pranam thisina buthagada, ప్రాణం తీసిన భూతగాదా

ప్రాణం తీసిన భూతగాదా మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట మండలంలోని బలరావుపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం బలరావుపేట గ్రామంలో భూతగాదాలతో పెట్టం శంకరయ్య అనే వ్యక్తిని అల్లంల బాలయ్య అనే వ్యక్తి గొడ్డలితో నరికాడు. దీంతో పెట్టం శంకరయ్యకు తీవ్రరక్తస్రావం జరిగి అక్కడికక్కడే మతిచెందాడు.

Read More

raithilanu sadvinyogam chesukovali, రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి

రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి – ఎంపీపీ మార్నేని రవిందర్‌రావు రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక రకాల రాయితీలను కల్పిస్తుందని, రైతులు ప్రభుత్వం కల్పించే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని వర్ధన్నపేట ఎంపీపీ మార్నేని రవిందర్‌రావు కోరారు. మంగళవారం మండల కేంద్రంలో రైతు ఆగ్రోస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జీలుగ విత్తనాల పంపిణీ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎంపీపీ మార్నేని రవిందర్‌ రావు ముఖ్యఅతిధిగా హాజరై రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీలుగ విత్తనాలను…

Read More

kasulapia preethi…ideam rithi, కాసులపై ‘ప్రీతి’…ఇదేం రీతి…

కాసులపై ‘ప్రీతి’…ఇదేం రీతి… వరంగల్‌ అర్బన్‌ ఇంటర్మీడియట్‌ జిల్లా ప్రధాన కార్యాలయంలో అవినీతి ఛాయలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, ఇక్కడా…అక్కడా అనే తేడా లేకుండా అందినకాడికల్లా దోచుకోవడమే తమ ద్యేయమన్నట్లుగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారని ప్రచారం జరుగుతున్నది. ప్రతి యేటా కాలేజీలు అనుమతులు తీసుకోవడం, రెన్యువల్స్‌ చేసుకోవడం జరుగుతుంటుంది. ఈ క్రమంలో కాలేజీ అఫ్లియేషన్లు చేయాలన్నా, రెన్యువల్‌ కావాలన్నా కళాశాలల యజమాన్యాలు వీరి చేయి తడిపితేనే పనులు చకాచకా జరుగుతాయని లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే…

Read More

congress mptc abyarthi atmahatyayatnam, కాంగ్రెస్‌ ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్‌ ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం ఓడిపోతానన్న భయంతో ఓ ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం చేశారు. నిద్రమాత్రలు మింగి, పురుగుల మందు తాగారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా, కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో జరిగింది. కాంగ్రెస్‌ ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాచర్ల రాములు అప్పులపాలయ్యారు. దీనికి తోడు గెలిచే అవకాశం లేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు, నిద్రమాత్రలు మింగడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన రాములును హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. రాములు ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే…

Read More

ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు డిపాజిట్‌ గల్లంతే : పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి.

ఎన్నికలు అంటేనే కాంగ్రెస్‌ పార్టీకి వణుకు పుడుతోందని, తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల గుండెల్లో నిలిచిందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్‌ చైర్మన్‌లతో కలిసి మంగళవారం నామినేషన్‌ ధాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల గుండెల్లో నిలిచిందని..ఎన్నికలు ఏవైనా విజయం టిఆర్‌ఎస్‌ పార్టీదేనని అన్నారు. ఓటమి భయంతో రాష్ట్రంలో…

Read More

bavi thavakam prarambham, బావి తవ్వకం ప్రారంభం

బావి తవ్వకం ప్రారంభం వేసవికాలంలో గ్రామపంచాయితీ పరిధిలోని ప్రజల దాహార్తిని తీర్చడానికి మంచినీటి బావిని తవ్వడానికి పనులు ప్రారంభించామని గ్రామ సర్పంచ్‌ గోడిశాల మమత సదానందంగౌడ్‌ తెలిపారు. మంగళవారం నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామంలో గ్రామ ప్రజల దాహార్తిని తీర్చడానికి మంచినీటి బావిని గ్రామసర్పంచ్‌ చేతుల మీదుగా బావి తవ్వి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సహకారంతో పనులు ప్రారంభించామని చెప్పారు. గ్రామంలోని ప్రతి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించి…

