విలక్షణమైన ఆచారాన్ని బోరడి ఝాస్కెరో పేరుతో పిలుస్తారు.చివరి రోజు నిమజ్జనం కనుల పండువగా బంజారా వేషధారణలో నిర్వహిస్తారు.నిమజ్జన కార్యక్రమంలో తండా పెద్దలు, మహిళలు,యువతీ, యువకులు, ఉద్యోగస్తులు, పెద్ద ఎత్తున పాల్గొంటారు.తీజ్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

సన్నబియ్యం ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే.

సన్నబియ్యం ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే.

మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా.

దుగ్గొండి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి:

నిరుపేదలు,సామాన్య ప్రజలు,ధనికుల ఓకె రకమైన సన్నబియ్యం తినాలనే ఉద్దేశ్యంతో దేశంలో మొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో సన్నబియ్యం పథకం ప్రారంభించారని దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్ అన్నారు.ఇటీవలే నూతనంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు ఆర్డినెన్సు చేసి దేశంలో చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందపరించిన విధంగా అన్ని పథకాలు అమలు చేస్తున్నదని వాటి అమలును ప్రజల్లోకి మండల పార్టీ సహకారంతో తీసుకెళ్తానని పేర్కొన్నారు. తనకు గత 30 ఏండ్లుగా రాజకీయ అనుభవం ఉన్న నేపథ్యంలో దుగ్గొండి మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపించుకుంటానని రమేష్ గౌడ్ హామీ ఇచ్చారు.తమపై నమ్మకంతో మండల అధ్యక్షునిగా బాధ్యత ఇచ్చిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి,సహకరించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,నియోజకవర్గ నాయకులు,మండల నాయకులు,కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

భక్తి శ్రద్ధలతో సంకష్ట చతుర్థి పూజలు..

న్యాల్కల్: భక్తి శ్రద్ధలతో సంకష్ట చతుర్థి పూజలు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంకష్ట చతుర్థి పర్వదినం సందర్భంగా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామ శివారులో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో సోమవారం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి అభిషేకాలు, సింధూర లేపనం, అలంకరణ గావించి అష్టోత్తర శతనామ స్తోత్ర యుక్తముగా పూజలు జరిపారు. తొలి మొక్కల దేవుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

సాహితి సమితి ఆధ్వర్యంలో దర్పణం పుస్తకం ఆవిష్కరణ.

సిరిసిల్ల సాహితి సమితి ఆధ్వర్యంలో దర్పణం పుస్తకం ఆవిష్కరణ

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోనీ ఈరోజు సిరిసిల్ల సాహితి సమితి అధ్యక్షులు జానపాల శంకరయ్య, మరియు కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ ఆధ్వర్యంలో మల్లేష్ చక్రాల కోనరావుపేటకు చెందిన రచయిత (ధర్పణం)కవిత పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగినది.అధ్యక్షులు జానపాల శంకరయ్య మాట్లాడుతు..ధర్పణం పుస్తకం నేటి సమాజంలో
నేటి యువతకు ఎంతగానో తొడపడుతున్నది.
సాహిత్యంతో నేటి యువత సద్వినియోగం చేసు కొని సమాజం లో ఉన్న అసమానతలు తొలిగించాలి అని తెలిపారు. అలాగే బాల సాహిత్య వేత్త వాసరవేణి పర్శరాములు మాట్లాడుతు పుస్తక రచయిత తన అక్షరాలను పూల మల్లికాల కుర్చీ
సమాజానికి తెలియజేస్తుంది అని తెలిపారు.
మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి పూర్ణచంధర్ మాట్లాడుతు ధర్పణం ఒక అద్భుతం పుస్తకం అని
అంతేకాకుండా సమాజంలో జరిగే పరిమానాలు
తెలియజేసే విధంగా ఉన్నది అని తెలిపారు. అంతేకాకుండా సిరిసిల్ల మానేరు కవులు, రచయతలకు ఒక పుట్టిన్నీళ్లు అని తెలిపారు.
ఈ కార్యక్రమం లో కోడం నారాయణ, బూర దేవానందం, ఏనుగుల ఎల్లయ్య,గడ్డం పర్శరాములు,గాయకుడు సుల్తానా మల్లేష్,
అంకారపు రవి, తదితరులు పాల్గొన్నారు.

