సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.

రైతు బందవుడు సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

◆ – 9 రోజుల్లో 9 వెయ్యిల కోట్లు విడుదల చేయడంపై రైతుల్లో హర్షం

◆ – రైతుల సంక్షేమం కోసం కృషి చేసేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే

◆ – బలహీనమైన నాయకత్వంతోనే పార్టీలో సీనియర్లకు గుర్తింపు లేదు

◆ -పార్టీకి వ్యతిరేకంగా పని చేసినవారికి పెద్దపీట వేయడం దేనికి సంకేతం ?

◆ – మండల అధ్యక్షులుగా సీనియర్ నాయకులకు అవకాశం ఇవ్వాలి

◆ – ప్రస్తుతం ఉన్న మండల అధ్యక్షులకు జిల్లా పార్టీలో భాగస్వామ్యం చెయ్యాలి

◆- సీనియారిటీ, సమర్థతకు పెద్దపీట వేసి నూతన అధ్యక్షులను ఎంపిక చెయ్యాలి

◆- 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీని ఇప్పటినుంచే ప్రక్షాళన చెయ్యాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

 

రాష్ట్ర, దేశ చరిత్రలో రైతుల కోసం ఏకకాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా 9 రోజుల్లో 9 వెయ్యిల కోట్లు రైతు పంట పెట్టుబడి సాయంగా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని సంగరెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ముల్తానీ అన్నారు.

గురువారం నాడు ఝరసంగం మండలంలోని మన్నూర్ గ్రామంలో నియోజకవర్గ ముఖ్య కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి రైతులు పెద్దఎత్తున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మండల ఎంపిపి దేవదాస్ మాట్లాడుతూ బలహీనమైన నాయకత్వం వల్లే కాంగ్రెస్ పార్టీలో నైరాశ్యం నెలకొందని.

మండల అధ్యక్షులను మార్చి నూతన నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని, అప్పుడే కాంగ్రెస్ పార్టీ తిరిగి జహీరాబాద్ అసెంబ్లీ సీటు గెలవగలదని, గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించడానికి పెద్ద నాయకుల వద్దకు వెళితే కనీసం పాలకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్లమెంట్ ఎస్టీ సెల్ కో ఆర్డినేటర్ ఛానోత్ రాజు నాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమపై ఎన్నో ఆక్రమ కేసులు నమోదు చేశారని, ఇప్పటికైనా అధినాయకత్వం సీనియర్లను గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

సీనియర్ నాయకులు కవేలి కృష్ణ కోహిర్ మండల ఎస్టీ సెల అధ్యక్షుడు వినోద్ రాథోడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారిని విస్మరించి పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారికి అందలం ఎక్కించడం కరెక్ట్ కాదని, రాబోయే రోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సవివరంగా కెలపాలని, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు, సన్నబియ్యం, నూతన రేషన్ కార్డుల మంజూరు, కళ్మాణాలక్ష్మి, షాది ముబారక్, రైబుభరోసా, రైతు భీమా, ఆడపిల్లలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు లాంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయలను ప్రజలకు తెలియజేద్దామని అన్నారు.

 

 

Farmers

 

కార్యక్రమంలో జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ముల్తానీ, మాజీ ఎంపీపీ దేవదాస్, జహీరాబాద్ పార్లమెంట్ ఎస్టీ సెల్ కో ఆర్డినెంటర్ థానోత్ రాజు నాయర్, మాజీ సర్పంచ్ మహేబూబ్ పటేల్, మాజీ ఎంపిటిసి దుర్గాప్రసాద్, మొహమ్మద్ శుకుర్, కృష్ణ, కోహిర్ మండల ఎస్టీ సెల్ రాథోడ్ వినోద్ కుమార్, సీనియర్ నాయకులు రవేలి కృష్ణ, మొహమ్మద్ యూనుస్ హత్నూర్, మొహమ్మద్ మస్తాన్, ముహమ్మద్ చష్మోద్దీన్ శేకపూర్, సుధాకర్ రెడ్డి.

భాస్కర్ రెడ్డి, నవాజ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి వెంకటా పూర్, రాజ కుడు సంగం, నగేష్ బొపన్ పల్లి, హత్నూర్ వెంకట్ రెడ్డి వెంకట్ హాద్నూరు, సంగన్న ఝారసంగం, మచ్నూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ రాపీయెన్షన్, విద్య సాగర్, ప్రశాంత్, గుండప్ప పటేల్, ఆయా మండలాల మాజీ సర్పంచులు. మాజీ ఎంపిటిసిలు, సీనియర్ కార్యర్తలు తదితరులు పాల్గొన్నారు.

వెదజల్లే పద్దతిలో తక్కువపెట్టుబడితో అధిక దిగుబడి.

వెదజల్లే పద్దతిలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వస్తుంది…

నేటి ధాత్రి -గార్ల :-

 

 

వెదజల్లే పద్దతిలో విత్తనాలు నేరుగా పొలంలో చల్లడం ద్వారా, నారు తీసి నాటడం అవసరం ఉండదని కూలీల ఖర్చు, విత్తనాల అవసరం తగ్గి తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడి సాధించవచ్చు అని గార్ల వ్యవసాయధికారి కావటి రామారావు అన్నారు.శుక్రవారం దుబ్బగూడెం గ్రామం లో రైతులకు నేరుగా విత్తనాలు వెధజల్లే పద్ధతి పై అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,తక్కువ పెట్టుబడితో నాటు అవసరం లేకుండా నారు మడి ఖర్చు లేకుండా నేరుగా విత్తనాలు వేదజల్లుకోవాలని సూచించారు.ఈ విధానం లో కూలీల అవసరం ఉండదని ఎకరాకు 6 వేల నుండి 8 వేల వరకు పెట్టుబడి ఆదా అవుతుందని,రైతులకు ఎంతో శ్రేయస్కరం లాభదయాకమని అందరూ ఈ విధానాన్ని అవలంభించి లాభాలు గడించాలని సూచించారు.ఈ పద్దతిలో విత్తనాలు చల్లిన 2 రోజుల్లో ఒక ఎకరాకు పెండిమెతలిన్ ఒక లీటర్ పిచికారీ చేయాలనీ,విత్తనాలు చల్లిన 25 రోజుల తర్వాత నామినీ గోల్డ్ కానీ కౌన్సిల్ యాక్టీవ్ గాని వివాయ గాని పిచికారీ చేసి కలుపు నివారించుకోవాలని తెలిపారు.ఎరువులు ఆఖరి దుక్కిలో డిఏపి ని 20 రోజులు తర్వాత యూరియా తో పాటు పొటాస్ 20కేజీ లు వేసుకోవాలని అన్నారు.చిరుపొట్ట దశలో 30 కేజీ లు యూరియా తో పాటు 15 కేజీ ల పొటాష్ వాడాలని, అవసరం మేరకే క్రిమిసంహారక మందులు వాడాలని సూచించారు.ఈ పద్ధతి లో నాటు పద్ధతి కంటే 10 రోజులు ముందుగా వరి కోతకు వస్తుందని అన్ని కంకులు ఒకే సారి ఈనిక దశకు వస్తాయని, చీడ పీడల నివారణ సాధ్యమవుతుందని సూచించారు.ఈ కార్యక్రమం లో ఏఈఓ మేఘన,రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల భరోసాగా రైతు భరోసా.

ఎన్నికల భరోసాగా రైతు భరోసా.

విజయోత్సవాల పేరుతో గత సీజన్ రైతు భరోసా,వడ్లకు బోనస్ ఎగనామం..

రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే పెద్ది ఫైర్..

నర్సంపేట నేటిధాత్రి:

గత సీజన్ లో రైతు భరోసా, అలాగే వడ్లకు ప్రకటించిన బోనస్ లను ఎగనామం పెట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామా చేస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర సివిల్ సప్లైస్ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో రైతు భరోసా పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపి గత19 నెలల కాలంలో రైతులను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని పెద్ది డిమాండ్ చేశారు.ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి 12 వేలకు పరిమితం చేయడం అలాగే గత వానకాలం,యాసంగిలో రైతు భరోసా ఎగ్గొట్టి ఓట్ల కోసం ఇప్పుడు విజయోత్సవాల పేరిట సంబరాలు జరపుకోవడం రైతులను మోసం చేయడం కాదా అని ప్రశ్నిస్తూ,రైతులకు ఏం చేశావని సంబరాలు చేస్తున్నారంటూ ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో ఒక్క చెక్ డ్యాం కట్టలేదని ఆరోపించారు.2022 మే 6 న వరంగల్ లో జరిపిన రైతు డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీ,సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ,ఆనాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది ప్రశ్నించారు.కాంగ్రెస్ దుర్మార్గ పాలనలో 511 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల బతుకులు సంక్షోభంలో కూరుకుపోయాయని అవేదన వ్యక్తం చేశారు.గత పదేండ్ల బిఆర్ఎస్ పాలన రైతు సంక్షేమ ప్రభుత్వమైతే నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రైతు సంక్షోభ ప్రభుత్వంగా పెరుపొందుతున్నదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో వ్యవసాయం దండుగ కాదు..

తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో వ్యవసాయం దండుగ కాదు…పండగ

◆ రైతు భరోసా విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్న

◆ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఎ.చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి

 

 

 

 

న్యాలకల్ మండలంలోని ముంగి చౌరస్తా వద్ద నిర్వహించిన రైతు నేస్తం,రైతు భరోసా విజయోత్సవ సభలో కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద నిధులు రైతుల ఖాతాలో విడుదల చేసిన శుభ సందర్భన్నీ పురస్కరించుకుని మాజీ మంత్రి డా౹౹చంద్రశేఖర్ మండలంలోని రైతులు మరియు పార్టీ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగుంది.అనంతరం రైతులందరు ప్రజా ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తంచేశారు, మరియు మాజీ మంత్రి డా౹౹ఎ.చంద్రశేఖర్ మాట్లాడుతూ కేవలం18 నేలలో రైతు రుణమాఫీ,రైతు భరోసా,రైతు బోనస్లు అందించిన ఏకైక ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అని వారు వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ డీసీసీ ప్రధాన కార్యదర్శి.భాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సామెల్,pacs చైర్మన్లు.సిద్దిలింగయ్య స్వామి,జగ్గానాథ్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ.గౌసోద్దీన్,మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్,కాంగ్రెస్ నాయకులు హుగ్గేల్లి రాములు,తదితరులు పాల్గొన్నారు.

రైతన్నలు ఆకాశం వైపు ఎదురుచూపు.

ఎటూ పోయావు వానమ్మా…

రైతన్నలు ఆకాశం వైపు ఎదురుచూపు

శాయంపేట నేటిధాత్రి:

జూన్ మాసం వచ్చి 20 రోజులు గడిచిన తొలకరి పలకరించలేదు ఎన్నో ఆశలతో సాగుకు సిద్ధమైన రైతు వర్షం రోజు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. మేఘాలు వర్షం రావడం కరుణించకపోవడంతో వానకాలం పంట సీజన్ ఆరంభంలో నిరాశ చెందు తున్నారు. ప్రకృతి విపత్తుల నేపథ్యంలో పంటలు దెబ్బ తినడంతో రైతులు నష్ట పోవలసిన పరిస్థితి వస్తుంది ఒక నెల ముందుగానేప్రారంభిం చాలని దిశ నిర్దేశం చేసింది. చినుకులు లేకపోవడంతో విత్తనాలు విత్తకుంటే అధిక దిగులు వస్తాయని రైతులు ఆలోచించారు ఎప్పటిలాగే రైతులు వానాకాలంలో వ్యవసాయ పనులు చేసుకునే పరిస్థితి కూడా లేకపోయింది. మేఘాలు మొఖం చాటేసుకోవ డంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అమ్ముకోవా లని నానా కష్టాలు పడి అమ్ముకుంటే జూన్ నెలలో విత్తనాలు వేసుకుంటే రైతన్నలకు వాన కాలంలో అనావృష్టి వెంటాడుతుంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించాకే నల్లరేగడిలో 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత విత్తనాలు వేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. మండలంలో పలు గ్రామాల్లో రైతులు వర్షం వస్తుందని నమ్మకంతో పత్తి విత్తనాలు నాటి ఎదురు చూస్తున్నారు ఈసారి ఎండ తీవ్రత విపరీతంగా ఉండడం తో మండలంలోని చెరువులు కుంటాను నీళ్లు లేక విలవిల బోతున్నాయి ఆయకట్టు వనరులు ఉన్న ప్రాంతాల్లో ఆయకట్టు వనరులు ఉన్న ప్రాంతాలలో ఆయకట్టు రైతులు కూడా వరుణుడు దీవెనలు కోసం ఎదురుచూ డాల్సిన పరిస్థితి నెలకొంది.

ఎదురుచూస్తున్నాం..

మండలం రైతు ముసికే అశోక్

వర్షాల కోసం ఎదురుచూపులు చూస్తున్నాం సీజన్ లో వర్షాలు రాకుండా కష్టపడి పండించిన తర్వాత లేదా పంటలు చేతకొచ్చే సమయంలో వర్షాలు వచ్చి మమ్మల్ని నష్టం పరుస్తుంది ఈ వర్షాకాలంలో మొదట్లోనే వర్షాలు రాక కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది.

హామీ మేరకు రైతులకు అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలి.

