వనపర్తి లో అవసరం లేని చోట సిసి రోడ్ల నిర్మాణం

వనపర్తి లో అవసరం లేని చోట సిసి రోడ్ల నిర్మాణం పై అధికారులపై ఏ సీ బీ అధికారులకు ఫిర్యాదు

ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్

వనపర్తి నెటిదాత్రి :

 

 

వనపర్తి పట్టణంలో మున్సిపల్ టి యు ఎఫ్ యూ డి సి ప్రభుత్వ ని లతో చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణం అవసరం లేని చోట వేస్తున్నారని మంచిగా ఉన్న రోడ్లను తొలగించి ప్రభుత్వ నిధులతో సి సి రోడ్లు వేయించి అభివృద్ధిని పక్కదారి పక్కదారి పట్టిస్తున్నారని అదేవిధంగా సిసి రోడ్లు నాణ్యతగా వేయడం లేదని అధికారుల పర్యవేక్షణ కాంట్రాక్టర్ పర్యవేక్షణ లేదని వర్షంలో కూడా సిసి రోడ్డు వేయడం వల్ల నాణ్యత కోల్పోతుందని జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ సెల్ నెంబర్ 630 99 76 569 విలేకరులకు తెలిపారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో సిసి రోడ్ల నిర్మాణం నూతన కాలువ ల నిర్మాణం వాటిపై సందర్శించామని ఆయన పేర్కొన్నారు అధికారుల అవినీతి కాంట్రాక్టర్ చిన్న చోటా నాయకుల జోబులు నింప డానికి సీసీ రోడ్డు మురికి కాల్వలు ఓంకర టింకర నాసిరకంగా కట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వనపర్తి లో ప్రభుత్వ సొమ్ము అధికారుల జేబుల్లోకి చోటా నాయకుల జేబుల్లోకి వెళుతున్నాయని సాక్షాదా రా లతో అఖిలపక్ష ఐక్యవేదిక ప్రజల తరఫున హ్యూమన్ రైట్స్ చీఫ్ సెక్రటరీ ఏసీబీ సిఎండిఎస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ప్రజా భవన్ హైదరాబాద్ కు ఫిర్యాదు చేస్తామని చేస్తామని ఆయన తెలిపారు . ప్రజల సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తే కాంట్రాక్టర్ చోటా నాయకులకు జేబులు నింపుతూ వనపర్తి పట్టణ అభివృద్ధిని పక్కదారి పట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సి సి రోడ్లను నూతనంగా నిర్మించే కాలువలను తనిఖీ చేసిన వారిలో జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు సతీష్ యాదవ్ గౌనికాడి యాదయ్య కొత్త గొల్ల శంకర్ బొడ్డుపల్లి సతీష్ రామస్వామి కురుమూర్తి రాము వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు

మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం:

మందమర్రి నేటి ధాత్రి :

 

 

మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం: బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్
గంజాయి నిర్మూలనే ధ్యేయంగా పోలీస్ శాఖ భారీ అవగాహన ర్యాలీ
మందమర్రి: మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించాలనే గొప్ప లక్ష్యంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని, మందమర్రి సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలో “మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీ”ని గురువారం ఘనంగా నిర్వహించారు.

 

 

 

 

ఈ ర్యాలీని ఏసీపీ రవి కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.
మందమర్రి సింగరేణి గ్రౌండ్ నుండి మార్కెట్ మీదుగా సాగిన ఈ భారీ ర్యాలీలో సింగరేణి మందమర్రి ఏరియా జీఎం దేవేందర్, ఇతర సింగరేణి అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, యువత, రాజకీయ నాయకులు, మహిళలు, పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. “మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకండి” వంటి నినాదాలతో విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి ప్రజలలో చైతన్యం నింపారు. అనంతరం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత ప్రతిజ్ఞ చేసి, “యాంటీ డ్రగ్ సోల్జర్స్”గా సంతకాలు చేశారు.

 

 

 

 

ఈ సందర్భంగా ఏసీపీ రవి కుమార్ మాట్లాడుతూ, “దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. అలాంటి యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలై పురోగతికి, ఉజ్వల భవిష్యత్తుకు స్వయంగా అవరోధాలు సృష్టించుకోవద్దు. సమాజం నుండి మాదకద్రవ్యాలను సమూలంగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. పోలీస్ శాఖ గంజాయి వంటి మత్తుపదార్థాల అమ్మకం మరియు వాడకంపై కఠినంగా వ్యవహరిస్తుంది,” అని హెచ్చరించారు.

