నాయకుని పరామర్శించిన బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు.!

ప్రమాదవశాత్తు గాయపడిన నాయకుని పరామర్శించిన బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి :

 

 

తంగళ్ళపల్లి మండలానికి చెందిన టౌన్ బిఆర్ఎస్ పార్టీ. సీనియర్ నాయకులు జంగపల్లి. బిక్షపతి గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు గాయపడం జరిగింది. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ. సీనియర్ నాయకులు . బొ ల్లి. రామ్మోహన్. పార్టీ నాయకులు కార్యకర్తలు . ఆయన. ఇంటికి వెళ్లి. పరామర్శించి మనోధైర్యం చెప్పి. బిఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని ధైర్యం చెప్పి. సంబంధిత విషయాన్ని మాజీ మంత్రి కేటీ రామారావు దృష్టికి తీసుకెళ్లి తమకు అండగా ఉంటామని పార్టీ పరంగా ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు . పరామర్శించిన వారిలో తంగళ్ళపల్లి టౌన్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు యూత్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

జయంతి ఉత్సవాల సందర్భంగా ఊరేగింపు. !

శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా ఊరేగింపు

వనపర్తి నేటిధాత్రి :

 

వనపర్తి పట్టణంలో శంకర్ గంజ్. శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం రాత్రి స్వామివారి ఊరేగింపు శంకర్ గుంజీ నుండి బయలుదేరి కమాన్ చౌరస్తా రాజీవ్ చౌక్ ద్వారా భక్తిశ్రద్ధలతో ఆలయ కమిటీ నిర్వాహకులు నిర్వహించారు

స్మశాన వాటిక భూమి ఏంత.!

స్మశాన వాటిక భూమి ఏంత?

పన్నెండు గుంటలా?

ఇరవై ఐదు గుంటలా?

ముప్పై గుంటల పైగానా?

అయోమయంలో గోపాలరావుపేట గ్రామ ప్రజలు?

కరీంనగర్ నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని స్మశాన వాటిక కోసం కోనుగోలు చేసిన భూమి ఇతరుల సాగులోకి వెళ్ళింది. వివరాల్లోకి వెళితే తాజా మాజీ గ్రామ సర్పంచ్ లెటర్ హెడ్ పై సర్పంచ్ భర్త అయిన ప్రభుత్వ ఉపాధ్యాయులు స్మశాన వాటిక కోసం గ్రామ ప్రజల చందాలతో 09 సెప్టెంబ ర్2019న గుంట ఒకంటికి పదిహేనువేల రూపాయల చొప్పున పదమూడు గుంటల భూమిని కోనుగోలు చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేయకముందే మొత్తం డబ్బులు 15డిసెంబర్ 2019న భూయజమానులకు సర్పంచ్ భర్త అయిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఐదువేల రూపాయలను అదనంగా చెల్లించి గంపగుత్తగా అని తెలిపారు. అట్టి భూమిని కోనుగోలు చేసినప్పుడు గ్రామ పంచాయతీ ఆదినంలో ఉంటుందని తెలిపారు. కాని వాస్తవంగా కోనుగోలు చేసిన నుండి నేటి వరకు గ్రామ పంచాయతీ ఆదినంలోకి తీసుకోకపోవడంతో నేడు అట్టి భూమిని ఇతరుల సాగులోకి వెళ్ళింది. ఈవిషయంలో గ్రామప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు. స్మశానవాటిక నిమిత్తం కొనుగోలు చేసింది పన్నెండు గంటలా, ఇరవై ఐదు గుంటలా, ముప్పై గుంటల పైగానో తెలియని అయోమయ స్థితిలో గ్రామ ప్రజలున్నారు. వాస్తవానికి పోన్నం వీరేశం అనే గ్రామస్తుని నుండి గ్రామ ప్రజల చందాలతో గ్రామపంచాయతీ కార్యాలయం వారు పన్నెండు గంటల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని హద్దులు ఏర్పాటు చేసి స్మశాన వాటిక నిర్మాణం చేసి ఉన్నారు. తదనంతరం పదమూడు గుంటల భూమిని కొంతమంది గ్రామస్తుల ద్వారా తాజా మాజీ సర్పంచ్ లెటర్ హెడ్ పై కొనుగోలు చేశారు. ఇట్టి భూమి ప్రస్తుతం గ్రామపంచాయతీ ఆధీనంలో లేకపోవడం, గ్రామ స్మశానవాటిక నిర్మాణ అనంతరం చందాదారులకు సన్మాన కార్యక్రమంలో ముఫై గుంటల పైగా భూమిని కొనుగోలు చేశామని తెలియజేశారు. ఇలా మూడు రకాలుగా వినబడుతున్న మాటలు విన్న గ్రామప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు. దీనిపై ఇప్పటికైనా సంబంధిత గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామ స్మశాన వాటిక నిమిత్తం ఎంత భూమి కొనుగోలు చేశారో నిగ్గుతేల్చాలని గ్రామ ప్రజలు పత్రికా ముఖముగా అధికారులను వేడుకొనుచు, అసలు ప్రజల చందాలు ఎన్ని సమకూరాయో తెలియపరచాలని, గ్రామ పంచాయతీ కోనుగోలు చేసినప్పుడు చూపిన హద్దుల ప్రకారం మండల రెవెన్యూ సర్వేయర్ తో కోలిపించి హద్దు రాళ్ళను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ఆదినంలోకి తీసుకోని, ఒకవేళ తప్పు జరిగిందని నిర్ధారణ జరిగితే సంబంధిత అప్పటి గ్రామ సర్పంచ్, పాలకవర్గంపై, అప్పటి గ్రామ, మండల అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు అధికారులను కోరుతున్నారు.

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమo .!

పిజేటిఏయూ వారి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమo

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గల వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ వారి ఆధ్వర్యంలో రైతులకు మేలైన సాగు పద్దతులపై అవగాహన కల్పించడంతో పాటు, వానాకాలం సాగుకు రైతులను సమాయత్తం చేసేందుకు వ్యవసాయ శాఖతో కలిసి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే వినూత్న కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా రామడుగు మండలo దేశరాజుపల్లి గ్రామంలోని రైతువేదిక నందు నిర్వహించడం జరిగినది. వ్యవసాయ పరిశోధన స్థానం, శాస్త్రవేత్త మరియు అధిపతి డా.ఉషారాణి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంతో పాటు ముఖ్యమైన అంశాలైన తక్కువ యూరియా వాడండి, సాగు ఖర్చుని తగ్గించండి, అవసరం మేరకు రసాయనాలను వినియోగించండి, నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడండి, రశీదులను భద్రపరచండి, కష్టకాలంలో నష్ట పరిహారాన్ని పొందండి అని తెలిపారు. ఈకార్యమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎఎంసి చైర్మన్ బొమ్మరవేణి తిరుమల మరియు జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మిలు మాట్లాడుతూ రైతులందరూ యూరియ వాడకాన్ని తగ్గించి, చెట్లని పెంచి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. నెల రోజుల పాటు జిల్లాలో వివిధ గ్రామాలలో జరిగే ఈరైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈకార్యక్రమానికి విచ్చేసిన వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ శాస్త్రవేత్త డా . ఏ.విజయభాస్కర్ సాగు నీటిని ఆదా చేయండి, భావి తరాలకు అందించండి, పంట మార్పిడి పాటించండి, సుస్థిర ఆదాయాన్ని పొందండి, చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి అనే విషయాలు రైతులకు తెలిపారు. జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి శ్రీనివాస్ రావు రైతులను ఉద్దేశిస్తూ మామిడి, కూరగాయ, ఆయిల్ పామ్ సాగు వివరాలు తెలిపారు. అనంతరం టిఎస్ఎస్డిసి రీజినల్ మేనేజర్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతు నాణ్యమైన విత్తన లభ్యత మరియు ధరల వివరాలను వివరించారు. ఈకార్యక్రమంలో చొప్పదండి సహ సంచాలకులు ప్రియదర్శిని, మండల వ్యవసాయ అధికారి త్రివేదిక, సీడ్ ఆఫీసర్ మౌనిక , ఉద్యాన శాఖ ఆఫీసర్ రోహిత్, విఏఎస్ మనోహర్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు రమేష్, సంపత్, గోవర్ధన్ సుమారు నూటా యాభై ఏడు మంది రైతులు పాల్గొన్నారు.

