గోవధ చేసే వారిని కఠినంగా శిక్షించాలి.

గోవధ చేసే వారిని కఠినంగా శిక్షించాలి.

భాజపా మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్.

నల్లబెల్లి నేటి ధాత్రి:

బక్రీద్ పండుగ పురస్కరించుకొని గోవధ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అన్నారు మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ చంద్రయ్య కు మండల పరిధిలో గోమాత హత్యలు చేస్తే చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మండల పార్టీ తరఫున వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ గౌడ్ మాట్లాడుతూ మండల పరిధిలో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి గో అక్రమ రవాణాలను నివారించాల్సిందిగా అదేవిధంగా గోమాత హత్యలను అరికట్టే విధంగా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నాగరాజు, కోశాధికారి మురికి మనోహర్, నాయకులు వల్లే పర్వతాలు, కొండ్లె రమేష్, కౌడగాని రాజేందర్, తిమ్మాపురం శివ తదితరులు పాల్గొన్నారు.

ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి.

ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి…

సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్

రామకృష్ణాపూర్, నేటిదాత్రి:

 

 

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ సీపీఐ పార్టీ క్యాతనపల్లి మున్సిపాలిటీ పట్టణ సమితి ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు.ఉగ్రవాదుల దుర్మార్గపు చర్యల వల్ల అమాయక ప్రజలు,పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని,ఉగ్రవాదులను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందినదని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ఆరోపించారు.కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు వనం సత్యనారాయణ, నక్క వెంకటస్వామి, కాదండీ సాంబయ్య, పార్టీ ప్రజా సంఘాల నాయకులు, మామిడి గోపి, ఎగుడ మొండి,సిర్ల ముకుందరేడ్డి, కస్తూరి మల్లారెడ్డి,గంగాదరి మల్లయ్య,బోయపోతుల కొమురయ్య,మోతుకుల రాజు, అన్నం శ్రీనివాస్, మా దాస్ శంకర్,గొడిసెల గురువయ్య, శ్రీకాంత్ ,చిరంజీవి,తదితరులు పాల్గొన్నారు.

చెక్ డ్యామ్ ను కూల్చిన వారిని కఠినంగా శిక్షించాలి.

చెక్ డ్యామ్ ను కూల్చిన వారిని కఠినంగా శిక్షించాలి.

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం,నవాబు పేట మరియు మొగుళ్ళపల్లి మండలం,బద్ధంపల్లి గ్రామాల నడుమ చలివాగు పై బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి దాదాపు 10 కోట్ల రూపాయలతో నిర్మించిన చెక్ డ్యామును టిఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కొరకు రైతులు రెండు పంటలు సునాయాసంగ పండించుకునేందుకు నిర్మించిన చెక్ డ్యామ్ ను కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు దగ్గర ఉండి మరీ చెక్ డ్యామ్ బాంబులతో కూలగొట్టడం ఎంత దుర్మార్గమో ప్రజలు, రైతులు గమనించాలి, ఈ దుర్మార్గమైన చర్యను బిఆర్ఎస్ పార్టీ తరుపున ఖండిస్తున్నాం.వెంటనే ఇరిగేషన్ అధికారులు మరియు పోలీస్ అధికారులు ఈ దుర్మార్గమైన చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూన్నాం.అదే విదంగా ఈ ఘటన పై స్థానిక ఎమ్మెల్యే బాధ్యత వహిస్తూ రైతులకు నష్టం కలిగించేలా ప్రభుత్వ ఆస్తులను ద్వసం చేసిన వారి కార్యకర్తలపై పార్టీపరంగా, చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేను డిమాండ్ చేస్తూ.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాడ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో చిట్యాల మండల బిఆర్ఎస్ ప్రెసిడెంట్ పిట్టా సురేష్ బాబు,మండల ప్రధాన కార్యదర్శి ఏరుకొండ రాజేందర్, మండల యువజన అధ్యక్షుడు తౌటం నవీన్, సీనియర్ నాయకులు పండ్రాల వీరస్వామి, ఆరేపల్లి సమ్మయ్య, సోషల్ మీడియా ఇంచార్జి కూస ప్రశాంత్ రెడ్డి, ఆలేటి సురేందర్ రెడ్డి, నరిగె అశోక్, మర్రి నరేష్,నవాబుపేట్ గ్రామ అధ్యక్షుడు సాధా రాజు,వలబోజు నరేష్,వేముల అశోక్,సంపంగి శ్రీను మరియు నవాబుపేట గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version