వాణిజ్య పంటల వైపురైతులు మొగ్గు చూపాలి.

వాణిజ్య పంటల వైపురైతులు మొగ్గు చూపాలి.

#రాయితీ డ్రిప్, మల్చింగ్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

#జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ.

నల్లబెల్లి , నేటి ధాత్రి:

మండల వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏరువాక సాగుబడి అవగాహన సదస్సు కార్యక్రమం మండలంలోని రాంపూర్ రైతు వేదికలో శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఏరువాక శాస్త్రవేత్త విజయభాస్కర్ , ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాసరావు హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వరి పంటలో సూడోమోనాస్ ట్రైకోడెర్మా ఉపయోగం గురించి రైతులకి వివరించారు అలాగే పత్తి వరి మొక్కజొన్న మిరప పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎరువుల వాడకం పురుగుమందుల వాడకం నారుమడి సస్యరక్షణ గురించి వివరించారు మారిన కాలానికి అనుగుణంగా పంట మార్పిడి పద్ధతులు చేపట్టాలని పాత పద్ధతులకి అనుగుణంగా రైతులు మారాలని కూరగాయలు పండ్ల ఆయిల్ ఫామ్ పంటల వైపు మొగ్గుచూపి రైతులు ఆర్థికంగా ఎదగాలని కోరారు ఆయిల్ ఫామ్ పంట ఒకసారి నాటితే 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని ఎకరానికి లక్ష నుండి లక్ష యాభై వేల నికర ఆదాయం వస్తుందని చీడపీడల బాధలు ఉండవని ప్రభుత్వమే రేటు నిర్ణయిస్తుంది కాబట్టి డిమాండ్ ఉన్న పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద డ్రిప్ సౌకర్యం 90 శాతం వరకు అలాగే మల్చింగ్ రాయితీ 50 శాతం వరకు ఉంది. హెక్టార్ కి 20,000 సబ్సిడీ ఉంది కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పలువురు రైతులకు వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రజిత , ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి ,వ్యవసాయ విస్తరణ అధికారి మహేందర్ ,రైతులు పెరుమాండ్ల బాబు, పొనుగోటి దేవన్న ,పోలేపల్లి నరసింహారెడ్డి, బచ్చు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

పొంగిన వాగులు.. మునిగిన పొలాలు….

పొంగిన వాగులు.. మునిగిన పొలాలు….

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-34.wav?_=1

వరుణుడి జాడ కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు జహీరాబాద్ నియోజకవర్గం పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా చోట్ల రైతులు పత్తి, సోయాబీన్, పంటల విత్తనాలను వేశారు.రైతులు వర్షం కోసం ఎదురు చూస్తుండగా శుక్రవారం కురిసిన వర్షం ప్రాణం పోసింది.

Farmers

జహీరాబాద్:-

వారం రోజులుగా విపరీత మైన ఉష్ణోగ్రతలు నమోదైన వేళ వరుణదేవుడు కరుణించడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మండలంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి వర్షం భారీగా కురవడంతో రైతన్నల్లో ఆనందం వెల్లువెరిసింది. ఖరీఫ్లో పంటల సాగుకు అనుకూలంగా వర్షం కురిసిందని, పొలాలను దుక్కి చేసుకోవ డానికి అవకాశం ఏర్పడిందని రైతులు పేర్కొన్నారు. ఈ వేసివిలో భూగర్భ జలాలు అడుగంటి చాలా బోరుబావుల నుంచి నీరు రావడంలేదు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో బోరుబావులు రీచార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రైతులు అంటున్నారు. ఏది ఏమైనా ఖరీఫ్ ప్రారంభంలో వరుణ దేవుడు కరుణించడంతో రైతుల్లో సంతోషం కనిపిస్తోంది.

ఝరాసంగం:-

ఝరాసంగం మండలంలో శుక్రవారం సాయంత్రం
ఓ మోస్తరు వర్షం కురిసింది. ఓ వైపు ఎండ కొడుతుండగానే ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. రోజంతా తీవ్రమైన ఎండ,ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు సాయంత్రం చల్లని ఈదురుగాలులతో ఉపశమనం పొందారు.

కోహిర్:-

మండలంలోని ఆయా గ్రామాల్లో
మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. పది రోజులుగా వర్షాల జాడ లేక విత్తనాలు వేసిన రైతులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో వర్షం కురవడంతో విత్తనానికి, ప్రాణం పోసిందన్నారు.

న్యాల్కల్:-

మండలంలోని ఆయా గ్రామాల్లో
మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. పది రోజులుగా వర్షాల జాడ లేక విత్తనాలు వేసిన రైతులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో వర్షం కురవడంతో విత్తనానికి, మొలకలకు జీవం పోసినట్లయింది. ఆశించిన స్థాయిలో వర్షం కురవడంతో పలు గ్రామాల్లో రైతులు పత్తి విత్తనాలు మొలకలను ఇంటిల్లిపాదిగా పొలం బాట పట్టారు.

మొగుడంపల్లి:-

మండల వాసులు శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ఉపశమనం పొందారు. దాదాపు 7 గంటలకు పైగా 90 మి.మీ. వర్షం కురవడంతో ఖరీఫ్ పనులు ఊపందుకున్నాయి. వారం రోజుల నుంచి పత్తి విత్తనాలు విత్తుకున్న రైతులు ఈ వానతో ఊపిరి పీల్చుకున్నారు.

రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన..

రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారులు

రామడుగు, నేటిధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-31.wav?_=2

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఎన్ఎమ్ఎన్ఎఫ్ పథకంలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చొప్పదండి డివిజన్ ఏడిఏ ప్రియదర్శిని హాజరై రైతులకు సేంద్రియ సాగు గురించి సలహాలు సూచనలు తెలియజేశారు. ఆయిల్ ఫాం పంట సాగులో మెలకువలతో పాటు పంట సాగుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి హార్టికల్చర్ ఆఫీసర్ రోహిత్ రైతులకు వివరించారు. ఈకార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి త్రివేదిక, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

తీరునా మా గోస.

తీరునా మా గోస

పరకాల వ్యవసాయమార్కెట్ లో యూరియా కోసం పడిగాపులు

పరకాల నేటిధాత్రి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-9.wav?_=3

మేలో ప్రకృతి అనుకూలిస్తుందని భావించిన రైతులు పంటల సాగులపై ఆశలు పెంచుకున్నారు.జూన్ మొదటి వారంలో వర్షాలు కురుస్తాయని భావించిన రైతులకు నిరాశే మిగిలిందని చెప్పవచ్చు,పరకాల వ్యవసాయ మార్కెట్లో రైతులు తమ చెప్పులను క్యూలో పెట్టి యూరియా కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.ఈ సందర్బంగా పలువురు రైతులు,మహిళలు మాట్లాడుతూ పొలం పనులు వదులుకొని భార్యభర్తలం రోజంతా ఎదురుచూడాల్సి వస్తున్నదని,రోజంతా నిలబడితే రెండు యూరియా బస్తాలే ఇస్తున్నారని,పంటలు పెరిగే దశలో యూరియా వేయకపోతే దిగుబడి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కేసిఆర్ ప్రభుత్వం ఉన్న సమయంలో రైతులకు యూరియా కొరత ఉండేది కాదని అసలు యూరియా కోసం ఇలా లైన్ లలో ఎదురుచూసిన సందర్భాలు లేవన్నారు.

Agricultural Market.

యూరియాను రైతులకు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు.ప్రభుత్వం మరియు అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.

సహకార సంఘాలు రైతులకు మేలు.

సహకార సంఘాలు రైతులకు మేలు”

బాలానగర్/ నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో మండల సహకార కేంద్రంలో బుధవారం అంతర్జాతీయ సహకార దినోత్సవం -2025 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగిల్ విండో డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద రైతులు సహకార సంఘాలలో రుణాన్ని తీసుకొని ఉజ్వల భవిష్యత్తును పెంపొందించుకున్నారని, పేదల సంక్షేమానికి సహకార సంఘాలు కృషి చేస్తున్నయన్నారు. మధ్యతరగతి కుటుంబాల అభివృద్ధికి సహకార సంఘాలు సహకరిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘాల సభ్యులు పలువురు రైతులు పాల్గొన్నారు.

ఓవర్ లోడ్ విద్యుత్ సమస్యను పరిష్కరించిన.

ఓవర్ లోడ్ విద్యుత్ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

రాజినెల్లి గ్రామ రైతులు ఓవర్ లోడ్ విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్న విషయాన్ని మండల పార్టీ అధ్యక్షుడు నర్సింలు యాదవ్ మండల బీఆర్ఎస్ నాయకులు మ్యాతరి ఆనంద్ దృష్టికి తీసుకెళ్లడంతో వారు ఇదే విషయమై శాసనసభ్యులు కొనింటి మణిక్ రావు గారి దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరనికి చర్యలు తీసుకోవాలని అదేశించడంతో బుధవారం నాడు నూతన ట్రాన్స్ ఫార్మర్ బిగించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సాయన్న, ఈశ్వరప్ప పాటిల్, నర్సింలు, మధుకర్ ఫాస్టర్, మొహమ్మద్ వహబ్, మొహమ్మద్ ఫయాజ్, మొహమ్మద్ ముస్తఫా, లైన్ మెన్ మొహమ్మద్ ఇలియజ్, లడ్డు, ఎవన్, గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

వరండాలు, చెట్ల కింద పై చదువులు.

వరండాలు, చెట్ల కింద పై చదువులు
• ఆరు బయట వంట
• సరిపడ గదులు లేక ఇబ్బందులు..

నిజాంపేట: నేటి ధాత్రి

Principal Padma Reddy’s

ఆరు బయట చెట్ల కింద, వరండాలలో విద్యార్థుల చదువులు కొనసాగుతున్నాయి. ఈ మేరకు నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఆరు బయట చదువులు కొనసాగించలేమని విద్యార్థులు వాపోతున్నారు. సరైన గదులు లేక ఆరుబయటే వంట కూడా కొనసాగించడం జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆరు బయట వంటశాలకు విష సర్పాలు వస్తున్నాయని దీనిపై అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టి పాఠశాలకు అదనపు గదులతో పాటు కాంపౌండ్ వాల్ నిర్మించాలని వేడుకుంటున్నారు.

ప్రధానోపాధ్యాయులు పద్మా రెడ్డి వివరణ

పాఠశాలలో అదనపు గదులు లేక ఆరుబయటే చదువులు కొనసాగించడం వాస్తవమేనన్నారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి కూడా తీసుకోబోయినట్లు పేర్కొన్నారు.

కనిపించని నక్ష బాట.

