మెదక్ లో వర్గ పోరు మొదలైనట్టేనా?
ఎవరికి వారే పలు కార్యక్రమాలు…
ఉమ్మడిగా ముందుకు రాని వైనం…
ఎటు పోవాలో తెలియక అయోమయంలో పడుతున్న కార్యకర్తలు..
రామాయంపేట మే 13 నేటి ధాత్రి :
టిఆర్ఎస్ కు కంచుకోట ఉమ్మడి మెదక్ జిల్లా అలాగే మెదక్ నియోజకవర్గం కూడా ఈ పార్టీకి మంచిపట్టున్న నియోజకవర్గం. అయితే ఈ మధ్యకాలంలో మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకుడు కాంటారెడ్డి తిరుపతిరెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. ఏ కార్యక్రమం చేసిన వేరువేరుగా చేయడం పట్ల కార్యకర్తలు కూడా అయోమయంలో పడుతున్నారు. బహిరంగంగా విభేదాలు బయటపడకున్న లోలోపల మాత్రం విభేదాలు ఉన్నాయని వినిపిస్తున్నాయి. ఇప్పటినుండి వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారని పలువురి అభిప్రాయం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ రావు తనదైన శైలిలో ముందుకు వెళ్లడంతో పాటు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కూడా ఘాటుగా విమర్శిస్తున్నారు.
ఈ క్రమంలో అనుకున్న విధంగా ఈ ఇద్దరిలో ఎవరు కూడా ఖండించకపోవడం పట్ల కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ రావ్ వ్యాఖ్యల పట్ల పార్టీ కార్యకర్త ఒకరు సోషల్ మీడియాలో ఘాటుగా విమర్శించారు. అయితే ఆ కార్యకర్తను పోలీసులు విచక్షణ రహితంగా కొట్టిన కనీసం పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. బాధితుడు ఇటీవల కేటీఆర్ ను కలిసి తన బాధను చెప్పుకున్నాడు. కేటీఆర్ సైతం మెదక్ నియోజకవర్గంలో నాయకుల పనితీరు పట్ల సంతృప్తిగా లేదని పలువురి వాదన. ఏది ఏమైనా ఇంటి పోరే కారుకు తిను సవాలుగా మారే ప్రమాదం ఉంది.