సైన్స్ ఫెర్లో అద్భుత ప్రదర్శనలు.

సైన్స్ ఫెర్లో అద్భుత ప్రదర్శనలు.

… చూపరులను ఆకట్టుకున్న విద్యార్థుల ప్రతిభ.

రామయంపేట నేటి ధాత్రి

మెదక్ విద్యార్థులు కేవలం చదివే కాకుండా అన్ని రంగాల్లో ముందుంటారని ఆ పాఠశాలకు చెందిన విద్యార్థులు నిరూపించారు. రామాయంపేట పట్టణంలోని వివేకానంద విద్యాలయంలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ లో పలు ప్రదర్శనలు విద్యార్థుల మేజర్సుకు అద్దం పడుతున్నాయి. విద్యార్థుల ప్రదర్శించిన పలు ప్రదర్శనలు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడే విధంగా ఉన్నాయి.

science

ప్రకృతి సేద్యం విధానం.
.. ప్రదర్శన చూపించిన విద్యార్థిని వైష్ణవి.
స్థానిక వివేకానంద విద్యాలయంలో మూడవ తరగతి చదువుతున్న సిహెచ్ వైష్ణవి ప్రకృతి సేద్యం పట్ల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ప్రకృతి సేద్యానికి పేడ ఏ విధంగా ఉపయోగపడుతుంది ప్రదర్శనలలో చూపడం జరిగింది. ప్రకృతి సేద్యం వల్ల ఆరోగ్యకరమైన పంటలు, కూరగాయలు పండించుకునే విధానాన్ని విద్యార్థిని చక్కగా ప్రదర్శించడం జరిగింది.

వేస్టేజ్ తో కరెంట్ తయారీ విధానం.
.. విద్యార్థి నీరాజాక్ష్.
వేస్టేజ్ పదార్థాలను ఉపయోగించి కరెంటు తయారుచేసుకునే విధానాన్ని విద్యార్థి నీరాజాక్ష్ ప్రదర్శనలు అద్భుతంగా చూపించడం జరిగింది. వ్యర్థాలను ఉపయోగించి కరెంట్ తయారీతోపాటు, గ్యాస్ తయారీ విధానాన్ని ప్రదర్శనలో చూపించడం జరిగింది. వ్యర్థాలను ఇలా ఉపయోగిస్తే భవిష్యత్తులో వేస్టేజ్ కూడా వృధాగా పోదని ఈ ప్రదర్శన ద్వారా తెలుస్తోంది. విద్యార్థి ప్రదర్శన చాలామందిని ఆకర్షించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి నీరాజ్యాక్ష్ ను అభినందించారు.

చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి

చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

మహబూబ్ నగర్/నేటి ధాత్రి

మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టికెట్ లను ఆయన ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ విద్య తరువాత రానున్న నాలుగు సంవత్సరాల సమయమని చాలా విలువైనదని అన్నారు. మీ భవిష్యత్తు బాగుండాలని, మీ తల్లిదండ్రుల లాగా మీరు కష్టపడకూడదని.. వారు కూలీ పనులు చేస్తూ.. వ్యవసాయ పనులు చేసుకుంటూ.. వాళ్ళు పడే కష్టాలను సైతం ఇష్టపడుతున్నారని ఆయన చెప్పారు. మీ తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని మంచిగా చదువుకొని జీవితంలో మీరు స్థిరపడాలని ఆయన సూచించారు. మీకోసం మీ తల్లిదండ్రులే కాకుండా మేము కూడా తపన పడుతున్నామని, మీరంతా మంచిగా చదువుకొని జీవితంలో స్థిరపడాలని

Avoid bad friends

కోరుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన తర్వాత నెల రోజుల పాటు మీకోసం ఇంజనీరింగ్, నీట్ ఎంట్రెన్స్ పరీక్షలకు క్రాష్ కోర్స్ ఏర్పాటు చేస్తామని.. ఈ కోర్సులో చేరిన వారికి ఉచితంగా వసతి భోజన సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న పాపిరెడ్డి శుక్రవారము పదవీ విరమణ సందర్భంగా ఆయన ను ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు హాల్ టికెట్స్ పంపిణీ చేసి ఆల్ ది.. బెస్ట్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, టిజిఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు యం.రామకృష్ణ గౌడ్, కళాశాల ప్రిన్సిపాల్ భగవంతచారి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణను పెంపొందిం చాలి.

విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణను పెంపొందిం చాలి

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

శాయంపేట ఎస్బిఐ మేనేజర్ రాజేష్

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలోని బాలికల కళాశాల లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది,
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాయంపేట ఎస్బిఐ మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఈ ఆర్థిక క్రమశిక్షణ రేపటి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని అన్నారు, అదేవిధంగా ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాను తీసుకొని పొదుపు చేయాలని, ఇప్పుడు చేస్తున్న ఈ పొదుపే మీ యొక్క భవిష్యత్తు అవసరాల కోసం చాలా ఉపయోగపడు తుందని ఎవరి దగ్గర చేయి చాపాల్సిన పని ఉండదు అని అన్నారు, అదేవిధంగా ప్రస్తుత సమాజంలో ఆర్థిక నేరాలు విపరీతంగా పెరిగిపోతు న్నాయి వాటి నుండి తస్మాత్ జాగ్రత్త అని విద్యార్థులకు తెలియజేశారు, ముఖ్యంగా అపరిచిత వ్యక్తులు పంపించిన లింక్స్ గాని ఓటీపీలు గాని ఎవరికి షేర్ చేయవద్దని అన్నారు, ఒకవేళ తెలియక సైబర్ నేరాల వలలో పడినట్లయితే వెంటనే గుర్తించి బ్యాంకును గాని పోలీసులను గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని తద్వారా మీకు సహాయం చేయడానికి వీలుగా ఉంటుందని తెలియజేశారు.
ఇదే రోజున ఈ హాస్టల్లో సైన్స్ వేర్ నిర్వహించడం జరిగింది, విద్యార్థుల యొక్క ప్రతిభను చూసి విద్యార్థులను అభినందించడం జరిగింది

