వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి.

వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి…

తంగళ్ళపల్లి నేటి రాత్రి :

 

 

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో. రైతులు ఆరుగాలం పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రాస్తారోకో ధర్నాకు దిగారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజులు గడుస్తున్న కాంట పెడతలేరు అంటూ. వడ్లు కొంట.లేరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వడ్లు కొనుగోలు విషయంలో జాప్యం జరుగుతుందంటూ జిల్లెల్ల గ్రామంలో ప్రధాన రహదారిపై ధర్నాకు దిగిన రైతులు. రైతులు ధర్నాకు దిగడంతో రోడ్డుపై భారీగా ఎక్కడికక్కడ వాహనాలు . నిలిచి. రాకపోకలకు ఇబ్బంది జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ .ఇకనైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని. ఈ సందర్భంగా జిల్లాల గ్రామస్తులు తెలిపారు అలాగే. మండేపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు చేస్తలేరని రైతులు రోడ్డెక్కి. నిరసన తెలియజేస్తూ ధర్నాకు దిగారు. దయచేసి వెంటనే సంబంధిత అధికారులు మండలంలో ప్రతి గ్రామంలో వడ్ల. కొనుగోలు కేంద్రాల ప్రారంభించి రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా రైతులు ఉన్నతాధికారులకు విన్నవించారు ఇట్టి ధర్నా కార్యక్రమంలో జిల్లెల్ల గ్రామ ప్రజలు. రైతులు. మండపల్లి గ్రామ ప్రజలు. రైతులు. పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తర్వాత. పోలీసులు వెళ్లి ధర్నా చేస్తున్న వారిని . శాంతింప చేసి. సంబంధిత అధికారులతో మాట్లాడి వరి ధాన్యం. కొనుగోలు చేసే విధంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రోడ్డుపై వెళ్లే వాహనాలను . క్రమబద్ధకరించి. వాహనాలు సజావుగా పోయేటట్టు రాకపోకలకు అంతరాయం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version