 

 

 

సింగరేణి జీఎం దేవేందర్ మాట్లాడుతూ, “చెడు వ్యసనాల వల్ల యువత ఆరోగ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాకుండా, చట్టవ్యతిరేక కార్యకలాపాలలో చిక్కుకుంటున్నారు. ఈ మత్తు అనే మహమ్మారి నుండి మన యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది,” అని అన్నారు.

 

 

 

మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, “సరదాగా మొదలయ్యే అలవాటే వ్యసనంగా మారి జీవితాలను నాశనం చేస్తుంది. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా విద్యార్థులు తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలి. గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనలో యువత భాగస్వామ్యం కావాలి,” అని కోరారు.
మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే ఉపాధ్యాయులకు, యాంటీ-డ్రగ్ కమిటీలకు లేదా డయల్ 100, 1908 నంబర్లకు ఫోన్ చేసి పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

 

 

 

 

ఈ కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఎస్ఐలు, సింగరేణి పర్సనల్ మేనేజర్, ఎస్ఓ టూ జీఎం, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులు, పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పిచ్చిది.. ట్రాక్ పై కారును పరుగులు పెట్టించింది .

పిచ్చిది.. ట్రాక్ పై కారును పరుగులు పెట్టించింది:

శంకర్ పల్లి వద్ద భయభ్రాంతులు: రైళ్ల రాకపోకలకు విఘాతం

శంకరపల్లి, నేటి ధాత్రి

 

 

 

శంకర్ పల్లి వద్ద దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతి.. పట్టాలపై కారును పరుగులు పెట్టించింది. 80 కిలోమీటర్ల వేగంతో కారు పరుగులు తీసింది. రైల్వే సిబ్బంది హెచ్చరిస్తోన్నప్పటికీ ఆమె లెక్క చేయలేదు. ఈ ఘటన ఆందోళనకు దారి తీసింది.ఈ తెల్లవారు జామున ఈ ఘటన సంభవించినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సమాచారం అందిన వెంటనే రైల్వే భద్రత సిబ్బంది, స్థానిక పోలీసులు.. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్నారు.సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుందీ శంకర్ పల్లి రైల్వే స్టేషన్.

 

 

 

 

 

శంకర్‌పల్లి- నాగులపల్లి సెక్షన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపుగా మూడు కిలోమీటర్ల పాటు ఆ యువతి కారును వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది. రైల్వే సిబ్బంది హెచ్చరిస్తోన్నప్పటికీ లెక్క చేయలేదు.శంకర్ పల్లి వద్ద గల రైల్వే గేటు మీదుగా ఆ యువతి కారులో రైలు పట్టాలపై వచ్చినట్లు తెలుస్తోంది. మార్గమధ్యలో ఆమెను గమనించిన స్థానికులు శంకర్ పల్లి, నాగులపల్లి స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనితో హుటాహుటిన సిబ్బంది అప్రమత్తం అయ్యారు. కారును వెంబడించారు.

 

 

 

 

 

కారును ఆపాలంటూ హెచ్చరించినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. చివరికి నాగులపల్లి వద్ద పట్టాలపైనే కారును అడ్డగించారు. దీన్ని సీజ్ చేశారు. దాదాపుగా గంట పాటు ఆ యువతి పట్టాలపై హల్ చల్ చేసినట్లు చెబుతున్నారు. ఈ ఘటనతో ఈ మార్గంలో రైళ్లను నిలిపివేయాల్సి వచ్చింది. బెంగళూరు- కాచిగూడ సహా వివిధ రైళ్లను సమీప స్టేషన్లల్లో ఆపివేశారు.ఫలితంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆ యువతిపై ఎటువంటి కేసులు నమోదు చేశారనేది ఇంకా తెలియరావట్లేదు. రైల్వే ఆస్తులను ముప్పు వాటిల్లేలా వ్యవహరించినందు వల్ల సంబంధిత సెక్షన్ల ఆధారంగా ఆమెపై కేసు నమోదు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.

విద్యార్థులు, యువత డ్రగ్స్‌ కు దూరంగా ఉండాలి .

ఉత్తమ సమాజ నిర్మిద్దాం
విద్యార్థులు, యువత డ్రగ్స్‌ కు దూరంగా ఉండాలి : వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్‌
డ్రగ్స్‌,గంజాయి నిర్మూలనలో భాగస్వామ్యం కావాలి : ఎస్సై రాజు
మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

వర్దన్నపేట (వరంగల్‌ జిల్లా ) ,నేటిధాత్రి:

 

 

వర్ధన్నపేట పట్టణంలో ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (జూన్‌ 26) సందర్భంగా (యాం టీ డ్రగ్‌ డే )సందర్భంగా మత్తుపదార్థాల నిర్మూలన వారోత్సవాలలో భాగంగా
వెస్ట్‌ జోన్‌ జనగాం, మరియు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో వర్ధన్నపేట అంబేద్కర్‌ విగ్రహం వద్ద నుండి బస్టాండ్‌ వరకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించే ర్యాలీ విద్యార్థులు, పోలీస్‌ అధికా రులతో కలిసి ఇవాళ (గురువారం) నిర్వహించబడిరది. ప్రజలను ఆకట్టుకుంటూ ఆలోచింప చేసేలా ఉన్న గంజాయి రహిత సమాజం-మనందరి బాధ్యత డ్రగ్స్‌కి నో చెప్పండి,ఆరోగ్యమే అసలైన సంపద వంటి ఫ్లకార్డ్స్‌, నినాదాలు చేశారు.డ్రగ్స్‌,గంజాయిని నిర్మూలించేందుకు బాధ్యత గల పౌరులుగా వ్యవహరించి డ్రగ్స్‌,గంజాయి నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని ప్రజలు,యువతకు పిలుపుని చ్చారు .
అనంతరం వారు మాట్లడుతూ. విద్యార్థులు, యువత డ్రగ్స్‌ కు దూరంగా ఉండి పక్కా ప్రణాళిక ప్రకారం చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. డ్రగ్స్‌ ను వినియోగించి సమాజానికి ఇబ్బంది కలిగించే పౌరులుగా మారవద్దని పేర్కొన్నారు. డ్రగ్స్‌ వినియోగంతో మెదడు, కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతింటాయని రాను రాను ఆరోగ్యం క్షీణిస్తుందని వివరించారు. డ్రగ్స్‌ వినియోగంతో శారీరకంగానే కాకుండా మానసిక ఇబ్బందులు, సామాజిక రుగ్మతలు తలెత్తుతాయని తెలిపారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ డ్రగ్స్‌ తో కలిగే నష్టాలపై అవగాహన ఉండి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్‌ కు దూరంగా ఉంటూ ఉత్తమ సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్‌ , ఎస్సై రాజు , పోలీస్‌ సిబ్బంది, విద్యార్థులు , ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వందశాతం పన్నులు వసూలు చేయాలి

వందశాతం పన్నులు వసూలు చేయాలి

పంచాయితీ కార్యదర్శులకు డీఎల్ పీఓ రాజీవ్ కుమార్ ఆదేశాలు జారీ.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

గ్రామ పంచాయితీల పరిధిలోని వివిధ రకాల పన్నులు వంద శాతం వసూల్ చేయాలని నర్సంపేట డివిజనల్ పంచాయితీ అధికారి రాజీవ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.గురువారం దుగ్గొండి మండల కేంద్రంలో గల
మండల పరిషత్ కార్యాలయంలో డివిజనల్ పంచాయతీ అధికారి కే రాజీవ్ కుమార్ పంచాయతీ కార్యదర్శులతో ఎంపీఓ శ్రీధర్ గౌడ్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డీఎల్ పీఓ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ
ట్రేడ్ లైసెన్సులు, సెల్ టవర్లు, ఇంటి పన్నులు, నల్ల పన్నులు వంద శాతం వసూలు చేయాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ రికార్డులన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శులు,సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ భూమి కబ్జా చేశారని కలెక్టర్ కు ఫిర్యాదు.

ప్రభుత్వ భూమి కబ్జా చేశారని కలెక్టర్ కు ఫిర్యాదు.

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దాయపల్లి గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారి దగ్గరలోని అయ్యప్ప దేవాలయం సమీపంలోని ఓ వెంచర్ లో అక్రమాలు జరిగాయని గురువారం కలెక్టర్ కు రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య ఫిర్యాదు చేశారు. సర్వే నెం. 102లో 2ఎకరాలు, సర్వే నెం.105లో 0.20 గుంటల భూమి కబ్జా చేశారని ఫిర్యాదులు తెలిపారు. ఆక్రమణకు గురైన భూమి విలువ బహిరంగ మార్కెట్లో ఎకరం రూ. 4 కోట్ల విలువ ఉందని అక్రమంగా ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేసిన వెంచర్ యజమాని పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

గంజాయి నియంత్రణ పై అవగాహన సదస్సు

గంజాయి నియంత్రణ పై అవగాహన సదస్సు

మందమర్రి నేటి ధాత్రి : 

 

 