Read More

mruthula kutumbalaku bima sahayam, మతుల కుటుంబాలకు భీమా సహాయం

మతుల కుటుంబాలకు భీమా సహాయం నర్సంపేట మండలం కమ్మపల్లి మండలంలోని నేతాజీ పురుషుల పొదుపు సంఘంలో సభ్యులుగా ఉంటూ ఇటీవల మతిచెందిన దామెర స్వామి, గడ్డం అశోక్‌ల నామినీలు (కుటుంబసభ్యులకు) అభయ నిధి పథకం, సామూహిక నిధి పథకం ద్వారా ఒక్కొక్కరికి 55వేల రూపాయల చొప్పున ఆ సంఘ అధ్యక్షుడు సాంబరాతి రమేష్‌ ఆధ్వర్యంలో, దుగ్గొండి పురుషుల పొదుపు సమితి అధ్యక్షుడు నీలా రవీందర్‌ చేతుల మీదుగా బీమా పథకాల డబ్బులను వారికి మంగళవారం సంఘ కార్యాలయంలో…

Read More

vidyardulaku andaga youth for swach duggondi, విద్యార్థులకు అండగా యూత్‌ ఫర్‌ స్వచ్చ దుగ్గొండి

విద్యార్థులకు అండగా యూత్‌ ఫర్‌ స్వచ్చ దుగ్గొండి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎప్పటికీ అండగా ఉంటామని యూత్‌ ఫర్‌ స్వచ్చదుగ్గొండి అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ ఎన్నారై ఫోరం అధికార ప్రతినిధి శానబోయిన రాజ్‌కుమార్‌ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించడం పట్ల దుగ్గొండి మండలకేంద్రంలో ఆయన మాట్లాడారు. యూత్‌ ఫర్‌ స్వచ్చ దుగ్గొండి, లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని పదవతరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్‌తోపాటు వివిధ రకాలుగా సహాయం అందించిన…

Read More

taskforce headconistable mruthi, టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మృతి వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌కానిస్టేబుల్‌గా విదులు నిర్వహిస్తున్న కన్నెబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ అలియాస్‌ కరాటే శ్రీను బిపి పెరిగి కిందపడిపోగా హన్మకొండలోని మాక్స్‌కేర్‌ ఆసుపత్రికి తరలించారు. మ్యాక్స్‌కేర్‌ వైద్యుల సలహా మేరకు కరాటే శ్రీనును మెరుగైన చికిత్స కోసం శుక్రవారం హైదరబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మెడ నరాలు దెబ్బతిన్నాయని తెలిపారు. దీంతో కరాటే శ్రీనుకు చిన్న మెదడు పనిచేయకపోవడంతో చికిత్స పొందుతూ మృతిచెందారు. కరాటే శ్రీను గతంలో…

Read More

taskforce headconstable mruthi, టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మృతి వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌కానిస్టేబుల్‌గా విదులు నిర్వహిస్తున్న కన్నెబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ అలియాస్‌ కరాటే శ్రీను బిపి పెరిగి కిందపడిపోయారు. దీంతో కరాటే శ్రీనును హన్మకొండలోని మాక్స్‌కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం శుక్రవారం హైదరబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మెడ నరాలు దెబ్బతిన్నాయని, చిన్న మెదడు పనిచేయకపోవడంతో చికిత్స పొందుతూ పరమపదించారు. కరాటే శ్రీను గతంలో హసన్‌పర్తి, హన్మకొండ…

Read More

ajancy mandala toperga gayatri, ఏజెన్సీ మండల టాపర్‌గా గాయత్రి

ఏజెన్సీ మండల టాపర్‌గా గాయత్రి ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన బాలసాని నరేంద్ర కుమార్తె బాలసాని గాయత్రి పదవ తరగతి పరీక్షల్లో మండల టాపర్‌గా నిలిచింది. సోమవారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో వెంకటాపురం మండలంలోని భారతి విద్యానికేతన్‌ స్కూల్‌కు చెందిన గాయత్రీ 9.8జిపిఎతో ఏజెన్సీ మండల టాపర్‌గా నిలిచింది.