students

ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చాలా అదృష్టవంతులని ఈ విద్యా సంస్థలలో చదివే విద్యార్థులే అన్ని రంగాల్లో రాణిస్తారని తెలియజేశారు.
నేను కూడా గురుకుల పాఠశాలలోనే చదివి ఈరోజు బ్రాంచ్ మేనేజర్ గా ఉన్నాను, ఈ పాఠశాలలో చదువుకు న్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని అదేవి ధంగా మీరందరూ కూడా ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రజిని మరియు సిబ్బంది, మరియు ప్రభుత్వ బాలుర పాఠశాల ఉపాధ్యాయులు, మరియు విడ్స్ స్వచ్ఛంద సంస్థ కౌన్సిలర్స్ మారపెల్లి క్రాంతికుమార్, విజయ్, ప్రసాద్ పాల్గొన్నారు.

మానవాళి మనుగడకు మూలం సైన్స్

మానవాళి మనుగడకు మూలం సైన్స్

నర్సంపేట,నేటిధాత్రి:

మానవాళి మనుగడకు మూలం సైన్స్ అని శ్రీ గురుకుల ఫౌండర్ మోతె సమ్మిరెడ్డి అన్నారు.నర్సంపేట మహేశ్వరం గ్రామంలో జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం జరిగింది.ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా మహేశ్వరం శ్రీ గురుకుల ఫౌండర్ మోతె సమ్మిరెడ్డి పాల్గొన్నారు.మానవ జీవన మనుగడకు సైన్స్ తప్పనిసరి అవసరమని ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది నడిపిస్తున్నది సైన్స్ అని తెలిపారు. విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,డిక్షనరీలు బహుమతిగా అందజేసి,విద్యార్థులు అనేక ఆవిష్కరణలు జరపాలని, బాగా కష్టపడి చదవాలని తెలిపారు.ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత ప్రధానోపాధ్యాయులు స్వరూప, అర్జున్ సాగర్, వేణుబాబు,శ్రీలత, రాజేశ్వరి,రమేష్,రేఖ,శ్రీలత, కరుణాకర్,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

శాస్త్రీయ జ్ఞానంతోనే ప్రపంచ పురోగతి

శాస్త్రీయ జ్ఞానంతోనే ప్రపంచ పురోగతి
బాలాజీ విద్యా సంస్థల కార్యదర్షి డాక్టర్.జి.రాజేశ్వర్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

శాస్త్రీయ జ్ఞానమే ప్రజా జీవితానికి ఆయువు పట్టని,శాస్త్ర జ్ఞానం లేకపోతే ప్రపంచం ఇంతగా పురోగతిని సాధించేదికాదని బాలాజీ విద్యా సంస్థల కార్యదర్షి డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి అన్నారు.జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా బాలాజీ టెక్నో స్కూల్లో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రతి విషయాన్ని కూడా శాస్త్రీయ దృక్పథంతో చదువుకొని నూతన ఆవిష్కరణలు చేయాలని డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు.బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో పాఠశాల విద్య అత్యంత ప్రాముఖ్యత కలదని,ప్రభావశీలమైనదని,ఈ వయసులో అలవడే శాస్త్రీయ దృక్పథం భవిష్యత్తును దేదీప్యమానంగా ప్రకాశింపజేస్తుందని అన్నారు.భారత దేశానికి చెందిన సి.వి.రామన్ తాను తయారు చేసిన రామన్ ఎఫెక్ట్ కు గాను 1930 లోనే నోబెల్ బహుమతి గ్రహించిన విషయాన్ని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలన్నారు.పాఠశాల దశలోనే సి.వి. రామన్ అనేక కొత్త ప్రశ్నలను లేవనెత్తి వాటి సమాధానాలకై అన్వేషించే తత్వమే తనను గొప్ప శాస్త్రవేత్తగా మార్చిందనే విషయాన్ని వారు ఈ సందర్భంగా విద్యార్థులకు గుర్తు చేశారు.

Scientific knowledge

ఆయన పుట్టినరోజును జాతీయ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని అన్నారు.అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా విద్యార్థులు తయారుచేసిన రెండు వందలకు పైగా వైజ్ఞానిక ప్రదర్శనలను తిలకించారు. ఉత్తమ ఆవిష్కరణలకు డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం.డి. రియాజుద్దీన్, సైన్స్ ఉపాధ్యాయులు జగదీశ్వర్, గౌతమ్, నాగరాజు, విజయ్, పూర్ణిమ, ప్రీతి, కనకరాజు, మహేందర్, రాజ్ కుమార్, సంపత్, ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

రావూస్ ఇంటర్నేషనల్ స్కూల్ సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్.

