చిరంజీవి పాటకు భీమ్స్ ట్యూన్.

చిరంజీవి పాటకు భీమ్స్ ట్యూన్

 

 

 

 

 

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా గురించి వార్తలు విశేషంగా వినిపిస్తున్నాయి- కానీ, ఆ మూవీ రిలీజ్ డేట్ మాత్రం తెలియడం లేదు.. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కు భీమ్స్ ట్యూన్స్ అందిస్తూ ఉండడం ఇప్పుడు విశేషంగా మారింది.

 

మొదటి నుంచీ ప్రతిభ ఎక్కడ ఉన్నా ప్రోత్సహిస్తూ సాగుతున్నారు చిరంజీవి…

ఆయన రీ ఎంట్రీ తరువాత ‘ఖైదీ నంబర్ 150’, ‘వాల్తేరు వీరయ్య’ మినహాయిస్తే మిగిలిన నాలుగు సినిమాలు అంతగా అలరించలేకపోయాయి…

‘భోళాశంకర్’ పరాజయం చిరంజీవి ఫ్యాన్స్ కు నిరాశ కలిగించింది…

దాంతో ‘విశ్వంభర’ ద్వారా అభిమానులకు ఆనందం పంచే దిశగా సాగుతున్నారు చిరంజీవి.

యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేసే చిరంజీవి ఈ సినిమాలో డైరెక్టర్ మల్లిడి వశిష్ఠకు ఛాన్స్ ఇచ్చారు…

అతను కూడా శక్తివంచన లేకుండా ‘విశ్వంభర’ను రూపొందించారు…

ఓ పాట మినహా ‘విశ్వంభర’ పూర్తయింది…

ఈ సాంగ్ ఐటమ్ నంబర్ గా రూపొందనుంది… .

ఇందులో చిరంజీవితో చిందేసే ముద్దుగుమ్మ కోసం అన్వేషణ సాగుతోంది…

ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు…

ఆయన ‘హరిహర వీరమల్లు’ సినిమా రీ-రికార్డింగ్ లో బిజీగా ఉన్నారు…

అందువల్ల ఈ ఐటమ్ నంబర్ కు మాత్రం భీమ్స్ సిసిరోలియో ట్యూన్స్ ఎంచుకున్నారట…

ఈ యేడాది బంపర్ హిట్ గా నిలచిన ‘సంక్రాంతికి వస్తున్నాం’కు భీమ్స్ సిసిరోలియో ట్యూన్స్ భలేగా పనిచేశాయి…

ఈ చిత్రంలోని పాటలు మాస్, క్లాస్ అన్న తేడాలేకుండా అందరినీ ఆకట్టుకుంటున్నాయి…

చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రానికి కూడా భీమ్స్ స్వరకల్పన చేస్తున్నారు…

ఈ నేపథ్యంలోనే ‘విశ్వంభర’ చిత్రంలోని ఐటమ్ నంబర్ కు భీమ్స్ బాణీలు ఉపయోగించుకోవాలని చిరంజీవి, దర్శకుడు వశిష్ఠ నిర్ణయించారు…

చిరంజీవి సినిమాలో ఐటమ్ నంబర్ అంటే ఇరగదీసేలా ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు…

మరి వారి అంచనాలకు తగ్గట్టుగానే భీమ్స్ బాణీలు ఉంటాయని టాక్!

అప్పుడలా… ఇప్పుడిలా…

దాదాపు 21 సంవత్సరాల క్రితం చిరంజీవి ‘అంజి’ సినిమా అప్పట్లో జనాల్లో విశేషమైన క్రేజ్ క్రియేట్ చేసింది…

ఆ సినిమాకు ముందు శ్రీ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నారు…

ఓ పాటను కూడా చిత్రీకరించారు…

తరువాత పలు మార్పులు జరిగి, మణిశర్మ బాణీలతోనే ‘అంజి’ రిలీజయింది…

అప్పట్లో గ్రాఫిక్స్ తో ‘అంజి’ అలరించే ప్రయత్నం చేసింది…

ఇప్పుడు ‘విశ్వంభర’లోనూ జీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంది…

అంతేకాదు, ‘విశ్వంభర’ విడుదలలోనూ జాప్యం జరుగుతోంది…

అయితే అప్పుడు శ్రీ స్థానంలో మణిశర్మ వచ్చి ఒక పాట మినహా అన్నీ పూర్తి చేశారు…

ఇప్పుడు కీరవాణి బిజీ వల్ల భీమ్స్ వచ్చి ఓ పాటకు ట్యూన్స్ కడుతున్నారు…

ఏది ఏమైనా చివరగా మిగిలిన పాట పూర్తయితే ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారు.

మరి కీరవాణికి బదులుగా ఓ పాటకు బాణీలు కడుతున్న భీమ్స్ ఈ ఐటమ్ నంబర్ ను ఎలా రూపొందిస్తారో చూడాలి.

సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన.

సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయిని

#పార్టీలకు అతీతంగా ఆరోగ్య పరంగా అండగా ఉంటానని భరోసా…

#63 మంది లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.

హనుమకొండ, నేటిధాత్రి:

 

 

 

 

 

ప్రజల ఆరోగ్యం కోసం పతాకంగా నిలిచిన సీఎం సహాయనిధి చెక్కులను పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.గురువారం రోజున బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 63 మంది లబ్ధిదారులకు రూ 28,48,600/- విలువైన చెక్కులు ,వరంగల్ మండలానికి చెందిన 5 మందికి రూ.5,00,580/-ల విలువగల కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు ఎవరికి అయినా ఊహించకుండా వస్తాయి. అటువంటి సమయంలో ప్రభుత్వ మద్దతు అనేది ప్రజలకు వెన్నంటే నిలిచి అండగా ఉంటుంది అని అన్నారు.
ఆరోగ్య సమస్య ఎదురైనప్పుడు పార్టీలు, కులాలు, మతాలు అనే భేదాలు ఉండవు. ఒక్క మనిషిగా చూస్తూ, ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడటం కోసం నేనెప్పుడూ అండగా ఉంటాను అని తెలిపారు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం
ప్రతి పేద కుటుంబానికి అండగా నిలబడేలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితుల్లో చికిత్స కోసం ఆర్థిక సాయాన్ని అందజేస్తూ వేలాది కుటుంబాలను ఆదుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అధికార యంత్రాంగం  పాల్గొన్నారు.