గిరిజనులపై జరుగుతున్న దాడులను నిలిపివేయాలి.!

ఆపరేషన్ కగార్ పేరిట అమాయక గిరిజనులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలి

గుండాల,నేటిధాత్రి:

 

గుండాల మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ కార్యక్రమం కు వచ్చిన టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి గోపగాని శంకర్ రావు మండల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
మన పొరుగు రాష్ట్రమైన చత్తీస్గడ్ లో ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసి ప్రజానీకాన్ని స్వదేశీ, విదేశీ కార్పోరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం హతమారుస్తున్న విధానాన్ని దేశంలోని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు తీవ్రంగా ఖండిస్తున్న కేంద్రంలోని మనువాద మతోన్మాద ప్రభుత్వం నిసిగ్గుగా మావోయిస్టుల ఏరివేత పేరుతో అనేకమంది పేరుతో అనేకమంది ఆదివాసి యువకులను దారుణంగా చంపి రాజ్య హింసకు పాల్పడుతూ మధ్య భారత దేశంలోని ఆదివాసి ప్రజానీకం. జల్, జంగల్, జమీన్ కోసం పోరాడుతూ అడవిని, అడవిలో గల సహజ, ఖనిజ సంపదను రక్షించుకునేందుకు సాగిస్తున్న విరోచత పోరాటాలపై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్బంధాన్ని, హత్యకాండను ప్రతికటిద్దాం
ఈ దేశ మూలవాసులు అనాదిగా అడవిని వాగులు, వంకలు, ఒర్రెలు, చెట్టు పుట్ట మరియు మూగజీవాలతో సహజీవనం చేస్తూ, తర తరాలుగా అడవినే నమ్ముకుని జీవనం గడుపుతున్న ఆదివాసి ప్రజానీకాన్ని, అడవి నుండి ఖాళీ చేసి, సహజ, ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు ధారా దత్తం చేసేందుకు కుటిల రాజనీతిని ప్రదర్శిస్తూ ఆదివాసీల మనుగడను ప్రశ్నార్ధకంగా మార్చింది. ఒక ప్రక్కన మావోయిస్టులను దేశంలో నుండి ఏరిపారేసామని గొప్పలు చెబుతున్న పాలకులు, ఈనాడు ఇంకా మావోయిస్టులు ఉన్నారన్న నెపంతో అడవిలో ప్రశ్నించే శక్తులు లేకుండా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామిక వాదులు ముక్తకంఠంతో ఖండించాలన్నారు.భారతదేశ రాష్ట్రపతి 5. 6 షెడ్యూల్ ప్రాంతంలో జన్మించి రాజకీయంగా ఎదిగి, ఈనాడు ఆయా తెగల మీద ఫాసిస్టు ప్రభుత్వం ఆదివాసీలపై ఆపరేషన్ కగారు పేరుతో హననం చేస్తుంటే, మౌన ముని వలె ప్రేక్షక పాత్ర పోషించడం తగదు. దేశ సరిహద్దు ప్రాంతంలో ఉండవలసిన సైన్యం ఆదివాసి గూడాలపై పడి మరణ హోమం కలిగించడం బాధాకరం.
ప్రజలు ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలు ఆదివాసీలకు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆట, పాట, వేట, ఆదివాసీల సంస్కృతి, వారిని అడవికి దూరంగా పారామిలటరీ దళాలు తరుముతున్నాయి. తెలంగాణలో పారా మిలటరీ మరియు బిఎస్ఎఫ్ క్యాంపులను సత్వరమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గొల్లపల్లి రమేష్ పాల్గొన్నారు.

మెదక్ లో వర్గ పోరు మొదలైనట్టేనా?

మెదక్ లో వర్గ పోరు మొదలైనట్టేనా?

ఎవరికి వారే పలు కార్యక్రమాలు…

ఉమ్మడిగా ముందుకు రాని వైనం…

ఎటు పోవాలో తెలియక అయోమయంలో పడుతున్న కార్యకర్తలు..

రామాయంపేట మే 13 నేటి ధాత్రి :

 

 

టిఆర్ఎస్ కు కంచుకోట ఉమ్మడి మెదక్ జిల్లా అలాగే మెదక్ నియోజకవర్గం కూడా ఈ పార్టీకి మంచిపట్టున్న నియోజకవర్గం. అయితే ఈ మధ్యకాలంలో మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకుడు కాంటారెడ్డి తిరుపతిరెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. ఏ కార్యక్రమం చేసిన వేరువేరుగా చేయడం పట్ల కార్యకర్తలు కూడా అయోమయంలో పడుతున్నారు. బహిరంగంగా విభేదాలు బయటపడకున్న లోలోపల మాత్రం విభేదాలు ఉన్నాయని వినిపిస్తున్నాయి. ఇప్పటినుండి వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారని పలువురి అభిప్రాయం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ రావు తనదైన శైలిలో ముందుకు వెళ్లడంతో పాటు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కూడా ఘాటుగా విమర్శిస్తున్నారు.

Congress.

ఈ క్రమంలో అనుకున్న విధంగా ఈ ఇద్దరిలో ఎవరు కూడా ఖండించకపోవడం పట్ల కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ రావ్ వ్యాఖ్యల పట్ల పార్టీ కార్యకర్త ఒకరు సోషల్ మీడియాలో ఘాటుగా విమర్శించారు. అయితే ఆ కార్యకర్తను పోలీసులు విచక్షణ రహితంగా కొట్టిన కనీసం పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. బాధితుడు ఇటీవల కేటీఆర్ ను కలిసి తన బాధను చెప్పుకున్నాడు. కేటీఆర్ సైతం మెదక్ నియోజకవర్గంలో నాయకుల పనితీరు పట్ల సంతృప్తిగా లేదని పలువురి వాదన. ఏది ఏమైనా ఇంటి పోరే కారుకు తిను సవాలుగా మారే ప్రమాదం ఉంది.

