బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ కంటెస్టడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ లో రోడ్లు, విధి దీపాలు, డ్రైనేజీ సమస్యలు ముఖ్యంగా రోడ్లను ఆక్రమించడం వల్ల అంబులెన్స్ మరియు వాహనాలు పోయే పరిస్థితి అక్కడే లేవు మరియు అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారాని బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ కంటెస్టడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ చందనగర్ జీహెచ్ఎంసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి వినతి పత్రం అందజేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ హఫీజ్ పేట్ డివిజన్ మొత్తం సమస్యలమైయం అయ్యింది అన్ని అన్నారు.ఈ యొక్క సమస్యలను అధికారులుగాని,నాయకులు గాని పట్టించుకోవడం లేదని అన్నారు.ఇకనైనా నాయకులు,అధికారులు మేలుకొని ప్రజల సమస్యలను పరిష్కరించే విదంగా పనిచైయండి అన్ని అన్నారు.లేని పక్షంలో ప్రజా పోరాటం తప్పదు అన్ని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పవన్,నవీన్ మరియు తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ ను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని వార్డు నెంబర్ 25 , గోల్ మజీద్ ప్రాంతంలో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులతో నిర్మించనున్న బాక్స్ డ్రైనేజీ నిర్మాణపు పనులకు సోమవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ పట్టణంలోని గోల్ మజీద్ నుంచి రైస మజీద్ వరకు రూ.4 కోట్లతో బాక్స్ డ్రైనేజీ నిర్మాణం చేపడతామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ 2047 తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, వారి అడుగు జాడల్లో ముందుకు నడుస్తూ విజన్ 2047 ద్వారా మహబూబ్ నగర్ ను తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఒక్క సంవత్సరంలోనే రూ.250 కోట్లతో విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, అందులో కొన్ని ఇప్పటికే పూర్తి చేసుకోగా, మరి కొన్ని అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో మహబూబ్ నగర్ ను మరింత అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ కు ఏమి కావాలన్నా ఇవ్వడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని, రానున్న 3 సంవత్సరాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అత్యధిక సంఖ్యలో నిధులు తెచ్చి మహబూబ్ నగర్ ను అద్బుతంగా అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ , ఫైయాజ్, లీడర్ రఘు, మోయీజ్,ఉమర్ అఫీజ్, మహబూబ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆలయాల నిర్మాణానికి తండ్రి జ్ఞాపకార్థకంగా తనయులు భారీ విరాళం అందజేత
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మున్సిపల్ లోని విలేజ్ కేసముద్రంలో ఇటీవలే విశ్వబ్రాహ్మణ సంఘ వారు శ్రీశ్రీ కాశీ విశ్వేశ్వరాలయం, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయము మరియు శ్రీ సరస్వతి దేవి అమ్మవార్ల ఆలయాల నిర్మాణానికి భూమి పూజ సిలన్యాస శంకుస్థాపన చేయడం జరిగింది.
అనంతరం ఆలయాల కమిటీ సభ్యులు ఆలయాల నిర్మాణం కొరకు నిధుల సేకరణ చేపట్టడం జరిగింది.
ఈ నిధుల సేకరణలో భాగంగా కేసముద్రం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారి కీర్తిశేషులు చిల్లం చర్ల లక్ష్మణరావు ల జ్ఞాపకార్ధకంగా వారి సతీమణి చిల్లం చర్ల ధనమ్మ మరియు కుమారులు చిల్లం చర్ల శ్రీనివాస్, శ్యాంసుందర్, సంతోష్ కుమార్, సతీష్ కుమార్ లు ఆలయ నిర్మాణం కొరకు వారి తండ్రి జ్ఞాపకార్థకంగా ఒక లక్ష ఒక వెయ్యి 116 ఆలయాల నిర్మాణం కొరకు భారీ విరాళం అందజేయడం జరిగింది.
చిల్లంచర్ల లక్ష్మణరావు కుటుంబం గ్రామంలో ఇప్పటివరకు నిర్మించిన ఆలయాలకు విరాళం దాతలుగా ముందు వరసల ఉండేవారని అనాదిగా
ఈ కుటుంబం భక్తి శ్రద్దలకు నిదర్శనంగా నిలిచారని అలాగే వ్యాపార రంగంలో ఎంతో నిజాయితీగా కొనసాగే వారిని అందరిని తన మంచితనంతో ఆకట్టుకునే వారిని ఇలాంటి వారు సమాజానికి ఎంతో అవసరమని వారి జ్ఞాపకాలు ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతున్నాయని పలువురు భావిస్తున్నారు.