కనిపించని నక్ష బాట.
– సమస్యలో పర్వేద- సంకేపల్లి మధ్య నక్షదారి.
– మా స్థలంలో వేశారు అంటే మా స్థలంలో వేశారు అని గొడవ.
– రైతులకు ఆగిపోయిన రాకపోకలు.
శంకర్ పల్లి, నేటిధాత్రి :
శంకర్పల్లి మండలం సంకేపల్లి గ్రామ పరిధిలో సరిహద్దు(పొలిమేర) దారి విషయంలో సంకేపల్లి గ్రామ రైతులు సమస్యను ఎదుర్కొంటున్నారు. తమ పొలాలకి వెళ్లడానికి దారి లేక అయోమయంలో పడ్డారు. పూర్తి వివరాలు పరిశీలిస్తే సంకేపల్లి పర్వేద మధ్యలో సరిహద్దు దారి గత 25 సంవత్సరాలుగా ఉన్నది. ఆ దారి నుంచే రైతులు రాకపోకలు చేస్తున్నారు తమ పొలానికి కావాల్సిన ఎరువులు, పండిన పంటలను తీసుకెళ్లడం ఇదే దారి వెంట కొనసాగిస్తున్నారు. అయితే రెండు సంవత్సరాల క్రితం పొలిమేర దారి వెంట పొలం ఉన్న రైతులు ప్రభుత్వ సర్వేయర్ తో సర్వే చేయించగా పర్వేద గ్రామానికి సంబంధించిన రైతు పొలంలో నుంచి రోడ్డు వేశారు అని సర్వేయర్ రిపోర్ట్ ఇచ్చాడు అని ఆయన తన పొలంలో నుంచి వేసిన రోడ్డు ను తవ్వేశారు. అయితే సంకేపల్లి గ్రామానికి చెందిన రైతులు మాత్రం గత 25, 30 సంవత్సరాల నుంచి ఇదే రోడ్డుపై మేము మా పొలాలకు వెళ్తున్నాము అని ఇప్పుడు రోడ్డును తవ్వి వేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని అన్నారు. అయితే పర్వేద రైతులు మాత్రం రోడ్డు మా పొలంలో వేశారు అని సర్వేయర్ చెప్పిన దాని ప్రకారం అయితే రోడ్డు సంకేపల్లి గ్రామస్తుల పొలంలో నుంచి వెళ్తుంది అని అంటున్నారు. ఏది ఏమైనా అధికారులు తొందరగా స్పందించి సమస్యను పరిష్కరించాలి అని రైతులు కోరుకుంటున్నారు. పంటల కాలం కాబట్టి తప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి కాబట్టి అధికారులు స్పందించాలి అని రైతులు కోరుకుంటున్నారు.

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) స్థానం లో పత్తి కొనుగోలు కు పీడీపీఎస్ విధానం అమలు విరమించుకోవాలి.

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) స్థానం లో పత్తి కొనుగోలు కు పీడీపీఎస్ విధానం అమలు విరమించుకోవాలి.

తెలంగాణ రైతు సంఘం డిమాండ్.

కారేపల్లి: నేటి ధాత్రి

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పత్తి మద్దతు ధర కు తెలంగాణ రాష్ట్రం లో పత్తిని కొనుగోలు చేస్తున్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ని ఆ బాధ్యతల నుంచి తప్పించే ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలకాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. గురువారం కారేపల్లి మండలం లో పాట్టిమీద గుంపు బాజ్జుమల్లాయిగూడెం లలో పత్తి పంట పరిశీలన చేశారు. రైతుల నుంచి కౌలు రేట్లు వివిధ రకాల పంటల సాగు పరిస్థితి మిర్చి సాగు విస్తీర్ణం పై రైతుల నుంచి వివరాలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మద్దతు ధర కు పత్తి కొనుగోలు చేయకుండా ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీం ( పీడీపీఎస్) ను రాష్ట్రం లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది అని తెలంగాణ రాష్ట్రం లో అత్యధికంగా పత్తి పండించే ఆదిలాబాద్ జిల్లాలో ఈ వ్యవసాయ సీజన్ లో అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది అని పత్తి రైతులకు తీవ్రంగా నష్టం వాటిలే అవకాశం ఉందని రాంబాబు అన్నారు.
ఎంఎస్ పి విధానం లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి పంటలు కొనుగోలు చేస్తుంది పీడీపీఎస్ విధానం వల్ల రైతు తన పత్తి పంటను బహిరంగ మార్కెట్లో విక్రయించిన తర్వాత మార్కెట్ ధర కన్నా ఎం.ఎస్.పి ఎంత తక్కువ ఉంటే ఆ మొత్తాన్ని నేరుగా డిబిటి (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) పద్ధతుల్లో రైతు ఖాతాల్లో జమ చేస్తారు అంటే ప్రభుత్వం రైతు దగ్గర పంటను కొనదు కానీ మార్కెట్లో రైతు నష్టపోయిన మొత్తాన్ని సర్దుబాటు చేస్తుందని నూతన పథకాన్ని ప్రవేశపెట్టారు గత వానాకాలం సీజన్లో 44 లక్షల ఎకరాల్లో 20 లక్షల మంది పైగా రైతులు పత్తి పంట సాగు చశారు ఇంత మంది రైతులకు బహిరంగ మార్కెట్లో విక్రయించిన తర్వాత వ్యత్యాసం ధర నగదు బదిలీ చేయడం సాధ్యం కాదు మధ్యప్రదేశ్ లో 2016-17 లోనే 8 ప్రధాన పంటలకు పీడీపీఎస్ విధానాన్ని అమలు చేసి రైతులకు వ్యత్యాసాలు నిర్ధారించడంలో లోపాలు వ్యత్యాసపు ధర చెల్లింపులు ఆలస్యం మార్కెట్ ధరలు తేడాలు నిజమైన రైతులకు కాకుండా దళారులకు చెల్లింపులు వంటివి చోటు చేసుకోవటం తో మరుసటి సంవత్సరమై ఆ పథకాన్ని నిలిపివేశారని ఇప్పుడు తెలంగాణలో పీడీపీఎస్ ప్రయోగించడం పత్తి రైతులను నాశనం చేస్తుందని వెంటనే ఈప ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మేరుగు సత్యనారాయణ తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ సిఐటియు జిల్లా నాయకులు కుందనపల్లి నరేంద్ర రైతు సంఘం మండల కార్యదర్శి వజ్జా రామారావు బాదావత్ శ్రీనివాసరావు మన్నెం బ్రహ్మయ్య వడ్లమూడి మధు యనమద్ది రామకృష్ణ మహిళా రైతులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