స్థానిక మంజీరా విద్యాలయంలో వనమహోత్సవాన్ని.

స్థానిక మంజీరా విద్యాలయంలో వనమహోత్సవాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

రామంపేట జూలై 14 నేటి ధాత్రి (మెదక్)

ఈ కార్యక్రమంలో భాగంగా ఎఫ్.ఆర్.ఓ అంబర్ సింగ్ గారు, వనమహోత్సవం మరియు చెట్ల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. చెట్లు లేకపోతే మానవ మనుగడ లేదని ,చెట్లు మాత్రమే చెడును తీసుకొని మంచిని ఇస్తాయని. మానవులు వదిలేటటువంటి కార్బన్డయాక్సైడ్ ను తీసుకొని ,ఆక్సిజన్ మానవులకు ఉపయోగపడేటటువంటి ఆక్సిజన్ ఇస్తాయని ఇనుము ఎలా అయితే అయస్కాంతాన్ని ఆకర్షిస్తుందో ఆ విధంగా చెట్లు మేఘాలను ఆకర్షించే వర్షాలను కురిపింప చేస్తాయని ప్రతిరోజు మానవుడికి మూడు సిలిండర్ల ఆక్సిజన్ అవసరం ఉంటుందని ఒక సిలిండర్ విలువ 700 రూపాయలు అయినట్లయితే రోజుకి 2100 ఖర్చు అవుతుందని సంవత్సరానికి 7,66,500 అలాంటి ఆక్సిజన్ ని మనం ఉచితంగా తీసుకోగలుగుతున్నాం. అందరికీ ఆక్సిజన్ సిలిండర్ల అవసరము పడితే సిలిండర్లు దొరకక ఏ విధమైనటువంటి క్లిష్ట పరిస్థితి ఏర్పడుతుందో కరోనా సమయంలో అందరం చూసినటువంటిదే కాబట్టి చెట్లను నాటడం వాటిని సంరక్షించడం చెట్లతో పాటుగా అడవిని, జంతువులను ,నీటిని పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి విద్యార్థి అమ్మ పేరు పైన ఒక చెట్టును నాటాలని అమ్మను ఏ విధంగా చూసుకుంటారో ఆ చెట్టుని ఆ విధంగా చూసుకోవాలని విద్యార్థులకు వివరించడం జరిగింది. అమ్మ పేరు పైన చెట్టు నాటడం అనేది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి గారు చెప్పినటువంటి నినాదం. క్రమం తప్పకుండా మనం అందరం పాటించాలని చెప్పడం జరిగింది.

Forest Festival

మంజీరా పాఠశాలలో ఎఫ్ఆర్ఓ అంబర్ సింగ్ గారు, డిప్యూటీfro శ్రీనివాస్ గారు ,గీత ,కృష్ణ గారు చెట్లను నాటడం జరిగింది .విద్యార్థుల చేత మొక్కలు నాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ జితేందర్ రెడ్డి వాసవి, ప్రిన్సిపల్ సురేష్ ,అనిల్ ,శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

జోగంపల్లి చలివాగుప్రాజెక్టు నీటిని విడుదల చేసిన..

జోగంపల్లి చలివాగుప్రాజెక్టు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం జోగం పల్లి చలివాగు ప్రాజెక్టు చెరువు నీటిని దిగువన ఉన్న పంట పొలాలకు నీటిపారుదల శాఖ, ఇతర శాఖల అధికారులు మరియు కాంగ్రెస్ నేతలతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొ న్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నీటిని విడుదల చేశారు. అక్కడ తూము వద్ద ఎమ్మెల్యే టెంకాయ కొట్టి, చెరువులోకి పూలు చల్లారు. అనంతరం తూము గేట్ వాల్వ్ ను తిప్పి కిందికి నీటిని వదిలారు. అనం తరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వ ధ్యేయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రైతులకుఏకకాలం లో రెండు లక్షల రుణమాఫీ చేసిందన్నారు. రైతులు బాగుం టేనే గ్రామాలు అభివృద్ధిచెందు తాయన్నారు.ఈ కార్యక్రమం లో అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

ఆషాఢమాసం బోనాల కార్యక్రమంలో పాల్గొన్న.