ఎన్నికల హామీ మేరకు రైతులకు అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలి,

ప్రతి రైతుకు రైతు భరోసా నిధులు ఇవ్వాలి,

యూరియా సరఫరా లో ప్రభుత్వం విఫలం

గణపురం మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో వడ్లు పండించిన ప్రతి రైతుకు ఎన్నికల హామీ మేరకు బోనస్ ఇవ్వాలని గణపురం మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు హామీల అమలు విషయంలో కాలయాపన చేస్తున్నారని అన్నారు, ఇప్పటికైనా రైతులు పండించిన అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని, ప్రతి రైతుకు రైతు బంధు పథకం అమలు చేయాలని, లేని పక్షంలో రైతుల పక్షాన ధర్నా చేపడతామని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో అనేక కొర్రీలు పెట్టి రైతులను ఇబ్బంది పెట్టారని, కొందరు రైతులకు ఇప్పటికీ ధాన్యం డబ్బులు పడలేదని, జిల్లా యంత్రాంగం రైతులకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వానకాలం పంట సాగు సమీపిస్తున్న ఇప్పటికీ యూరియా అందుబాటులో లేదని, రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.

రైతుల ఖాతాల్లో రూ. 99.5 కోట్ల రైతు భరోసా నిధులు జమ.

రైతుల ఖాతాల్లో రూ. 99.5 కోట్ల రైతు భరోసా నిధులు జమ

1,10,322 మంది జిల్లా రైతులకు లబ్ది

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

 

 

సిరిసిల్ల జిల్లాలోని అన్నదాతలకు రైతు భరోసా కింద మూడు రోజుల్లో రూ. 99.5 కోట్లకు పైగా డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఖరీఫ్ వర్ష కాలం సీజన్ సాగు కోసం రైతులకు ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద నిధులు విడుదల చేస్తుందని తెలిపారు. ఈ రోజు వరకు జిల్లాలోని 13 మండలాల పరిధిలోని 1,10,322 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.99,52,19,906= 00 డబ్బులు జమ అయ్యాయని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

కార్మికులకు ప్రయోజనాలు కల్పించడంలో నిర్లక్ష్యం.

కార్మికులకు ప్రయోజనాలు కల్పించడంలో నిర్లక్ష్యం

కేసముద్రం వ్యవసాయ మార్కెట్ అధికారుల తీరు అసంతృప్తికరం

సి ఐ టి యు జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

 

 

 

కేసముద్రం మండలం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో కార్మికుల ను ఉద్దేశించి ఏఐసిటియు జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ ఆదాయము సంవత్సరమునకు సుమారు 8 కోట్ల రూపాయలని కానీ కార్మికులకు ఓ నగూరింది ఏమీ లేదని ఆయన అన్నారు. ఈ మార్కెట్ ప్రధానమంత్రి ఎక్స్లెన్స్ అవార్డు పొందిన మార్కెట్ అని కార్మికులకు మాత్రం మార్కెట్ అధికారులు మార్కెట్ ఆదాయం నుండి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కట్టడం లోపల నిర్లక్ష్యం చేస్తున్నారని కార్మిక ప్రయోజనాలు పట్టింపు లేనట్టు మార్కెట్ అధికారులు వ్యవహరిస్తున్నారని ఇది సమంజసం కాదని ఆయన అన్నారు. అదేవిధంగా పాలకులు అసంఘటితరగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఏమి పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా అసంఘటితరంగా కార్మికులకు సమగ్ర చట్టం చేయకపోవడం మూలంగా కార్మికులకు వారి యొక్క హక్కులు లేకుండా పోవుచున్నావని నిరంతరం ఎన్నో ప్రమాదాల మధ్య కార్మికులు తమ పనిని చేయుచున్నారని కానీ పాలకులకు మాత్రం కార్మికులైన వీరికి ప్రయోజనాలు కల్పించడంలో నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారని వీటి సాధన కొరకు ఉద్యమాలే శరణ్యం అని కార్మికులందరూ పోరాటాలకు సంసిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనాటి ఈ సమావేశంలో పాల్గొన్న వారు వేల్పుల వెంకన్న, గుగులోతు రాజు,రమణ బోయిన సురేష్, గద్దల సాలయ్య,బోడ వీరన్న నాయక్, ధారావత్ వీరన్న నాయక్ ,గుగులోతు లక్ష్మణ్,నేరడ వీరస్వామి,అందే భాస్కర, పుల్లన్న,మురళి తదితరులు పాల్గొన్నారు.

పీఎం-కిసాన్ 20వ ఇన్‌స్టాల్‌మెంట్..

పీఎం-కిసాన్ 20వ ఇన్‌స్టాల్‌మెంట్..

 

shine junior college

 

 

 

దేశంలోని రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం ఈ పథకానికి రూపకల్పన చేసింది.

 

 

దేశంలోని రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan). రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం ఈ పథకానికి రూపకల్పన చేసింది. ఏడాదికి ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాలో వేస్తోంది. విడతకు రూ.2 వేలు చొప్పున ఏడాదిలో మూడు సార్లు అందిస్తోంది (PM-KISAN 20th instalment).

 

 

ఇప్పటి వరకు 19 విడతల్లో రూ.2 వేల చొప్పున కోట్లాది మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇక, 20వ విడత పీఎం-కిసాన్ నిధుల విడుదలకు సమయం ఆసన్నమైంది. ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు 20వ విడత పీఎం-కిసాన్ నిధుల విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన రాలేదు. అయితే జూన్ 20వ తేదీన రైతుల ఖాతాల్లోకి 20వ విడత పీఎం-కిసాన్ నిధులు జమ అవుతాయని సమాచారం.

 

 

 

 

 

మరి, ఈ 20వ విడత పీఎం-కిసాన్ నిధులు అందుకోవాలంటే రైతులు తప్పనిసరిగా రెండు పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అందులో మొదటిది తప్పనిసరిగా ఇ-కేవైసీ పూర్తి చేసి ఉండడం. రెండోది బ్యాంక్ ఖాతాతో ఆధార్ నంబర్ లింక్ చేసుకుని ఉండడం. ఈ రెండు పనులు పూర్తి చేయడంలో విఫలమైతే పీఎం-కిసాన్ డబ్బులు అందుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి, సాధ్యమైనంత త్వరగా ఈ రెండు పనులను పూర్తి చేసుకోవాలని రైతులకు అధికారులకు సూచిస్తున్నారు.

కవేలి రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి.

కవేలి రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

shine junior college

 

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల కేంద్రంలోని కవేలి గ్రామంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారతి సదస్సును గ్రామపంచాయతీ ఆవరణంలో పంచాయతీ కార్యదర్శి సురేఖ ఆధ్వర్యంలో భూ భారతి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మండల రెవెన్యూ అధికారులు గిర్దావరి అశ్విని కుమార్ మాట్లాడుతూ రైతుల నుంచి భూ సంబంధిత సమస్యల పరిష్కారం కొరకు వినతి పత్రాలు సేకరించారని అన్నారు. మొత్తం 40 అప్లికేషన్లు వచ్చాయని అన్నారు.

