ఇంటర్ విద్యార్థులు సత్ప్రవర్తన కలిగి ఉండాలి.

“ఇంటర్ విద్యార్థులు సత్ప్రవర్తన కలిగి ఉండాలి”

ఎస్సై లెనిన్.

బాలానగర్ నేటి ధాత్రి

 

 

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఎస్సై లెనిన్ విద్యార్థులకు కమ్యూనిటీ పోలీసింగ్ పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ దశలో విద్యార్థులు అవలంబించాల్సిన పద్ధతులు ప్రవర్తన విధానంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలు నిలబెట్టాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రమేష్ లింగం, అధ్యాపకులు అనురాధ, వినోద్, సునీల్, చంద్రకాంత్ విద్యార్థులు పాల్గొన్నారు.

సామర్థ్యాల అభివృద్ధి ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు.

సామర్థ్యాల అభివృద్ధి ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు.

ప్రారంభమైన 5 రోజుల ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమం

కేసముద్రం నేటి ధాత్రి:

ఎఫ్ ఎల్ ఎన్ తో సామర్ధ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా విద్యార్థుల్లో మంచి ఫలితాలను తీసుకురావచ్చని కేసముద్రం మరియు ఇనుగుర్తి మండలాల విద్యాశాఖాధికారులు కాలేరు యాదగిరి, మరియు జంగా రూపారాణి అన్నారు. కేసముద్రం మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 2 మండలాల ప్రాథమిక ఉపాధ్యాయులకు ఎఫ్.ఎల్.ఎన్. 5 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. ప్రతిరోజు సమయపాలన పాటిస్తూ శిక్షణను బాగా ఉపయోగించుకొని విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచేలా కృషి చేయాలన్నారు. అనంతరం 158 మంది ఉపాధ్యాయులకు మూడు గదుల్లో మండల రిసోర్సు పర్సన్లు శిక్షణ ఇచ్చారు. మొదటి రోజు తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులలోని ఎఫ్ఎల్ఎన్ అంశాల పై శిక్షణ ఇచ్చారు. వివిధ కృత్యాలు, పరస్పర చర్చల ద్వారా అర్ధవంతమైన శిక్షణ కొనసాగించారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్పి కె.సారంగం, ఎం.ఆర్.పీ. లు గనె యాదగిరి, బొరిగం రాములు, ఏదునూరి అశోక్, ఎన్నం భాస్కర్, వెలమల భాస్కర్, వట్నాల సత్యనారాయణ, మేకల సురేష్ నాయుడు, జి. మోహనకృష్ణ, ఘనపురం కృష్ణ, ఎస్.భాస్కర్, ఎం.ఐ.ఎస్. కో ఆర్డినేటర్ ఎస్.కె. ఖాదర్, కంప్యూటర్ ఆపరేటర్ వెన్ను భిక్షపతి, సీఆర్పీలు ఎం.డి. సుల్తానా, బండారు స్వాతి, ఇస్సంపల్లి ఉదయ్, చీర మురళి, నేలకొండ నాగవాణి, పులి సరిత, ధారావత్ రవి, నేరెళ్ల పద్మ తదితరులు పాల్గన్నారు.

గుడ్ ఫ్రై డే సందర్బంగా పరకాలలో సిలువయాత్ర.

గుడ్ ఫ్రై డే సందర్బంగా పరకాలలో సిలువయాత్ర

 

పరకాల నేటిధాత్రి

గుడ్ ఫ్రైడే (శుభశుక్రవారం) సందర్బంగా దివ్య కారుణ్య యేసు క్యాతలిక్ సంఘం ఫాదర్ బాలరాజు ఆధ్వర్యంలో ఉదయం బస్టాండ్ కూడలినుండి మొదలై పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట సిలువ యాత్రను చేపట్టారు.అనంతరం యూదుల రాజైన యేసుక్రీస్తు వారు ఈలోకంలో జీవించే జనాంగం కోసం సిలువలో ఎలా వేయబడ్డారని కళ్ళకు కట్టినట్టుగా యేసుక్రీస్తు వేశాధారణతో కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మడికొండ బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటి నాయకులు,మాజీ ఒకటో వార్డు కౌన్సిలర్ మడికొండ. సంపత్ కుమార్,డాక్టర్ మడికొండ శ్రీను,క్రైస్తవ సోదర సోదరీమణులు,సంఘ సభ్యులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వేసవి ఆరోగ్యానికి మేలు చేసే తాటి ముంజలు.