ఆషాఢమాసం బోనాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఆషాఢమాసం బోనాల సందర్భంగా పట్టణంలోని వివిధ ఆలయలలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు,నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో,సుభిక్షంగా ఉండాలని ఆ తల్లిని వేడుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంస్ చైర్మన్ శివకుమార్ మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజీ మున్సిపల్ చైర్మన్ తాంజమ్, సినియర్ నాయకులు నామ రవికిరణ్,మాజీ పట్టణ అధ్యక్షులు యాకుబ్, విజిలిన్స్ మెంబెర్ రామకృష్ణ,ఎస్సి సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,వెంకట్, శివ ముదిరాజ్,నరేష్ రెడ్డి,మహమ్మద్ అలీ, జఫ్ఫార్, సందీప్, తదితరులు.

ఆశాఢ మాస బోనాల ఉత్సవాలల్లో పాల్గొన్న.

ఆశాఢ మాస బోనాల ఉత్సవాలల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు.

◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,

◆:- రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారు,మాజీ టిజిఐడిసి చైర్మన్ మహ్మద్.తన్విర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని గడి విధి లో జరిగిన ఆశాఢ మాస ఊరడమ్మ తల్లి బోనాల పండుగలో పాల్గొని అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి,మాజీ టిజిఐడిసి చైర్మన్ మహ్మద్ తన్విర్ గార్లతో కలిసి దర్శించుకున్నారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు.ఈకార్యక్రమంలో వారితో పాటు సిడిసి చైర్మన్ ముబీన్,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి,మాజీ కౌన్సిలర్లు రాజశేఖర్,మహిపాల్ రెడ్డి,అక్తర్ గోరి,రంగా అరుణ్,కాశీనాథ్,ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,అశ్విన్ పాటిల్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లారెడ్డి,అక్బర్,జావిద్,హఫీజ్,జుబేర్,రాజు నాయక్,మల్లికార్జున్,యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రతాప్ రెడ్డి,హర్షవర్ధన్ రెడ్డి,కిరణ్ గౌడ్,జగదీశ్వర్ రెడ్డి,నథానెయల్,అక్షయ్ జాడే,విష్ణువర్ధన్ రెడ్డి,నర్సింహా యాదవ్,పాండు యాదవ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇటీవల ఎమ్మెల్యే గారి సొంత గ్రామమైన ఝరాసంగం లో అనారోగ్యంతో బాధపడుతు కోలుకున్నా గ్రామ మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్,రామ్ సింగ్,కేతన్ చౌతయి, గార్ల వారి నివాసనికి చేరుకొని శాసనసభ్యులు కోనింటి మానిక్ రావు గారు,ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ డీసీఎంఎస్ శివకుమార్ గార్లు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి త్వరగా కోవాలని కోరారు.
వారితో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్, మాజీ కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నర్సింహా గౌడ్, పట్టణ అధ్యక్షులు ఎజాస్ బాబా, మాజీ సర్పంచ్ లు పరమేశ్వర్ పటేల్,శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజ్, అమరజిత్, ప్రభు పటేల్,బస్వరాజ్ పటేల్,ఫరూక్ పటేల్, నాయకులు వెంకట్ రెడ్డి, నవాజ్ రెడ్డి, నాగేశ్వర్ సజ్జన్,సంగన్న, శివ శంకర్ పటేల్, శశి వర్ధన్ రెడ్డి, కిజర్, విజయ్ పాటిల్, మాణిక్ యాదవ్,ఎంపీ శ్రీనివాస్ పటేల్,ఎంపీ నాగన్న, సోహైల్,రమేష్,రాజు కుమార్, బాలరాజ్, విల్లాస్, అనిల్ పటేల్, కృష్ణ, విజయ్, సాయ్యేద్, శివ వైజ్యనాథ్, రామ్ రెడ్డి, తదితరులు ఉన్నారు

కొత్త కాలువ నిర్మించారు,పాత బండరాళ్లను తీయ్యడం.!