‘ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి’

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ మండలంలో వన మహోత్సవం కార్యక్రమంలో నాయబ్ తహశీల్దార్ వరప్రసాద్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడాలని, మొక్కల పెంపకంతో మానవజాతి మనుగడ సాధ్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది

 

The state government will stand by the fishermen.

*చేపల పెంపకంలో మత్స్యకారులు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి*

*రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్*

*సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి )*

The state government will stand by the fishermen.

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు మత్స్యకారుల రైతు వేదికలో నేషనల్ అగ్రో ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మత్స్య రైతుల దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఉత్తమ ప్రతిభ కనబరిచిన సొసైటీ సభ్యులకు ప్రశంసా పత్రాలు అందజేసి సన్మానించారు..అనంతరం చేపల స్టాల్స్ ను సందర్శించారు. వారు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మత్స్య సంపద పెంపొందించడానికి తన వంతు ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు..మొన్నటి రోజూ మంత్రీ శ్రీహరి కరీంనగర్ వచిన్నపడు వారితో చేపల పెంపకం,మత్స్యకారుల గురించి మాట్లాడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చెరువుల్లోకి సకాలంలో చేప పిల్లలు పంపిణీ చేస్తుందనీ తెలిపారు.. బలహీన వర్గాల ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందజేస్తుందని అన్నారు.గతంలో మిడ్ మానేరులో చేపలను వదలడం జరిగిందని, మన ప్రాంతంలో మల్కపేట్ రిజర్వాయర్ కుడా అందుబాటులోకి వచ్చిందని వాటిలో కూడ చేపల పెంపకం ఏర్పాట్లు విధానం పరిశీలించాలన్నారు. గతంలో తెగిపోయిన చెరువులు మరమ్మత్తులు పూర్తి చేశామని అన్నారు.. ఇంకా ఎక్కడ చెరువులు మరమ్మత్తులు ఉంటే చేపడతానని తెలిపారు… ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలల్లోనే కథాలపూర్ మండలం లోని తెగిపోయిన చెరువులను మరమ్మత్తులు చేసినట్లు తెలిపారు. మల్కపేట రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చెసి ఎల్లారెడ్డిపేట వరకు రైతులకు సాగు నీరు అందించమని తెలిపారు.గతంలో మిడ్ మానేరు డ్యాంలో కేజీ కల్చర్ విధానంలో చేపల పెంపకం కోసం ముంపు గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించమని కేజీ కల్చర్ చేపల పెంపకం చేపట్టడం కోసం ముందుకు రావాలన్నారు.చేపల పెంపకంలో అధునాతన సాంకేతిను అందిపుచ్చు కోవాలన్నారు… కేజీ కల్చర్ విధానంలో చేపల పెంపకానికి ముందుకు వస్తె రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు అందజేస్తామని తెలిపారు..
దేశంలో మత్స్య సంపద పెరగాలని చేపలు ఆరోగ్యానికి మంచిదనీ ,ప్రభుత్వం మత్స్యకారులకు అనేక రకాలుగా ప్రోత్సాహకాలు అందజేస్తుందని తెలిపారు.గత ప్రభుత్వం పెట్టిన ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయకుండా వాటిని కొనసాగిస్తూ నూతన పథకాలను అమలు చేస్తున్నామన్నారు..రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు మహిళ తల్లులకు ఉచిత బస్సు ప్రయాణం,500 కు సిలిండర్,10 లక్షల అరోగ్య శ్రీ,పది సంవత్సరాలుగా పేద ప్రజలు ఎదురు చూస్తున్నా ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు తెలిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప, జిల్లా ఫిషరీస్ చైర్మన్ చొప్పరి రామచంద్రం, డి ఏ వో అఫ్జల్ బేగం, మల్లికార్జున్, పి కిషోర్, నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ సునీల్ కుమార్,, అడ్వైజర్ విద్యాసాగర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

పచ్చదనమే మన భవిత….

*పచ్చదనమే మన భవిత….*

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

సంగారెడ్డి: జహీరాబాద్ పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్లో వనమహోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య మహిళా మండలి పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించింది. “మానవ సేవయే మాధవ సేవ” నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు బెజుగం రాజయ్య, మహిళా మండలి అధ్యక్షురాలు కల్పన తదితరులు పాల్గొన్నారు.