రావూస్ ఇంటర్నేషనల్ స్కూల్ సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్

శేరిలింగంపల్లి,నేటి ధాత్రి:-

Exhibition

శేరిలింగంపల్లి, గుల్మాహర్ పార్క్ కాలనీ లోని రావూస్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు శుక్రవారం జెగా ఫ్రై మా డా|| సి. విరామన్ జన్మదిన కారణంగా రావూన్ విద్యాసంస్థలు ఈ విజ్ఞాన ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని వారి ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్లను రావూన్ విద్యాసంస్థల చైర్మన్ శ్రీ పోల్సాని ప్రభాకర్ రావు గారు సందర్శించి విద్యార్థులు కనబరిచిన ప్రతిభమ ప్రశంపించారు. మరియు విద్యార్థుల తల్లిదండ్రలు కూడా తమ పిల్లల ప్రతిభము చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా పలువురు ప్రముఖలు చూసి పిల్లలను ఎంతగానో మెచ్చుకున్నారు. ప్రతి సంవత్సరం రావూన్ విద్యాసంస్థలు విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రం
పట్ల అవగాహన కల్గించడానికి వారిలోని ప్రతిభను వెలికి తీయడానికి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నారు

కుంగ్ ఫు పోటీలో విద్యార్థులకు ఉత్తమ బహుమతులు…

కుంగ్ ఫు పోటీలో విద్యార్థులకు ఉత్తమ బహుమతులు

నిజాంపేట, నేటి ధాత్రి

ఇంటర్నేషనల్ శాలిన్ కుంగ్ ఫు @కరాటే వారియర్స్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో జరిగిన టోర్నమెంట్ లో మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన కుంగ్ ఫు విద్యార్థులు తమ ప్రదర్శనను కనబరిచారు అలాగే ఈ పోటీల్లో 6 బంగారు పతకాలు, 8వెండి పతకాలు,3 బ్రౌన్ పథకాలు సాధించారు ఈ కార్యక్రమంలో మాస్టర్ స్వామి, శ్రీనివాస్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు

అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి, సహకరిస్తే..!

ముందస్తు అడ్మిషన్ల కోసం కార్పొరేట్ కళాశాలకు ప్రైవేటు పాఠశాలలు సహకరిస్తే ఊరుకునేది లేదు-మచ్చ రమేష్

కరీంనగర్, నేటిధాత్రి:

రాష్ట్ర వ్యాప్తంగా శ్రీచైతన్య, నారాయణ కళాశాలల ముందస్తు అడ్మిషన్లకు ప్రారంభం చేసిందని, విద్యా సంవత్సరం పూర్తి కాకముందే జిల్లాల్లో పిఅర్ఓలను పెట్టుకుని ప్రచారం నిర్వహిస్తూ తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి అడ్మిషన్లు తీసుకుంటున్నారని, అధికారులు, ప్రభుత్వం కార్పొరేట్ కళశాలల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో జరిగిన ఏఐఎస్ఎఫ్ నాయకుల సమావేశంలో మచ్చ రమేష్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలు తమ కళాశాలలో ప్రవేశం పొందాలని గ్రామాల్లో తిరుగుతున్నారని దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఆకళాశాలల్లో విద్యార్థులు మానసిక, శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని
విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అవుతున్న శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలను రాష్ట్రవ్యాప్తంగా సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ముందస్తు అడ్మిషన్ల కోసం తిరుగుతున్న కార్పొరేట్ కళాశాలకు జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు సహకరిస్తే ఊరుకునేది లేదని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష దాడులకు సిద్ధం అవుతామని హెచ్చరించారు. విద్యా హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం అమలు చేయాలని, ప్రైవేటు విద్యా సంస్థలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, ఫీజుల నియంత్రణ చట్టం కోసం త్వరలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని రమేష్ తెలిపారు. ఈకార్యక్రమంలో అధ్యక్షులు రామారావు వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు కనకం సాగర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ మామిడిపల్లి హేమంత్, ఏఐఎస్ఎఫ్ నాయకులు కనకం రాహుల్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బీహెచ్ఈఎల్ 2000 బ్యాచ్ సిల్వర్ జూబ్లీ..

ఘనంగా బీహెచ్ఈఎల్ 2000 బ్యాచ్(సిల్వర్ జూబ్లీ) పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం…..

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:-

జడ్.పి.హెచ్.ఎస్ బీహెచ్ఈఎల్ 2000 బ్యాచ్ విద్యార్థులు… 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా“””25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ”” కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అప్పుడు పాఠాలు నేర్పించిన టీచర్లు అందర్నీ పిలిచి శాలువాలు, పూలదండలు, మొక్కలు,, మెమొంటో లతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా టీచర్లందరూ విద్యార్థుల తీరును చూసి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మా విద్యార్థులు మరింత పైకి ఎదగాలని, మరిన్ని గొప్ప గొప్ప ఆశయాలను పూర్తి చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. విద్యార్థులు ఆటపాటలతో సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 25 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని విద్యార్థుల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిహెచ్ఎల్ జడ్పిహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల తో పాటు పలువురు పాల్గొన్నారు…

విద్యార్థులు అత్యున్నత శిఖరాలను అధిరోహించాలి

జిల్లా పరిషత్,సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో మండలస్థాయి అవగాహన,శిక్షణ కార్యక్రమం

విద్యార్థులు అత్యున్నత శిఖరాలను అధిరోహించాలి

ఆర్డీఓ డాక్టర్.కన్నం నారాయణ

Students

పరకాల నేటిధాత్రి
మండల పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ మరియు సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉత్తీర్ణత మరియు వ్యక్తిత్వ వికాసం పై ఏర్పాటు చేసిన అవగాహనా మరియు శిక్షణ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ వీరలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ డాక్టర్ కన్నం.నారాయణ హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్యార్థులు చదువు పై దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లి తండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని అన్నారు.ప్రఖ్యాత మోటివేటర్ దిలీప్ కుమార్,మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు,తహసీల్దారు విజయలక్ష్మి మాట్లాడుతూ మాట్లాడుతూ విధ్యార్థులకు చదువడం జ్ఞాపక శక్తి పెంచుకోవడం మరియు పరీక్షలు రాయడంలో మెలకువల గురించి వివరించారు,ప్రతి విద్యార్థి ఒక లక్ష్యం నిర్ణయించుకుని దాన్ని చేరుకునే విధంగా కృషి చేయాలని,విద్యార్థులు అందరూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడే తల్లి తండ్రులు ఉపాధ్యాయులు సంతోషిస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి యస్ రమాదేవి,జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల పరకాల బాలుర గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సి. హెచ్ మధు,వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