Read More

vanda shatham uthirnatha, వందశాతం ఉత్తీర్ణత

వందశాతం ఉత్తీర్ణత నర్సంపేట డివిజన్‌లోని దుగ్గొండి మండలం మల్లంపల్లి కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినులు మొట్టమొదటిసారిగా వందశాతం ఉత్తీర్ణత సాధించి రికార్డును సష్టించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థుల పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. దుగ్గొండి మండలం మల్లంపల్లి కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో 36మంది విద్యార్థినులు విద్యాభ్యాసం అభ్యసించి ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రత్యేక అధికారిని మంజుల మాట్లాడుతూ 36మంది విద్యార్థినులు పరీక్షలకు…

Read More

mathisthimitham leni vyakthi hulchul, మతిస్థిమితం లేని వ్యక్తీ హల్‌చల్‌

మతిస్థిమితం లేని వ్యక్తీ హల్‌చల్‌ రద్దీగా ఉండే హైదరాబాద్‌-ముంబై జాతీయ రహదారిపై మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి వీరంగం సృష్టించాడు. దిల్‌సుఖ్‌ నగర్‌ వైపు నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్లే వాహనాలకు అడ్డుపడుతూ నానా హంగామా చేశాడు. బస్సులు, ఆటోలు, ద్విచక్రవాహనాలు, ఫైర్‌ ఇంజన్‌పై రాళ్లు వేయసాగాడు. అటుగా వెళ్లే పాదచారులను కర్రతో వెంబడించాడు. దాంతో వాహనదారులు, ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. ఎర్రగడ్డ మెంటల్‌ ఆసుపత్రి నుంచి ఆ మతిలేని వ్యక్తి పారిపోయి వచ్చి ఉంటాడని భావిస్తున్నారు. మతిస్థిమితం…

Read More

intulo chori, ఇంట్లో చోరీ

ఇంట్లో చోరీ – 35తులాల బంగారం అపహరణ హన్మకొండ సుబేదారి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎక్సైజ్‌ కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ పాల్పడగా సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ పాల్పడినట్లు పేర్కొన్నారు. ఇంట్లో ఉన్న 35 తులాల బంగారం అపహరించారని చెప్పారు.

Read More

maramathullu,  మరమ్మత్తులు

మరమ్మత్తులు వేసవికాలంలో నీటి ఎద్దడిని నివారించడానికి డివిజన్‌లో మరమ్మత్తులో ఉన్న బోరింగులను పునరుద్దరించడానికి కృషి చేస్తున్నామని 22వ డివిజన్‌ కార్పొరేటర్‌ మరుపల్ల భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం వరంగల్‌లోని ఉర్సు ప్రతాప్‌నగర్‌లో మరమ్మత్తులో ఉన్న బోరింగులు కార్పొరేషన్‌ సిబ్బందితో మరమ్మత్తులు చేయిస్తూ వారి పనితీరును పరిశీలించారు. కొద్దిరోజులలో ప్రతి ఇంటికి మంచినీరు పంపిణీ చేయడానికి ప్రభుత్వం మిషన్‌ భగీరథ కార్యక్రమం చేపట్టిందన్నారు. పైప్‌లైన్లు లేని ఏరియాలను గుర్తించారు. త్వరలో ఆయా ప్రాంతాలలో మంచినీటి పైపులు వేయిస్తానని తెలిపారు. ఈ…

Read More

paruvuthisuthunna private palu, పరువుతీస్తున్న ప్రైవేట్‌ పిఎలు

పరువుతీస్తున్న ప్రైవేట్‌ పిఎలు ఓ ప్రభుత్వ కార్యాలయం వెళ్లాలంటే అధికారి కంటే ముందు అక్కడ పనిచేస్తున్న అటెండర్‌ను ప్రసన్నం చేసుకోవాలి. అలా అయితేనే పని జరుగుతుంది లేదంటే అంతే సంగతులు. ఆ కార్యాలయంలో ఏ వ్యవహారం గూర్చి సమాచారం. కావాలన్న వారే సమస్తం. ఇది ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి. మరీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల పరిస్థితి ఎలా ఉంది అని ఆరా తీస్తే అచ్చం ప్రభుత్వ కార్యాలయాలలాగే ఉంది. ఇక్కడ మాత్రం సూటు…బూటు వేసుకుని చేతిలో రెండు,…