మినీ స్టేడియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన..

మినీ స్టేడియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

భూపాలపల్లి పట్టణం కేంద్రంలోనీ సుభాష్ కాలనీలో గల టి యు ఎఫ్ ఐ డి సి నిధులు 400 లక్షల రూపాయలతో మినీ స్టేడియం నిర్మాణ పనులకు ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ ఈ స్టేడియంను ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ స్టేడియం నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కి మరియు సంబంధిత అధికారులకు సూచించారు. రాబోవు రోజుల్లో ఈ స్టేడియంకు సావిత్రి బాయ్ పూలే పేరు పెడతామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఏఈ మానస పట్టణ అధ్యక్షుడు దేవన్ పిసిసి మెంబర్ చల్లూరు మధు అప్పం కిషన్ బుర్ర కొమురయ్య దాట్ల శ్రీనివాస్ ముంజాల రవీందర్ కురుమిళ్ళ శ్రీనివాస్ రమణ చారి పార్టీ మండల నాయకులు అధికారులు పాల్గొన్నారు.

మాట తీసుకున్నాడు.. మరోసారి చేయబోతున్నాడట..

మాట తీసుకున్నాడు.. మరోసారి చేయబోతున్నాడట..

 

 

 

 

పవన్‌ కళ్యాణ్ కొత్త కథలు వింటున్నట్లు టాక్‌ నడుస్తోంది. ఆయనతో హిట్ సినిమా తీసిన  దర్శకుడితో మరోసారి సినిమా చేయబోతున్నాడని  తెల్సింది  

 

పవన్‌ కల్యాణ్‌ ‘హరి హర వీరమల్ల్లు’ సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు. ‘ఓజీ’కీ కూడా  కాల్షీటు ఇచ్చారు. త్వరలోనే ఆ చిత్రం కూడా పూర్తికానుందని మేకర్స్‌ వెల్లడించారు. ఇంకో వైపు హరీశ్‌ శంకర్‌ కూడా ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ షూటింగ్‌ షురూ చేశారు. ఈసినిమా సెట్‌లోనూ పవన్‌ పాల్గొంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్‌ కొత్త కథలు వింటున్నట్లు టాక్‌ నడుస్తోంది. ఆయనతో ‘బ్రో’ చిత్రం తీసిన తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని పవన్‌తో మరో సినిమా చేయాలనుందని ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయితే ఇటీవల సముద్రఖని పవన్‌కు ఓ కథ చెప్పారట.

ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ‘బ్రో’ సినిమా వచ్చింది. పవన్‌ ఫ్యాన్స్‌ను మెప్పించిన సినిమా అది. అప్పట్లోనే పవన్‌ సముద్రఖనితో ఓ సినిమా చేస్తానని మాటిచ్చారట. ఇప్పుడు అది పట్టాలెక్కబోతోందని తెలిసింది. పవన్‌కు ఇప్పటికే కొంతమంది నిర్మాతలు అడ్వాన్స్‌ ఇచ్చారు. ఆయన పార్టీ పనులతో బిజీ కావడం, సినిమాలకు కొంత గ్యాప్‌ ఇవ్వంతో కొందరికి అడ్వాన్స్‌లు తిరిగి ఇచ్చేశారు. అందులో కొంత మందికి ఇవ్వాల్సి ఉంది. వారిలో ఓ నిర్మాత కోసం ఇప్పుడీ సినిమా చేయబోతున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. తక్కువ సమయంలో, లిమిటెడ్‌ బడ్జెట్‌ లో ఈ సినిమా ప్లాన్‌ చేశారట. ఇటీవల సముద్రఖని పవన్‌ని కలిసి కథ చెప్పేసినట్టు ఇన్‌ సైడ్‌ వర్గాల టాక్‌. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ పూర్తయిన తర్వాత ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం.

 

Kajol: రామోజీ ఫిల్మ్ సిటీ.. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన చోటు

Dhanush: ‘కుబేర’.. టచ్ చేసే పాట

 

Vishwambhara: చిరంజీవి పాటకు భీమ్స్ ట్యూన్

పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధం.

పల్లె పోరుకు సిద్ధం…..

◆ పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధం

◆ ఎన్నికలెప్పుడొచ్చినా సజావుగా నిర్వహించేలా కసరత్తు

◆ బ్యాలెట్‌ బాక్సులు, పత్రాలు సమకూర్చేపనిలో నిమగ్నం

◆ పోలింగ్‌ కేంద్రాలు, సిబ్బంది ఎంపిక, శిక్షణపై దృష్టి

◆ జిల్లాలకు చేరిన ఎన్నికల గుర్తులు

◆ సర్పంచ్‌కు 30.. వార్డు సభ్యులకు 20

◆ రాష్ట్రంలో 12,848 పంచాయతీలు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

పల్లె పోరుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు చేస్తోంది. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఎన్నికల ప్రక్రియను సజావుగా చేపట్టడానికి సమాయత్తమవుతోంది.