రైతు బజార్ ను వినియోగించుకోవాలి

రైతు బజార్ ను వినియోగించుకోవాలి

జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం

కలెక్టర్ ఆదేశాలతో కూరగాయల వ్యాపారులకు షెడ్ల నిర్మాణం

కూరగాయలు, మాంసం, చేపల షాపులు తరలింపు

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ రైతు బజార్ ను కూరగాయలు, మాంసం, చేపల విక్రయదారులు వినియోగించు కోవాలని బుధవారం జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కూరగాయల వ్యాపారులను బతుకమ్మ ఘాట్ రైతు బజార్ లోకి తరలించేందుకు అవసరమైన షెడ్ల నిర్మాణం చేస్తున్నామని, అదేవిధంగా ఈ రైతు బజార్ లోకి మటన్ షాపులు, మాంసం షాప్ లు, చేపల విక్రయం షాపులు సైతం తరలించాలని, ఎవరు కూడా రోడ్డు పక్కన అమ్మకూడదని అన్నారు.బతుకమ్మ ఘాట్ రైతు బజార్ ను జిల్లాలోని వినియోగదారులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి వాడుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు…

ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు…

నేటి ధాత్రి -గార్ల :-

వాణిజ్య పంటలో అధిక లాభాలు వచ్చే ఆయిల్ ఫామ్ పంటలను రైతులు సాగు చేసి అధిక లాభాలు పొందాలని గార్ల వ్యవసాయ అధికారి కావటి రామారావు తెలిపారు.శనివారం మండల పరిధిలోని బుద్దారం గ్రామంలో డోర్నకల్ ఉద్వాన వన అధికారి శాంతి ప్రియ,ఏఈఓ రాజ్యలక్ష్మి లతో కలిసి ఆయిల్ ఫామ్ పంట క్షేత్ర సందర్శన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితిలు ఉన్నాయన్నారు.ఆయిల్ ఫామ్ పంట దిగుబడి వచ్చేంతవరకు అంతర పంటల సాగుతో రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు.వరి,పత్తి పంటలతో పోల్చితే రైతులు తక్కువ పెట్టుబడి,తక్కువ శ్రమతో మంచి లాభాలు సాధించే అవకాశం ఉంటుందన్నారు.ఆయిల్ పామ్ మొక్కలను ఒకసారి నాటితే 30 సంవత్సరాల వరకు దిగుబడి ఇస్తాయని, నాలుగవ సంవత్సరం నుంచి రైతుకు పంట చేతికి వస్తుందని అన్నారు.రైతులు ప్రతి ఏటా ఒకే పంట కాకుండా పంట మార్పిడి విధానం అవలంబించుకుంటూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను,నికర ఆదాయం లభించే పంటలను సాగు చేయడం ద్వారా సుస్థిర ఆదాయం పొందడమే కాకుండా భూసారం కాపాడుకోవచ్చు అన్నారు.ప్రస్తుతం మార్కెట్లో ఆయిల్ ఫామ్ కు మంచి డిమాండ్ తో పాటు రవాణా, మార్కెట్,ప్రాసెసింగ్ సౌకర్యంతో పాటు గిట్టుబాటు ధర ఉందని తెలిపారు.ఆయిల్ ఫామ్ పంటలో అంతర పంటలను నాలుగు సంవత్సరాల వరకు వేరుశనగ, మొక్కజొన్న,కూరగాయలు మరియు నాలుగు సంవత్సరాల తర్వాత పైనాపిల్,కోకో వంటి పంటలను సాగు చేసుకుని అధిక ఆదాయం పొందవచ్చు అని సూచించారు.ఆయిల్ ఫామ్ పంట సాగుకు చీడపీడల బెడద ఉండదని, కోతుల సమస్య రాదని,అకాల వర్షాలు,వడగండ్ల వాన ఇబ్బందులు ఉండవని అన్నారు.ఎకరా మొక్కలకు 11600, అంతర పంటలకు ప్రతి సంవత్సరంకు 4200 చొప్పున నాలుగు సంవత్సరాలకు 16,800, బిందు సేద్యానికి 22518 మొత్తము కలిపి 50 వేల 918 రూపాయలు రాయితీ పొందవచ్చు అని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

రైతులు ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

రైతులు ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

పట్టా పాసు పుస్తకం ఉన్న రైతులు తప్పనిసరిగా ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఝరాసంగం మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశం శుక్రవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం 11 నెంబర్ల విశిష్ట సంఖ్య ఉన్న ఫార్మసీ రిజిస్ట్రేషన్ మండల వ్యవసాయ శాఖ అధికారుల వద్ద చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు మండల వ్యవసాయ శాఖ అధికారులు సంప్రదించాలని సూచించారు. వ్యవసాయ విత్తనాల అధికారులను సంప్రదించగలరని కోరారు.

అల్లం పంట పైన అవగాహన సదస్సు.