రైతు బంధు నిధులు విడుదల .

రైతు బంధు నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎంపిటిసి వాసాల రామస్వామి

జమ్మికుంట :నేటిధాత్రి

 

shine junior college

రైతుబంధు నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు, మాజీ ఎంపీటీసీ వాసలా రామస్వామి,, ఇ సందర్బంగా మాట్లాడుతూ..ఎకరాలతో సంబంధం లేకుండా రైతులు సాగు చేసిన అన్ని ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి, పంటకు ఎకరాకు 6 వేలు చొప్పున సోమవారం రైతు నేస్తం కార్య క్రమంలో పాల్గొని రైతు బందు నిధులు విడుదల చేయడం పట్ల దన్యవాదాలు తెలుపుతున్నం అని జమ్మికుంట కాంగ్రెస్ నాయకులు, తనుగుల తాజా మాజీ ఎంపీటీసీ వాసలా రామస్వామి మాట్లాడారు.ప్రస్తుత పంట సాగు ప్రారంభించిన రాష్ట్ర వ్యాప్త రైతులకు ఈ బెట్టుబడి సహాయం ఎంతో లబ్ధి చేకూరుతుందని
రామస్వామి అన్నారు. నిజానికి రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అని కొనియాడారు.

రైతు భరోసా పథకంకు అర్హులైన వారు.

రైతు భరోసా పథకంకు అర్హులైన వారు పేర్లు నమోదు చేసుకోవాలి…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

shine junior college

ఈనెల 5వ తేదీకి ముందు పట్టా పాస్ పుస్తకాలు పొంది ఉండి, రైతు భరోసా పథకంలో పేరు నమోదు కాని రైతులందరూ వారి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం తో సంబంధిత రైతు వేదికలో వ్యవసాయ విస్తరణాధికారి వద్ద పేరు నమోదు చేసుకోవాలని క్యాతనపల్లి మున్సిపాలిటీ లోని ఐదవ వార్డ్ అమరవాది లో ఏర్పాటు చేసిన భూభారతి కార్యక్రమంలో మందమర్రి ఎమ్మార్వో సతీష్ కుమార్ తెలిపారు. రైతు కార్డ్ తీసుకోనీ వారు కూడా సంబధిత అధికారులను కలిసి తీసుకోవాలని కోరారు. భూ సమస్యలన్నింటినీ సామరస్యంగా పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని బత్తుల వేణు ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు
దాంక రమేష్ ,రోడ్డ రమేష్
క్యాతం పురుషోత్తం,రొడ్డ మల్లేష్, వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

14వ వార్డులో ఇందిరమ్మ గృహ ఇండ్ల భూమిపూజా.

14వ వార్డులో ఇందిరమ్మ గృహ ఇండ్ల భూమిపూజా

 

పరకాల నేటిధాత్రి

 

 

shine junior college

 

 

 

పరకాల పట్టణంలోని 14 వార్డులో ఇందిరమ్మ ఇండ్ల అర్హులైన లబ్ధిదారులకు భూమిపూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పట్టణ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ సోద అనితా రామకృష్ణ కాంగ్రెస్ పట్టణ అద్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,కుంకుమేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు,మాజీ కౌన్సిలర్ మార్క ఉమా రఘుపతి,మాజీ మైనారిటి సెల్ అధ్యక్షులు ఎండీ అలీ హాజరై కొబ్బరికాయ కొట్టి నూతన నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటి సబ్యులు కొక్కిరాల స్వాతి,ఎండీ అమీనా,ఆకుల అశోక్,ఎండీ షఫీ,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రైతుకు చుక్కలు చూపిస్తున్న కౌలుదారుడు.

రైతుకు చుక్కలు చూపిస్తున్న కౌలుదారుడు…

రైతు కుటుంబంపై విచక్షణరహితంగా భౌతిక దాడులు..

మహిళా రైతుపై భౌతిక దాడి చేస్తే చర్యలు ఉండవా..?

మహిళల రక్షణ పట్ల కొత్త చట్టాలు తెస్తున్న ప్రభుత్వం… తుంగలో తొక్కుతున్న అధికారులు..

పలుమార్లు కేసులు పెట్టిన బాధితులు… దాడికి పాల్పడ్డ వారికి అండగా పోలీసులు..?

కోర్టు ఆదేశాలను ధిక్కరించి… నిర్లక్ష్యపు ధోరణిలో పోలీసులు..?

భూమి కొనుగోలుకు సాక్షులు వీరే.. ప్రస్తుతం దాడులు చేసేది వీరే..

ప్రాణాలు తీసిన దిక్కులేని స్థితిలో బాధిత రైతు కుటుంబం..

కోర్టు ఉత్తర్వుల ప్రకారం భూమి కొనుగోలు రిజిస్ట్రేషన్, భూమి అగ్రిమెంటు ప్రకారం న్యాయం చేయాలని బాధిత రైతు కుటుంబం ఆవేదన..

ఇరువురి ఫిర్యాదుల మేరకు కేసు నమోదు.. సివిల్ కేసుల పట్ల నాకు ఎలాంటి సంబంధం లేదు.. ఎస్సై రాజేష్ రెడ్డి..

నర్సంపేట నేటిధాత్రి:

తన వ్యవసాయ భూమిని మరో వ్యక్తికి అమ్ముకొని కౌలుదారు అవతారమెత్తిన ఒక వ్యక్తి పక్కనే ఉన్న ఒక రైతు కుటుంబానికి చుక్కలు చూపిస్తున్నాడు.తన సొంత భూమి ఉన్నప్పుడు పక్కనే ఉన్న రైతుతో సన్నిహితంగా ఉంటూ పక్కలో ఇప్పుడు బల్లెంల మారాడు.తనకున్న వ్యవసాయ భూమిని మరొక వ్యక్తికి అమ్ముకొని అదే భూమిని కౌలుకు చేస్తూ పక్కనే అన్న రైతు కుటుంబంపై భౌతికదాడులకు తెగబడుతున్నాడు. కౌలుదారు కొనుగోలు చేసిన వ్యక్తి ఆయనను పక్కనే అన్న రైతు కుటుంబంపై ఒసిగొలుపుతూ అంటిఅంటకుండా వ్యవహరిస్తున్నాడు.నిత్యం కౌలుడారుడు చేసే దౌర్జన్యాలు,భౌతిక దాడుల పట్ల పోలీస్ స్టేషన్ వెళ్తే పట్టించుకోవడం మాట దేవుడెరుగు గాని బాధిత రైతు కుటుంబాన్ని బైండోవర్ చేసి ముప్పుతిప్పలు పెడుతున్న పరిస్థితి నెలకొన్నది.కోర్టు ఉత్తర్వులు తెచ్చిన కూడా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు.ఈ వ్యవహారం మొత్తం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో జరుగుతున్నది.

