ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి.

ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి…

సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్

రామకృష్ణాపూర్, నేటిదాత్రి:

 

 

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ సీపీఐ పార్టీ క్యాతనపల్లి మున్సిపాలిటీ పట్టణ సమితి ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు.ఉగ్రవాదుల దుర్మార్గపు చర్యల వల్ల అమాయక ప్రజలు,పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని,ఉగ్రవాదులను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందినదని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ఆరోపించారు.కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు వనం సత్యనారాయణ, నక్క వెంకటస్వామి, కాదండీ సాంబయ్య, పార్టీ ప్రజా సంఘాల నాయకులు, మామిడి గోపి, ఎగుడ మొండి,సిర్ల ముకుందరేడ్డి, కస్తూరి మల్లారెడ్డి,గంగాదరి మల్లయ్య,బోయపోతుల కొమురయ్య,మోతుకుల రాజు, అన్నం శ్రీనివాస్, మా దాస్ శంకర్,గొడిసెల గురువయ్య, శ్రీకాంత్ ,చిరంజీవి,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version