భూభారతిపై అవగాహన కార్యక్రమం.

భూభారతిపై అవగాహన కార్యక్రమం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన కార్యక్రమాన్ని.రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్.నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూభారతి చట్టంలో వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ.రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకువచ్చిన భూభారతి నూతన ఆర్ ఓ ఆర్.చట్టంపై తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సదస్సులో కలెక్టర్ పాల్గొని చట్టంలోని వివిధ అంశాలను ప్రయోజనాలను ప్రజెంటేషన్ ద్వారా రైతులకు ప్రజలకు క్లుప్తంగా వివరించడం జరిగిందని. అలాగే శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలోని గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూధార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని దీని ద్వారా భూ అక్రమాలకు చెక్ పెట్టవచ్చునని పెండింగ్లో ఉన్న సాదా బైనామ పరిష్కారం కోసం భూభారతి. చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని పి ఓ టి. ఎల్.టి.ఆర్ సీలింగ్ చట్టాలు ఉల్లంఘనలు లేని దరఖాస్తులను క్రమబద్ధీకరణ చేసే నాటి స్టాంప్ డ్యూటీ 100 రూపాయలు అపరాధ రుసుము వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని. హక్కుల రికార్డులు వివరాలను నమోదు చేసి పాస్ బుక్ జారీ చేయడం జరుగుతుందని వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఒకేరోజు ఉంటాయని కొనుగోలు తనక బదిలీ బాగా పంపకాల ద్వారా భూమిపై హక్కులు సంకల్పిస్తే తాసిల్దార్ .రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డులను మార్పు చేసి పట్టాదారు పాసుబుక్ జారీ చేస్తారని .స్లాట్ బుకింగ్ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ న్యూట్రిసియేషన్ .ఫీజు చెల్లింపు అంటే నిర్ణీత తేదీల్లో చట్ట ప్రకారం సొంత దస్తావేజు రాసుకొని సమర్పించాల్సి ఉంటుందని దస్తావేజుతోపాటు ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి భూమి పట్టం సమర్పించాలని తెలియజేశారు చట్టంపై అవగాహన కల్పించేలా కరపత్రాలు పంపిణీ చేశామని ప్రజలు వీటిని గమనించాలని ఏమైనా సందేహాలు ఉంటే తీర్చడానికి అధికారులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేశారు రైతులకు ఎటువంటి భూ సమస్యలు ఉన్న భూభారతిలో పరిష్కరించవచ్చని పేర్కొంటూ ప్రతి గ్రామానికి ఒక విలేజ్ రెవెన్యూ అధికారిని నియమించడం జరుగుతుందని తద్వారా రైతులకు భూభారతిలో ఎటువంటి సమస్యలు వచ్చిన పరిష్కరించడానికి చాలా సులువుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి అవగాహన కార్యక్రమానికి రైతులు ఆర్డీవో రాధాబాయి ఎమ్మార్వో జయంత్ కుమార్ గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప తిరుపతి రెడ్డి వైస్ చైర్మన్.నేరెళ్ల నరసింహం గౌడ్.ప్రభుత్వ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version