ఒక్కో వార్డు నా బాధ్యతే : మాజీ మంత్రి, ఎంఎల్ఏ మల్లారెడ్డి…

ఒక్కో వార్డు నా బాధ్యతే : మాజీ మంత్రి, ఎంఎల్ఏ మల్లారెడ్డి
* మునిసిపల్ బిఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

మునిసిపల్ ఎన్నికలో గెలుపే లక్ష్యం ఒక్కో వార్డు నా బాధ్యతని మాజీ మంత్రి, ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి అన్నారు. మునిసిపల్ ఎన్నికల సందర్బంగా బిఆర్ఎస్ మునిసిపల్ అధ్యక్షులు సరసం మోహన్ రెడ్డి, మల్లేష్ గౌడ్ ల ఆధ్వర్యంలో సోమవారం అలియాబాద్, మూడుచింతలపల్లి మునిసిపల్ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ గెలుపే లక్షంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. కాంగ్రెస్ రెండు ఏండ్లు పాలన గడిచిన అంతా ఆగమే ఉందన్నారు. ఆగమైన ఆరు గ్యారంటీకాని ప్రజల్లో ప్రశ్నించి చైతన్యపరచలన్నారు.

ఓటర్లను అక్కర్శించే పనులతో ప్రజల్లోకి వెళ్ళాలని, 13న ఊర్లలో ముగ్గుల పోటీలు, 16న క్రికెట్ మ్యాచ్ లు చేపట్టాలనసూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశం, ఏఎంసి వైస్ చైర్మన్ లు నాగరాజు, శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీపీలు పల్లె సితారములు గౌడ్, ఎల్లుభాయి, మాజీ జడ్పీటీసీ అనిత, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్య యాదవ్, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ డైరెక్టర్లు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

కార్మికుల ప్రధాన సమస్యలపై గని మేనేజర్..

కార్మికుల ప్రధాన సమస్యలపై గని మేనేజర్ కి ఐఎన్టియుసి ఆధ్వర్యంలో మెమోరాండం అందజేత

మంచిర్యాల,నేటి ధాత్రి:

సింగరేణిలో నెలకొన్న ప్రధాన సమస్యలైనా సొంతింటి కలను నెరవేర్చాలని,ఆదాయపు పన్నును మాఫీచేయాలని,మెడికల్ అటెండెన్స్ నియమాలను మార్చాలని కోరుతూ గురువారం ఐఎన్టియుసి నాయకులు గని మేనేజర్ కు మల్లారెడ్డి అధ్యక్షతన మెమోరాండం అందజేశారు. అనంతరం కేంద్ర కమిటీ నాయకులు గరిగే స్వామి మాట్లాడుతూ…నూతన బదిలీ విధానం,నూతన గనులు, తదితర కార్మికుల ప్రధాన సమస్యలను సింగరేణి యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని కోరారు.గని యాజమాన్యం అవసర నిమిత్తం తీసుకుని పనిచేస్తున్న జనరల్ అసిస్టెంట్ డ్రెస్ కోడ్ ధరించాలని,వారు అధికారులు లాగా కార్మికులతో వ్యవహరిస్తున్నారని,మాన్ వే వద్ద ఇన్,అవుట్ కు రావట్లేదని,ఫోన్ ద్వారానే వారికి ఇన్,అవుట్ వేయడం జరుగుతుందన్నారు.వీరికి యాజమాన్యాన్ని సర్కులర్ రిలీజ్ చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్కే 5 ఫిట్ సెక్రటరీ నంబయ్య,అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీలు రవి,రాజేందర్, ఏరియా నాయకులు మహేందర్ రెడ్డి,పెద్ది రాజు,చందు,రామకృష్ణ,గని. యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version