కొత్త కాలువ నిర్మించారు,పాత బండరాళ్లను తీయ్యడం మరిచారు…

మందమర్రి నేటి ధాత్రి

ఒకవైపు వర్షాలు, మరో వైపు నిండిన కాలువలు, పట్టించుకునే వారేరని ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు.

జరా పట్టించుకోండి సార్, దోమల బెడదతో అల్లాడుతున్నా కాలనీ వాసుల గోడు.

అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని సిపియం పార్టీగా విజ్ఞప్తి.

దూలం శ్రీనివాస్
సిపిఎం మందమర్రి మండల కార్యదర్శి.

మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని శ్రీ వెంకటేశ్వర టెంపుల్ ఏరియా 3వ వార్డులో ఇటీవల కొత్త కాలువ నిర్మాణం చేసిన అధికారులు, పాత కాలువకు సంబంధించిన కాంక్రీట్ మరియు రాళ్లను రోడ్డు మీదనే వదిలి మరచిపోయారు. దానితో కాలనీ వాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చీకట్లో బండలు తగిలి గాయలపాలవుతున్నారు. వెహికల్ పై వచ్చే వారు కొంచెం అజాగ్రత్తగా వచ్చిన పెద్దపెద్ద బండరాళ్లకు తగిలి కింద పడుతున్నారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు ఆడుకొంటూ ప్రమాదాలకు గురవుతున్నారు. అంతేకాకుండా ఇటీవల కురిసిన వర్షాలకు కాలువలు శుభ్రం లేక, చుట్టూ పిచ్చి మొక్కలతో నిండి భయంకరంగా మారి పాములు ఇతర పురుగుబూసి కనిపించే పరిస్థితి కూడా లేదు. అంతేకాకుండా దీని వలన దోమల బెడద విపరీతంగా పెరిగాయి. కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకోని అధికారులు స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సిపియం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాము.

ఫోటో భవన్ రెండవ వార్షికోత్సవం సంబరాలు.

ఫోటో భవన్ రెండవ వార్షికోత్సవం సంబరాలు

మందమర్రి నేటి ధాత్రి

ఈరోజు మంచిర్యాల జిల్లా మందమర్రి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. ఫోటో భవన్ రెండవ వార్షికోత్సవం స్థానిక ఫోటో భవన్లో నిర్వహించారు

Welfare Association

శ్రీ అధ్యక్షులు పసుల వెంకటస్వామి ఫోటోగ్రఫీ పితామహుడు అయినటువంటి లూయిస్ డాగురే జెండా ఎగురావేశారు అనంతరం లూయిస్ డాగురేగారి చిత్ర పటానికి పూలమాలవేసి . జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం కేక్ కట్ చేశారు

Welfare Association

ఈ కార్యక్రమంలో. రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు వడ్డకొండ కనకయ్య గౌడ్.పట్టణ కార్యదర్శి ఆడెపు అశోక్ కుమార్. ఉపాధ్యక్షులు. లక్కిరెడ్డి అనిదర్ రెడ్డి.. ఆర్ సుజిత్ నక్క పవన్ తాళ్లపల్లి రమేష్. వర్కింగ్ ప్రెసిడెంట్ వలస మణిరజ్. ప్రచార కార్యదర్శులు పసుల రవి. రామసాని సురేందర్. కేశవేణి హరికృష్ణ. జూపాక చది. సర్వ సలహాదారులు నక్క తిరుపతి. ఎం వి సత్యనారాయణ. జాడి ముకుందం. మంచిర్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్వాస తిరుపతి. కుటుంబ భరోసా ఇన్చార్జి నూనె సురేష్. జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు.

Welfare Association

జహీరాబాద్ లో యువకుడి హత్య..

జహీరాబాద్ లో యువకుడి హత్య..

◆:- మొదట మిస్సింగ్.. అనంతరం హత్య.

