అత్యుత్తమ ఫలితాలు సాధించిన అల్ఫోర్స్
రామడుగు, నేటిధాత్రి:
రాష్ట్ర విద్యాశాఖ బుధవారం ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులను సాధించి పాఠశాలకు తల్లిదండ్రులకు కీర్తిని తెచ్చిపెట్టారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని అల్ఫోర్స్ పాఠశాలలో పదవ తరగతి ఫలితాలలో 600 మార్కులకు గాను బక్కశెట్టి హర్షిని 574, కే.భాను ప్రకాష్ 573, ఎం.శరణ్య 568, జె.సాయి చరణ్ 568, కే.సంజన, జి.మన్విత 566మార్కులు సాధించారు. 500కు పైగా 72 మంది వంద శాతం ఉత్తీర్ణతతో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని పాఠశాల చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను చైర్మన్ ఊట్కూరి నరేందర్ రెడ్డి శాలువా కప్పి ఘనంగా సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు.