*చేపల పెంపకంలో మత్స్యకారులు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి*
*రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్*
*సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి )*
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు మత్స్యకారుల రైతు వేదికలో నేషనల్ అగ్రో ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మత్స్య రైతుల దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఉత్తమ ప్రతిభ కనబరిచిన సొసైటీ సభ్యులకు ప్రశంసా పత్రాలు అందజేసి సన్మానించారు..అనంతరం చేపల స్టాల్స్ ను సందర్శించారు. వారు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మత్స్య సంపద పెంపొందించడానికి తన వంతు ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు..మొన్నటి రోజూ మంత్రీ శ్రీహరి కరీంనగర్ వచిన్నపడు వారితో చేపల పెంపకం,మత్స్యకారుల గురించి మాట్లాడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చెరువుల్లోకి సకాలంలో చేప పిల్లలు పంపిణీ చేస్తుందనీ తెలిపారు.. బలహీన వర్గాల ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందజేస్తుందని అన్నారు.గతంలో మిడ్ మానేరులో చేపలను వదలడం జరిగిందని, మన ప్రాంతంలో మల్కపేట్ రిజర్వాయర్ కుడా అందుబాటులోకి వచ్చిందని వాటిలో కూడ చేపల పెంపకం ఏర్పాట్లు విధానం పరిశీలించాలన్నారు. గతంలో తెగిపోయిన చెరువులు మరమ్మత్తులు పూర్తి చేశామని అన్నారు.. ఇంకా ఎక్కడ చెరువులు మరమ్మత్తులు ఉంటే చేపడతానని తెలిపారు… ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలల్లోనే కథాలపూర్ మండలం లోని తెగిపోయిన చెరువులను మరమ్మత్తులు చేసినట్లు తెలిపారు. మల్కపేట రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చెసి ఎల్లారెడ్డిపేట వరకు రైతులకు సాగు నీరు అందించమని తెలిపారు.గతంలో మిడ్ మానేరు డ్యాంలో కేజీ కల్చర్ విధానంలో చేపల పెంపకం కోసం ముంపు గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించమని కేజీ కల్చర్ చేపల పెంపకం చేపట్టడం కోసం ముందుకు రావాలన్నారు.చేపల పెంపకంలో అధునాతన సాంకేతిను అందిపుచ్చు కోవాలన్నారు… కేజీ కల్చర్ విధానంలో చేపల పెంపకానికి ముందుకు వస్తె రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు అందజేస్తామని తెలిపారు..
దేశంలో మత్స్య సంపద పెరగాలని చేపలు ఆరోగ్యానికి మంచిదనీ ,ప్రభుత్వం మత్స్యకారులకు అనేక రకాలుగా ప్రోత్సాహకాలు అందజేస్తుందని తెలిపారు.గత ప్రభుత్వం పెట్టిన ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయకుండా వాటిని కొనసాగిస్తూ నూతన పథకాలను అమలు చేస్తున్నామన్నారు..రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు మహిళ తల్లులకు ఉచిత బస్సు ప్రయాణం,500 కు సిలిండర్,10 లక్షల అరోగ్య శ్రీ,పది సంవత్సరాలుగా పేద ప్రజలు ఎదురు చూస్తున్నా ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు తెలిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప, జిల్లా ఫిషరీస్ చైర్మన్ చొప్పరి రామచంద్రం, డి ఏ వో అఫ్జల్ బేగం, మల్లికార్జున్, పి కిషోర్, నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ సునీల్ కుమార్,, అడ్వైజర్ విద్యాసాగర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.