◆:- శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణ పరిధిలోని ఫైజ్ నగర్కు చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. హ త్యకు గురైన వ్యక్తి మొహమ్మద్ తాజో ద్దీన్ (22)గా గురించారు. పట్టణ పరిధి అల్లానా రోడ్డులో గల రహమత్ నగర్ ప్రాంతంలో ఆయన మృతదేహం లభిం చింది. నిన్న నమాజ్ కోసం వెళ్తున్నట్లు
ఇంట్లో చెప్పి బయలుదేరిన యువకుడు రాత్రి వరకు రాలేదు. జామ మసీదు వద్ద ఆయన బైక్ ను రికవరీ చేశారు. ఇవాళ ఓ పాడు బావిలో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడకు చేరుకొని పరిశీలించగా మృత దేహం మీద గాయాలున్నందున కసితీరా పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పరారై నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా హత్య ఎవరు, ఎందుకు చేశారనేది తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఝరాసంగం మాజీ సర్పంచ్ ను పరామర్శన..

ఝరాసంగం మాజీ సర్పంచ్ ను పరామర్శన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఇటీవల ఎమ్మెల్యే గారి సొంత గ్రామమైన ఝరాసంగం లో అనారోగ్యంతో బాధపడుతు కోలుకున్నా గ్రామ మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్,రామ్ సింగ్,కేతన్ చౌతయి, గార్ల వారి నివాసనికి చేరుకొని శాసనసభ్యులు కోనింటి మానిక్ రావు గారు,ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ డీసీఎంఎస్ శివకుమార్ గార్లు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి త్వరగా కోవాలని కోరారు.
వారితో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్, మాజీ కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నర్సింహా గౌడ్, పట్టణ అధ్యక్షులు ఎజాస్ బాబా, మాజీ సర్పంచ్ లు పరమేశ్వర్ పటేల్,శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజ్, అమరజిత్, ప్రభు పటేల్,బస్వరాజ్ పటేల్,ఫరూక్ పటేల్, నాయకులు వెంకట్ రెడ్డి, నవాజ్ రెడ్డి, నాగేశ్వర్ సజ్జన్,సంగన్న, శివ శంకర్ పటేల్, శశి వర్ధన్ రెడ్డి, కిజర్, విజయ్ పాటిల్, మాణిక్ యాదవ్,ఎంపీ శ్రీనివాస్ పటేల్,ఎంపీ నాగన్న, సోహైల్,రమేష్,రాజు కుమార్, బాలరాజ్, విల్లాస్, అనిల్ పటేల్, కృష్ణ, విజయ్, సాయ్యేద్, శివ వైజ్యనాథ్, రామ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

చెక్కులు ఇప్పించేందుకు… రూ.30 లక్షల కమీషన్!

చెక్కులు ఇప్పించేందుకు… రూ.30 లక్షల కమీషన్!

◆:- అసైన్డు భూమికి పరిహారం రాదంటూ తిరకాసు పెట్టిన అధికారులు

◆:- ఆందోళనతో నెలల తరబడి కార్యాలయాల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు

◆:- ఇదే అదనుగా యంత్రాంగం సహకారంతో రంగంలోకి దిగిన దళారులు

◆:- అంతా తాము చూసుకుంటామని ఇద్దరు రైతులతో బేరసారాలు

◆:- వాళ్లు చెప్పినట్లుగా తక్కువ సమయంలో చెక్కులు ఇచ్చేసిన అధికారులు

◆:- కమీషన్ డబ్బులు ఇచ్చి. ఆధారాలతో దందాను వెలుగులోకి తెచ్చిన రైతులు

◆:- పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోక ఆవేదన

◆:- నిమ్జ్‌ భూసేకరణలో పెద్ద ఎత్తున సాగిన అక్రమాలకు నిదర్శనమీ ఘటన

Issuing cheques

జహీరాబాద్ నేటి ధాత్రి:

అసైన్లు భూములున్న వారే లక్ష్యంగా అధికారు లు పెద్దయెత్తున దందా సాగించారు. రైతుల అవగాహన లేమి, ఇతరత్రా అంశాలను ఆధారం చేసుకొని రూ.కోట్లు వెనకేసుకున్నారు. దళారులను ముందు పెట్టి పని నడిపించారు. ఎకరాకు ఇంత అని రేటు పెట్టి మరీ దర్జాగా వసూళ్లకు పాల్పడ్డారు. రైతులు ఎన్ని రోజులు తిరిగినా విడుదల కాని చెక్కులు, దళారుల సాయం తీసుకుంటే రోజుల వ్యవధిలోనే చేతికం దాయి. యంత్రాంగం, గ్రామాల్లోని దళారులు కలిసి సాగించిన కమీషన్ల దందాకు ఈ ఘటనే నిదర్శనం.