పూర్తి వివరాల్లోకి వెళ్ళితే…. చెన్నారావుపేట ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ఒక రైతు కుటుంబ సభ్యులు సామల శాంత సాంబయ్య దంపతులు అదే గ్రామం నుండి ముదిగొండ వైపు వెళ్లే కంకర రోడ్డుకు సుమారు 3 ఎకరాల వ్యవసాయ భూమిని గత రెండు దశాబ్దాల క్రితం కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటున్నారు.రోడ్డుకు ఉన్న వీరి భూమి కింది మొదటి బాగాన చీమల కర్ణాకర్ సంబంధించిన ఎకరం వ్యవసాయ భూమి ఉన్నది.అలాగే కర్ణాకర్ కింద భాగాన కావటి ముత్యాలు అనే రైతు ఎకరం భూమి ఉన్నది.ఈ ముగ్గురు రైతులు సాంబయ్య,కర్ణాకర్,ముత్యాలు వ్యవసాయ భూములకు నీటి సౌకర్యం కోసం పొత్తుల భావి సాంబయ్య,కర్ణాకర్ ల భూముల్లో ఉన్నది. ఐతే కావటి ముత్యాలు తన ఇంటి అవసరాల నిమిత్తం ఆ ఎకరం అమ్మకానికి నిర్ణయించుకున్నాడు.ముందుగా చీమల కర్ణాకర్ అనే రైతును భూమి అమ్మకం పట్ల తెలుపగా నేను కొనుగోలు చేయనని తేల్చి చెప్పేశారు.అనంతరం సామల శాంత సాంబయ్య రైతును అమ్మకం పట్ల అడుగగా వారు కొనుగోలు చేసేందుకు ఒప్పుకున్నారు.గ్రామ పెద్దల సమక్షంలో ఎకరాకు రూ.7 లక్షల 60 వేలకు మాట్లాడుకొని బయాన ఇచ్చి అగ్రిమెంట్ రాసుకున్నారు.మరల కొద్ది రోజుల తర్వాత చీమల కర్ణాకర్ ఆ భూమిని నేను కూడా తీసుకుంటామని పెద్దనుషుల సమక్షంలో మాట్లాడుకున్నారు.అనంతరం ముత్యాలుకు సంబంధించిన సర్వే నంబర్ 399 గల ఎకరం భూమి సామల శాంత సాంబయ్య,చీమల కర్ణాకర్ అదే రేటు ప్రకారంగా ఒక్కొక్కరు 20 గంటల చొప్పున కొనుగోలు చేసుకున్నారు.ఐతే ఇద్దరి భూమి సమాన ఓకె విధంగా ఉండేందుకు గాను కర్ణాకర్ కు సంబంధించిన 20 గంటల భూమిని సామల సాంబయ్యకు కేటాయించిన కర్ణాకర్.. ముత్యాలు వద్ద ఇద్దరి పొత్తుల 2018 లో కొనుగోలు చేసిన ఎకరం భూమిని తనే తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు.ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో డాక్యుమెంట్ ప్రకారం సర్వే నంబర్ 399 తో చేర్చి వారి ఒప్పందంలో భాగంగా కర్ణాకర్ కు గల 20 గంటల భూమిని సాంబయ్యకు మారుస్తూ తూర్పున భూమి కొనుగోలు చేసిన సాంబయ్య భూమి ,ఉత్తరము రెడ్డబోయిన సాయిలు,పడమర చీమల కర్ణాకర్,దక్షణం వైపు వాగు ఉన్నట్లుగా హద్దులు నిర్ణయిస్తూ భూమిని సాంబయ్యకు రిజిస్ట్రేషన్ చేస్తూ కర్ణాకర్ సాక్షిగా ఉన్నారు.మొత్తం భూమిని వారివారి ఒప్పందాల ప్రకారం కావటి ముత్యాలు వద్ద ఇద్దరి పొత్తుల కొనుగోలు చేసిన ఒక ఎకరం భూమిని కర్ణాకర్ తన భూమితో కలిపి 1 ఎకరం 20 గంటల భూమిని సాగుచేసుకుంటున్నాడు.అలాగే సామల సాంబయ్య తన 3 ఎకరాల భూమితో పాటు అగ్రిమెంట్ కర్ణాకర్ తో కుదుర్చుకున్న 20 గంటల భూమితో కలిసి గత ఏడేండ్లుగా సాగు చేసుకుంటున్నాడు.అలాగే వాటాల ప్రకారంగా వ్యవసాయ బావిని వాడుకుంటున్నారు.గత సంవత్సరం నర క్రితం చీమల కర్ణాకర్ తన ఎకరం 20 గంటల భూమిని నగేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారికి అమ్మకం చేశారు.పక్కనే ఉన్న లావన్ పట్టా భూమి గల వాగును దారి కోసం తన అధీనంలోకి తీసుకుందామని విక్రయదారులు కర్ణాకర్ తో ప్లాన్ చేయగా అది కాస్త బెడిసికొట్టింది.పైన రోడ్డు బాగం నుండి ఉన్న రైతు సామల శాంత సాంబయ్యను అడుగగా వారు ఒప్పుకోలేదు.ఎలాగైనా సాంబయ్య భూమి నుండి తన భూమిలోకి దారి తీసుకోవాలని కర్ణాకర్ ను నగేష్ ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది.ఐతే అదే భూమిని నగేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి అమ్మకం చేసిన కర్ణాకర్ కు కౌలుకు ఇచ్చాడు.దీంతో సాంబయ్య భూమిలో నుండి ఎలాగైనా దారి పొందాలని భావించిన క్రయ విక్రయ దారులు రంగం సిద్ధం చేసుకున్నారు.ఈ నేపథ్యంలో భూమిని విక్రయించిన చీమల కర్ణాకర్.

