సర్వాపురంలో మహిళ మృతి – కౌన్సిలర్ సంతాపం
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డ్ సర్వపురంలో మంగళవారం జన్ను రాజు భార్య జన్ను లావణ్య మృతి చెందారు.ఈ సందర్భంగా 5వ వార్డ్ కౌన్సిలర్ పొన్నాల మనీషా ప్రకాష్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఊరి పెద్దలు ఆకులపెల్లి రమేష్, చిలుక జంపయ్య, కొంగర సాంబయ్య, మాసు స్వామి, పొన్నాల శంకర్, మాసు కొమ్మలు, బోట్ల కుమార్, తడుగుల ఎల్లయ్య తదితరులు పాల్గొని సంతాపం ప్రకటించారు.