Read More

bukabzadarulapia pd act, భూకబ్జాదారులపై పీడీ యాక్ట్‌

భూకబ్జాదారులపై పీడీ యాక్ట్‌ తెలంగాణలో అత్యంత ప్రాధాన్యమున్న, వేగంగా వద్ధి చెందుతూ స్మార్ట్‌ సిటీగా ఎంపికైన కరీంనగర్‌ పట్టణంలో సొంత ఇల్లు నిర్మించుకోవాలని సామాన్యులు కలలు కనడం సహజం. ఈ కారణంగా, ఇటీవల కరీంనగర్‌ పట్టణంలో, శివారు ప్రాంతాల్లో భూమి విలువ అమాంతంగా పెరగడం వల్ల ఆ డిమాండ్‌ను తమకు లాభాలుగా మార్చుకోవాలని స్వార్థంతో, దురుద్దేశంతో భూకబ్జాదారుల కన్ను భూములపై పడింది. ప్రభుత్వ ఉద్యోగులు, చిరువ్యాపారులు, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు తమ పిల్లల భవిష్యత్తు, చదువులు,…

Read More

DIEO karyalayamlo…eam jaruguthondi, డిఐఈఓ కార్యాలయంలో…ఏం జరుగుతోంది..

డిఐఈఓ కార్యాలయంలో…ఏం జరుగుతోంది.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రధాన కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులదే హవా నడుస్తున్నదని, వారు చెప్పిందే వేదంగా కార్యాలయ సిబ్బంది నడుచుకోవాలని, ఎదురు మాట్లాడినా…వారి పనులకు అడ్డు తగిలే ప్రయత్నం చేసినా కార్యాలయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని, అవినీతికి పాల్పడినా, అక్రమాలకు ఒడిగట్టినా నోరు మెదపకుండా మౌనంగా కూర్చోవాలని ఇతరులపై ఒత్తిడి తెస్తుంటారని సమాచారం. కళ్ల ముందే కార్యాలయంలో అవినీతి జరుగుతున్నా ఎవరికి చెప్పలేక తమలో తాము మనోవేదనకు గురవుతున్నట్లు…

Read More

thalasemiya baditha baludiki vitharana, తలసేమియా బాధిత బాలుడికి వితరణ

తలసేమియా బాధిత బాలుడికి వితరణ వెంకటాపురం మండలకేంద్రానికి చెందిన కోగిల్ల రాజేష్‌ అనే బాలుడు కొద్దికాలంగా తలసేమియా వ్యాధితో బాధ పడుతున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన రాజేష్‌కు వైద్యం అందించడంలో కుటుంబసభ్యులు ఇబ్బందిపడుతున్నారు. సమాచారం తెలుసుకున్న వెంకటాపురానికి చెందిన యువకుడు బిల్లా తరుణ్‌ తనకు హరీష్‌రావు అందజేసిన సొమ్ములో 5వేల రూపాయలు బాధిత బాలుడికి అందించి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ 5వేల రూపాయల నగదును బాధిత రాజేష్‌ తండ్రి రాజుకు అందజేశారు.

Read More

pidugupadi gorrelakapari mruthi, పిడుగుపడి గొర్లకాపరి మతి

పిడుగుపడి గొర్లకాపరి మతి పిడుగుపాటుకు గొర్లకాపరి మత్యువాత పడ్డాడు. ఈ సంఘటన నర్సంపేట డివిజన్‌ దుగ్గొండి మండలంలోని గుడ్డెలుగులపల్లె గ్రామశివారులో చోటుచేసుకున్నది. కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దుగ్గొండి మండలం గుడ్డెలుగులపల్లె గ్రామానికి చెందిన మంద రాజయ్య(40) తనకున్న వ్యవసాయంతోపాటు గొర్రెలను పోషించుకుంటున్నాడు. రోజు మాదిరిగానే శనివారం గొర్రెలను మేపడానికి ఊరి శివారులోకి వెళ్లాడు. అనుకోకుండా ఈదురుగాలులు భారీగా వర్షం రావడంతో అక్కడే ఉన్న చెట్టు కిందకు వెళ్లాడు. వర్షంతోపాటు ఒక్కసారిగా పిడుగు…

Read More