అన్న ప్రసాదం అందజేసిన కవిత కిషన్ దంపతులు .

స్వాములకు అన్న ప్రసాదం అందజేసిన కవిత కిషన్ దంపతులు

పరకాల నేటిధాత్రి :

 

మండలంలోని మల్లక్కపేట గ్రామంలోని ఈ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో బొజ్జం కవిత కిషన్ దంపతులు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి మాల ధరించిన దాదాపు 250 మంది స్వాములకు అన్నప్రసాదం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,ఆలయ చైర్మన్ అంబిరు మహేందర్,ఇఓ వెంకటయ్య,అర్చకులు కాటూరి జగన్నాధాచార్యులు,డైరెక్టర్స్ దొమ్మటి శంకరయ్య,నిట్టె బాలరాజు,బొజ్జం రాజేందర్ అలాగే,నల్ల విష్ణువర్థన్ రెడ్డి,భక్తులు పాల్గొన్నారు.

ప్రజా అవసరాలకు అనుమతులు ఇవ్వాలి.!

ప్రజా అవసరాలకు అనుమతులు ఇవ్వాలి…

 తంగళ్ళపల్లి నేటి ధాత్రి :

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ. ఇసుక టాక్స్ పాలసీ తీసుకురావాలని పెద్దపెల్లి జిల్లాలో అమలవుతున్న ఇసుక టాక్స్ పాలసీ సిరిసిల్లలో కూడా అమలు చేయాలని సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఇసుక పాలసిని. తీసుకోవాలని గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలతో అక్రమాలు జరిగాయని ఇసుక రవాణా విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రజా ప్రభుత్వంలో సామాన్యులకు సైతం ఇసుక అందుబాటులో ఉండేరా నిర్ణయం తీసుకోవాలని దూరాన్ని బట్టి ఇసుక రవాణాలకు చాలాను.కట్టే విధంగా ఇసుకపాలసిని .అమలు చేయాలని అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ సామాన్యులకు ఇసుక సరఫరా లో ఇబ్బందులు కలగకుండా చూడాలని. దీనిపై జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ గౌడ్. ఆది శ్రీనివాస్. కేకే మహేందర్ రెడ్డి లు. ఈ విషయంలో చొరవ చూపాలని కాంగ్రెస్ పార్టీ తరపున తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగాల భూపతి. గుగ్గిళ్ళ భరత్ కొత్త రవి.సత్తు శ్రీనివాస్ రెడ్డి. మీరాల శ్రీనివాస్. పొన్నాల లక్ష్మణ్. మునిగల రాజు. శ్రీకాంత్ గౌడ్. వాసు. చంద్రారెడ్డి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ప్రజా అవసరాలకు అనుమతులు ఇవ్వాలి.!

ప్రజా అవసరాలకు అనుమతులు ఇవ్వాలి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి :

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ. ఇసుక టాక్స్ పాలసీ తీసుకురావాలని పెద్దపెల్లి జిల్లాలో అమలవుతున్న ఇసుక టాక్స్ పాలసీ సిరిసిల్లలో కూడా అమలు చేయాలని సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఇసుక పాలసిని. తీసుకోవాలని గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలతో అక్రమాలు జరిగాయని ఇసుక రవాణా విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రజా ప్రభుత్వంలో సామాన్యులకు సైతం ఇసుక అందుబాటులో ఉండేరా నిర్ణయం తీసుకోవాలని దూరాన్ని బట్టి ఇసుక రవాణాలకు చాలాను.కట్టే విధంగా ఇసుకపాలసిని .అమలు చేయాలని అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ సామాన్యులకు ఇసుక సరఫరా లో ఇబ్బందులు కలగకుండా చూడాలని. దీనిపై జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ గౌడ్. ఆది శ్రీనివాస్. కేకే మహేందర్ రెడ్డి లు. ఈ విషయంలో చొరవ చూపాలని కాంగ్రెస్ పార్టీ తరపున తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగాల భూపతి. గుగ్గిళ్ళ భరత్ కొత్త రవి.సత్తు శ్రీనివాస్ రెడ్డి. మీరాల శ్రీనివాస్. పొన్నాల లక్ష్మణ్. మునిగల రాజు. శ్రీకాంత్ గౌడ్. వాసు. చంద్రారెడ్డి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

స్మశాన వాటిక భూమి ఏంత.!

స్మశాన వాటిక భూమి ఏంత?

పన్నెండు గుంటలా?

ఇరవై ఐదు గుంటలా?

ముప్పై గుంటల పైగానా?

అయోమయంలో గోపాలరావుపేట గ్రామ ప్రజలు?

కరీంనగర్ నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని స్మశాన వాటిక కోసం కోనుగోలు చేసిన భూమి ఇతరుల సాగులోకి వెళ్ళింది. వివరాల్లోకి వెళితే తాజా మాజీ గ్రామ సర్పంచ్ లెటర్ హెడ్ పై సర్పంచ్ భర్త అయిన ప్రభుత్వ ఉపాధ్యాయులు స్మశాన వాటిక కోసం గ్రామ ప్రజల చందాలతో 09 సెప్టెంబ ర్2019న గుంట ఒకంటికి పదిహేనువేల రూపాయల చొప్పున పదమూడు గుంటల భూమిని కోనుగోలు చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేయకముందే మొత్తం డబ్బులు 15డిసెంబర్ 2019న భూయజమానులకు సర్పంచ్ భర్త అయిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఐదువేల రూపాయలను అదనంగా చెల్లించి గంపగుత్తగా అని తెలిపారు. అట్టి భూమిని కోనుగోలు చేసినప్పుడు గ్రామ పంచాయతీ ఆదినంలో ఉంటుందని తెలిపారు. కాని వాస్తవంగా కోనుగోలు చేసిన నుండి నేటి వరకు గ్రామ పంచాయతీ ఆదినంలోకి తీసుకోకపోవడంతో నేడు అట్టి భూమిని ఇతరుల సాగులోకి వెళ్ళింది. ఈవిషయంలో గ్రామప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు. స్మశానవాటిక నిమిత్తం కొనుగోలు చేసింది పన్నెండు గంటలా, ఇరవై ఐదు గుంటలా, ముప్పై గుంటల పైగానో తెలియని అయోమయ స్థితిలో గ్రామ ప్రజలున్నారు. వాస్తవానికి పోన్నం వీరేశం అనే గ్రామస్తుని నుండి గ్రామ ప్రజల చందాలతో గ్రామపంచాయతీ కార్యాలయం వారు పన్నెండు గంటల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని హద్దులు ఏర్పాటు చేసి స్మశాన వాటిక నిర్మాణం చేసి ఉన్నారు. తదనంతరం పదమూడు గుంటల భూమిని కొంతమంది గ్రామస్తుల ద్వారా తాజా మాజీ సర్పంచ్ లెటర్ హెడ్ పై కొనుగోలు చేశారు. ఇట్టి భూమి ప్రస్తుతం గ్రామపంచాయతీ ఆధీనంలో లేకపోవడం, గ్రామ స్మశానవాటిక నిర్మాణ అనంతరం చందాదారులకు సన్మాన కార్యక్రమంలో ముఫై గుంటల పైగా భూమిని కొనుగోలు చేశామని తెలియజేశారు. ఇలా మూడు రకాలుగా వినబడుతున్న మాటలు విన్న గ్రామప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు. దీనిపై ఇప్పటికైనా సంబంధిత గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామ స్మశాన వాటిక నిమిత్తం ఎంత భూమి కొనుగోలు చేశారో నిగ్గుతేల్చాలని గ్రామ ప్రజలు పత్రికా ముఖముగా అధికారులను వేడుకొనుచు, అసలు ప్రజల చందాలు ఎన్ని సమకూరాయో తెలియపరచాలని, గ్రామ పంచాయతీ కోనుగోలు చేసినప్పుడు చూపిన హద్దుల ప్రకారం మండల రెవెన్యూ సర్వేయర్ తో కోలిపించి హద్దు రాళ్ళను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ఆదినంలోకి తీసుకోని, ఒకవేళ తప్పు జరిగిందని నిర్ధారణ జరిగితే సంబంధిత అప్పటి గ్రామ సర్పంచ్, పాలకవర్గంపై, అప్పటి గ్రామ, మండల అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు అధికారులను కోరుతున్నారు.