వీరి తనయులు కూడా తండ్రి బాటలో నడుస్తున్నందుకు వారి ఆశయాలను నిలబెట్టుకుంటూ తండ్రి యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచుతున్నారని విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు మరియు గ్రామం ప్రజలు వీరి దాతృత్వానికి అభినందనలు తెలియజేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఉల్లి రాజేశ్వరరావు, చిట్టోజు రమణాచారి, ఆరెందుల కుమారస్వామి, కందుకూరి సోమయ చారి, ఉల్లి వెంకటేశ్వర్లు, తుమ్మనపల్లి జితేందర్ రావు, బొల్లోజు శ్రీనివాస్, చిట్టోదు శ్రీనివాస్, కందుకూరి శ్రీనివాస చారి, తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలోని అమ్మపల్లి, అప్పాజీపల్లి, బోడగుట్ట తండా, గౌతాపూర్ గ్రామాలలో సోమవారం ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని.. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యను ప్రతి నిరుపేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
#అంతిమయాత్రలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి..
నల్లబెల్లి, నేటిధాత్రి:
మండలంలోని లెంకలపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏరుకొండ వెంకటేష్, వేణు తండ్రిగారైన రాములు గుండెపోటుతో సోమవారం ఉదయం మృతిచెందగా విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి మృతుని సగృహానికి చేరుకొని మృతవి పార్థివ దేహం పై పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి అంతిమయాత్రలో పాల్గొన్నారు ఆయన వెంట ఫ్యాక్స్ చైర్మన్ చెట్టు పల్లి మురళీధర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కొత్తపెళ్లి అశోక్, నాయకులు మామిళ్ల రాజు, కస్తూరి రవి, పప్పు శంకర్, మేకల సాంబయ్య, ఆకుల సాంబారావ్, కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, నరేష్ తదితరులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.
సహకార సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా గ్రామాల అభివృద్ధి.
సహవికాస సంస్థ మేనేజర్ లక్ష్మణ్..
విజయవంతంగా దుగ్గొండి పురుషుల పొదుపు సమితి వార్షిక మహాసభ..
నర్సంపేట,నేటిధాత్రి:
స్వకృషి ఉద్యమంలో నూతన కంప్యూటరీకరణ వలన సంఘాల్లో సభ్యులకు ఎంతగానో మేలు జరుగుతున్నదని సహవికాస సంస్థ మేనేజర్ లక్ష్మణ్ తెలిపారు.
దుగ్గొండి మండల కేంద్రంలో గల దుగ్గొండి పురుషుల పొదుపు సమితి అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ అధ్యక్షతన ఆ సమితి 12 వ వార్షిక మహాసభ కార్యాలయం ఆవరణలో జరిగింది.
సమితి పరిధిలోని దుగ్గొండి,చంద్రయ్యపల్లి,దేశాయిపల్లి, రేబల్లె,వెంకటాపురం,నేరేడుపల్లి, వసంతాపురం,ప్రగతిసింగారం,అక్కంపేట అనే 10 సంఘాలు ఉండగా మొత్తం 4382 మంది సభ్యులు కాగా మొత్తం రూ.10 కోట్ల నిధులు ఉన్నాయి.
సమితి నిర్వహణ పట్ల స్థితిగతులు,అభివృద్ధి పట్ల చర్చించుకున్నారు.
ఈ నేపథ్యంలో 2024-25 వార్షిక నివేదికను అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్,గణకులు పోలోజు రమణాచారిలు చదివి ప్రవేశపెట్టారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న సహకార వికాస సంస్థ మేనేజర్ లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామాల్లో సహకార సంఘాలు,స్వచ్ఛంద సంస్థలు మంచిన నడిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఉద్దేశ్యంతో సహకార వికాస సంస్థ ఏర్పాటు చేయగా నేడు స్వకృషీ ఉద్యమం వజయవంతంగా నడుస్తున్నాయని తెలియజేశారు.
Development
1995 చట్టం ద్వారానే రాజకీయ పార్టీలకతీతంగా సహావికాస సంస్థ సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు.
సహకార ఉద్యమంలో 54 సమితిలు ఉండగా సేవా దృక్పథంతో నిర్వహణలో ఉన్నాయని తెలిపారు.