అదే భూమికి కౌలుదారుగా అవతారమెత్తాడు.గత ఏడు సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న సాంబయ్య కుటుంబంపై దాడులకు పాల్పడటం మొదలుపెట్టారు.మీరు సాగుచేసుకుంటున్న 20 గంటల భూమి మాదే అంటూ 2024 జనవరి నెలలో సామల శాంత సాంబయ్య దంపతులపై దాడి చేసి వ్యవసాయ బావికి సంబంధించిన మోటార్,స్టార్టర్ లను చీమల కర్ణాకర్,అతని సోదరుడు సతీష్ లు ధ్వంసం చేశారు.వెంటనే బాధితులు స్థానిక చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.కొద్ది రోజులకే మొక్కజొన్న పంటపై కర్ణాకర్,సతీష్ లు గడ్డిమందు ప్రయోగం చేశారు.మరల బాధితులు శాంత సాంబయ్య దంపతులు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.మరుసటి రోజున అదే మొక్కజొన్న పంటను ట్రాక్టర్ తో ఫాల్టర్ కొట్టించి దున్నించి నాపై కర్ణాకర్,సతీష్ లు మహిళా అనే ఇంగీతజ్ఞానం లేకుండా విచక్షణ రహితంగా దాడి చేశారని బాధితురాలు సామల శాంత ఆరోపించారు.ఐనప్పటికీ పోలీస్ స్టేషన్ చేసిన పిర్యాదు మేరకు ఎస్సై,సీఐలు వ్యవసాయ భూమివద్ద విచారణ చేపట్టగా సాక్షులు కూడా తమదే న్యాయం అని పోలీస్ అధికారులకు తెలిపారని వాపోయారు.తీవ్రంగా గాయాలపాలైన మమ్మల్ని ఆస్పత్రికి వెళ్ళనివ్వకుండా మా దాడికి పాల్పడ్డ వారికి సహకరిస్తూ మండల రెవెన్యూ అధికారి వద్ద బైండోవర్ చేయించారని బాధిత రైతు కుటుంబం సభ్యులు శాంత సాంబయ్యలు అవేదన వ్యక్తం చేశారు.పెద్ద మనుషుల ఒప్పందం,భూమి అగ్రిమెంట్,రిజిస్ట్రేషన్ లో హద్దుల ప్రకారంగా తమకే భూమి చెందుతుందని కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకొని భూమి సాగుచేసుకుంటున్న క్రమంలో సతీష్ , కర్ణాకర్ లు నానా దుర్భాషలాడుతూ, వెంట్రుకలు పట్టుకుని విచక్షణారహితంగా కొట్టారని మహిళా రైతు సామల శాంత రోదిస్తూ తెలిపారు.ఈ నేపథ్యంలో వారిపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మా కుటుంబాన్ని పట్టించుకోవడంలేదని బాధితులు శాంత సాంబయ్యలు అవేదన వ్యక్తం చేశారు.భూమితో వారికి ఎలాంటి సంబంధం లేకున్నా కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నగేష్ సహకారంతో నిత్యం భయాందోళనల కల్పిస్తూ మనోవేదనకు గురిచేస్తున్నారని ఆరోపించారు.మా కుటుంబంపై దాడి చేసిన చీమల సతీష్ ,కర్ణాకర్ లపై పిర్యాదులు చేస్తే భూమి కొనుగోలు చేసిన నగేష్ తో సెటిల్ చేసుకోండని ఎస్సై రాజేష్ రెడ్డి తెలుపుతున్నారని బాధిత రైతు కుటుంబం శాంత సాంబయ్యలు ఆరోపించారు.ఎన్నిసార్లు పిర్యాదు చేసిన కానీ సతీష్ , కర్ణాకర్ లకు అండగా ఉంటూ మా ఫిర్యాదుల పట్ల

తూ తూ మంత్రంగా కేసులు నమోదు చేసి మాపై నిర్లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని తెలిపారు.మా కుటుంబంపై జరుగుతున్న సంఘటనల పట్ల పోలీస్ కమిషనర్,నరంపేట ఏసిపిలకు పిర్యాదులు చేయనున్నట్లు బాధిత రైతు కుటుంబం సామల శాంత సాంబయ్యలు తెలిపారు.

ఇరువురి ఫిర్యాదులతో కేసులు చేసిన..సివిల్ కేసుల పట్ల నాకు సంబంధం లేదు… చెన్నారావుపేట ఎస్సై రాజేష్ రెడ్డి..

చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సామల శాంత సాంబయ్య అనే రైతులు,అదే గ్రామానికి చెందిన చీమల కర్ణాకర్,సతీష్ అలాగే నగేష్ అనే వ్యక్తుల మధ్య భూ తగాదాల గొడవలు జరుగుతున్నాయి.ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు.ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినం అని ఎస్సై రాజేష్ రెడ్డి తెలిపారు.భూ తగాదాలు సివిల్ కేసుల పట్ల నాకు ఎలాంటి సంబంధం లేదని నేటిధాత్రి ప్రతినిధి అడిగిన వివరణకు ఎస్సై రాజేష్ రెడ్డి సమాధానం చెప్పారు.

రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

శాయంపేట మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలి

మండల వ్యవసాయ అధికారి గంగాజమునా

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

2025వ సంవత్సరం వానా కాలానికి సంబంధించి రైతు భరోసా కోసం కొత్తగా పట్టా దారు పాసుపుస్తకాలు తీసు కున్నటువంటి రైతులు మీయొక్క పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు మరి యు మీ యొక్క బ్యాంక్ పాస్ పుస్తకం యొక్క జిరాక్స్ వెంటనే తీసుకొని మండల వ్యవసాయ విస్తరణ అధికారికి సమర్పించగలరు, దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 18.06.2025 .జూన్ 18 వ తారీకు వరకే చివరి రోజు ఉన్నందున, రైతులు చివరి రోజు వరకు చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవా ల్సిందిగా కోరుతున్నాం ప్రస్తు తానికి ఈ పథకానికి జూన్ 5వ తారీఖు వరకు పట్టాదారు పాసుపుస్తకాలు పొందినటు వంటి రైతులు అర్హులు, ఒకవేళ ఇదివరకే రైతు భరోసా తీసు కుంటూ బ్యాంక్ అకౌంట్ ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకునే రైతులు కూడా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలతో మీ యొక్క వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి.

రైతు భరోసా పథకం సద్వినియోగం చేసుకోవాలి.

రైతు భరోసా పథకం సద్వినియోగం చేసుకోవాలి :

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

రైతు భరోసా పథకం సద్వినియోగం చేసుకోవాలి : మండల వ్యవసాయ అధికారి వెంకటేశం.
ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం రైతు భరోసా పథకం లో భాగంగా
ఝరాసంగం మండలంలోని రైతులందరూ వానకాలం 2025 సీజన్ కి సంబంధించిన తేదీ 05.06.2025. వరకు ఎవరికైతే నూతనంగా వచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు అయిన రైతులు రైతు భరోసా పథకం కొరకు దరఖాస్తు చేసుకోవలని మండల వ్యవసాయ అధికారి వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు..
కావాల్సిన పత్రాలు:
1. రైతు భరోసా అప్లికేషన్ ఫారం
2. పట్టదార్ పాస్ పుస్తకం
3. ఆధార్ కార్డు జిరాక్స్
4. బ్యాంకు అకౌంట్ జిరాక్స్
మీ యొక్క సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారులకు ఈ నెల 20 వ తేదీ వరకు సమర్పించాలని తెల్పడం జరిగింది..

వనజీవి స్ఫూర్తితో.

వనజీవి స్ఫూర్తితో.