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.!

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి :

 

 

తంగళ్ళపల్లి. మండల కేంద్రంలో పాటు. తంగళ్ళపల్లి. గీత నగర్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న. టీ. జి. పాలీసెట్.ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పరీక్ష కేంద్రాలను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షలు. ఎలా జరుగుతున్నాయని ఎగ్జామ్స్ సెంటర్లో నిర్వహించిన. సీసీ కెమెరాల పరిధిలో పరిశీలించి వివరాలు అడిగి. కెమెరాల పరిశీలన ఎలా ఉందని తెలుసుకున్నారు ప్రవేశ పరీక్ష సజావుగా ప్రశాంతంగా జరగాలని కలెక్టర్ తెలిపారు. అలాగే. తంగళ్ళపల్లి జెడ్పిహెచ్ఎస్. పాఠశాలలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులను త్వరగా పూర్తి చేయాలని ప్రిన్సిపల్ శంకర్ నారాయణ ఆదేశించారు. అదేవిధంగా పాఠశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన బోరుకు మోటార్ ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ కోరగా పంచాయతీ . సెక్రెటరీ కి. ప్రతిపాదనలు
అందజేయాలని ప్రిన్సిపల్ కి సూచించారు. ఇట్టి తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట. ప్రిన్సిపల్ . సూపర్డెంట్. శంకర్ నారాయణ శారద ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

పది లారీలు రెండు ప్రొక్లైయిన్ లకు అనుమతి

పది లారీలు, రెండు ప్రొక్లైయిన్ లకు అనుమతి

పరిమిషన్ లేని లారీలలో అధికారుల వాటాలెంత?

రేవెల్లి గ్రామపంచాయతీ పరిధిలో ప్రక్క గ్రామ నీటి ట్యాంకర్ ద్వారా రోడ్డుపై నీటిని చల్లుతున్న వైనం

కరీంనగర్ నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా చోప్పదండి మండలం రెవెల్లి గ్రామ చెరువులో మట్టి తవ్వకాలు జరిపేందుకు రంగాపూర్ గ్రామం పెద్దపల్లి మండలం మరియు జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి సంబంధించిన ఏఎన్ఆర్ బ్రిక్స్ కు గ్రామపంచాయతీ వారు మే రెండున తీర్మానం అందించగా, ఇరిగేషన్ అధికారులు మే8న అనుమతులిచ్చారు. నిబంధనల ప్రకారం రెండు వేల క్యూబిక్ మీటర్ల మట్టి మాత్రమే తరలించాలని, తవ్వకాల కోసం రెండు ప్రొక్లెయిన్ మట్టి తరలింపు కోసం పది లారీలను మాత్రమే ఉపయోగించాలని, ఉదయం 6 నుండి సాయంత్రం 6 తీసుకోవాలని పర్మిషన్ లో పేర్కొన్నారు.

Gram Panchayat

కాని మట్టి తరలింపు కోసం పర్మిషన్ పొందిన సదరు కాంట్రాక్టర్ నిబంధనలు ఏం చేయవు, అధికారులు పట్టించుకోరు అనుకున్నాడో ఏమో గాని, పరిమిషన్ లేని లారీలను వాడటమే కాకుండా రాత్రి ఆరు గంటల తర్వాత కూడా ఇష్టారీతిన మట్టి తరలింపు చేపడుతున్నారు.

Gram Panchayat

ఇదిలా ఉండగా రాగంపేట గ్రామపంచాయతీ కి సంబంధించిన నీటి ట్యాంకర్ ను సంబంధిత కాంట్రాక్టర్ రేవెల్లి గ్రామపంచాయతీ పరిధిలో మట్టి తరలిస్తున్న లారీలు వెళ్లే దారిలో నీటిని పట్టుతుండడం విశేషం. ఈవిషయమై రాగంపేట గ్రామపంచాయతీ కార్యదర్శి అనిల్ ను వివరణ కోరగా మేము ట్యాంకర్ ను ఎవరికీ ఇవ్వలేదని తెలియజేశారు.

Gram Panchayat

తమ ఆధీనంలో ఉండాల్సిన ట్యాంకర్ పక్క గ్రామంలో నీటిని పడుతున్న ఏమీ తెలియనట్టు ఉన్నా పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే మట్టి తవ్వకాలు చేపట్టిన సమయంలో పర్యవేక్షించాల్సిన ఇరిగేషన్ అటువైపు కనీసం కన్నెత్తి చూడకపోవడంపై మండలంలోని ప్రజలలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇట్టి విషయమై గ్రామపంచాయతీ కార్యదర్శి సంప్రదించడానికి వెళ్ళగా పంచాయతీ కార్యాలయంలో లేకపోవడంతో ఆమె కార్యాలయానికి ప్రతిరోజు ఆలస్యంగా వచ్చుచున్నారని గ్రామ ప్రజలు తెలియజేశారు.

Gram Panchayat

ఇదే విషయమై గ్రామ ప్రత్యేక అధికారిని వివరణ కోరగా కార్యదర్శి పై ఎంపీఓకి ఆలస్యంగా వచ్చుచున్నారని తెలియజేశామని మరియు మట్టి తరలింపుపై ఎంపీఓకి సమాచారం అందజేశామని తెలియజేశారు.నిబంధనలు విస్మరించి అనుమతి లేని వాహనాల ద్వారా మట్టి తరలిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవడంతో పాటు ఇంత జరుగుతున్నా సదరు కాంట్రాక్టర్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఇరిగేషన్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రత్యేక అధికారులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

ప్రజా అవసరాలకు అనుమతులు ఇవ్వాలి.!