హ్యాపీ సీడర్ తో వరిలో పంట అవశేషాల నిర్వహణ యొక్క ప్రయోజనాలు

అధునాతన టెక్నాలజీ ద్వారా వరిని హార్వెస్టర్ సహాయంతో కోయడం జరుగుతోంది. ఈ విధానంతో వరి అవశేషాలను సమర్థంగా ఉపయోగించడంలో అసమర్థత ఎదురవుతోంది. వరి అవశేషాలను ఉపయోగించేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నప్పటికీ, వరి కోత మరియు విత్తనాల నాటికి తక్కువ వ్యవధి ఉండటం వల్ల రైతులు తరచుగా ఈ అవశేషాలను దహనం చేస్తారు. ఇది ఖర్చు తక్కువగా ఉండే పరిష్కారం అయినప్పటికీ, పర్యావరణం మరియు ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. వరి అవశేషాలను దహనం చేయడం ద్వారా అధికంగా ధూళి కణాలు (PM 2.5 మరియు PM 10), కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, మరియు మీథేన్ వంటి విష వాయువులు విడుదలవుతాయి. అవశేషాలను సమర్థవంతంగా నిర్వహించడానికి రైతుల వద్ద అవశేషాలను మట్టిలో చేర్చడం, కత్తిరించడం, కోయడం, మల్చింగ్, బెయిలింగ్ మరియు పొలం నుండి అవశేషాలను తొలగించడం వంటి అనేక ఉత్తమ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. పరిస్థితిని బట్టి ఈ ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. పంట అవశేషాల నిర్వహణను సుస్థిర వ్యవసాయంలో ఒక ముఖ్యమైన అంశంగా పరిగణించవచ్చ. వరి అవశేషాలను ఉపయోగిచుకోవడానికి వివిధ వ్యవసాయ యంత్రాలు, హ్యాపీ సీడర్, జీరో టు డ్రిల్ మరియు రోటో టిల్ డ్రిల్ అనేవి సంప్రదాయ పద్ధతి కాకుండా వాడుకలో ఉన్న సాంకేతికతలు. వాటికీ ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తుంది. వాటిలో హ్యాపీ సీడర్ టెక్నాలజీ చాలా వరి అవశేషాలను ఉపయోగిచడం లో సమర్థవంతంగా పనిచేస్తుంది. హ్యాపీ సీడర్ అనేది ప్రస్తుత వ్యవసాయ అవసరాలను తీర్చగల సాంకేతిక పరిజ్ఞానంలో ఒక విప్లవాత్మక పరికరం. హ్యాపీ సీడర్ అనేది ట్రాక్టర్ ఆధారిత యంత్రం, ఇది వరి గడ్డిని కత్తిరించి పైకి తీసేస్తూ, ఖాళీ మట్టిలో విత్తనాలను నాటుతుంది మరియు గడ్డిని మల్చ్‌గా విత్తనాలపై నిల్వ చేస్తుంది. హ్యాపీ సీడర్, ఈ విధంగా, గడ్డి మల్చింగ్, విత్తనాల నాటడం, మరియు ఎరువుల డ్రిల్లింగ్‌ను ఒకే పాస్‌లో చేర్చుతుంది. ఈ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా రైతులు పంట అవశేషాలను మట్టిలో కలిపి, ఫలితంగా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. హ్యాపీ సీడర్ వలన పొందే ప్రయోజనాలలో నీటిపారుదల నీటి వినియోగం, విత్తనాలు, ఎరువుల వినియోగం, శక్తి మరియు ఉత్పత్తి వ్యయాలను తగ్గించడం ఉన్నాయి. పంట అవశేషాల సంరక్షణ సాంకేతికత ద్వారా ఈ ప్రయోజనాలను సాధించవచ్చు. ఇది వరి గోధుమల మల్చింగ్ విధానంలో కొత్త మార్గాలను తెరిచింది. పంట వ్యర్థాలను సస్య ద్రవ్యంగా ఉపయోగించి, నేల జీవవైవిధ్యాన్ని మెరుగుపరిచే ఈ పరికరం రైతులకి ఆర్థిక మరియు పర్యావరణ పరిరక్షణలో కీలకంగా ఉంది. ఈ పరికరంలో ప్రత్యేకమైన రోటర్ బ్లేడ్‌లు ఉంటాయి, ఇవి వరి తొడుగును కోయడం ద్వారా ఒకే సమయంలో విత్తనాలను నేలలో పడేస్తాయి.