తిరిగి తిరిగి అలసిపోయారు!

Issuing cheques

న్యాల్ కల్ మండలం గణేష్ పూర్ గ్రామానికి చెందిన యోహాన్, సీమన్ అన్నదమ్ములు. వారికి ఒక్కొక్కరికి 4.19 ఎకరాల భూమి ఉంది. నిమ్జ్‌
కోసం ఈ భూములను సేకరించారు. అయితే ఈ భూములకు పరిహారం రాదని, కొన్ని రకాల కారణాలతో చెక్కులు ఇవ్వడం కుదరదని అధికారులు చెప్పారు. దీంతో అన్నదమ్ములిద్ద రూ ఆందోళన చెందారు. తమకు చాలా ఏళ్ల క్రితమే ప్రభుత్వం ఈ భూములను ఇచ్చిందని, పరిహారం ఇవ్వాలని విన్నవించారు. అయినా వారు పట్టించుకోలేదు. నెలల తరబడి కార్యా లయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపో యింది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్కులు రావని అధికారులు స్పష్టం చేశారు.

దళారులను రంగంలోకి దించారు!

Issuing cheques

న్యాయంగా యోహాన్ కు రూ.67లక్షలు, సీమన్ కు రూ.67లక్షలు వస్తాయి. కావాలనే అధికారు లు చెక్కులు ఆపేశారు. వారే హుసెళ్లికి చెందిన ఒక దళారిని రంగంలోకి దించారు. అతడు వెళ్లి నేరుగా వీరిద్దరితో మాట్లాడారు. ‘మీకెందుకు నేను అధికారులతో మాట్లాడుతాను. మీకు చెక్కులు ఇప్పిస్తాను. కానీ ఒక్కొక్కరు రూ.15ల క్షలు ఇవ్వాలి. లేకుంటే మీకు రూపాయి కూడా రాద’ని చెప్పుకొచ్చాడు. దీంతో భయపడిపో యిన అన్నదమ్ములు చేసేదేమీలేక సరేనన్నారు. దళారి చెప్పినట్లుగానే రోజుల వ్యవధిలోనే ఇద్దరి కీ చెక్కులు వచ్చాయి. తాము నెలలుగా తిరిగినా అందని చెక్కులు.. జెట్ స్పీడుతో వచ్చేయడంతో అన్నదమ్ములిద్దరూ అవాక్కయ్యారు.

ఆయన చేతికే చెక్కులు!

Issuing cheques

అధికారులు ఈ చెక్కులనూ దళారి చేతికే ఇచ్చే శారు. తమకు న్యాయంగా రావాల్సిన పరిహారం విషయంలో ఇంత పెద్దయెత్తున దందా నడవడం తో సీమెన్ నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆధారాలతో సహా ఈ బాగోతాన్ని బట్టబయలు చేసేందుకు ప్రయత్నించారు. ‘దళారి చేతికే రూ.67లక్షల విలువైన చెక్కు ఇచ్చారు. ఆయన నన్ను నేరుగా బ్యాంకుకు తీసుకెళ్లాడు. అక్కడ చెక్ డిపాజిట్ చేయించాడు. మా ఖాతాలో డబ్బు పడగానే.. రూ.15లక్షలు ఆయన ఖాతాలోకి పంపించుకున్నాడు. ఈ అంశమై చర్యలు తీసుకోండి’ అంటూ హద్నూర్ పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. కానీ వారు పట్టించుకోలేదు. నిమ్జ్‌ భూసేకరణ మాటున సాగిన, సాగుతున్న దందాలకు ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. ఇప్పుడు వెళ్లి అధికారులు విచారణ చేసినా. పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.

Issuing cheques
error: Content is protected !!
Exit mobile version