ఓవర్ లోడ్ విద్యుత్ సమస్యను పరిష్కరించిన.

ఓవర్ లోడ్ విద్యుత్ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

రాజినెల్లి గ్రామ రైతులు ఓవర్ లోడ్ విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్న విషయాన్ని మండల పార్టీ అధ్యక్షుడు నర్సింలు యాదవ్ మండల బీఆర్ఎస్ నాయకులు మ్యాతరి ఆనంద్ దృష్టికి తీసుకెళ్లడంతో వారు ఇదే విషయమై శాసనసభ్యులు కొనింటి మణిక్ రావు గారి దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరనికి చర్యలు తీసుకోవాలని అదేశించడంతో బుధవారం నాడు నూతన ట్రాన్స్ ఫార్మర్ బిగించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సాయన్న, ఈశ్వరప్ప పాటిల్, నర్సింలు, మధుకర్ ఫాస్టర్, మొహమ్మద్ వహబ్, మొహమ్మద్ ఫయాజ్, మొహమ్మద్ ముస్తఫా, లైన్ మెన్ మొహమ్మద్ ఇలియజ్, లడ్డు, ఎవన్, గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version