సిడీఎఫ్ ధర్మకర్తల మండలి ప్రతినిధి దర్మవతి మాట్లాడుతూ సంఘాల అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు కృషి కీలకమని అన్నారు.రానున్న రోజుల్లో సభ్యులు ,సంఘాలు ఇబ్బందులు పదద్దనే ఉద్దేశ్యంతో సహావికాస కార్యశాల నిర్ణయించిందని దీంతో కొన్ని ఖాతాలు నిలిపివేసిందని తెలియజేశారు.
సిడీఎఫ్ అభివృద్ధి అధికారి నవీన్ మాట్లాడుతూ సంఘాల్లో బకాయి శాతం జీరో చేస్తేనే మెరుగు లభిస్తుంది అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షుడు కందికొండ రవీందర్,సంఘాల అధ్యక్షులు,సమితి పాలకవర్గ సభ్యులు కందుల శ్రీనివాస్ గౌడ్, మోతుకూరి ప్రభాకర్,పెద్దిరెడ్డి మహేందర్ రెడ్డి,బట్టి బక్కయ్య,పొగాకు రమేష్ గౌడ్,వేములపల్లి బాబు,పెండ్యాల మల్లేశం,రాయరాకుల రమేష్,ప్రేమ్ సాగర్,ఆయా సంఘాల ఉపాధ్యక్షులు,పాలకవర్గ సభ్యులు,గణకులు పాల్గొన్నారు
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలి
భూపాలపల్లి నేటిధాత్రి
సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ నిర్వహించారు జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం సమర్పించిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా, సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేసినట్లు తెలిపారు. ప్రజావాణిలో 22 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణి ప్రధాన ఉద్దేశం ప్రజల ఫిర్యాదులను స్వీకరించి త్వరితగతిన పరిష్కారం చేయడమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మీ, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్ డెలివరీ సమయంలో ఆన్లైన్లో బుక్ చేసిన రవాణ చార్జీల పేరుతో వినియోగదారుల నుండి అదనంగా 100 రూ” వరకు వసూలు చేస్తున్నారని (రిసిప్ట్ బిల్లు) అడుగుతే ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారని వినియోదారులకు అందుబాటులో ఉంచకుండా కమర్షియల్ సిలిండర్లకు బదులు ఇండ్లలో వాడే సిలిండర్లను హోటల్స్ బేకరీ షాపులలో నిల్వ ఉంచుతూ ప్రజలకు సకాలంలో అందించకుండా ఇబ్బందులు గురిచేస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని దళారులను గుర్తించి వారి లైసెన్సులు రద్దు చేసి ప్రజలను వారి బారి నుండి కాపాడాలని వారితో కుమ్మక్కైన అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ వేల్పుగొండ మహేందర్ జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి మురారి సదానందం తదితరులు పాల్గొన్నారు
ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామం లో ప్రభుత్వ పాఠశాల లో తమ పిల్లలను చేర్పించాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్స్ బడి బాట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. మల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల లో కల్పిస్తున్న వసతుల గురించి విద్య బోధన గురించి వివరించారు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ పేద విద్యార్థులకు విద్య ను అందిస్తున్నదని ప్రభుత్వ పాఠశాల లో తమ పిల్లలను చేర్పించాలని కోరారు ఈ కార్యక్రమం లో టీచర్స్ డి. మమత కే. పద్మ సి ఎచ్. సునీల్ నరేష్ అంగన్వాడీ టీచర్స్ బి. రమ జి. తిరుపతమ్మ ఎస్. రమాదేవి ఏ. తిరుమల ఆశ వర్కర్ సరిత లు పాల్గొన్నారు
మొగుళ్లపల్లి మండలంలోని పెద్దవాగు బ్రిడ్జి వద్ద గత రెండు సంవత్సరాలుగా పెద్దవాగు అధిక వర్షపాతంతో ఈ వాగులో అధిక మోతాదులో నీటి ప్రవాహం రావడం వలన ఈ యొక్క బ్రిడ్జి ఆనకట్ట వరద ప్రభావానికి కొట్టుకొని పోయింది అప్పటినుండి ఇక్కడున్న అధికారులు ఈ యొక్క ఆనకట్టకు మరమ్మత్తులు చేయలేదు కనీసం పలు అభివృద్ధి పనుల కోసం మండలంలో ఉన్న 20 గ్రామాలకు ఇదే రోడ్డు నుండి వెళ్తున్న ఎమ్మెల్యే గారికి ఈ సమస్య పట్టలేదా ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు చెప్పలేదా మళ్లీ వర్షాకాలం మొదలైంది వాగు అధిక మోతాదులో మళ్ళీ వస్తే ఇక్కడ ఉన్న 20 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యే అవకాశం ఉంది ఎందుకనగా ఇప్పటికే రోడ్డు పై నుండి అనకట్ట కిందకు వర్షం వచ్చినప్పుడు మట్టి కొట్టుకుపోతుంది కావున ఈ రోడ్డు తెగిపోయే ప్రమాదం ఉంది కావున తక్షణమే సంబంధిత అధికారులు గమనించి ఈ ఆనకట్టకు మరమ్మత్తులు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బండారి కుమార్ డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న అధికారులు తక్షణమే మరమ్మతు పనులు జరిపించాలని కోరుకుంటున్నాను