అల్లం పంట పైన అవగాహన సదస్సు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ,కోహిర్ మండలం,పిచేర్యాగడి గ్రామంలోనీ రైతు వేదికలో ఉద్యాన శాఖ,కొహీర్ మండల్ ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి సునీత ఆధ్వర్యంలో, రైతులకు అల్లం పంట సాగు పై అవగాహన కార్యక్రమం జరిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యాన పంటల మీద ,ప్రభుత్వం ఇచ్చే రాయితీల మీద ,అవగాహన కలిపించడం జరిగింది.
మామిడి, జామ, బొప్పాయ, అరటి, అల్లం, వెదురు, తదితర పంటల మీద ఉద్యాన శాఖ సబ్సిడీ అందిస్తుందని తెలిపారు.అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తుందని , ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు ఆర్జించవచ్చని ,కోహిర్ ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి సునీత అన్నారు.ఈ సందర్భంగా ఉద్యాన అధికారి మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు చేయాలనుకునే రైతులకు మొక్కలను 90 శాతం రాయితీ, డ్రీప్ ఏర్పాటుకు 80 శాతం నుంచి వంద శాతం రాయితీ వస్తుందన్నారు. పంటను కంపెనీయే కొంటుందని, దీని కోసం కోహిర్ మండల్ లోనే ఆయిల్ పామ్ గెలల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారని తెలిపారు. అదేవిధంగా సీనియర్ సైంటిస్టులు మాట్లాడుతూ , కోహిర్ ప్రాంతం ముఖ్యంగా అల్లం మరియు ఆలుగడ్డ జామ సాగులో ప్రసిద్ధి చెందిందని తెలిపారు.అల్లం సాగులో ఎక్కువగా వచ్చే వ్యాధులకు సంబంధించిన నివారణను మరియు ఆ తెగుళ్లను ఎలా ఎదుర్కోవాలో వారు చాలా చక్కగా రైతులకు వివరించడం జరిగిందని రైతులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈవో సవిత, సంగారెడ్డి డిహెచ్ఎస్ఓ సోమేశ్వరరావు, డిడిఎస్, కెవికె సీనియర్ సైంటిస్ట్ వరప్రసాద్, శైలజ, నేటాఫిన్ సౌత్ ఇండియా హెడ్ సుబ్బారావు, ఉద్యానవన శాఖ అధికారి సునీత, మండల వ్యవసాయ అధికారి వినోద్, వ్యవసాయ విస్తరణ అధికారి సవిత, ఆయిల్ ఫామ్ ఆఫీసర్ రాజేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ అమృత వీరారెడ్డి, అనంతరం, చంద్రశేఖర్, గ్రామ మైనార్టీ చైర్మన్ జహీరుద్దీన్, రైతులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

రైతులు ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

రైతులు ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

పట్టా పాసు పుస్తకం ఉన్న రైతులు తప్పనిసరిగా ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఝరాసంగం మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశం శుక్రవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం 11 నెంబర్ల విశిష్ట సంఖ్య ఉన్న ఫార్మసీ రిజిస్ట్రేషన్ మండల వ్యవసాయ శాఖ అధికారుల వద్ద చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు మండల వ్యవసాయ శాఖ అధికారులు సంప్రదించాలని సూచించారు. వ్యవసాయ విత్తనాల అధికారులను సంప్రదించగలరని కోరారు.

గుళికల యూరియా వద్దు నానో యూరియా ముద్దు.

గుళికల యూరియా వద్దు నానో యూరియా ముద్దు

పి హరి ప్రసాద్ బాబు.
గీసుగొండ మండల వ్యవసాయ అధికారి.

కాశిబుగ్గ నేటిధాత్రి.

 

 

 

 

గీసుగొండ మండలంలో 14,000 ఎకరాలకు పైగా సాగవుతున్న పత్తి పంటకు వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫారసు చేసిన 135 కిలోల యూరియా మోతాదును 4 భాగాలు చేసి వేసుకోవాలని,మొదటి 5 రోజుల్లో 25%,తర్వాత 20-25 రోజుల వ్యవధిలో,మూడు సార్లు సమాన మోతాదులో, మిగతా 75% యూరియా వేసుకోవాలి.అలాగే వరి పంటకైతే 96 కిలోలు మూడు భాగాలు చేసుకొని వేసుకోవాలి.వరి నాటు వేసిన 15 రోజులకు 30 కిలోలు,30 రోజులకు 35 కిలోలు,చిరు పొట్ట దశలో 31 కిలోలు వాడాలని తెలిపారు.
పైన తెలిపిన యూరియాను గుళికల రూపంలో (45 కిలోల బ్యాగ్స్) వాడటం తగ్గించి, ఇటీవల మనకు అందుబాటులోకి వచ్చిన నానో ప్లస్ ద్రవరూప యూరియాను ఒక అర లీటర్ ఒక ఎకరానికి నేరుగా స్ప్రేయర్/డ్రోన్ తో గాని పిచికారి చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి విజ్ఞప్తి చేయడం జరిగింది.ఎందుకంటే నానో ప్లస్ ద్రవ రూప యూరియాను వాడటం వలన చాలా లాభాలు కలిగి ఉన్నాయి.
⏩సాధారణ యూరియా తో గ్రీన్ హౌస్ వాయువు(నైట్రస్ ఆక్సైడ్) విడుదలై భూమి వేడెక్కడమే కాక వర్షపు నీటితో కలిసి జల కాలుష్యం కు కూడా జరిగి పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుంది.అదే నానో యూరియా వాడితే 40% వరకు వాతావరణ,నీటి కాలుష్యం తగ్గించవచ్చు.
⏩ వరి ఆకుల పైన ఈ ద్రవరూప యూరియా వెంటనే పూర్తిగా వ్యాప్తి అయ్యి, అత్యంత సూక్ష్మ రూపంలో ఉన్న నత్రజని వేగంగా గ్రహించబడి,వినియోగ సామర్థ్యం (80-90%) అత్యధికంగా ఉండి,మొక్క ఆరోగ్యవంతముగా పెరుగుదల ఉండి,సరియైన నాణ్యమైన పంట దిగుబడులు వస్తాయని తెలిపారు.(అదే 45kg ల యూరియా బ్యాగ్ వేస్తే 40% మాత్రమే మొక్కకు వేర్ల ద్వారా చేరుతుందని ఇక్కడ రైతులు గమనించాలని కోరారు).
⏩నానో ప్లస్ ద్రవరూప యూరియా వాడడం వల్ల నేల స్వభావం,రసాయన-జీవ వాతావరణం,మిత్ర కీటకాలు వృద్ధి చెందడం పై ఏవిధమైన చెడు ప్రభావం ఉండదు.
⏩నత్రజని మొక్క వేళ్ళకు అందకుండా నేల లోపలికి ఇంకిపోయే నష్టం ఉండదు.
⏩ఇట్టి నానో ప్లస్ ద్రవరూప యూరియాను పై రెండు పంటలేకాక మొక్కజొన్న , ఎండుమిరప, పప్పు దినుసులు & ఇతర అన్ని పంటల పైన పిచికారి చేసుకొనవచ్చు అని అన్నారు.

