ప్రమాదం లో బుర్కపల్లి వాగు వంతెన.

ప్రమాదం లో బుర్కపల్లి వాగు వంతెన

బయందోళనలో ప్రయాణం సాగిస్తున్న ప్రజలు

కొత్తగూడ, నేటిధాత్రి :

 

 

 

 

మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం నుంచి గంగారం ఇల్లందు వెళ్లే దారిలో మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి బుర్కపల్లి వాగుపై వంతెన ఎప్పుడో తాతల కాలం నాటి నిర్మించినది.. అది కూడా వెడల్పు లేకుండా ఉండడంతో వర్షాకాలం వచ్చిందంటే బ్రిడ్జి పైన నుంచి నీళ్లు వెళ్లి రాకపోకలకు అంతరాయం జరుగుతూ ఉంటుంది.. వర్షాకాలంలో వాగు ఉప్పొంగి వరద ఉధృతికి బ్రిడ్జి పూర్తిగా దెబ్బతిని భారీ వాహనములు బ్రిడ్జిపై వెళ్తుండడంతో బ్రిడ్జ్ పిల్లర్లు రాళ్లు ఇసుక కంకర అన్ని కొట్టుకపోయాయి బ్రిడ్జి ఎప్పుడు కూలిపోతుందని ప్రయాణికులు భయంకరమైన చెందుతున్నారు కావున ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి పాత బ్రిడ్జి స్థానంలో మరింత వెడల్పుగా కొత్త బ్రిడ్జి నిర్మించాలని ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని కొత్తగూడ గంగారం మండలాల ప్రజలు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు..,,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version