“నేటిధాత్రి”, హైదరాబాద్.

ఇటీవలే మరణించిన పద్మశ్రీ వనజీవి రామయ్య ని స్ఫూర్తి గా తీసుకొని వాశ్విక్ ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ ప్రజాపతి ఒక సంవత్సరంలో లక్షమొక్కలు నాటాలనే సంకల్పం తీసుకున్నారు ఈ లక్ష మొక్కల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారిక నివాసంలో మొదటి మొక్కను నాటించి కార్యక్రమాన్ని ప్రారంభించారు మొదటి మొక్కను నాటిన మంత్రి తన స్వంత నియోజక వర్గమైన ధర్మపురి నుండి మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగించాలని నరేష్ ప్రజాపతి ని కోరారు.

 

 

Inspired by wildlife.

బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వాటర్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కవి గాయకులు మిట్టపల్లి సురేందర్, వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త జిఆర్కే రెడ్డి, గాజుల రవికుమార్ ఎడ్యుజోన్ సీఈఓ లు పాల్గొన్నారు

దశ మారుతున్న దామర చెరువు

దశ మారుతున్న దామర చెరువు..

ఎమ్మెల్యే రోహిత్ రావు చొరవుతో వేగంగా అభివృద్ధి పనులు..

ఇప్పటివరకు రూ.7 కోట్ల అభివృద్ధి పనులు..

రామాయంపేట జూన్ 11 – నీటి ధాత్రి (మెదక్)

మెదక్ నియోజకవర్గం లోని రామయంపేట మండలం దామరచెరువు గ్రామానికి మహర్దశ పట్టుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రత్యేక దృష్టి సారించి దామరచెరువు గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం జరిగింది. అంతకుముందే గ్రామంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడం ప్రారంభించారు. మొట్టమొదటగా ఇక్కడ లేనివిధంగా గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగింది. రూ. రెండు కోట్లతో బీటి, సి సి, రోడ్డుతో పాటు ఇందిరమ్మ ఇండ్లకు ఐదున్నర కోట్లతో పనులు ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా చర్చి కాంపౌండ్ లో, మరియు అంగన్వాడి పాఠశాల, ప్రభుత్వ దవాఖాన వద్ద టాయిలెట్లను నిర్మించేందుకు నిధులు విడుదల చేయడం జరిగింది. ఈ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా అభివృద్ధి పనులు జరగకపోవడం ఇప్పుడు ముమ్మరంగా పనులు జరుగుతుండడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వాడవాడలో సిసి రోడ్లు, గ్రామం నుండి వెళ్లే రోడ్డు బిటి మరియు సిసి రోడ్డుగా పనులు చేయడం పట్ల గ్రామస్తులతో పాటు గిరిజనులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌదరి సుప్రభాత రావుకు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ప్రజలు అంటున్నారు.

 

The changing phase of the Damara Lake

… చెప్పడం కాదు చేతుల ప్రభుత్వం మాది.. టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు.

కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి చెప్పుడు మాటలు కాదు చేతుల ప్రభుత్వం. ఇప్పుడు కూడా అదే నిజం చేస్తున్నాం. ఎవరు ఇచ్చిన విధంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు పనులు కూడా అదే తరహాలో జరుగుతున్నాయి. దామరచెరువు గ్రామాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కానీ మేము అలా చేయలేదు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావ్ ప్రత్యేక చొరవత గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతున్నాం. అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా ఎక్కడలేని విధంగా చేయడం జరుగుతుంది. గ్రామస్తులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం.

ఎమ్మెల్యే రోహిత్ రావుకు రుణపడి ఉంటాం.. మాజీ సర్పంచ్ పడాల శివప్రసాద్ రావు.

గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే రోహిత్ రావ్ చెప్పారు. అంతకుమించి అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయించడంలో ఎంతో కృషి చేస్తున్నారు. దీంతో గ్రామంలో రూపురేఖలే మారిపోతున్నాయి. ఏక్కడ కూడా మట్టి రోడ్డు కనిపించకుండా బీటీ మరియు సిసి రోడ్లు వేయించడం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రామం అభివృద్ధి దిశలో వెళుతుంది. ఇది ఎమ్మెల్యే మైనాంపల్లి రోహిత్ రావు చొరవ తోనే. ఆయనకు గ్రామస్థులం ఎల్లప్పుడు రుణపడి ఉంటాం.

The changing phase of the Damara Lake.

 

ఏరువాక సాగారో.. రన్నో చిన్నన్నా

ఏరువాక సాగారో.. రన్నో చిన్నన్నా..

జహీరాబాద్ నేటి ధాత్రి:

వాగులు, వంకలు, ఏరులు అన్నీ వానాకాలంలో కలిసి ‘పోయి ప్రవహించి పంటలకు ప్రాణంగా నిలుస్తాయి కాబట్టి ఏరువాక అని పేరు వచ్చిందని కొంత మంది అభిప్రాయం. ఏరు అంటే ఎద్దులకు కట్టి దున్నటానికి సిద్ధంగా ఉన్న నాగలి అని అర్ధం. వాక అంటే దున్నటం. నాగలితో భూమిని దున్నుతున్నప్పుడు ఏర్పడిన చాలును “సీత” అంటారు. నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవ సాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. దీనినే పూల పౌర్ణమి అని కూడా అంటారు. ఇంతకీ ఈ ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏమిటి… దాన్ని ఈరోజు ఎందుకు చేసుకుంటారంటే.. వైశాఖ మాసం ముగిసి జ్యేష్టం మొదలైన తరువాత వర్షాలు కురవ డం మొదలవుతాయి.

 

 

 

 

Whether you choose to walk or run, you are a child.
Whether you choose to walk or run, you are a child.

ఒక వారం అటూ ఇటూ అయినా కుడా జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడక మానదు. భూమి మెత్తబడకా మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు అది శుభారంభం అన్నమాట. అందుకనే ఈ రోజున
ఏరువాక అంటే దుక్కిని ప్రారంభిం చడం అనే పనిని ప్రారంభిస్తారు. అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకూ ఎందుకు ఆగడం, ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయ వచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఎవరికి తోచినట్లు వారి తీరికని బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలి తాలు తారుమారైపో తాయి. సమష్టి కృషిగా సాగేందుకు పరాగ సంపర్కం ద్వారా మొక్క ఫలదీకరణం చేందేం దుకు, రుతువుకి అనుగుణంగా వ్యవసాయాన్ని సాగిం చేందుకు.. ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయక క్యాలెండర్ ను ఏర్పాటు చేశారు మన పెద్దలు. అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి కొంత మంది అత్యుత్సాహంతో ముందే ప్రారంభించకుండా, కొందరు బద్దకించ కుండా ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు.

తొలకరి పలకరింపుతో ఆనందంలో రైతులు.