రోటర్ వేగాలు మరియు తేమ శాతం వ్యవసాయ పనితీరును ప్రభావితం చేస్తాయి. గోధుమ పంటను నాటడానికి ముందు వరి గడ్డిని కాల్చకుండా నిర్వహించడానికి హ్యాపీ సీడర్ అత్యంత ఆర్థికమైన పద్ధతిగా తేలింది. వరి గడ్డిని తొలగించకుండా గోధుమ విత్తనాలు నాటడానికి ఇది ఉపయోగించబడింది. హ్యాపీ సీడర్ యొక్క రోటర్ యాంటిలాక్ వైజ్ దిశలో తిరుగుతుంది. రోటర్ ఫ్లేల్స్ పొలం నేల నుండి 2-3 సెం.మీ ఎత్తులో తిరుగుతూ అవశేషాలను శుభ్రపరుస్తాయి. రోటర్ వేగం గడ్డి లోడ్ మరియు తేమ ద్వారా ప్రభావితమవుతుంది. పరికరం ఉపయోగించే శక్తి వనరు 45-55 హార్స్ పవర్ మధ్య ఉంటుంది. ఇది త్రీ పాయింట్ లింకేజ్ హిచ్ టైప్‌తో కూడి ఉంటుంది. క్యాట్-1, క్యాట్-2 కేటగిరీలకు అనుగుణంగా రూపొందించబడింది. ఈ యంత్రం 11 టైన్లను కలిగి ఉంటుంది, వీటిలో వరుసల మధ్య దూరం 225 మిమీ. ఫ్యూరో ఓపెనర్లు ఇన్వర్టెడ్ టి-రకానికి చెందినవి. రోటార్ డ్రమ్ వ్యాసం 700-800 మిమీ మధ్య ఉండగా, రోటార్ షాఫ్ట్ వ్యాసం 130-150 మిమీ మధ్య ఉంటుంది. ట్రాక్టర్ పిటిఒ 540 ఆర్‌పిఎమ్ వద్ద నడుస్తున్నప్పుడు, రోటర్ 1000-1600 ఆర్‌పిఎమ్ వేగంతో పనిచేస్తుంది. ఫ్లేయిల్ బ్లేడ్లు రివర్సబుల్ గామా రకానికి చెందినవి. రోటర్ ఉపరితలం నుండి బ్లేడ్ పొడవు 240 మిమీ, బ్లేడ్ మొత్తం పొడవు 85 మిమీ. మీటరింగ్ కోసం ఫ్లూటెడ్ రోలర్ యంత్రాంగాన్ని ఉపయోగించి విత్తనాలు పంపిణీ చేయబడతాయి. ఎరువులను గ్రావిటీ ఫీడ్ లేదా తుప్పు పట్టిన రోలర్ రకంతో అందిస్తారు. మీటరింగ్ మెకానిజానికి శక్తి లగ్డ్ గ్రౌండ్ వీల్ ద్వారా గొలుసులు మరియు స్ప్రాకెట్లతో ప్రసారం అవుతుంది.

ఫలితాలు మరియు ప్రయోజనాలు

  1. హ్యాపీ సీడర్ వాడటం వల్ల పంట వ్యర్థాలను దహనం చేయవలసిన అవసరం ఉండదు. దీని వల్ల వాయు కాలుష్యం తగ్గుతుంది.
  2. మల్చింగ్ వల్ల నీటి ఆవిరి కావడం తగ్గుతుంది. ఇది నీటిని పొదుపు చేయడంలో సహాయపడుతుంది.
  3. హ్యాపీ సీడర్ వివిధ రోటర్ వేగాలతో పని చేయగలదు. దీనివల్ల వివిధ మట్టి తేమ స్థితులలో కూడా ఉత్తమ పనితీరు అందించగలదు.
  4. ఈ పరికరం వ్యవసాయ ఖర్చులను తగ్గిస్తుంది, ముఖ్యంగా చేతి పనిని మరియు ఇంధనాన్ని ఆదా చేస్తుంది.

Dr. KALLURI PRAVEEN 

Assistant Professor

Dept. of Agriculture Engineering,

SoA, SR University, Warangal, Telangana, India.

Phone: +91- 9542424278

IIT గాంధీనగర్ ఇంటర్నేషనల్ గ్రీన్ యూనివర్శిటీ అవార్డు 2023 గెలుచుకుంది

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, IIT గాంధీనగర్ శుక్రవారం, సెప్టెంబర్ 15న ఇంటర్నేషనల్ గ్రీన్ యూనివర్శిటీ అవార్డు 2023 గెలుచుకుంది. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ (ECOSOC)తో ప్రత్యేక సంప్రదింపుల హోదా కలిగిన ప్రభుత్వేతర సంస్థ అయిన గ్రీన్ మెంటర్స్, USA ఈ అవార్డును అందజేసింది.

పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడంలో మరియు విద్యార్థులలో పర్యావరణ స్పృహ విలువలను పెంపొందించడంలో చేసిన కృషికి ఇన్స్టిట్యూట్ ఈ అవార్డును గెలుచుకుంది.

IIT గాంధీనగర్ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటన ప్రకారం, ఈ వారం న్యూయార్క్ నగరంలో 78వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సెషన్ సందర్భంగా USAలోని కార్నెల్ విశ్వవిద్యాలయంలో జరిగిన 7వ NYC గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్‌లో అవార్డు ప్రదానోత్సవం నిర్వహించబడింది. ఈ అవార్డును ఐఐటీజీఎన్ రిజిస్ట్రార్ పీకే చోప్రా అందుకున్నారు.

ఇంటర్నేషనల్ గ్రీన్ యూనివర్శిటీ అవార్డు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలను వారి ప్రధాన విలువలు, కార్యకలాపాలు మరియు కమ్యూనిటీ మరియు విద్యార్థుల నిశ్చితార్థం కోసం విద్యా కార్యక్రమాలలో స్థిరత్వాన్ని ఏకీకృతం చేసింది మరియు శక్తి-సమర్థవంతమైన మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన పరిష్కారాలు, వ్యర్థాల తగ్గింపు మరియు రీసైక్లింగ్ ప్రోగ్రామ్‌ల వంటి స్థిరమైన పద్ధతులను అమలు చేసింది. , మరియు స్థిరమైన రవాణా కార్యక్రమాలు, పత్రికా ప్రకటనను చదవండి.

ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు ఎన్నికల నిర్వహణ.

ప్రతి విద్యార్థికి ప్రజాస్వామ్యంపై అవగాహన కలిగి ఉండాలి, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ విజయ రఘునందన్ రావు.


రాజన్న సిరిసిల్ల టౌన్: నేటిధాత్రి
సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో
2023 24 సంవత్సరము గాను కళాశాల విద్యార్థులకు
ఎన్నికల నిర్వహణలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు
కళాశాలలో ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ పై
అవగాహన కల్పించేందుకు కళాశాల అధ్యక్షుడు
అధ్యక్షురాలని ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికను నిర్వహణలో ముఖ్యఅతిథిగా హాజరైన సిరిసిల్ల తహసిల్దార్ ఎన్నికల పర్యవేక్షణ అధికారిగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయ రఘునందన్ రావు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు ఓటు హక్కు విలువపై అవగాహన కల్పించేందుకే కళాశాలలో
ఎన్నికలు నిర్వహించామని తెలిపారు.
ఎన్నికలలో ప్రభుత్వ కళాశాల అధ్యక్షులుగా వినయ్ ఉపాధ్యక్షుడిగా విక్రమ్ ఎన్నికయ్యారు గర్ల్స్అధ్యక్షురాలిగా అశ్విని ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అధ్యాపకులు బుర్ర వెంకటేశం గౌడ్ సామల వివేకానంద కనకయ్య అరుంధతి వికాస్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

మొబైల్ బుక్ హౌజ్ .

రాజన్న సిరిసిల్ల టౌన్ :నేటిధాత్రి
సిరిసిల్ల పట్టణంలోని కోర్టు ఎదుట ప్రధాన రహదారి
ప్రక్కన ఏర్పాటుచేసిన నవ చేతన సంచార పుస్తకాల నిలయం (మొబైల్ బుక్ హౌజ్) ఏర్పాటు చేయడం జరిగింది.
నవచేతన సంచార పుస్తక నిలయం ‌ నిర్వాహకుడు
గోపాల్, కృష్ణ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణ ప్రజలు
మొబైల్ బుక్ హౌజ్ లో అన్ని రకముల బుక్స్ లు
అందుబాటులో ఉన్నాయని సిరిసిల్ల పట్టణ ప్రజలు
సద్వినియోగం చేసుకోగలరని కోరారు.

జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు తుంగదొక్కి పాఠశాల నిర్వహిస్తున్న నారాయణ విద్యాసంస్థ

హన్మకొండ, నేటిధాత్రి:

ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ మాట్లాడుతూ…
హాన్మకొండ నగరం నడి ఒడ్డున ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా నారాయణ వైట్ హౌస్ కో బ్రాంచ్ పేరుతో స్కూల్ గ్రౌండ్ మరియు ఫైల్ సేఫ్టీ లేకుండానే గత మూడు నాలుగు నెలల నుండి ప్రభుత్వ ఆదేశాలు లేకుండా పాఠశాల నిర్వహించేద్దామని సంబంధిత విద్యాశాఖ అధికారికి ఏ బి ఎస్ ఎఫ్ మరియు ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసిన వెనువెంటనే జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నిర్వహిస్తున్న యాజమాన్యంపై మూసివేయాలని సంబంధిత మండల విద్యాశాఖ అధికారికి ఎం ఈ ఓ చెప్పినప్పటికీ కూడా విద్యాశాఖ అధికారి ఎంఈఓ కార్పొరేట్ విద్యా సంస్థకు కొమ్ముగాస్తు జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు సైతం పట్టించుకోకుండా కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాస్తున్న విద్యాశాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

తెలంగాణలోని నిరుద్యోగ యువత కోసం 24 గంటల నిరాహార దీక్షను కిషన్ రెడ్డి ముగించారు

హైదరాబాద్‌: నిరుద్యోగ యువత పట్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి చేపట్టిన 24 గంటల నిరాహార దీక్ష గురువారం ముగిసింది.

నిరాహార దీక్ష ముగింపు సందర్భంగా కిషన్‌రెడ్డికి తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ఉన్న కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ నిమ్మరసం అందించారు.

రెడ్డి బుధవారం ఇక్కడ ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు.

అయినప్పటికీ, అనుమతించిన సమయానికి మించి నిరసనను “కొనసాగించినందుకు” బుధవారం సాయంత్రం ఆయనను పోలీసులు ధర్నా చౌక్ నుండి “బలవంతంగా” తరలించారు.

రెడ్డిని రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యాలయానికి తరలించినప్పటికీ బిజెపి కార్యకర్తలు నినాదాలు చేసి పోలీసుల చర్యను వ్యతిరేకించడంతో బుధవారం సాయంత్రం ధర్నా చౌక్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
రెడ్డి మాత్రం పార్టీ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష కొనసాగించారు.

తెలంగాణలో పార్టీ వ్యవహారాల ఇంచార్జి, బిజెపి ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ బుధవారం రాత్రి పోలీసుల చర్యను ఖండించారు మరియు నిరసన ప్రదేశంలో రెడ్డి స్పృహతప్పి పడిపోయారని పేర్కొన్నారు.

"ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరసనకు అనుమతి జారీ చేయబడింది, అయితే వారు సమయాలను పాటించలేదు మరియు నిరసన స్థలం నుండి ఖాళీ చేయలేదు" అని సీనియర్ పోలీసు అధికారి బుధవారం రాత్రి PTI కి చెప్పారు.