ప్రజా అవసరాలకు అనుమతులు ఇవ్వాలి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి ;

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ. ఇసుక టాక్స్ పాలసీ తీసుకురావాలని పెద్దపెల్లి జిల్లాలో అమలవుతున్న ఇసుక టాక్స్ పాలసీ సిరిసిల్లలో కూడా అమలు చేయాలని సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఇసుక పాలసిని. తీసుకోవాలని గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలతో అక్రమాలు జరిగాయని ఇసుక రవాణా విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రజా ప్రభుత్వంలో సామాన్యులకు సైతం ఇసుక అందుబాటులో ఉండేరా నిర్ణయం తీసుకోవాలని దూరాన్ని బట్టి ఇసుక రవాణాలకు చాలాను.కట్టే విధంగా ఇసుకపాలసిని .అమలు చేయాలని అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ సామాన్యులకు ఇసుక సరఫరా లో ఇబ్బందులు కలగకుండా చూడాలని. దీనిపై జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ గౌడ్. ఆది శ్రీనివాస్. కేకే మహేందర్ రెడ్డి లు. ఈ విషయంలో చొరవ చూపాలని కాంగ్రెస్ పార్టీ తరపున తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగాల భూపతి. గుగ్గిళ్ళ భరత్ కొత్త రవి.సత్తు శ్రీనివాస్ రెడ్డి. మీరాల శ్రీనివాస్. పొన్నాల లక్ష్మణ్. మునిగల రాజు. శ్రీకాంత్ గౌడ్. వాసు. చంద్రారెడ్డి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి.

వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి…

తంగళ్ళపల్లి నేటి రాత్రి :

 

 

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో. రైతులు ఆరుగాలం పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రాస్తారోకో ధర్నాకు దిగారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజులు గడుస్తున్న కాంట పెడతలేరు అంటూ. వడ్లు కొంట.లేరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వడ్లు కొనుగోలు విషయంలో జాప్యం జరుగుతుందంటూ జిల్లెల్ల గ్రామంలో ప్రధాన రహదారిపై ధర్నాకు దిగిన రైతులు. రైతులు ధర్నాకు దిగడంతో రోడ్డుపై భారీగా ఎక్కడికక్కడ వాహనాలు . నిలిచి. రాకపోకలకు ఇబ్బంది జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ .ఇకనైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని. ఈ సందర్భంగా జిల్లాల గ్రామస్తులు తెలిపారు అలాగే. మండేపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు చేస్తలేరని రైతులు రోడ్డెక్కి. నిరసన తెలియజేస్తూ ధర్నాకు దిగారు. దయచేసి వెంటనే సంబంధిత అధికారులు మండలంలో ప్రతి గ్రామంలో వడ్ల. కొనుగోలు కేంద్రాల ప్రారంభించి రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా రైతులు ఉన్నతాధికారులకు విన్నవించారు ఇట్టి ధర్నా కార్యక్రమంలో జిల్లెల్ల గ్రామ ప్రజలు. రైతులు. మండపల్లి గ్రామ ప్రజలు. రైతులు. పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తర్వాత. పోలీసులు వెళ్లి ధర్నా చేస్తున్న వారిని . శాంతింప చేసి. సంబంధిత అధికారులతో మాట్లాడి వరి ధాన్యం. కొనుగోలు చేసే విధంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రోడ్డుపై వెళ్లే వాహనాలను . క్రమబద్ధకరించి. వాహనాలు సజావుగా పోయేటట్టు రాకపోకలకు అంతరాయం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు

వైకుంఠధామ దారిలో అడ్డంకిగా భారీ మురుగు కాలువ.

వైకుంఠధామ దారిలో అడ్డంకిగా భారీ మురుగు కాలువ.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

కోహిర్ మండలం నాగిరెడ్డిపల్లి వెళ్లే మార్గంలో స్థానిక వైకుం ఠధామం వద్దకు వెళ్లే దారిలో భారీ మురుగు కాలువ ఏర్పడటంతో స్థానికులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. ఈకాలువ కారణం గా స్మశానవాటికకు వెళ్లేమార్గం అడ్డంకులతో కూడుకున్నది దీంతో అంత్యక్రియలు, ఇతర ఆ చారాలు నిర్వహించడం కష్టతరంగా మారింది. స్తానికులు తెలిపిన వివరాల ప్రకారం.ఈ ము రుగు కాలువ నీరు చుట్టుపక్కల ప్రాంతాలను కలుషితం చేస్తూ దుర్వాసన వెదజల్లుతుంది. ఈ సమస్య వల్ల స్మశానవాటికకు వెళ్లేవారు ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మురుగు కాలువ వల్ల మార్గం పూర్తిగా మునిగిపోయింది. అంత్యక్రియలకు వెళ్లడం కూడా కష్టంగా మారిందని స్థాని కులు తెలిపారు. అధికారులు ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని మురు గు కాలువను మూసివేసి స్మశానవాటికకు సరైన మార్గం ఏర్పాటు చేయాలని స్థానికు లు కోరుతున్నారు. ఈవిషయంలో తహశీల్దార్ కార్యాలయం తగిన చర్య లు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈసమస్యపై అధికారుల స్పం దన కోసం స్థానికులు ఎదురుచూస్తున్నారు.

మే 24న జహీరాబాద్‌లో నిరసన సమావేశం.!

వక్ఫ్ సవరణ బిల్లు 2025 కు వ్యతిరేకంగా మే 24న జహీరాబాద్‌లో నిరసన సమావేశం.

◆ ముఫ్తీ అబ్దుల్ సబూర్ ఖాసీ కాను మరియు వక్ఫ్ బచా ప్రచారం, ముస్లిం పర్సనల్ లా బోర్డు జహీరాబాద్ సమాచారం ప్రకారం, వక్ఫ్ సవరణ బిల్లు 2025.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు వ్యతిరేకంగా వక్ఫ్ బచా దస్తూర్ బచా ప్రచారం యొక్క కేంద్ర నిరసన అఖిల పక్ష సాధారణ సమావేశం మే 24వ తేదీ శనివారం అసర్ ప్రార్థనల తర్వాత రాత్రి 10 గంటల వరకు ఈద్గా మైదాన్ జహీరాబాద్‌లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహ్మానీ అధ్యక్షతన జరుగుతుంది. ఈ సమావేశంలో అన్ని ఆలోచనా విధానాల నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు మరియు ఇతర మతాల నాయకులు ప్రసంగిస్తారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యవస్థాపక కార్యనిర్వాహక కమిటీ సభ్యులు కూడా పాల్గొంటారు. ఈ నల్లజాతి చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించే నిరసన సమావేశంలో అన్ని ఇస్లామిక్ సోదరులు తమ మతం లేదా మతంతో సంబంధం లేకుండా పాల్గొని, తమ ఐక్యత, జాతీయ సంఘీభావం, మతపరమైన గర్వం మరియు సజీవ దేశంగా నిరూపించుకోవాలని మరియు ఈ వివాదాస్పద నల్లజాతి చట్టానికి వ్యతిరేకంగా తమ సమిష్టి నిరసనను నమోదు చేయాలని అభ్యర్థించారు.

ఉపాధి పనులు సద్వినియోగం చేసుకోవాలి.