నర్సంపేట మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేసిన ఎంసిపిఐ (యు) నాయకులు
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల విభజన లో పారదర్శకత పూర్తిగా లోపించిందని ఎం సిపిఐ( యు) నాయకులు కన్నం వెంకన్న , వంగల రాగ సుధా , కొత్తకొండ రాజమౌళి ఆరోపించారు. ఈ సందర్భంగా నర్సంపేట మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.ఇటీవల కొన్ని గ్రామాలను నర్సంపేట మున్సిపాలిటీలో విలీనం చేయగా , ఆ గ్రామాల ఓటర్లను రెండు ,మూడు వార్డుల్లో వేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. గ్రామాల విలీనం తో ఒకవైపు ప్రజలు ఉపాధి కోల్పోగా ,ఇది చాలదన్నట్టు ప్రజలను మరింత అస్థిరపరిచేందుకు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.అదే రకంగా పట్టణంలోని జ్యోతిబాసు నగర్ , కారల్ మార్క్స్ కాలనీలో చాలా ఏళ్లుగా సమస్యలు వెంటాడుతున్నాయని ఈ సమస్యలను పరిష్కరించడంలో పాలకవర్గాలు ఘోర వైఫల్యం చెందారన్నారు .ఇప్పటికైనా కాలనీలో అంతర్గత రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను వెంటనే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో దశలవారి ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో ఏఐసిటియు జిల్లా అధ్యక్షులు ఎండి మా షూక్ , పట్టణ నాయకులు భైరబోయిన నరసయ్య ,బెజ్జంకి పుష్పనీలా , జన్ను విజయ తదితరులు పాల్గొన్నారు .
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సంగాయిపల్లి గ్రామంలో సోమవారం స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో.. ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహవిష్కరణ చేసిన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ , బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో నాయకులు మాట్లాడుతూ.. యువత స్వామి వివేకానంద భారతదేశంలోని యువతకు రోల్ మోడల్, భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలు గుర్తించుకునే స్థాయిలో మాట్లాడి మెప్పించారు , యువత వివేకానంద చూపించిన మార్గంలో నడవాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆమన్ గల్ మాజీ జడ్పిటిసి కండే హరిప్రసాద్ , మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,మండలంలోని మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసిలు, తదితరులు పాల్గొన్నారు.
అయినవోలు కాంగ్రెస్ మండల పార్టీలో ముసలం??? మండల కమిటీలో అన్ని గ్రామాలకు లభించని ప్రాతినిధ్యం అధ్యక్షుడి వ్యవహార తీరుపై సర్వత్రా అసంతృప్తి??? అధికారం కాంగ్రెస్ గెలుపు కాదు బిఆర్ఎస్ ఓటమి క్యాడర్ ను సమన్వయ పరచడంలో పూర్తిగా విఫలం ప్రజలతో మమేకమవ్వకుండా పదవులపై కన్ను ఐలోనోళ్లకు నచ్చకపోతే అంతే సంగతులు నైరాశ్యంలో వలస వచ్చిన కాంగ్రెస్ నాయకులు
నేటి ధాత్రి అయినవోలు :-
అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీలో ముసలం ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
త్వరలోనే మండల కమిటీ మార్పు తద్యం అని నాయకులు భావిస్తున్నారు.
ఎందుకంటే అధికారంలోకి రాకముందు ఆపత్కాలంలో ఉన్న నాయకులతో మండల కమిటీని సర్దుబాటు చేయగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లోకి వలస వచ్చిన నాయకులకు తగిన ప్రాతినిధ్యం లేదని వారంతా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది.