వేసవి ఆరోగ్యానికి మేలు చేసే తాటి ముంజలు

ఉపాధి కోసం తాటి ముంజల వ్యాపారం

ప్రయోజనాలతో పాటు రుచిని ఆస్వాదించండి

అంతర్గాం గీతా కార్మికులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

కాలానుగుణంగా వేసవిలో దొరికే తాటి ముంజలను చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో ఇష్టంగా తింటూ వాటి రుచిని ఆస్వాదిస్తారు.సోమవారం అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి గ్రామం నుండి గౌడ సామాజిక వర్గానికి చెందిన కైలాసం,సది అనే ఇరువురు తాటి ముంజలు వ్యాపారం చేస్తూ జిల్లా కేంద్రంలో నేటి ధాత్రి కెమెరాకి కనిపించారు.ఈ సందర్భంగా వారు ఇరువురు మాట్లాడుతూ ఆరోగ్యానికి మేలు చేసే తాటి ముంజలు వేసవిలో లభిస్తాయన్నారు.తాటి ముంజలు ఎంతో ప్రత్యేకమైనవి వీటిని పిల్లలు,పెద్దలు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారని పేర్కొన్నారు.గీతా కార్మికులైన వారు ఇరువురు పల్లెటూరు నుండి పట్టణ ప్రజల అందుబాటులోకి ముంజలను తీసుకువచ్చి అమ్ముతూ
ఉపాధి పొందుతున్నామన్నారు.తాటి ముంజల యొక్క ప్రయోజనాలను వారి మాటల్లో వివరించారు.తాటి ముంజలలో వేసవి వేడిలో శరీరానికి కావలసిన ఏ,బి,సి విటమిన్లు, ఐరన్,జింక్,ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా దొరుకుతాయని నిపుణులు చెబుతుంటారని చెప్పారు.తాటి ముంజలు మన శరీర బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తాయని,కాలేయ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయని, అధిక మొత్తంలో ఉండే పొటాషియం మన శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగిస్తాయని వైద్యులు చెబుతుంటే విన్నామని తెలిపారు.

ఆరోగ్యం బాగుపడాలని ప్రత్యేక పూజలు.!

మాజీ ఎమ్మెల్యే ఓదన్న గారి ఆరోగ్యం బాగుపడాలని ప్రత్యేక పూజలు

మందమర్రి నేటి ధాత్రి

 

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ ప్రాంతంలో బస్టాండ్ ఏరియా లోని అభయ ఆంజనేయ స్వామి గుడి లో ఎమ్మెల్యే మాజీ విప్ నల్లాల ఓదెలు గారు ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ మంగళవారం రోజున స్థానిక అభయాంజనేయ స్వామి మారుతి నగర్ మందమర్రి బస్టాండ్. ఆలయంలో కాంగ్రెస్ నాయకుడు ఏటూరి సత్యనారాయణ గారు మాజీ మా మాజీ విప్ మాజీ ఎమ్మెల్యే ఓదన్న గారు ఆరోగ్యంగా మహామృత్యుంజయడు గా తిరిగి రావాలని. అభయాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకం, ప్రత్యేక అర్చనలు చేశారు. 101 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది.భక్తులకు ఓదన్న గారి అభిమానులు తీర్థప్రసాదాలను స్వీకరించి మాజీ ఎమ్మెల్యే కోలుకోవాలని వేడుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కొద్దిరోజుల నుంచి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ ఉన్నాడు. అరోగ్యం తొందరగా బాగా పాడాలని అభిమానులు కార్యకర్తలు భగవంతుని వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరి సత్యనారాయణ తో పాటు ఓదన్న గారి అభిమానులు. ఆ ఏరియా ప్రజలు పెద్దలు అందరూ పాల్గొన్నారు

పుస్తక పఠనం ఒక మంచి అలవాటు

మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడి వంటిది…

*ప్రతి ఒక్కరూ మంచి పుస్తక పఠనం వారి దైనందిన జీవితంలో భాగంగా అలవర్చుకోవాలి.

*భారతీయ విద్యా భవన్ వారు ఏర్పాటు చేసిన 17వ తిరుపతి పుస్తక ప్రదర్శన భేష్.

జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్.

తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 08:

మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడి వంటిదని, పుస్తక పఠనం ఒక మంచి అలవాటు అని ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం మంచి పుస్తక పఠనానికి కేటాయించి వారి దైనందిన జీవితంలో అలవర్చుకోవాలని యువతకు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్.ఎస్ పేర్కొన్నారు.
నేటి శనివారం స్థానిక ఇస్కాన్ టెంపుల్ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో వారం రోజులకు పైగా కొనసాగుతున్న 17వ తిరుపతి పుస్తక ప్రదర్శనను కలెక్టర్ దంపతులు చిన్నారితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతీయ విద్యా భవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 17వ తిరుపతి పుస్తక ప్రదర్శన ప్రజల మన్నలు పొందుతు వారం రోజులుగా కొనసాగుతున్నదని, ఎన్నో అమూల్యమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, తిరుపతి ప్రజలు ప్రతి ఒక్కరూ సందర్శించాలని, మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడి వంటిదని, మంచి పుస్తక పఠనం మంచి అలవాటుగా మన దైనందిన జీవితంలో భాగంగా అలవర్చుకుంటే జ్ఞానం పెంపొందుతుంది అని తెలిపారు. కలెక్టర్ దంపతులు చిన్నారితో కలిసి పుస్తక ప్రదర్శనను తిలకించి పలు పుస్తకాలను కొనుగోలు చేశారు.
ఈ పుస్తక ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుండి 70 స్టాళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని.ఈ ఆదివారం పుస్తక ప్రదర్శన ముగియనుందని ప్రతిరోజు సాయంత్రం సంగీత సాహిత్య కార్యక్రమాలు ఏర్పాటు చేశామని భారతీయ విద్యా భవన్ డైరెక్టర్ పుస్తక ప్రదర్శన నిర్వాహకులు డాక్టర్ సత్యనారాయణ రాజు, అసోసియేట్ సెక్రటరీ దక్షిణామూర్తి కమిటీ సభ్యులు యుగంధర్ రాజు కలెక్టర్ కు వివరించారు.
పలువురు సాహిత్య పుస్తక అభిమానులు కలెక్టర్ తో మాట్లాడుతూ సదరు పుస్తక ప్రదర్శన చాలా ఉపయోగకరంగా ఉన్నాయని, పుస్తక ప్రదర్శన ప్రాంగణంలో చేపట్టిన పలు సాహిత్య, సంగీత కార్యక్రమాలు సందర్శకులను ఎంతగానో అలరిస్తున్నాయని వారు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version