కాబట్టి, పై అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రైతులు అవసరం మేరకే యూరియాను మరియు ఇతర రసాయన ఎరువులను వేసుకోవాలి. పర్యావరణాన్ని, జలాశయాలను విషపూరితము చేస్తున్న గుళికల రూపంలోని యూరియా వాడకం తగ్గించి నానో సాంకేతిక పరిజ్ఞానం తో రూపొందించిన యూరియాను విరివిగా వాడాలని కోరారు.
శాస్త్రవేత్తలు,వ్యవసాయ అధికారులు పైన చేప్పిన సూచనలను రైతుసోదరులు గమనించి,అర్థం చేసుకొని, సహకరించి పాటించవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము.

పి.హరి ప్రసాద్ బాబు.
గీసుగొండ మండల వ్యవసాయ అధికారి

ఎరువుల అమ్మకాల్లో జాగ్రత్తలు పాటించాలి.

ఎరువుల అమ్మకాల్లో జాగ్రత్తలు పాటించాలి.

పి హరి ప్రసాద్ బాబు.
గీసుగొండ మండల వ్యవసాయ అధికారి.

కాశిబుగ్గ నేటిధాత్రి

 

 

 

 

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కొనాయమాకుల కేంద్రంగా శనివారం నాడు రైతు వేదికలో ఈ ఖరీఫ్ సీజన్లో డీలర్లు తీసుకోవలసిన జాగ్రత్తల పై మండల వ్యవసాయ అధికారి పి హరి ప్రసాద్ బాబు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.మండలంలో ఉన్న 28 మంది డీలర్లు ఈ అవగాహన సదస్సుకు హాజరైయ్యారు.డీలర్లను ఉద్దేశించి మండల వ్యవసాయ అధికారి పి.హరి ప్రసాద్ బాబు మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎరువులు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలన్నారు.రైతులకు అమ్మిన ఎరువుల బస్తాల వివరాలు రిజిస్టర్ లో పొందుపరచాలని,రైతుకు ఉన్న వ్యవసాయ భూమికి సరిపడా మాత్రమే విడతల వారీగా పంపిణీ చేయాలని సూచించారు.సీజన్ మొత్తానికి ఒకేసారి కొనుగోలు చేసుకోకుండా అమ్మకం జరిపేటప్పుడు రైతు వేసే పంట వివరాలు తెలుసుకొని ఆ నెలకు సరిపడా మాత్రమే తీసుకునేటట్లుగా ఒప్పించాలన్నారు.నానో యూరియాను,నానో డీ.ఏ.పీ ని వాడే విధంగా రైతులను ప్రోత్సహించాలని,వ్యవసాయ విస్తరణ అధికారులు కూడా గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భంగా ఈ విషయంపై రైతులకు అవగాహన కలిగిస్తున్నారని,అందరం కలిసి నానో ఉత్పత్తులను రైతులు వాడే విధంగా చూడాలని కోరారు. గ్రామాల్లో గ్లైఫోసేట్ అక్రమ మార్గాల్లో నిలువచేసిన,అమ్మిన అట్టి సమాచారాన్ని వెంటనే వ్యవసాయ అధికారులకు అందజేసినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.డీలర్లు ఎవరు కూడా అనుమతి లేకుండా గ్లైఫోసేట్ కొనడం గాని, అమ్మడం గాని చేయకూడదని హెచ్చరించారు.డీలర్లు ఎప్పటికప్పుడు తన దగ్గర ఉన్న పురుగుమందుల స్టాకులను పరిశీలిస్తూ వాటి పరిమిత కాలం చెల్లని స్టాక్ లను వెంటనే వేరు చేసి ప్రత్యేకమైన బాక్సులో వాటిని ఉంచి అట్టి బాక్సు పై డేట్ ఎక్స్పైర్ స్టాక్ అని రాసి రోజు అమ్మే స్టాక్ కు దూరంగా పెట్టాలని సూచించారు.అట్టి స్టాకు వివరాలను డేట్ ఎక్స్పైర్ స్టాక్ రిజిస్టర్ లో నమోదు చేసి వ్యవసాయ అధికారి తో సర్టిఫై చేయించుకోవాలని ఆదేశించారు.అనంతరం మండల తాహసిల్దారు రియాజుద్దీన్ మాట్లాడుతూ డీలర్లు జిల్లా అధికారుల ఆదేశానుసారం నడుచుకోవాలని,రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎరువుల అమ్మకాలు చేయాలని,ఈ సీజన్లో వ్యవసాయ శాఖ అధికారులతో పాటు తనిఖీలు చేపడతామని అక్రమాలకు పాల్పడినట్లు తమ దృష్టికి వస్తే చట్టప్రకారం చర్యలుఉంటాయన్నారు. ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో ఎరువుల షాపు డీలర్లు పాల్గొన్నారు.