ఏరువాక పౌర్ణమికి ముందే జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో తొలకరి జల్లులు. పలుకరించడంతో మట్టి వాసనతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మే చివరి వారం నుంచి జిల్లాలో పలు మండల్లాలో వర్షాలు కురిసినప్పటికి రైతులు దుక్కులు దున్నుకోవడానికి అవసరమైన పెరిగి వర్షపాతం నమోదు కాకపోవ మంతో అశాశం వైపు నిరాశగా ఎదురు చూశాదు కానీ గత మూడు నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురవడంతో రైతుల ఆశలకు రెక్కలు వచ్చాయి.

రైతుల పండుగ ఎరువక.

ఈ రోజు వ్యవసాయ పనిముట్లు అన్నింటినీ కడిగి శుభ్రం చేసుకుంటారు. రైతులు. వాటికి పసుపు కుంకుమలు అద్ది పూజించుకుంటారు. ఇక ఎద్దులు సంగతి అయితే చెప్పనక్కర్లేదు. వాటిని శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగులు పూసి కాళ్లకు గజ్జలు కట్టి పసుపు కుంకుమతో అలంకరిస్తారు పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కులో కొందరు తామ కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దులతో సమానంగా నడుస్తారు. వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి కష్టసుఖాలను పాలుపంచుకునే ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. ఒక ఏరువాక సాగుతుండగా అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సంప్రదాయమూ ఉంది. అందుకే ఏరువాక పాటలు నాగలి పాటలకి మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది.

పెరిగిన పత్తి సాగు విస్తీర్ణం

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం సాగు విస్తరణ పెరిగినట్లు జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. గత సంవత్సరం వర్షాకాలం ఖరీఫ్ సీజన్లో 7.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ఈ వర్షాకాలం సీజన్లో 8,04,512 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతా యని అంచనా వేశారు. దీంట్లో 3లక్షల 87,539 వేల ఎకరాల్లో పత్తిపంట సాగవుతుందని, 1,65,173 లక్షల ఎకరాల్లో వరిపంట, 4 వేల ఐదు వందల ఎకరాల్లో. మొక్క జొన్న, 79,163 వేల ఎకరాల్లో సోయాబిన్, 84, 821 వేల ఎకరాల్లో కంది, 7,987 వేల ఎకరా ల్లో మిను ములు, 14,826 వేల ఎకరాల్లో పెసర్లు, 20వేల ఐదు వందల ఎకరాల్లో చెరుకు, 18వేల ఐదువందల ఎకరాల్లో కూరగాయల పంటలసాగవుతాయని అంచనా వేశారు.

అన్నదాతల పండుగ ఏరువాక పౌర్ణమి పండుగ నేడే.

అన్నదాతల పండుగ ఏరువాక పౌర్ణమి పండుగ నేడే…

– వ్యవసాయ పనులకు శుభారంభం….

– రైతన్నలకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన ముత్యం ప్రవీణ్ కుమార్….

కొల్చారం, (మెదక్):- నేటి ధాత్రి

 

 

 

 

నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. దీనినే హలపౌర్ణమి అని కూడా అంటారు. ఇంతకీ ఈ ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏమిటి. దాన్ని ఈ రోజునే ఎందుకు చేసుకుంటారు అంటే… వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠం మొదలైన తరువాత వర్షాలు కురవడం మొదలవుతాయి. ఒక వారం అటూ ఇటూ అయినా కూడా, జ్యేష్ఠ పౌర్ణమినాటికి తొలకరి పడక మానదు. భూమి మెత్తబడకా మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు ఇది శుభారంభం అన్నమాట. అందుకనే ఈ రోజున ఏరువాక అంటే ‘దుక్కిని ప్రారంభించడం’ అనే పనిని ప్రారంభిస్తారు. అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకూ ఎందుకు ఆగడం. ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయవచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఎవరికి తోచినట్లు వారు తీరికని బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలితాలు తారుమారైపోతాయి. సమిష్టి కృషిగా సాగేందుకు, పరాగ సంపర్కం ద్వారా మొక్కలు ఫలదీకరణం చెందేందుకు, రుతువుకి అనుగుణంగా వ్యవసాయాన్ని సాగించేందుకు… ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయిక క్యాలండర్‌ను ఏర్పరిచారు మన పెద్దలు. అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి. కొంతమంది అత్యుత్సాహంతో ముందే పనిని ప్రారంభించకుండా, మరికొందరు బద్ధకించకుండా… ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు.

– వ్యవసాయ పనిముట్లకు పూజలు…

 

Agricultural Work.

 

 

ఏరువాక పౌర్ణమి రోజు వ్యవసాయ పనిముట్లు అన్నింటినీ కడిగి శుభ్రంచేసుకుంటారు రైతులు. వాటికి పసుపుకుంకుమలు అద్ది పూజించుకుంటారు. ఇక ఎద్దుల సంగతైతే చెప్పనక్కర్లేదు. వాటికి శుభ్రంగా స్నానం చేయించి, వాటి కొమ్ములకు రంగులు పూస్తారు. కాళ్లకు గజ్జలు కట్టి, పసుపుకుంకుమలతో అలంకరించి హారతులిస్తారు. పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కిలో కొందరు తాము కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దుతో సమానంగా నడుస్తారు. వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి, కష్టసుఖాలను పాలుపంచుకునే ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. ఇక ఏరువాక సాగుతుండగా, అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సంప్రదాయమూ ఉంది. అందుకనే ఏరువాక పాటలు, నాగలి పాటలకి మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది.
జ్యేష్ఠ మాసంలో మొదలయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం ఇంచుమించు భారతదేశమంతటా ఉంటుంది. మన దేశంలోని దాదాపు 80 శాతం వర్షపాతం ఈ నైరుతి వల్లనే ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమిని దేశమంతటా జరుపుకుంటారు. పున్నమి నాడు పూజలు చేయడం వల్ల ఆ సంవత్సరం అంతా పంటలు సమృద్ధిగా పండుతాయని అన్నదాతలు విశ్వసిస్తారు.

– రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సీనియర్ నాయకుడు ముత్యం ప్రవీణ్ కుమార్….

కొల్చారం మండలం రైతులకు కొల్చారం మండలం సీనియర్ బి ఆర్ఎస్ పార్టీ నాయకుడు ముత్యం ప్రవీణ్ కుమార్ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ ప్రకృతిని దైవంగా భావించి భూమిని పూజించే సంప్రదాయం మనదని పేర్కొన్నారు. వర్ష ఋతువు ఆరంభమయ్యే జ్యేష్ఠ పౌర్ణమి నాడు భూమిని పూజించడమే గాక వ్యవసాయానికి ఆధారమైన పశుసంపద రోగాల బారిన పడకుండా అన్నదాతలు సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version