అయితే మండల కమిటీలో ఇన్నాళ్లు ఏకపక్షంగా వ్యవహరించిన నాయకులు త్వరలో జరగబోయే స్థానిక సమరంలోను పదవులు ఆశిస్తుండటంతో ఇన్నాళ్లు అధికారం అనుభవించిన వారికి మళ్ళీ పదవులు ఇస్తే కేడర్లో తీవ్ర అసంతృప్తి చెలరేగుతుందని ఎమ్మెల్యే భావిస్తున్నారు.
అందుకే పోటీపై ఆసక్తి ఉన్న నాయకులకు మండల కమిటీలో చోటు లేకుండా చేసి అసంతృప్తితో ఉన్న నాయకులతో మండల కమిటీని పూర్తి చేసి పాత కొత్త నాయకులను కలుపుకొని ముందుకు పోవాలని ఎమ్మెల్యే యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
అంతే కాకుండా ప్రస్తుత అధ్యక్షుని వ్యవహార శైలి పై వివిధ గ్రామాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మండల కమిటీ అంటే తాను ఒక్కడినే అన్నట్లు భావిస్తూ పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కింది స్థాయి నాయకులకు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
మండలంలో ఉన్న ఒకరిద్దరు వైట్ కాలర్ నాయకులను వెంటవేసుకొని తం చెప్పిందే మండలంలో తాను చెప్పిందే శాసనం అన్నట్లుగా ఈ గ్రూపు వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తుంది.
పాత కొత్త నాయకుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తొలగించి వారి మధ్య సయోధ్య కుదిర్చి పార్టీ అభ్యున్నతికి కృషి చేయాల్సిన నాయకులే తాము చెప్పిందే వేదం అంటూ ఏకపక్షంగా వ్యవహరిస్తుండటంతో కొత్తగా పార్టీలో చేరిన నాయకులు తమకు తగిన ప్రాధాన్యత లభిస్తలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విషయాన్ని వాళ్ళ పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో పార్టీలో తమ స్థానం ఏమిటో కొత్తగా వచ్చిన నాయకులకు తెలియని పరిస్థితి.
ఇటు మండల కమిటీ లోను మరియు నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీ లోను కొత్తవారికి చోటు కల్పించలేదు.
అంతేకాకుండా ప్రభుత్వ పథకాల కేటాయింపులో కూడా తగిన ప్రాధాన్యత లభించడం లేదని పదవులు పథకాలు అన్ని సీనియర్లము అన్న పేరుతో పాత కాంగ్రెస్ నాయకులే పెత్తనం చెలాస్తుండడంతో ఏదో ఆశించి అధికార పార్టీలో చేరిన నాయకులు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తుంది.
అంతే కాకుండా అయినవోలు మండలంలో ఉన్న పెద్ద నాయకుడు కాంగ్రెసులో చేరికతో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీలో నడిచిన నాయకులు కార్యకర్తలకు రాబోయే స్థానిక సమరంలోనూ టికెట్లు కేటాయిస్తారు అన్న ఆశ లేదు.
తమకు తగిన గుర్తింపు లభించకపోవడంతో పార్టీ మారి తాము తప్పు చేశామా అని నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తుంది.
పోలీస్ భాస్ గా ఎన్నో ఆపరేషన్లు చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే రాజకీయాల్లో అరగంట తర్వాత రాజకీయ చాణక్యతను చూపి పాత కొత్త నాయకుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలకు చెక్ పెట్టి తన రాజకీయ చాణక్యతను ప్రదర్శిస్తారా లేదా వేచి చూడాలి
న్యాల్కల్ మండల్ నూతన తహశీల్దారిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మల్గి గ్రామానికి భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సుకు విచ్చేసిన ఎమ్మార్వో ప్రభులు సార్ గారికి సన్మానించిన మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి వారితో పాటు బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి మైనార్టీ నాయకులు అఖిల్ మియా తదితరులు పాల్గొన్నారు.
భూ భారతి రేవన్యూ సదస్సు సద్వినియోగం చేసుకోవాలని పరకాల ఎమ్మార్వో విజయలక్ష్మి అన్నారు.
సోమవారం రోజున మండలంలోని మల్లక్కపేట గ్రామంలో తహసీల్దార్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని,ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని,సదస్సుల ద్వారా భూ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం లభించిందన్నారు.
MRO Vijayalakshmi.
రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి భూ సమస్యల పరిస్కరిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ అశోక్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి సుమలత,జూనియర్ అసిస్టెంట్ రాజు,రెవన్యూ సిబ్బంది,కారోబార్ వెనుకమూరి ఆనందరావు, స్థానికులు పాల్గొన్నారు.
కల్వకుర్తిలో ఘనంగా..హిందూ సామ్రాజ్య దినోత్సవేడుకలు.
కల్వకుర్తి/ నేటి ధాత్రి :
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో సోమవారం 1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ, జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన ప్రేమకలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది. భారత, రామాయణ గాధలు చెప్పి వీరత్వం మొలకింపచేసింది. తన తండ్రి పొందిన పరాజయాలను అద్యయనం చేసి అనతి కాలంలోనే శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ఠాతుడయ్యాడు. హిందూ సామ్రాజ్య స్థాపన యుద్ధం చేసి బీజాపూర్కు చెందిన ‘తోరణ’ దుర్గాన్ని స్వాధీనం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన అధీనంలో ఉంచుకున్నాడు.
పైసా ఖర్చు లేని ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య
మండల విద్యాధికారి కాలేరు యాదగిరి
2025 పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ చూపిన పెనుగొండ ఉన్నత పాఠశాల విద్యార్థికి సన్మానం:
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండలంలోని ప్రభుత్వ పాఠశాల అయినటువంటి పెనుగొండ ఉన్నత పాఠశాలలో చదివి 549 మార్కులు సాధించి, ఉత్తమ ప్రతిభ కనబర్చిన మండల యశ్వంత్ సాయిని మరియు అతని తల్లిదండ్రులను పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు కేసముద్రం మండల విద్యాధికారి కాలేరు యాదగిరి మాట్లాడుతూ గూడూరు మండలంలోని అప్పరాజుపల్లి గ్రామానికి చెందిన మండల శ్రీను, సరస్వతి దంపతుల కుమారుడు యశ్వంత్ సాయి చిన్నప్పటి నుండి చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపేవాడని, ప్రభుత్వ పాఠశాలల్లో పేద బలహీన బడుగు వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని తెలియజేయుటకు ఈ విద్యార్థి సాధించిన మార్కులే నిదర్శనమని తెలియజేశారు. అదేవిధంగా తల్లిదండ్రులందరూ ఆలోచించి పైసా ఖర్చు లేని ప్రభుత్వ పాఠశాలలో చదివించి మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని అందుకు మా ప్రభుత్వ పాఠశాలలు ముందు ఉంటాయని తెలియజేశారు. జడ్పిహెచ్ఎస్ పెనుగొండ పాఠశాలలో అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయ బృందం నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తెలియజేశారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ పెనుగొండ పాఠశాలలో అత్యుత్తమమైన విద్యా బోధన మా పిల్లలకు అందుతుందని మా పిల్లల్ని తల్లిదండ్రుల వలె ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణలో చదువు నేర్పుతున్నారని చెప్పారు. ఈ సన్మాన సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం అంజయ్య, హుస్సేన్, వెంకటగిరి, భాస్కర్, సత్యం, రవి, భీముడు, కిషన్, మల్లేశం, విజయ్ చందర్ మరియు అప్పరాజుపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు గ్రామ పెద్దలు పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సన్మాన సభను విజయవంతం చేశారు.
పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేసినందున కలెక్టర్ వినతి పత్రం అందజేత
మాజీ వైస్ ఎంపీపీ లతా- లక్ష్మారెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం గంగిరేణిగూడెం గ్రామంలో కెసీఆర్ హయాంలో ప్రతిష్టా త్మకంగా ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనాన్ని నరికి వేసి అక్కడ గ్రామపంచాయతీ భవనం నిర్మించుటకు అధికా రులు సిద్ధమై గ్రామస్తులు వద్ద ని మొరపెట్టుకున్నా కొందరి కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి వల్ల శంకుస్థాపన కూడా పూర్తి చేశారు.గతంలో గ్రామపంచా యతీ భవన నిర్మాణానికి ఎమ్మార్వో పరిశీలించి నిర్ధారణ చేసిన 0.06 గుంటల కాళీ స్థలం పల్లె ప్రకృతి వనానికి పక్కనే ఉన్నందున గ్రామస్తుల కోరిక మేరకు ఆ స్థలంలోనే నిర్మించాలేతప్ప పల్లె ప్రకృతి వనాన్ని నాశనం చేయకూడ దని గ్రామస్తుల సహకారంతో కలెక్టర్ వినతి పత్రం అందజే సిన మాజీ వైస్ ఎంపీపీ లతా- లక్ష్మారెడ్డి.ఈ కార్యక్రమంలో జాలిగాపు అశోక్, ఎండి మగ్దున్ పాషా, పోతు రమేష్, పెరుమాండ్ల కుమారస్వామి, సప్పిడి పోషాలు తదితరులు పాల్గొన్నారు.