సంగారెడ్డి,పల్లె పోరుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు చేస్తోంది. నోటిఫికేషన్‌ ఎప్పుడొచ్చినా ఎన్నికల ప్రక్రియను సజావుగా చేపట్టడానికి సమాయత్తమవుతోంది. సిబ్బంది ఎంపిక, వారికి శిక్షణ, పోలింగ్‌ కేంద్రాల గుర్తిం పు, ఎన్నికల గుర్తులు తదితర అంశాలపై అధికారులు కొద్దిరోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఇందు లో భాగంగా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులకు గ్రామపంచాయతీ ఎన్నికల్లో నిర్వహించాల్సిన విధులను కేటాయించారు. తెలంగాణ లో గ్రామాల సంఖ్య పెరగడంతో బ్యాలెట్‌ బాక్సుల అవసరం మరింత ఏర్పడింది. అందుకే పక్క రాష్ర్టాల నుంచి బాక్సులు తెప్పిస్తున్నారు. అలాగే, గ్రామాలు, వార్డుల వారీగా కావాల్సిన బ్యాలెట్‌ పత్రాల అవసరాన్ని అంచనా వేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల ఎంపిక ఇప్పటికే పూర్తయ్యింది. ఇక, ఎన్నికల్లో విధులు నిర్వహించడానికి ఉపాధ్యాయులతోపాటు ఇతర శాఖల ఉద్యోగులను గుర్తించారు. పలుచోట్ల సిబ్బందికి శిక్షణ కొనసాగుతోంది. ఇక, ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు కేటాయించే గుర్తులు కూడా సిద్ధమైనట్టు సమాచారం.

Elections

పంచాయతీ గుర్తులివే..

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుర్తులపై తుది కసరత్తు పూర్తయ్యింది. సర్పంచ్‌ అభ్యర్థులకు 30 గుర్తులు, వార్డు సభ్యులకు 20 గుర్తులను ఆమోదించినట్లుగా తెలుస్తోంది. దాదాపు ఇవే గుర్తులు ఖరారయ్యే అవకాశం ఉంది.

సర్పంచ్‌ గుర్తులు:

ఉంగరం, కత్తెర, బ్యాటు, ఫుట్‌బాల్‌, లేడీ పర్సు, టీవీ రిమోట్‌, టూత్‌ పేస్టు, స్పానర్‌(పానా), చెత్త డబ్బా, బ్లాక్‌ బోర్డు, బెండకాయలు, కొబ్బరితోట, వజ్రం, బకెట్‌, డోర్‌ హ్యాండిల్‌, టీ జల్లెడ, చేతికర్ర, మంచం, పలక, టేబుల్‌, బ్యాటరీ లైట్‌, బ్రష్‌, క్రికెట్‌ బ్యాటర్‌, పడవ, బిస్కెట్‌, పిల్లనగ్రోవి, చైను, చెప్పులు, బెలూన్‌, క్రికెట్‌ వికెట్లు

వార్డు సభ్యుల గుర్తులు

గౌను, గ్యాస్‌స్టవ్‌, స్టూల్‌, గ్యాస్‌ సిలిండర్‌, బీరువా, విజిల్‌, కుండ, డిష్‌ యాంటీనా, గరాటా, మూకుడు, ఐస్‌క్రీం, గాజుగ్లాసు, పోస్టు డబ్బా, ఎన్వలప్‌ కవర్‌, హాకీ స్టిక్‌ మరియు బంతి, నెక్‌ టై, కటింగ్‌ ప్లేయర్‌, పెట్టె, విద్యుత్‌ స్తంభం, కెటిల్‌.

రిజర్వేషన్లపై ఉత్కంఠ..

రాష్ట్రంలోని పల్లెల్లో ప్రస్తుతం ఎన్నికల రిజర్వేషన్లే హాట్‌టాపిక్‌గా మారాయి. సామాజిక వర్గాల వారీగా ఆశావహులు పోటీకి సిద్ధమయ్యారు. పం చాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు అనుకూలించకుం టే స్థానిక ఎన్నికల వైపు గురిపెడుతున్నారు. పం చాయతీ ఎన్నికల్లో సగం దాకా మహిళా రిజర్వేషన్లు ఉండడంపైనా తర్జనభర్జన పడుతున్నారు. అయితే, రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయా గ్రా మాల్లో సామాజికవర్గాల జనాభాశాతం, మహిళల సంఖ్యతోపాటు గతంలో వరుసగా మూడుసార్లు వచ్చిన రిజర్వేషన్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా తెలిసింది. గతసారి వచ్చిన రిజర్వేషన్‌ ఈసారి మారవచ్చని అంటున్నారు. తమ గ్రామానికి ఫలానా రిజర్వేషన్‌ను కేటాయించాలని అధికారులకు వినతిపత్రాలు కూడా అందజేస్తున్నారు.మొత్తంగా ఎన్నికల కోడ్‌ వెలువడకముందే రిజర్వేషన్ల అంశం పల్లెల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా 12,848 గ్రామ పంచాయతీలను గుర్తించింది. వీటన్నింటికి ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన నివేదిక వివరాలను ‘ఆంధ్రజ్యోతి’ సంపాదించింది. దాని ప్రకారం మొత్తం 12,848 గ్రామ పంచాయతీల్లో 5,817 ఎంపీటీసీ స్థానాలుండగా, 570 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 868 గ్రామ పంచాయతీలు ఉండగా అక్కడ 352 ఎంపీటీసీ స్థానాలు, 33 జడ్పీటీసీ స్థానాలున్నాయి. ఇక, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో అత్యల్పంగా 34 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ జిల్లాలో 19 ఎంపీటీసీ, 3 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి.

ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం

రాష్ట్రంలోని పంచాయతీల వివరాలు

జిల్లా గ్రామపంచాయతీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు

ఆదిలాబాద్‌ 473 166 20

భద్రాద్రి కొత్తగూడెం 478 236 22

హన్మకొండ 210 129 12

జగిత్యాల 385 216 20

జనగాం 280 134 12

భూపాలపల్లి 248 109 12

జోగులాంబ గద్వాల 255 142 13

కామారెడ్డి 536 237 25

కరీంనగర్‌ 318 170 15

ఖమ్మం 579 288 20

అసిఫాబాద్‌ 335 127 15

మహబూబాబాద్‌ 482 193 18

మహబూబ్‌నగర్‌ 423 175 16

మంచిర్యాల 306 129 16

మెదక్‌ 492 190 21

మేడ్చల్‌ మల్కాజిగిరి 34 19 3

ములుగు 174 87 10

నాగర్‌కర్నూల్‌ 460 214 20

నల్లగొండ 868 352 33

నారాయణపేట 276 136 13

నిర్మల్‌ 400 157 18

నిజామాబాద్‌ 545 307 31

పెద్దపల్లి 266 140 13

రాజన్న సిరిసిల్ల 260 123 12

రంగారెడ్డి 531 232 21

సంగారెడ్డి 633 276 27

సిద్దిపేట 508 230 26

సూర్యాపేట 486 235 23

వికారాబాద్‌ 594 227 20

వనపర్తి 268 133 15

వరంగల్‌ 317 130 11

యాదాద్రి భువనగిరి 428 178 17

తొలి ఒడి అమ్మ బడి అమ్మ మాట అంగన్వాడి బాట.

తొలి ఒడి అమ్మ బడి అమ్మ మాట అంగన్వాడి బాట

ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత

జైపూర్ నేటి ధాత్రి:

 

జైపూర్ మండలం ముదిగుంట అంగన్వాడి కేంద్రంలో అమ్మ ఒడి అంగన్వాడి బాట కార్యక్రమం బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు నర్సరీ,ఎల్కేజీ,యూకేజి తరగతులను ప్రైవేటు పాఠశాలల దీటుగా ప్రీ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్,పుస్తకాలు అందించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళిక రూపొందించారని అన్నారు.అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేసేందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.అంగన్వాడి కేంద్రాల్లో ప్రతి నెల పిల్లల ఎత్తు, బరువు,పెరుగుదలకు కావలసిన పోషక ఆహారం అందిస్తూ పిల్లలకు ఆట,పాటలు,అక్షరాలు నేర్పిస్తూ విద్యార్థుల భవిష్యత్తు బాల్యం నుంచి క్రమశిక్షణగా రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత అంగన్వాడి టీచర్ రాజేశ్వరి,ఆయమ్మ, విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే గండ్ర దంపతులకు ఘన స్వాగతం.

మాజీ ఎమ్మెల్యే గండ్ర దంపతులకు ఘన స్వాగతం

బిఆర్ఎస్ పార్టీ టేకుమట్ల మండల నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి:

 

బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అమెరికాలో దిగ్విజయంగా నిర్వహించి అమెరికా పర్యటన ముగించుకొని, నేడు స్వదేశానికి తిరిగి వచ్చిన భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన టేకుమట్ల మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో టేకుమట్ల బిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు సట్ల రవి గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి, మాజీ ఎంపీటీసీలు ఆది రఘు, పింగిలి వెంకటేశ్వర్ల రెడ్డి మాజీ సర్పంచులు బిలకంటి ఉమేందర్రావు నల్లబెల్లి రవీందర్, ఉద్దమారి మహేష్ యాదవ్, దేవేందర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు

పాడైన రోడ్డు పట్టించుకోని ప్రభుత్వం.

పాడైన రోడ్డు పట్టించుకోని ప్రభుత్వం..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్- బడం పేట్ మార్గమధ్యలో గల రోడ్డు కోత్తూర్, ఖానాపూర్ సమీపంలో పూర్తిగా పాడైపోయిన కారణంగా ఆసుపత్రి, పాఠశాలకు మండల కేంద్రమైన కోహీర్ కు రాకపోకలు సాగించడానికి తీవ్ర అవస్థకు గురౌతున్నామని, కోత్తూర్, ఖానాపూర్ గ్రామాలకు చెందిన పలువురు స్థానికులు శనివారం సాయంత్రం విడుదల చేసిన
సంయుక్త పత్రికా ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.

స్నేహితుని కుటుంబానికి చేయూత.

స్నేహితుని కుటుంబానికి చేయూత
మొగులపల్లి నేటి ధాత్రి:

 

మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని స్థానిక జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో తమతో పాటు చదువుకున్న 2007-08 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన ఇప్పకాయల శ్రీను తండ్రి ఇప్పకాయల రాజేందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు 10 వేల ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో బండారి ఓదెలు, తిప్పారపు సురేందర్,ల్యాండిగా రాజేందర్, జునుమల తిరుపతి, నాగలగని రాజేందర్, పోతుగంటి దశరథం తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ బ్రిడ్జి పైన ఆక్సిడెంట్ కి గురైన ఖాజా కుటుంబానికి సహాయం.

జహీరాబాద్ బ్రిడ్జి పైన ఆక్సిడెంట్ కి గురైన ఖాజా కుటుంబానికి సహాయం చేసిన – జేపీ చారిటబుల్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్ ఫౌండర్ జ్యోతి పండాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కొన్ని రోజుల క్రితం కొత్తగా నిర్మించిన జహీరాబాద్ బ్రిడ్జి పైన ఆక్సిడెంట్ కి గురైన ఖాజా గారి కుటుంబానికి సహాయం చేయగలరని జ్యోతి పండాల్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే, ఖాజా గారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో యాక్సిడెంట్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

అలాగే వారి కుటుంబం అంతా కూడా ఖాజా గారి సంపాదన పైన ఆధారపడి ఉన్నారు కాబట్టి వారికి ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఉండటం వల్ల రేషన్ కి కూడా చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిసి కాజా గారి ఇంటికి వెళ్లి బియ్యము, బ్లాంకెట్స్ మరియు పిల్లలకి బట్టలు అందజేయడం జరిగింది. అలాగే వారికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా తనకు కాల్ చేయమని జ్యోతి పండాల్ వారికి తెలియజేయడం జరిగింది.