రెడ్డి స్పృహ తప్పి పడిపోవడంపై ఆరా తీస్తే డీహైడ్రేషన్ వల్ల అయి ఉండవచ్చని పోలీసులు తెలిపారు.

ఆయన అభ్యర్థన మేరకు కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ కార్యాలయానికి తరలించినట్లు అధికారి తెలిపారు.
పోలీసుల చర్యను ఖండిస్తూ తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి జి ప్రేమేందర్ రెడ్డి గురువారం నిరసనలకు పిలుపునిచ్చారు.

ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లినట్లు బుధవారం రాత్రి విడుదల చేసిన ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు.

ప్రజల సమస్యలపై బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాటం కొనసాగించాలని కిషన్‌రెడ్డితో షా ఫోన్‌లో మాట్లాడినట్లు ఆ ప్రకటనలో తెలిపారు.



 

పేద విద్యార్థి….పెద్ద చదువులు

ఆర్థిక లేమి …తండ్రి అకాల మరణం

సహకారం కోసం ఎన్ ఎఫ్ ఎచ్ సి ఫౌండేషన్ విజ్ఞప్తి

కేసముద్రం (మహబూబాబాద్), నేటిధాత్రి:

అందరిలా సాధారణ జీవితం గడపకుండా తనకంటూ ఒక లక్ష్యాన్ని చేసుకొని ఉన్నత శిఖరాలకు వెళ్లి సమాజంలో నుంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆశయాలు ఆర్థికలేమితో అడియాసలు అయ్యే పరిస్థితి.వివరాల్లోకి వెళితే కేసముద్రం మండలం సప్పిడి గుట్ట తండాకు చెంది సాపావత్ రేణుక ప్రొఫెసర్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతుంది.కష్టపడి చదివి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న రేణుక తండ్రి అకాలంగా మృతి చెందారు.తండ్రి మరణించిన క్షోభ ఉండగా అంతేకాకుండా తలకు మించిన భారంగా అప్పులు కూడా భారంగా మారాయి.ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో బి ఎస్సీ అగ్రికల్చరల్ చేస్తున్నది.కాగా ఆమె చదువు కొనసాగించేందుకు,దాతలు,సంఘాలు,ఎంప్లాయిస్ అందరూ ఆర్ధిక సహకారం అందించాల్సిందిగా ఎన్ ఎఫ్ హెచ్ సి ఫౌండేషన్ వ్యవస్థపాక సభ్యుడు మోహన్ విజ్ఞప్తి చేసారు.మండలంలో తావుర్య తండ నివాసి అయిన మోహన్,బెంగళూరు లో జాబ్ చేస్తూ,వెనకబడిన వర్గాల శ్రేయస్సు కోసం,విద్యార్థుల మేలు కోసం ఫౌండేషన్ తరుపున సహకారం అందిస్తుంటారు.అలాగే తండ్రిని కోల్పోయిన పేద విద్యార్థిని రేణుక చదువును ఆపకుండా,ముందుకు సాగేలా ఫౌండేషన్ తరుపున డొనేషన్స్ చేస్తూ,ప్రజలు,దాతలు అందరూ ఈ పేద విద్యార్ధికి సహకారం అందిస్తే,సమాజానికి ఒక మంచి వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎదిగి,సేవలు అందిస్తారని ఆశిస్తున్నారు.సపావత్ రేణుక ఉన్నత చదువులు చదువుతున్న ఒక తెలివైన మరియు కష్టపడి పనిచేసే విద్యార్థిని.ఆమెకు నేర్చుకోవాలనే తపన,విజయవంతమైన వ్యవసాయ శాస్త్రవేత్త కావాలనే కల ఉంది.అయితే రూ.7 లక్షలకు పైగా అప్పులు మిగిల్చి తండ్రి అనారోగ్యంతో మరణించడంతో ఆమె జీవితం విషాద మలుపు తిరిగింది.ఆమె తల్లి కుటుంబానికి ఏకైక ఆధారం మరియు జీవనోపాధి కోసం కష్టపడుతోంది.రేణుక తన విద్యను కొనసాగించడానికి మరియు ఆమె లక్ష్యాలను సాధించడానికి మీ సహాయం కావాలని కోరారు.ఆమెకు మరో మూడేళ్ల కాలేజీ పూర్తి చేయాల్సి ఉంది,దీనికి ట్యూషన్ మరియు మెస్ ఫీజుల కోసం సుమారు రూ.4 లక్షలు ఖర్చవుతుంది.ఈ క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచి తన చదువును పూర్తి చేయడానికి దోహదపడే ఉదార దాతల కోసం ఆమె వెతుకుతోంది.దాతలు విద్యార్థిని రేణుక ఫోన్ పే,గూగుల్ పే నెంబర్ +91 80193 05451 కి సహాయం చేయవలసిందిగా కోరారు.

MBBS సీట్లపై TS నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది: తెలంగాణ విద్యార్థులకు 520 సీట్లు ఎక్కువ

హైకోర్టు తాజా తీర్పుతో, తెలంగాణ విద్యార్థులకు మరో 520 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి, తెలంగాణ విద్యార్థులకు ప్రతి సంవత్సరం మొత్తం MBBS సీట్ల సంఖ్య 1,820కి చేరుకుంది.

హైదరాబాద్: జూన్ 2, 2014 తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో పోటీ అథారిటీ కోటా సీట్లలో 100 శాతం తెలంగాణ విద్యార్థులకు మాత్రమే రిజర్వ్ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పుపై ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ నుండి ఔత్సాహిక వైద్య విద్యార్ధులందరికీ అతను తన శుభాకాంక్షలు తెలియజేశాడు, ఇప్పుడు వారికి అదనంగా 520 సీట్లు అందుబాటులో ఉంటాయి.