ఏఐటియుసి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సింగరేణి కార్మికులకు, అధికారులకు సరఫరా చేసే ఔషధాలు సరఫరా చేయడంలో యాజమాన్యం విఫలం చెందిందని ఏఐటియుసి యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ లు అన్నారు. కార్మికులకు ఔషధాల కొరత తీవ్రంగా ఉందని సోమవారం రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ డాక్టర్ ప్రసన్న కుమార్ కు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడారు. సింగరేణి సంస్థ వేలకోట్ల లాభాలు అర్జిస్తూ కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు, పదవి విరమణ కార్మికులకు దీర్ఘకాలిక వ్యాధుల యొక్క ఔషధాలను గత రెండు నెలలుగా పూర్తిస్థాయిలో సరఫరా చేయలేకపోతుందని, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని యాజమాన్యం వెంటనే స్పందించి ఔషధాలను పూర్తిస్థాయిలో సరఫరా చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నామని అన్నారు. యాజమాన్యం స్పందించకుంటే గుర్తింపు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఇప్పకాయల లింగయ్య, మందమర్రి బ్రాంచ్ ఉపాధ్యక్షులు సుదర్శన్, భట్టు, సంపత్, అప్రోజ్ ఖాన్, రమేష్, సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu).. రీల్ లోనే కాదు రియల్ గా కూడా ఎంతో స్టైలిష్ గా కనిపిస్తాడు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu).. రీల్ లోనే కాదు రియల్ గా కూడా ఎంతో స్టైలిష్ గా కనిపిస్తాడు. ప్రస్తుతం SSMB29 సినిమాతో బిజీగా ఉన్న మహేష్ తాజాగా అఖిల్ అక్కినేని(Akhil Akkineni) రిసెప్షన్ లు కుటుంబ సమేతంగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించాడు. మహేష్ తో పాటు నమ్రత(Namrata) , సితార కూడా ఈ వేడుకలో సందడి చేశారు. అఖిల్- జైనబ్ వివాహం జూన్ 6 న జరిగిన విషయం తెల్సిందే. ఇరు వర్గాల కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో సింపుల్ గా ఈ వివాహం జరిగింది. ఇక జూన్8 న వవీరి రిసెప్షన్ గ్రాండ్ గా నిర్వహించారు.
ఇండస్ట్రీ నుంచి స్టార్ సెలబ్రిటీలు అందరూ ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో మహేష్ బాబు సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారాడు. ఎంతో సింపుల్ గా కనిపించినా.. అందరి చూపు మహేష్ పైనే ఉంది అని చెప్పొచ్చు. ఇక మహేష్ ధరించిన టీ షర్ట్ ను చూసి ముచ్చటపడిన అభిమానులు.. అలాంటి టీ షర్ట్ నే కొనడానికి, దాని రేటు ఎంత అని గూగుల్ చేసి ఖంగు తిన్నారు.
ఆలివ్ గ్రీన్ కలర్ లో ఫ్లవర్ డిజైన్ తో ఉన్న టీ షర్ట్ హెర్మ్స్ అనే ఇంటర్నేషనల్ బ్రాండ్ తయారుచేసింది. దీని విలువ అక్షరాలా రూ. 1.51 లక్షలు. నమ్మడానికి వీలు లేకున్నా అది నిజం. అది సూపర్ స్టార్ రేంజ్. మొదటి నుంచి మహేష్ బయటకు చాలా సింపుల్ గా వచ్చినా చాలా కాస్ట్లీ దుస్తులు ధరిస్తూ ఎప్పటికప్పుడు అభిమానులకు షాక్ లు ఇస్తూనే ఉంటాడు. ఇక టీ షర్ట్ ధర లక్షల్లో ఉండడంతో నెటిజన్స్.. ఆమ్మో ఒక్క టీ షర్ట్ ధర అంతనా అని నోర్లు వెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం మహేష్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.