ఉపాధి పనులు సద్వినియోగం చేసుకోవాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఉపాధి హామీ పనులను కూలీలందరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎంపీడీవో సుధాకర్ సూచించారు. మంగళవారము ఝరాసంగం మండల పరిధిలోని కంబాలపల్లి గ్రామ శివారులో చేపడుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి అక్కడ కల్పిస్తున్న మౌలిక వసతులపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధార్‌కార్డును బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాలని సూచించారు. ఎండలు పెరిగిపోవడంతో రైతులు ఉదయం సమయంలోనే పనులు పూర్తి చేసుకొని ఇంటికి చేరుకోవాలని సూచించారు. వడదెబ్బ తగలకుండా పనులు ముందే ముగించాలన్నారు. పని ప్రదేశాల్లో తాగునీరు తప్పకుండా తీసుకెళ్లాలని తెలిపారు. పని ప్రదేశాల్లో సరైన వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం నర్సరీలో మొక్కల పెంపకంపై జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రాజ్ కుమార్ గ్రామ కార్యదర్శి నవీద్ ఫీల్డ్ అసిస్టెంట్ ఈశ్వర్ కూలీలు పాల్గొన్నారు.

మొక్కజొన్న కుప్ప దగ్ధం .

మొక్కజొన్న కుప్ప దగ్ధం

కంకులకుప్పను పరిశీలిం చిన ఏవో గంగాజమున

శాయంపేట నేటిధాత్రి:

 

 

ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళముందే కాలి పోతు న్న దృశ్యాన్ని చూసి రైతు కంట కన్నీళ్లు ఆగలేదు వివరాల్లో కెళితే శాయంపేటమండలం పత్తిపాక గ్రామానికి చెందిన అన్న బోయిన రఘుపతి అనే రైతు మూడున్నర ఎకరాల్లో మొక్కజొన్న పంటసాగు చేశారు పంట చేతికి అంద డంతో మొక్కజొన్న కోసి వాటిని పొలంలో కుప్పగా పోసి మార్కెట్ చేసేందుకు నిలువ ఉంచారు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించ డంతో పొలంలోని మూడున్నర.

Agriculture

ఎకరాలలో మొక్కజొన్న పంట సుమారు ఖాళీ బూడిదయింది పొలం వైపు వెళ్లి చూడగా పంట పూర్తిగా మట్టిలో కలిసిపో యింది అప్పటికే మొక్కజొన్న కంకులు కాలుతూనే ఉన్నాయి దృశ్యాన్ని చూసి రైతు లబోది బో అంటూ గుండె బాదుకు న్నాడు. రైతు స్థానిక వ్యవసా య అధికారికి ఫిర్యాదు మేర కు ఏవో గంగా జమున కాలిపో యిన కంకులు పరిశీలించగా 60% కాలి పోయినట్లు గుర్తిం చారు. రైతుకు పంట నష్టం జరిగినట్లు నిర్ధారించడం జరిగింది.

లంచగొండులు…జనం పాలిట రాబందులు!

`రోజుకు కనీసం నలుగురు పట్డుబడుతున్నారు.

`పట్టుబడతామన్న భయమే లేదు.

`పట్టుకుంటే మహా అయితే నాలుగు రోజులు జైలు.

`తర్వాత బెయిలు..పైరవీలు. కేసు క్లోజ్‌.

`రెండేళ్ల దాకా విచారణ పూర్తి కాకపోతే మళ్ళీ అదే కొలువు.

`అలాంటి దానికి పట్టుకోవడం ఎందుకు?

`శిక్ష లేనప్పుడు కేసులెందుకు?

`కొలువు మళ్ళీ ఇచ్చేది వున్నప్పుడు దాడులెందుకు?

`రాబందుల్లా దోచుకుంటున్నారని తెలుసు.

`రెడ్‌ హాండెడ్‌గా పట్టుబడ్డారని తెలుసు.

`అయినా కొలువెందుకు పోదు?

`పట్టు బడిన వెంటనే కొలువు పోయేలా చట్టమెందుకు చేయరు!

`అవినీతి నిరోధక శాఖ కష్టం బూడిదలో పన్నీరౌతోంది.

`అవినీతి ఉద్యోగులను పట్టుకునే వ్యవస్థకే పూర్తి అధికారాలు ఎందుకివ్వరు!

`ఉద్యోగుల సర్వీసు రిమూవల్‌ ఏసిబి చేతిలో ఎందుకు పెట్టరు.

`తప్పు చేసిన తర్వాతే ఏ ఉద్యోగి పట్టుబడతాడు!

`దానికి మళ్ళీ విచారణ ఎందుకు?

`దేశ వ్యాప్తంగా ఇదే జరుగుతోంది!

`కేంద్రం ఎందుకు స్పందించదు?

`రాష్ట్రాలన్నీ తీర్మానాలు చేసి ఎందుకు పంపవు?

`పట్టుబడ్డా కొలువులు..వారికే ప్రమోషన్లు!

`అవినీతి అధికారులకే అందలాలు.