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.

రైతు బందవుడు సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

◆ – 9 రోజుల్లో 9 వెయ్యిల కోట్లు విడుదల చేయడంపై రైతుల్లో హర్షం

◆ – రైతుల సంక్షేమం కోసం కృషి చేసేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే

◆ – బలహీనమైన నాయకత్వంతోనే పార్టీలో సీనియర్లకు గుర్తింపు లేదు

◆ -పార్టీకి వ్యతిరేకంగా పని చేసినవారికి పెద్దపీట వేయడం దేనికి సంకేతం ?

◆ – మండల అధ్యక్షులుగా సీనియర్ నాయకులకు అవకాశం ఇవ్వాలి

◆ – ప్రస్తుతం ఉన్న మండల అధ్యక్షులకు జిల్లా పార్టీలో భాగస్వామ్యం చెయ్యాలి

◆- సీనియారిటీ, సమర్థతకు పెద్దపీట వేసి నూతన అధ్యక్షులను ఎంపిక చెయ్యాలి

◆- 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీని ఇప్పటినుంచే ప్రక్షాళన చెయ్యాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

 

రాష్ట్ర, దేశ చరిత్రలో రైతుల కోసం ఏకకాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా 9 రోజుల్లో 9 వెయ్యిల కోట్లు రైతు పంట పెట్టుబడి సాయంగా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని సంగరెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ముల్తానీ అన్నారు.

గురువారం నాడు ఝరసంగం మండలంలోని మన్నూర్ గ్రామంలో నియోజకవర్గ ముఖ్య కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి రైతులు పెద్దఎత్తున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మండల ఎంపిపి దేవదాస్ మాట్లాడుతూ బలహీనమైన నాయకత్వం వల్లే కాంగ్రెస్ పార్టీలో నైరాశ్యం నెలకొందని.

మండల అధ్యక్షులను మార్చి నూతన నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని, అప్పుడే కాంగ్రెస్ పార్టీ తిరిగి జహీరాబాద్ అసెంబ్లీ సీటు గెలవగలదని, గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించడానికి పెద్ద నాయకుల వద్దకు వెళితే కనీసం పాలకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్లమెంట్ ఎస్టీ సెల్ కో ఆర్డినేటర్ ఛానోత్ రాజు నాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమపై ఎన్నో ఆక్రమ కేసులు నమోదు చేశారని, ఇప్పటికైనా అధినాయకత్వం సీనియర్లను గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

సీనియర్ నాయకులు కవేలి కృష్ణ కోహిర్ మండల ఎస్టీ సెల అధ్యక్షుడు వినోద్ రాథోడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారిని విస్మరించి పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారికి అందలం ఎక్కించడం కరెక్ట్ కాదని, రాబోయే రోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సవివరంగా కెలపాలని, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు, సన్నబియ్యం, నూతన రేషన్ కార్డుల మంజూరు, కళ్మాణాలక్ష్మి, షాది ముబారక్, రైబుభరోసా, రైతు భీమా, ఆడపిల్లలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు లాంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయలను ప్రజలకు తెలియజేద్దామని అన్నారు.

 

 

Farmers

 

కార్యక్రమంలో జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ముల్తానీ, మాజీ ఎంపీపీ దేవదాస్, జహీరాబాద్ పార్లమెంట్ ఎస్టీ సెల్ కో ఆర్డినెంటర్ థానోత్ రాజు నాయర్, మాజీ సర్పంచ్ మహేబూబ్ పటేల్, మాజీ ఎంపిటిసి దుర్గాప్రసాద్, మొహమ్మద్ శుకుర్, కృష్ణ, కోహిర్ మండల ఎస్టీ సెల్ రాథోడ్ వినోద్ కుమార్, సీనియర్ నాయకులు రవేలి కృష్ణ, మొహమ్మద్ యూనుస్ హత్నూర్, మొహమ్మద్ మస్తాన్, ముహమ్మద్ చష్మోద్దీన్ శేకపూర్, సుధాకర్ రెడ్డి.

భాస్కర్ రెడ్డి, నవాజ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి వెంకటా పూర్, రాజ కుడు సంగం, నగేష్ బొపన్ పల్లి, హత్నూర్ వెంకట్ రెడ్డి వెంకట్ హాద్నూరు, సంగన్న ఝారసంగం, మచ్నూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ రాపీయెన్షన్, విద్య సాగర్, ప్రశాంత్, గుండప్ప పటేల్, ఆయా మండలాల మాజీ సర్పంచులు. మాజీ ఎంపిటిసిలు, సీనియర్ కార్యర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version