ఇందిరమ్మ ఇండ్లలో అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోండి.

ఇందిరమ్మ ఇండ్లలో అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోండి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పగిడిపెల్లి రవి

మంగపేట నేటిధాత్రి:

బుచ్చంపేట గ్రామంలో కాంగ్రెస్ గ్రామ శాఖ పార్టీ అధ్యక్షుడు కాటూరు నాగయ్య జంగం భానుచందర్ ఎడ్ల నరేష్ పల్లె శోభన్. అను నలుగురు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుంటూ సీతక్క పేరు వాడుకుంటూ అక్క కుమారుడు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సూర్య పేరు వాడుకుంటూ.. వారితో దిగిన ఫోటోలు అమాయకులకు చూపిస్తూ.. మాకు అక్కకు దగ్గర మేము చెప్పింది చేస్తదని ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని. యువ వికాసంలో లోన్ ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ నెల లో కొందరికాడా వసూలు చేశారు కానీ మనం అధికారంలో ఉన్నాము కాబట్టి బయపడ్డారు మంగళవారం వచ్చిన వీడియో చూసాక వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వచ్చిస్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తారని వాస్తవం అధిష్టానికి మండల అధ్యక్షునికి మండల ప్రజలకు చెపుతున్న వాస్తవం నాపేరు పగిడిపల్లి రవిని నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకున్ని పైగా వారే. మీటింగ్లు పెట్టి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని పార్టీ ముఖ్య నాయకులను గ్రామ పేరును కాంగ్రెస్ పార్టీని చెడగొడుతున్నారు. వాస్తవంగా డబ్బులు తీసుకుంటే బయట పెట్టమని చాలెంజులు విసురుతున్నారు. నేను మీతో చెప్పినది ఏమనగా.. స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయిన నా దగ్గరే కూడా యువ వికాసం ఇస్తామని పదివేల రూపాయలను కాటూరు నాగయ్యతో కలసి నలుగురు వ్యక్తులు అడిగారు అడిగింది. వాస్తవము. నేను మొదటగా ఐదు వేల రూపాయలు ఫోన్ పే ద్వారా అందజేసింది. వాస్తవం. కాటురు నాగయ్య ఎడ్ల నరేష్ భానుచందర్ శోభన్ బాబు అధ్యక్షుని వివిధ హోదాలో ఉండి కార్యకర్త నైన నా వద్దనే ఈ విధంగా అడిగి పేపర్లలో దొంగే దొంగలు అన్నట్టుగా పేపర్లో వాస్తవములు ఉంటే బయట పెట్టమని ప్రకటనలు ఇస్తున్నారు. అందువలన నేను బయట పెట్టకు తప్పడం లేదు. నాకాడ నలుగురు మాట్లాడిన వీడియో మరియు వాయిస్ రికార్డింగ్ సాక్షులు బాధితులు ఉన్నారు బుచ్చంపేటలో ఎవ్వరిని అడిగిన చెబుతారు అందరికడా ఉన్నాయి ఇట్టి విషయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్న. రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి ధనసరి సూర్య అన్న. వీరిపై చర్య తీసుకోకపోతే రానున్న స్థానిక ఎన్నికలలో బుచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీ పూర్తి పరాభవము తప్పదు కావున వెంటనే వీరిపై చర్య తీసుకుని కాంగ్రెస్ పార్టీని నాయకుల మనోభావాలను కాపాడి రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పార్టీ విజయం సాధించుటకు సహకరిస్తారని కోరుతున్నాను.

పేదలకు సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం.

పేదలకు సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం పోతుగల్ లో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

మొగుళ్ళపల్లి నేటి దాత్రి:
మండలంలోని పోతుగల్ గ్రామంలో భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లపెల్లి రాములు గౌడ్, హౌసింగ్ ఎఈ హర్షిణి, పంచాయతీ కార్యదర్శి. సుజాత అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లకు పూజ కార్యక్రమం నిర్వహించి కొలతల ప్రకారం ముగ్గుపోసి పనులను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బి రాములు గౌడ్ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లను నిరుపేదలకు అందించడంలో ప్రత్యేక చొరవ తీసుకొని పేదోళ్ల సొంతింటి కల నెరవేర్చిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇళ్ళు లేకుండా ఎన్నో ఏళ్లుగా అద్దె గృహాల్లో ఉంటున్న మాకు ఇందిరమ్మ ఇళ్ళ కలను సాకారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కు లబ్ధిదారులు కృతజ్ఞత చాటుకున్నారు.

తాట తీస్తా.. అంబటి రాంబాబుకు డీఎస్పీ సీరియస్ వార్నింగ్

తాట తీస్తా.. అంబటి రాంబాబుకు డీఎస్పీ సీరియస్ వార్నింగ్

 

 

 

 

 

 

 

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నరసరావుపేట డీఎస్పీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే తాట తీస్తామని హెచ్చరించారు.

 

 

పల్నాడు జిల్లా: మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటనలో.. మాజీ మంత్రి అంబటి రాంబాబు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. రోడ్డుపై అడ్డంగా ఉన్న బారికేడ్‌లను విసిరిపడేశారు. అంతేకాకుండా, అడ్డుకోబోయిన పోలీసులపై కూడా దౌర్జన్యంగా ప్రవర్తించారు. దీంతో డీఎస్పీ నాగేశ్వరరావు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే తాట తీస్తామని హెచ్చరించారు. పిచ్చి వేశాలు వేస్తే అరెస్ట్ చేస్తామన్నారు. బారికేడ్‌లు తొలగింపుపై మండిపడిన డీఎస్పీ అంబటిపై చర్యలు తీసుకుంటామన్నారు.

 

 

 

 

కాగా.. వైసీపీ అధినేత జగన్ పల్నాడు పర్యటనలో ఆందోళనకర పరిస్థితులు కనిపించాయి. సత్తెన్నపల్లి పట్నంలో ఓ సీఐపై వైసీపీ మూకలు దౌర్జన్యం చేశారు. అంతేకాకుండా, ఆర్టీసీ బస్సుపై దాడి చేశారు. పల్నాడు, గుంటూరు జిల్లా సరిహద్దులో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద మాజీ మంత్రి అంబటి హల్‌చల్ చేశారు. బారికేడ్లను ఎత్తివేసి వీరంగం సృష్టించారు. నిబంధనలకు విరుద్ధంగా అంబటి ర్యాలీ చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన అంబటి బారికేడ్లను రోడ్డుపై నుంచి తోసిపడేశారు. ఇదిలా ఉంటే జగన్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

కేరళ విమానాశ్రయంలో నిలిచిపోయిన ఎఫ్-35బి

కేరళ విమానాశ్రయంలో నిలిచిపోయిన ఎఫ్-35బి

 

 

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అడ్వాన్సెడ్ విమానాల్లో ఒకటైన ఎఫ్-35బి విమానం బ్రిటన్ రాయల్ నేవీకి చెదిన హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగంగా ఉంది. ఇండో-పసిపిక్ సముద్ర జలాల్లో ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

 

 

 

తిరువనంతపురం: బ్రిటన్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్-35బి (F-35B) లైట్నింగ్ II స్టెల్త్ యుద్ధ విమానం కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో గత శనివారం రాత్రి ల్యాండ్ అయింది. నాలుగవ రోజైన బుధవారంనాడు కూడా విమానం అక్కడే నిలిచిపోయింది. ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.

 

 

 

 

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అడ్వాన్సెడ్ విమానాల్లో ఒకటైన ఎఫ్-35బి విమానం బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగంగా ఉంది. ఇండో-పసిపిక్ సముద్ర జలాల్లో ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇటీవల భారత నౌకాదళంతో సంయుక్త విన్యాసాలు ముగించుకుంది. అనంతరం ఇంధనం తక్కువ కావడంతో తిరువనంతపురం విమానాశ్రయానికి ఈ విమానాన్ని మళ్లించారు. అయితే విమానం హైడ్రాలిక్ సిస్టమ్స్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్టు ఆ తర్వాత గుర్తించారు. బ్రిటిష్ ఏవియషన్ ఇంజనీర్లు ప్రస్తుతం మరమ్మతులు చేపడుతున్నారు. ఇందుకు మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం విమానం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఈ రాత్రి US ఫెడరల్ రిజర్వ్ ప్రకటన..

ఈ రాత్రి US ఫెడరల్ రిజర్వ్ ప్రకటన.. అప్రమత్తమైన మదుపర్లు

 

 

 

 

ఈ రాత్రి తరువాత అమెరికాలో US ఫెడరల్ రిజర్వ్ ప్రకటన ఉండబోతోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురవుతాయోనని మదుపర్లు అప్రమత్తమయ్యారు.

 

 

 

ఇంటర్నెట్ డెస్క్: ఈ రాత్రి తరువాత అమెరికాలో US ఫెడరల్ రిజర్వ్ ప్రకటన ఉండబోతోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురవుతాయోనని మన మదుపర్లు అప్రమత్తమయ్యారు. దీంతో వరుసగా రెండో రోజైన ఇవాళ భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. దీనికితోడు మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు కూడా భారత మార్కెట్ల మీద ప్రభావం చూపాయి.

 

 

 

మార్కెట్లు ముగిసే సమయానికి, సెన్సెక్స్ 138.64 పాయింట్లు లేదా 0.17 శాతం తగ్గి 81,444.66 వద్ద ఉంది. నిఫ్టీ 41.35 పాయింట్లు లేదా 0.17 శాతం తగ్గి 24,812.05 వద్ద ముగిసింది. BSE మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.3 శాతం పడిపోయాయి. నిఫ్టీలో టాప్ లూజర్లలో TCS, అదానీ పోర్ట్స్, JSW స్టీల్, HUL, అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఉండగా. లాభపడిన వాటిలో ఇండస్ఇండ్ బ్యాంక్, ట్రెంట్, టైటాన్ కంపెనీ, మారుతి సుజుకి ఇంకా M&M ఉన్నాయి.

 

 

 

 

ఇక, రంగాల పరంగా చూస్తే, ఇవాళ మార్కెట్లో.. ఆటో, ప్రైవేట్ బ్యాంక్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మినహా, అన్ని ఇతర సూచీలు IT, మీడియా, మెటల్, ఆయిల్ & గ్యాస్, రియాల్టీ 0.5-1 శాతం క్షీణించి నష్టపోయాయి. గడువు తేదీకి సెబీ అనుమతి ఇచ్చిన తర్వాత BSE షేర్లు నష్టపోయాయి. నోమురా లక్ష్య అప్‌గ్రేడ్‌తో ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు 4% పెరిగాయి. OnePlusతో భాగస్వామ్యంతో ఆప్టిమస్ ఇన్‌ఫ్రాకామ్ 8 శాతం పెరిగింది. ప్రీ-ఐపిఓ వాటాదారులకు తప్పనిసరి ఆరు నెలల లాక్-ఇన్ వ్యవధి ఈరోజు ముగిసిన తర్వాత మోబిక్విక్ సిస్టమ్స్ షేర్లు 8% పడిపోయాయి.

 

 

 

 

 

 

BSEలో 70 కి పైగా స్టాక్‌లు 52 వారాల గరిష్ట స్థాయిలను తాకాయి. వాటిలో ఆథమ్ ఇన్వెస్ట్‌మెంట్, ఫెడరల్-మొగల్, AU స్మాల్ ఫైనాన్స్, యాక్సిస్‌కేడ్స్ టెక్నాలజీస్, లుమాక్స్ ఇండస్ట్రీస్, PSP ప్రాజెక్ట్స్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, రెడింగ్టన్, నవీన్ ఫ్లోరిన్, రెడింగ్టన్ తదితరాలు ఉన్నాయి.

ఫ్లైఓవర్ సైన్‌బోర్డ్‌లో ఉర్దూ భాష చేర్చబడిన ఇది సమానత్వం యొక్క విజయం.

ఫ్లైఓవర్ సైన్‌బోర్డ్‌లో ఉర్దూ భాష చేర్చబడిన ఇది సమానత్వం యొక్క విజయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నుండి ఒక సంతోషకరమైన వార్త: జహీరాబాద్‌లోని ప్రసిద్ధ “మొహమ్మద్ ఫరీద్ ఉద్దీన్ ఫ్లైఓవర్” సైన్‌బోర్డ్ నుండి ఉర్దూ భాషను దూరంగా ఉంచినప్పుడు, ముస్లిం ప్రజలు దానిని తమ భావాలకు సంబంధించినదిగా భావించారు. ! ఈ నిర్ణయం ఉర్దూ మాట్లాడే ప్రజలను మాత్రమే కాకుండా, తెలంగాణలోని గంగా-జముని సంస్కృతిని కూడా అవమానించింది.
ఈ నిర్ణయం ఉర్దూ మాట్లాడే ప్రజలను మాత్రమే కాకుండా, తెలంగాణలోని గంగా-జముని సంస్కృతిని కూడా అవమానించింది.
ఈ నిర్ణయం ఉర్దూ మాట్లాడే ప్రజలనే కాకుండా తెలంగాణలోని గంగా-జమునీ సంస్కృతిని కించపరిచింది.ఈ నిర్ణయం ఉర్దూ మాట్లాడే ప్రజలనే కాకుండా తెలంగాణలోని గంగా-జముని సంస్కృతిని కూడా అవమానపరిచింది.
కానీ ప్రజలు మౌనంగా కూర్చోలేదు! ముస్లిం నాయకులు బిగ్గరగా స్వరం వినిపించి తమ డిమాండ్లను ప్రభుత్వానికి తీసుకెళ్లారు. నేడు, ఆ స్వరం రంగు పులుముకుంది! ఫ్లైఓవర్ సైన్‌బోర్డ్‌లో ఉర్దూ భాష కూడా చేర్చబడింది. ఇది కేవలం ఒక పదం యొక్క అదనంగా కాదు – ఇది సంస్కృతి, గుర్తింపు మరియు సమానత్వం యొక్క విజయం. మొహమ్మద్ ఫరీద్ ఉద్దీన్ ఫ్లైఓవర్ పేరు ఇప్పుడు ఉర్దూలో కూడా ప్రకాశిస్తుంది మరియు ప్రజల స్వరం ఎప్పటికీ వృధా కాదని ప్రజలు గుర్తు చేస్తుంది. అన్నారు

3 సూపర్‌ ఓవర్లతో రికార్డు .

3 సూపర్‌ ఓవర్లతో రికార్డు

 

క్రికెట్‌ మ్యాచ్‌ల్లో స్కోర్లు సమం కావడం అరుదుగా చోటు చేసుకుంటుంది. అలాంటి వేళ విజేతను తేల్చేందుకు సూపర్‌ ఓవర్‌ను నిర్వహిస్తుంటారు. అలాగే సోమవారం రాత్రి…
గ్లాస్గో: క్రికెట్‌ మ్యాచ్‌ల్లో స్కోర్లు సమం కావడం అరుదుగా చోటు చేసుకుంటుంది. అలాంటి వేళ విజేతను తేల్చేందుకు సూపర్‌ ఓవర్‌ను నిర్వహిస్తుంటారు. అలాగే సోమవారం రాత్రి నేపాల్‌-నెదర్లాండ్స్‌ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ కూడా టై అయ్యింది. అయితే ఇక్కడ ఫలితం తేలేందుకు ఒక్క సూపర్‌ ఓవర్‌ సరిపోలేదు. ఏకంగా మూడుసార్లు ఇరు జట్లు బరిలోకి దిగాల్సి వచ్చింది. ఇప్పటి వరకు టీ20 లేక లిస్ట్‌ ‘ఎ’ మ్యాచ్‌ల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. ముందుగా నెదర్లాండ్స్‌ 20 ఓవర్లలో 152/7 స్కోరు చేసింది. ఛేదనలో నేపాల్‌ చివరి ఓవర్‌లో రెండు ఫోర్లతో సరిగ్గా 152/8 స్కోరే చేసింది. దీనికి తోడు రెండు జట్లు కూడా తొలి సూపర్‌ ఓవర్‌లో 19, రెండో సూపర్‌ ఓవర్‌లో 17 పరుగులు సాధించడంతో మూడోసారి అనివార్యమైంది. అందులో నేపాల్‌ పరుగులేమీ చేయకుండా 4 బంతుల్లో 2 వికెట్లు కోల్పోగా.. నెదర్లాండ్స్‌ ఓ సిక్సర్‌తో మ్యాచ్‌ను విజయంతో ముగించింది.

ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య.

“ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య”

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ నేటి ధాత్రి:

 

ప్రభుత్వ కళాశాలలో అందిస్తున్నామని, మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేర్పించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విద్యార్ధుల తల్లిదండ్రులకు సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వారి కరపత్రాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిష్ణాతులైన అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉన్నారని ఆయన తెలిపారు. కళాశాలలో చదివే విద్యార్థులకు చదువుతో పాటు కల్చరల్ కార్యక్రమాలు, స్పోర్ట్స్ లాంటి వాటికి కళాశాలలో శిక్షణ ఇస్తారని ఉన్నతంగా విద్యార్థులను అధ్యాపకులు తీర్చిదిద్దుతారని చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివుకున్న విద్యార్థులకు ఎంసెట్ లక్ష ర్యాంకు వరకు ఉచితంగా ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్ లభిస్తుంది అని ఆయన స్పష్టం చేశారు.

వెన్నునొప్పి వస్తుందా..

వెన్నునొప్పి వస్తుందా.. ఈ పొరపాట్లు చేయకండి..

 

 

 

 

వెన్నునొప్పి అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్య. అయితే, దీని వెనుక అనేక కారణాలు ఉండొచ్చు. కానీ, ముఖ్యంగా మనం చేసే ఈ తప్పుడు అలవాట్లు ఈ సమస్యను మరింత పెరిగేలా చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 

 

 

వెన్నునొప్పి అంటే వీపు భాగంలో కలిగే నొప్పి. ఇది కండరాలు, ఎముకలు, నరాలు, లేదా వెన్నుపాములోని ఇతర భాగాల నుండి రావచ్చు. సాధారణంగా, ఇది స్వల్పకాలికంగా లేదా దీర్ఘకాలికంగా ఉంటుంది. వెన్నునొప్పి అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. అయితే దీని వెనుక అనేక కారణాలు ఉండొచ్చు. కానీ, ముఖ్యంగా మనం చేసే ఈ తప్పుడు అలవాట్లు ఈ సమస్యను మరింత పెరిగేలా చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

 

తప్పుగా కూర్చోవడం:

గంటల తరబడి కంప్యూటర్ ముందు వంగి కూర్చోవడం, సోఫాలో సరిగా కూర్చోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని తగ్గించాలంటే నేరుగా కూర్చోవాలి, కుర్చీ కూడా మంచిది ఉపయోగించాలి. ప్రతి 30-40 నిమిషాలకు లేచి కొంచెం నడవడం మంచిది.

 

 

 

 

శారీరక శ్రమ లేకపోవడం

రోజంతా కూర్చొని పని చేయడం వల్ల కండరాలు బలహీనపడతాయి. ముఖ్యంగా నడుము చుట్టూ ఉన్న కండరాలు బలహీనపడితే, వెన్నెముకకు సరైన మద్దతు లేక నొప్పి వస్తుంది. కనీసం రోజుకు కొన్ని నిమిషాలు యోగా, వాకింగ్ లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల మంచిది.

 

 

 

 

బరువులు ఎత్తడం:

బరువులు ఎత్తేటప్పుడు వంగి ఎత్తడం, లేదా ఒక్కసారిగా ఎక్కువ బరువు మోయడం వల్ల వెన్నెముకకు నష్టం కలుగుతుంది. కింద ఉన్న వస్తువులను ఎత్తేటప్పుడు మోకాళ్లను వంచి, నెమ్మదిగా లేచే విధంగా ఎత్తాలి. అవసరమైతే ఎవరైనా సహాయం తీసుకోవాలి.

 

 

 

 

పరుపు లేదా నిద్ర భంగిమ:

మృదువైన లేదా గట్టిగా ఉన్న పరుపులు వెన్నెముకకు సరైన మద్దతు ఇవ్వవు. అలాగే నిద్రించే స్థితి సరిగాలేకపోతే ఉదయం నడుము నొప్పితో లేచే ప్రమాదం ఉంటుంది. మితమైన గట్టితనంతో ఉన్న పరుపును ఎంచుకోవాలి. వీపు నేరుగా ఉండేలా పడుకోవడం లేదా పక్కకు తిరిగి పడుకోవడం మంచిది. వెన్నునొప్పి సాధారణమైన సమస్య అయినా దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఆరోగ్యంగా ఉండటానికి ఈ అలవాట్లు మార్చుకోండి. వెన్ను నొప్పితో ఎక్కువగా బాధపడుతుంటే వైద్యుడిని సంప్రదించండి.

 

ప్రతి రైతుకు రైతు భరోసా అందజేస్తాం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

ప్రతి రైతుకు రైతు భరోసా అందజేస్తాం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి:

 

జిల్లాలో ఇప్పటి వరకు 90,837 మంది రైతులకు 72,30,42,624 రూపాయల నిధులు విజయవంతంగా జమయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు
పాత రైతులతో పాటు కొత్త రైతులకు కూడా రైతు భరోసా ను ఎలాంటి పరిమితులు విధించకుండా అందించాలని ప్రభుత్వం నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు ఈ నెల 20వ తేదీ వరకు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి రైతు భరోసా అందజేస్తామని ఆయన తెలిపారు
వానకాలం 2025 రైతు భరోసా నిధుల పంపిణీపై మండలాల వారీగా వివరాలు

జూన్ 18, 2025 నాటికి…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వానకాలం – 2025కు సంబంధించిన రైతు భరోసా నిధుల పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. మొత్తం 282 గ్రామాల నుంచి 1,24,397 మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్దిపొందేందుకు అర్హులుగా గుర్తించబడ్డారు. ఇందుకోసం 143,99,06,145 రూపాయల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడానికి చర్యలు తీసుకోగా, అందులో 114,50,67,074 రూపాయలు ఖజానా ద్వారా పంపిణీకి సంబంధించి నమోదయ్యారు. కాగా ఇప్పటి వరకు 90,837 మంది రైతులకు 72,30,42,624 రూపాయల నిధులు విజయవంతంగా జమయ్యాయి.
ఈ కార్యక్రమం రైతు సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనమని, వ్యవసాయ అధికారులు మరియు బ్యాంకర్లు సమన్వయంతో ఈ పంపిణీ సమర్థవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version