`ఇదీ మన వ్యవస్థ దురవస్థకు ఆనవాలు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
లంచగొండులు… ఆ పదం వినాలంటేనే అసహ్యం అనిపిస్తుంది. అలాంటిది లంచాలను విచ్చలవిడిగా తీసుకుంటున్న ఉద్యోగులకు చీమ కుట్టినట్లు కూడా కావడం లేదా? చీ..చీ అనిపించడం లేదా? జనమంతా ఛీ అని ఉమ్ముతున్నా సిగ్గనిపించడం లేదా? ఎందుకురా ఆ బతుకులు అంటూ జనం శాపాలు పెడుతున్నా లంచాలు మానరా? జనం పాలిట రాబంధులై నిత్యం పీక్కుతింటూనే వుంటారా? ఉద్యోగాలు సంపాదించుకున్నది ప్రజలకు సేవ చేయడానికా? లేక లంచాలు మెక్కడానికా? అసలు ప్రభుత్వ పనుల్లో పర్సెంటీజీలేమిటో? అవి ఎవరు నిర్దారించారో? ప్రజలు ఏ పని కోసం వచ్చినా దానికి ఒక రేటు ఫిక్స్‌ చేయడమేమిటో? ఉద్యోగులు అడిగిందానికి నోరు మూసుకొని ప్రజుల చెల్లించడమేమిటో? వ్యాపారులు, కాంట్రాక్టర్లు లక్షలకు లక్షలు లంచాలు ఇవ్వడమేమిటో? ఇలా లంచాలు తీసుకునే అదికారుల మూలంగా వ్యవస్ధకు జరుగుతున్న నష్టాలు ఎవరు పూడ్చాలి. ఒకప్పుడు నిర్మాణం చేసిన ఎన్నో కట్టడాలు ఇంకా చెక్కు చెదరడం లేదు. కాని ఇటీవల ఏ చిన్న పనిచేసినా బిల్లులు కాంట్రాక్టర్లకు బిల్లులు చేతికొచ్చే దాకా కూడా వుండడం లేదు. ఏ పనుల్లో నాణ్యత వుండడంలేదు. ఇక రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు, నీటి పారుదల, వ్యవసాయ శాఖ ఇలా చెప్పుకుంటూ పోతే ఏ శాఖను చూసినా ఏమున్నది గర్వకారణం. అన్ని శాఖలు కంపులోదొర్లుతున్న పందులకన్నా హీనం. రోజుకు కనీసం నలుగురు పట్టుబడుతున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడితే పరవు పోతుందన్న భయం లేదు. పట్టుకుంటే మహా అయితే ఓ నాలుగు రోజులు జైలుకు వెళ్తాం అంతకంటే జరిగేందేమీ వుంది. లంచం తీసుకోవడం దొంగతనంతో సమానం కాదా? చిన్న చిన్న దొంగతనం చేసిన వారిని పోలీస్‌ స్టేషన్‌లో చేసే సన్మానం లంచం తీసుకున్న అదికారులకు కూడా చేసే వ్యవస్ధ తయారైతే తప్ప అవినీతి అంతం కాదు. లంచం తీసుకుంటూ పట్టుబడిన ఉద్యోగికి వెంటనే ఉద్యోగం పోయేంత పరిస్దితి రావాలి. పట్టుబడిన ఉద్యోగులకు జైలులో సాదారణ ఖైదీకి వుండే వెసులుబాటైన జీవితమే వుంటుంది. కొంత కాలం తర్వాత బెయిల్‌ వస్తుంది. బైటకు వచ్చిన తర్వాత పాలకపక్షంలో వున్న పెద్దల ఆశీస్సులు, అవసరమైతే లంచాల ద్వారా సంపాదించిన దానిలో కొంత ముట్టజెప్పితే చాలు. మళ్లీ తన కొలువు తనకు వుస్తుంది. ఆ తర్వాత కేస్‌ క్లోజ్‌ అవుతుంది. తనను అన్యాయంగా ఇరికించారన్న సాక్ష్యాలను సృష్టించి తప్పించుకోవడం పరిపాటిగా మారింది. ఒక వేళ ఇలాంటి వెసులుబాటు కాని పక్షంలో రెండేళ్ల కాలం వరకు కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వుంటుంది. అందుకు ఇతర అధికారుల సహాకారంతో ఆ కేసు రెండేళ్లు దాటిందంటే చాలు..వెంటనే మళ్లీ తిరిగి ఉద్యోగం. అవసరమైతే ప్రమోషన్‌. ఇదే మన ఉద్యోగ వ్యవస్ధలో వున్న వెసులుబాటు. అది ఇప్పుడు అందరికీ అర్ధమైపోయింది. దాంతో ఏ ఉద్యోగి భయపడడం లేదు. భయపడి లంచం తీసుకోకుండా వుంటే ఈ వ్యవస్దలో కోటీశ్వరిడిని కాలేదు. రేపటి తన కుటుంబ తరానికి ఆస్దులు కూడగట్టలేనని తెలుసుకున్నారు. ప్రతి పనికి ఒక రేటు పిక్స్‌ చేసుకుంటున్నారు. అది ఏ పైని అయినా సరే..చిన్నా చితక అన్న ఆలోచన లేదు. సామాన్యులనుంచి కాంట్రాక్టర్లు, వ్యాపారుల నుంచి ఉద్యోగుల నోటి నుంచి వచ్చిన మాటే చివరి మాట. అంతే ముట్ట చెప్పాలి మూట. ఇక రైతులను పీడిరచుకు తినడంలో రెవిన్యూ వ్యవస్ద. భూముల కొనుగోలు, అమ్మకాలు, వారికి కాని భూములు రిజిస్ట్రేషన్‌ చేయడం కోసం అదికారులు తీసుకునే సొమ్ముకు లెక్కేలేదు. నిత్యం కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. లంచావతరాలు రోజురోజుకూ పెరుగుతున్నారు. తాజాగా సిరిసిల్లలో నీటి పారుదల శాఖకు చెందిన ఓ ఉద్యోగి లంచం తీసుకొని పట్టుబడ్డారు. కాని ఆయన ముఖంలో ఎలాంటి చీకు,చింత లేదు. భయం అసలేలేదు. పట్టుకుంటే మహా అయితే ఏం చేస్తారు? అన్నట్లు చూపులున్నాయి. ఏసిబి పట్టుకుంటే కనీసం కళ్లలోనైనా ఏదో ఒక సానుభూతి కోసం ఎదురుచూస్తున్నట్లు ముఖ కవళికలు మార్చేవారు వుంటారు. కాని ఈ ఉద్యోగి మాత్రం సోఫాలో దర్జాగా కూర్చొని, చిరునవ్వు చిందిస్తున్నాడు. అంటే లంచం తీసుకునే అదికారుల్లో ఎంతో భరోసా వుంటే తప్ప అలాంటి వ్యవహార శైలి కనిపించదు. పట్టుకున్నారు..అయితే ఏంటి? అని ఏసిబినే ప్రశ్నిస్తున్నట్లు అదికారుల వ్యవహార శైలి వుంటోంది. ఓ వైపు ప్రజలను లంచాల కోసం ఏ ఉద్యోగి అయినా వేదిస్తే వెంటనే ఏసిబిని ఆశ్రయించండి. అంతా గోప్యంగా వుంచుతామని ప్రకటనలు చేస్తున్నారు. ఈ మధ్య ఆ శాఖ పనితీరు కూడా ఎంతో బాగుంది. నిత్యం వారు ఎంతో కష్టపడుతున్నారు. ప్రజల పిర్యాదులకు బాగా స్పందిస్తున్నారు. ఎంత పెద్ద ఉద్యోగి అయినా సరే పట్టుకుంటున్నారు. ఎక్కడా వెనుకంజ వేయడంలేదు. పట్టుకోవడంలో ఎలాంటి శషభిషలు ప్రదర్శించడం లేదు. జాప్యం చూపడం లేదు. పిర్యాదు చేసిన ప్రజల చేత పదే పదే పిర్యాధులు కూడా తీసుకునేంత ఆలస్యం కూడాచేయడం లేదు. వెంటనే స్పందిస్తున్నారు. అదును చూసి పట్టుకుంటున్నారు. ఇంత వరకు బాగానే వుంది. అలా దొరికిన ఉద్యోగులను కోర్టులో ప్రవేశపెడుతున్నారు. చేతులు దులుపుకుంటున్నారు. మరి కేసుల విచారణ సమయంలో పట్టుకున్న అదికారులు సాక్ష్యం సరిగ్గా చెప్పడం లేదా? లేక ఆ పని తమది కాదని వదిలేస్తున్నారా? పోలీసులకు అప్పగించి చేతులు దలుపుకుంటున్నారా? ఎక్కడ లోపం జరుగుతోంది. ఎందుకు అవినీతి ఉద్యోగులు మళ్లీ ఉద్యోగాలు పొందుతున్నారు. నిజానికైతే ఒక్కసారి లంచంతో పట్టుబడి ఉద్యోగి మళ్లీ ఉద్యోగానికి అర్హుడు కాదు. ఏదైనా ఒకటి రెండు సందర్భాలలో ఆ అదికారిని టార్గెట్‌ చేసి ఇరించారన్న వార్తలు కూడా వస్తుంటాయి. అయినా అధికారి లంచం అడక్కుండా..ఇవ్వకుండా వున్నప్పుడు నోట్లను ఆ ఉద్యోగి ముట్టుకునే అవకాశం లేదు. అలాంటప్పుడు టార్గెట్‌ చేయడం అన్నది జరిగే ప్రశ్నే ఉత్పన్నం కాదు. కాని లాలో వున్న లొసుగులను ఆదారం చేసుకొని లంచాలతో సంపాదించిన సొమ్మును విసిరేసి, మళ్లీ ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. అంతకంతకు మళ్లీ మళ్లీ లంచాలతో సంపాదించుకుంటున్నారు. మన సమాజంలో అలాంటి ఉద్యోగులు ఎంతో మంది వున్నారు. అయితే ఇక్కడ ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న ఒక్కటే. లంచంతీసుకుంటూ పట్టుబడిన ఉద్యోగి ఉద్యోగం ఎందుకు వెంటనే పోదు? ఏసిబి అధికారులు రెడ్‌ హాండెడ్‌గా పట్టుకున్న తర్వాత కూడా అది ఫేక్‌ ఎలా అవుతుంది. ఏసిబి అదికారులకు , ఇతర ఉద్యోగులకు ఏలాంటి సంబంధాలు వుండవు. ఒక వేళ ఏసిబి వాళ్లు టార్గెట్‌ చేశారనడానికి ఆస్కారమే లేదు. ఏసిబి అధికారులు న్యాయంగా, దర్మంగా పనిచేస్తే తప్ప లంచావతారులైన ఉద్యోగులు పట్టుబడరు. ఒక వేళ ఏసిబి వాళ్లు ఆ అదికారులను తప్పించాలనుకుంటే , పట్టుకోకముందే తప్పించొచ్చు. ఏసిబి అధికారులు పట్టుకున్న తర్వాత ఉద్యోగులు నీతిమంతులెలా అవుతారు? మళ్లీ వాళ్లకు క్లీన్‌ చీట్‌ ఎలా వస్తుంది. అంటే ఏసిబి అధికారులను పనితీరును తప్పు పట్టినట్లా? లేక వ్యవస్ధను ఎగతాళి చేసినట్లా? చాల మంది ఉద్యోగులు, అందులో ఉన్నత ఉద్యోగులు ప్రజలను రాబందుల్లా పీడిరచుకు తింటున్నారని తెలుసు. తమ భూములను తమ పేరు మీద మార్చడానికి కూడా ఎకరానికి లక్షల రూపాయలు వసూలు చేసిన అదికారులు కూడా వున్నారు. అలా తప్పని పరిస్దితుల్లో లంచాలు ఇచ్చి, అప్పులు చేసి మరీ లంచాలు ఇచ్చుకున్న ప్రజలు కోకొల్లలున్నారు. లంచం ఇవ్వడం తప్పే, తీసుకోవడం తప్పే? అని మాత్రం ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటే సరిపోతుందా? కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలలో మార్పులు తీసుకొస్తున్నారు. ఏకంగా న్యాయ వ్యవస్దలోనే అనేక మార్పులు తీసుకొచ్చారు. బ్రిటీష్‌ ఇండియానుంచి ఇంత కాలం వారసత్వంగా వస్తున్న అనేక చట్టాలను మార్చి, కొత్త న్యాయ సంహితను తెచ్చారు. మరి అందులో అవినీతి అదికారుల గురించి ఆలోచించలేదు. అసలు అధికారులు సాగిస్తున్న అవినీతి గుర్తించలేదు. కనిపించడ ంలేదా? దేశ వ్యాప్తంగా అవినీతి అనేది ఎలా పెరిగిపోయిందో చూస్తూనే వున్నాం. కేంద్రం ప్రత్యేకచట్టం తీసుకురావడానికి అభ్యంతరం ఏమిటి? అందుకు రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి. తెలంగాణలో ఎంత ఉద్యోగ వ్యవస్దలో ఎంత అవినీతి జరగుతుందో చూస్తూనే వున్నాం. అలాంటి అవినీతి అంతానికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణంచేసి, కేంద్రానికి పంపొచ్చు కదా? అలా అన్ని రాష్ట్రాలు తీర్మాణాలు చేసి, పంపిస్తే బాగుంటుంది. ఉద్యోగి లంచం తీసుకుంటే ఆ క్షణమే ఉద్యోగం కోల్పోతాడన్న కొత్త చట్టం తీసుకురావడానికి ఎందకు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయడంలేదు. ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు. అవినీతి అంతం చేస్తామంటారు. అవినీతి అదికారులను కాపాడుతుంటారు. ఇదెక్కడి దిక్కుమాలిన రాజకీయాలో ఎవరికీ అర్దం కావు.

శ్రీ కంఠమహేశ్వరుని కల్యాణం.

కన్నుల పండుగగా శ్రీ కంఠమహేశ్వరుని కల్యాణం

నర్సంపేట నేటిధాత్రి:

నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామంలో శ్రీ సూరమాంబ -శ్రీ కంఠ మహేశ్వరుని కల్యాణం కన్నుల పండుగగా జరిగింది.ఐదు రోజుల పాటు గౌడ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ కంఠ మహేశ్వరునికి ఉత్సవాలు నిర్వహించారు.మొదటి రోజు ఆలయంలో మామిడి తోరణాల అలంకరణ, గౌడ కులస్తులకు మాలాదారణ, పటం కథ, రెండో రోజు గ్రామ దేవత లకు ప్రత్యేక పూజలు, మూడో రోజు జాలాభిషేకం, నాలుగో రోజు శ్రీ సూరమాంబ దేవి -శ్రీ కంఠ మహేశ్వరునికి కళ్యాణం,శ్రీ రేణుక-ఎల్లమ్మ తల్లి, జమదగ్ని పండుగ,బోనాల సమర్పణ, కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాల భాగంగా బోనాల కార్యక్రమం లో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరయ్యారు. శ్రీ కంఠ మహేశ్వరుని ఆలయంలో రేణుకా ఎల్లమ్మ,వనం మైసమ్మ,సూరమంబా దేవి, శ్రీ కంఠ మహేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం బొట్టు పెద్ద మనుషులు కట్ల సుధాకర్ గౌడ్, బుర్ర వెంకటేశ్వర్లు గౌడ్, సంఘం అధ్యక్షులు బుర్ర ఆనందం గౌడ్, కార్యదర్శి కక్కెర్ల కుమారస్వామి గౌడ్, కోశాధికారి తాళ్లపెల్లి అశోక్ గౌడ్, పిఏసిఎస్ వైస్ చైర్మన్ మేరుగు శ్రీనివాస్ గౌడ్, కట్ల కనుకయ్య గౌడ్, మచ్చిక రవీందర్ గౌడ్, బూడిద రవీందర్ గౌడ్, బూడిద శివ కోటి గౌడ్, ఆరెల్లి హరికిషన్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ లు ఆరెల్లి వేణు గౌడ్, బోడిగే వినయ్ గౌడ్,మాజీ ఎంపీపీ మోతె పద్మ నాబరెడ్డి, మాజీ జెడ్పి టీ సి కోమాండ్ల గోపాల్ రెడ్డి, ఎంపిటీసీ వీరన్న నాయక్, మాజీ పిఏసిఎస్ చైర్మన్ దుపాటి ఆనంద్ గౌడ్,యువజన నాయకులు బోడిగే క్రాంతి గౌడ్, కుమార్ గౌడ్, రాకేష్ గౌడ్, రంజిత్ గౌడ్, రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version