వైద్య విద్యకు సమానమైన ప్రాప్యతను నిర్ధారించడానికి ఈ తీర్పు ఒక ముఖ్యమైన అడుగు అని మంత్రి ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. “ఇది స్వాగతించదగిన పరిణామం. ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను నెలకొల్పి, వాటి ద్వారా ఏర్పడే ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు ఉపయోగపడేలా చూడాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సరైనదేనని అన్నారు.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చొరవ వల్ల 85 శాతం ఎంబిబిఎస్‌ ‘బి’ కేటగిరీ సీట్లను స్థానిక విద్యార్థులకు రిజర్వ్ చేయడం ద్వారా తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1,300 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. హైకోర్టు తాజా తీర్పుతో తెలంగాణ విద్యార్థులకు మరో 520 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి, దీంతో తెలంగాణ విద్యార్థులకు ఏటా 1,820 ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయి.

జెఇఇ అడ్వాన్స్‌డ్: ఐఐటి ధన్‌బాద్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోసం గత 5 సంవత్సరాల కేటగిరీ వారీగా కట్-ఆఫ్‌లను తనిఖీ చేయండి

IIT ధన్‌బాద్ NIRF 2023 యొక్క మొత్తం విభాగంలో 42వ ర్యాంక్‌ను పొందింది, ఇది ఇంజనీరింగ్ కళాశాలలలో 17వ ర్యాంక్, పరిశోధన విభాగంలో 24 మరియు మేనేజ్‌మెంట్ కళాశాలల విభాగంలో 44వ ర్యాంక్‌ను పొందింది.

జేఈఈ అడ్వాన్స్‌డ్: ఐఐటీ ధన్‌బాద్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన కటాఫ్‌లు గణనీయంగా మారాయి. ఓపెన్ కేటగిరీలో మొదటి రౌండ్ కౌన్సెలింగ్‌కు 2019 నుండి 2021 వరకు 3000 నుండి 3700 మధ్య ప్రారంభ కట్ ఆఫ్ ఉంది. అయితే, గత రెండు సంవత్సరాలలో, కేటగిరీకి ప్రారంభ ర్యాంక్ 5000 కంటే ఎక్కువగా ఉంది.

అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, గత కొన్నేళ్లుగా ఓపెన్ కేటగిరీ మహిళలకు ఓపెనింగ్ ర్యాంక్ దాదాపు 10,000గా ఉంది. EWS కేటగిరీకి సంబంధించిన ఓపెనింగ్ ర్యాంక్ కూడా 2019లో 476 నుండి 2023లో 934కి పెరిగింది. ఇతర అన్ని కేటగిరీలలో కూడా ఇలాంటి ట్రెండ్‌లు కనిపించాయి.

ఈ సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) 2023 యొక్క మొత్తం విభాగంలో 42వ ర్యాంక్‌ను పొందింది, ఇది ఇంజనీరింగ్ కాలేజీలలో 17వ ర్యాంక్, పరిశోధన విభాగంలో 24 మరియు మేనేజ్‌మెంట్ కాలేజీల విభాగంలో 44వ ర్యాంక్‌ను పొందింది.

KITS వరంగల్ IC3T-2023 అక్టోబర్ 6 నుండి 7 వరకు నిర్వహించబడుతుంది

సమాజం, పర్యావరణం మరియు పరిశ్రమలలోని వైవిధ్యభరితమైన సమస్యలకు వాస్తవిక పరిష్కారాన్ని అందించడానికి వర్తించే సిస్టమ్ పరిజ్ఞానం, మేధస్సు మరియు స్థిరత్వంలోని వివిధ ఆవిష్కరణ నమూనాలపై థీమ్ దృష్టి సారిస్తుంది.

హన్మకొండ: డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ), కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (కిట్స్‌డబ్ల్యూ) ఆధ్వర్యంలో 5వ స్కోపస్ ఇండెక్సింగ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ‘కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ (ఐసీ3టీ-2023) అక్టోబరు 6 నుంచి 7 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి.

గురువారం ఇక్కడి క్యాంపస్‌లో సదస్సు పోస్టర్‌, బ్రోచర్‌ను విడుదల చేశారు. స్మార్ట్ కంప్యూటింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మరియు ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ల రూపకల్పనకు సంబంధించి అధునాతన మరియు బహుళ-క్రమశిక్షణా పరిశోధన కోసం ఏకీకృత వేదికను అందించడం ఈ సదస్సు యొక్క లక్ష్యం.

సమాజం, పర్యావరణం మరియు పరిశ్రమలలోని వైవిధ్యభరితమైన సమస్యలకు వాస్తవిక పరిష్కారాన్ని అందించడానికి వర్తించే సిస్టమ్ పరిజ్ఞానం, మేధస్సు మరియు స్థిరత్వంలో వివిధ ఆవిష్కరణ నమూనాలపై థీమ్ దృష్టి సారిస్తుంది.

ECE విభాగాధిపతి డాక్టర్ V రాజు మాట్లాడుతూ, ఆమోదించబడిన అన్ని పత్రాలు “కంప్యూటర్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీస్ (LNIC3T)” పై స్ప్రింగర్ లెక్చర్ నోట్స్‌లో ప్రచురించబడతాయి. https://www.kitsw.ac.in/ic3t2023లో మరిన్ని వివరాలతో పేపర్ సమర్పణకు గడువు సెప్టెంబర్ 30.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version