గిరిజనులపై జరుగుతున్న దాడులను నిలిపివేయాలి.!

ఆపరేషన్ కగార్ పేరిట అమాయక గిరిజనులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలి

గుండాల,నేటిధాత్రి:

 

గుండాల మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ కార్యక్రమం కు వచ్చిన టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి గోపగాని శంకర్ రావు మండల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
మన పొరుగు రాష్ట్రమైన చత్తీస్గడ్ లో ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసి ప్రజానీకాన్ని స్వదేశీ, విదేశీ కార్పోరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం హతమారుస్తున్న విధానాన్ని దేశంలోని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు తీవ్రంగా ఖండిస్తున్న కేంద్రంలోని మనువాద మతోన్మాద ప్రభుత్వం నిసిగ్గుగా మావోయిస్టుల ఏరివేత పేరుతో అనేకమంది పేరుతో అనేకమంది ఆదివాసి యువకులను దారుణంగా చంపి రాజ్య హింసకు పాల్పడుతూ మధ్య భారత దేశంలోని ఆదివాసి ప్రజానీకం. జల్, జంగల్, జమీన్ కోసం పోరాడుతూ అడవిని, అడవిలో గల సహజ, ఖనిజ సంపదను రక్షించుకునేందుకు సాగిస్తున్న విరోచత పోరాటాలపై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్బంధాన్ని, హత్యకాండను ప్రతికటిద్దాం
ఈ దేశ మూలవాసులు అనాదిగా అడవిని వాగులు, వంకలు, ఒర్రెలు, చెట్టు పుట్ట మరియు మూగజీవాలతో సహజీవనం చేస్తూ, తర తరాలుగా అడవినే నమ్ముకుని జీవనం గడుపుతున్న ఆదివాసి ప్రజానీకాన్ని, అడవి నుండి ఖాళీ చేసి, సహజ, ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు ధారా దత్తం చేసేందుకు కుటిల రాజనీతిని ప్రదర్శిస్తూ ఆదివాసీల మనుగడను ప్రశ్నార్ధకంగా మార్చింది. ఒక ప్రక్కన మావోయిస్టులను దేశంలో నుండి ఏరిపారేసామని గొప్పలు చెబుతున్న పాలకులు, ఈనాడు ఇంకా మావోయిస్టులు ఉన్నారన్న నెపంతో అడవిలో ప్రశ్నించే శక్తులు లేకుండా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామిక వాదులు ముక్తకంఠంతో ఖండించాలన్నారు.భారతదేశ రాష్ట్రపతి 5. 6 షెడ్యూల్ ప్రాంతంలో జన్మించి రాజకీయంగా ఎదిగి, ఈనాడు ఆయా తెగల మీద ఫాసిస్టు ప్రభుత్వం ఆదివాసీలపై ఆపరేషన్ కగారు పేరుతో హననం చేస్తుంటే, మౌన ముని వలె ప్రేక్షక పాత్ర పోషించడం తగదు. దేశ సరిహద్దు ప్రాంతంలో ఉండవలసిన సైన్యం ఆదివాసి గూడాలపై పడి మరణ హోమం కలిగించడం బాధాకరం.
ప్రజలు ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలు ఆదివాసీలకు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆట, పాట, వేట, ఆదివాసీల సంస్కృతి, వారిని అడవికి దూరంగా పారామిలటరీ దళాలు తరుముతున్నాయి. తెలంగాణలో పారా మిలటరీ మరియు బిఎస్ఎఫ్ క్యాంపులను సత్వరమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గొల్లపల్లి రమేష్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version