జహీరాబాద్ నుండి మహిళల ఆవిష్కరణ ఎదగాలి…
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ లో ఈ కారిక్రామాన్ని ప్రారంభించి ఎన్నో అద్భుత సూచనలు ఇచ్చిన మాజి మంత్రివర్యులు డా. ఎ. చంద్రశేఖర్ మాట్లాడుతు సాధారణంగా పెద్ద పరిశ్రమలూ వ్యాపారాలకైతే పెట్టుబడి పెట్టే సంస్థలు చాలానే ఉంటాయి. కానీ చిన్నగా వ్యాపారం ప్రారంభించదలచుకున్న వాళ్లకి అప్పులూ బ్యాంకు లోన్లే ఆధారం. అందుకు పూచీకత్తు పెట్టడానికి స్థిరాస్తుల్ని చూపాల్సి ఉంటుంది. అవేవీ లేనివారు పెట్టుబడికి డబ్బులేక ఎంత మంచి ఆలోచన ఉన్నా వ్యాపారం ఆశలు వదులుకుంటారు. అలాంటివారిని దృష్టిలో పెట్టుకుని వ్యాపారరంగంలో తమని తాము నిరూపించుకోవాలనుకునేవారికి ఆర్థికంగా అండగా ఉంటాం అన్నారు.యం.ఎస్.ఎఫ్ సామాజిక పారిశ్రామికవేత్త, మేనేజింగ్ డైరెక్టర్,అస్మా మాట్లాడుతూ.జహిరాబాద్ ప్రాంతంలోని మహిళతో ఉన్న నైపుణ్యాలను గుర్తించి వ్యాపారం చేసే వాళ్ళల్లో ఉన్న వైపుశ్యాన్ని వ్యాపారాలుగా మారుస్తూ మహిళలు వ్యాపారం చేయుటకు కావలసిన ప్రతి మెళుకువలను ప్రదర్శించుటకు – మార్కెట్ కు సంబంధించిన సాధ్య అసాధ్యలు, ఏమిటి – ప్రణాలికలను ఎలా రచించాలి ఇలాంటి అనేక వ్యూహలను ప్రదర్శించేందుకు బహుత్కార కారిక్రమం.ప్రతి మహిళలలోను వ్యాపార ఆలోచనలు ఉన్నపటికీ అది వ్యాపారంగా తెలియకపోవడం. మన గ్రామీణ ప్రాంతంలో అవసరాలను గుర్తించి ఆ అవసరాలనే ఆవిష్కరణలనుగా మార్చాలి.
స్థానిక పరిశ్రమలకు అణుగుణంగా మన వ్యాపారాలను ప్రారంభిస్తే గనుక మనకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది . త్వరలో అన్ని పరిశ్రమ యజమానులను సంప్రదించి మహిళలకు తగిన అవకాశాలు తమ కంపెనీలో వ్యాపార అవకాశాలను ఇవ్వాలని విన్నవిస్తాను. మరియు నిష్ఠు లో కూడా మహిళా ఆధారిత పరిశ్రమలు నెలకోల్పాలని పెద్దల దృష్టికి తసుకెత్తాం అన్నారు.
సుమారు 300 మంది మహిళలు వివిధ గ్రామాలనుండి హాజరై వారి అభిప్రాయలను తెలియజేసారు ఈ కరీక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ రామ లింగారెడ్డి, మొగుడంపల్లి మండల అధ్యక్షులు మక్సూద్ అహ్మద్,జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు కండెం నర్సిములు,న్యాల్కల్ మండల అద్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,బ్లాక్ అద్యక్షులు అర్షద్ అలీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రసాద్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మహిళా అధ్యక్షులు మమత చంద్రకళ, స్వరూప, మారుణీ బాయి, చన్ను బీ, మల్లికా రెడ్డి, అరుణ, ఈశ్వరమ్మ, ఆసియా, తుల్జమ్మ, తదితరులు పాల్గొన్నారు
