కల్వకుర్తి మున్సిపాలిటీ…

కల్వకుర్తి మున్సిపాలిటీ…

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ – ఉప్పల వెంకటేష్ సహకారంతో మృతుడి కుటుంబాలకు ఆర్థిక సహాయం.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

 

కల్వకుర్తి మున్సిపాలిటీకి చెందిన ఆర్యవైశ్య అల్లంపల్లి శ్రీను అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయాన్ని ఆర్య వైశ్య సంఘం నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు & మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు వారి పిల్లల చదువుకు సహాయం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం కల్వకుర్తి మండలం అధ్యక్షులు గంధం ప్రసాద్, ఆర్య వైశ్య సంఘం నాయకుడు దాచపల్లి శ్రీనివాసులు, ఉప్పల వెంకటేష్ సైన్యం దారమోని గణేష్ , ఐలా శేఖర్ గౌడ్, ఆర్య వైశ్య సంఘం నాయకులు పోల నరేష్, ఆకారపుశివ తదితరులు పాల్గొన్నారు.

ఇటీవల చనిపోయిన కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందించిన గడ్డం మధుకర్….

ఇటీవల చనిపోయిన కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందించిన గడ్డం మధుకర్….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం బదనపల్లి టెక్స్టైల్ పార్క్ ఇందిరానగర్ గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం మరణించిన కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి గడ్డం మధుకర్. ఈ సందర్భంగా గత కొన్ని రోజుల క్రితం చెన్నూరి మహాదేవ్ అను వ్యక్తి అనారోగ్యంతో చనిపోగా రేపటి రోజునదినకర్మ.ఉన్నందున తమ వంతు సహాయంగా 50 కేజీల బియ్యం అందజేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ స్పెషల్ మీడియా ఇన్చార్జి గడ్డం మధుకర్. చోటు. ఇందుకుగాను. మహదేవ్ కుటుంబ సభ్యులు బియ్యం అందజేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుకొంపెల్లి శ్యామ్. భోగ రంగయ్య. ఎనగందు.లప్రశాంత్. దేవులపల్లి సుమన్.పూర్ణ. ఎలిగేటి.మహేందర్. అడిగొప్పులగంగయ్య. మహిళలు గ్రామ ప్రజల తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version