మందమర్రి పట్టణం సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో విద్యార్థినీ విద్యార్థులకు మందమర్రి పోలీస్ అధికారులు గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై తల్లిదండ్రులు ఎక్కువగా శ్రద్ధ తీసుకొని పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని తల్లిదండ్రుల పిల్లలకు సూచించారు గంజాయి మత్తులో పడి పిల్లలు వాళ్ళ భవిష్యత్తును కోల్పోతున్నారు ఇటువంటి అరాచకాల్ని అరికట్టడానికి మేము శాశ్వత ప్రయత్నం చేస్తున్నాము మీరు కూడా మాకు సహకరించాలని తల్లిదండ్రులను కోరడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి బెల్లంపల్లి ఏసిపి, సింగరేణి జిఎం, లైన్స్ క్లబ్ సభ్యులు, వివిధ పార్టీ నాయకులు హాజరు కావడం జరిగింది.

గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ.

గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ.

బాలానగర్ /నేటి ధాత్రి :

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని బిల్డింగ్ తండా గ్రామంలో MGNREGS నిధుల కింద మంజూరైన రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి గురువారం భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “ప్రతి గ్రామానికి పంచాయతీ భవనం ఒక కేంద్ర బిందువుగా ఉంటుందని, గ్రామపంచాయతీ భవనం గ్రామ అభివృద్ధి ప్రజల అవసరాలను తీర్చే దిశగా గ్రామపంచాయతీ కార్యాలయం ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం గ్రామస్థాయిలో మౌలిక వసతుల కల్పనతో గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడమే.ఇప్పటికే ఎన్నో గ్రామాల్లో పంచాయతీ భవనాలు నిర్మించామన్నారు. బిల్డింగ్ తండా గ్రామపంచాయతీ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజల సేవలోకి తీసుకురావాలని కోరుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్, దత్తాత్రేయ, తిరుపతి, కె.ఎస్.ఆర్ వెంకట్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.

భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఎన్నికైన .!

భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఎన్నికైన కామ్రేడ్ రామడుగు లక్ష్మణ్ ని ఘనంగా సన్మానించడం జరిగింది.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

 

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బెల్లంపల్లి పట్టణ సమితి సమావేశం కామ్రేడ్ భాశెట్టి గంగారం భవన్లో గురువారం రోజున ఉదయం 10 గంటలకి జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఎన్నికైన కామ్రేడ్ రామడుగు లక్ష్మణ్ ని ఘనంగా సన్మానించడం జరిగింది లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను చిత్తశుద్ధితో అమలు పరచాలి అని ఆపరేషన్ కగర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ పైన జరుపుతున్నవ మారనా హోమాన్ని వెంటనే రద్దు చేసుకొని వారితో శాంతి చర్చలు జరిపి మానవ హక్కులను కాపాడాలి, గిరిజనులు వ్యవసాయం చేసుకుంటూ పోరు భూములను పట్టాలు ఇవ్వాలి అలాగే ఎన్నిక హామీల్లో భాగమైన పేద వర్గాల కు నూతన రేషన్ కార్డులను వెంటనే ఇవ్వాలి.

 

 

 

 

 

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల ప్రకారం కార్పొరేషన్ పరిధిలో ఉన్న బొగ్గు గనుల ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇంటికి రాయి యాజమాన్యం చెల్లించాలి, బొగ్గు గాని కార్మికులకు సొంత ఇంటి పథకంలో భాగంగా రెండు గంటల భూమి వారికి సంబంధించిన బడ్జెట్ సపోర్ట్ ను యాజమాన్యం కల్పించాలి. భారత కమ్యూనిస్టు పార్టీ దాని అనుబంధ ప్రజా సంఘాలు మంచిర్యాల జిల్లాలో బలమైన నిర్మాణం కలిగి ఉన్న నేపథ్యంలో పార్టీ ఆఫీసు కు జిల్లా కేంద్రంలో ఒక ఎకరం భూమి కేటాయించాలి 2024. 25 సంవత్సరానికి సంబంధించిన సింగరేణి లాభాలను ప్రకటించి గని కార్మికులకు 40 శాతం వాటాను ప్రకటించాలి.

 

 

 

 

సింగరేణి నూతన బొగ్గు బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి, బెల్లంపల్లిలో బస్సు డిపోను నిర్మించాలి అని అన్నారు బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ని శాలువా పూలదండలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకట స్వామి రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ సిపిఐ సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య పట్టణ కార్యదర్శి ఆడపుq రాజమౌళి, సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ , జిల్లా సభ్యులు గుండా చంద్రమాణిక్యం, డి ఆర్ శ్రీధర్, కొంకుల రాజేష్, సీనియర్ మహిళా కామ్రేడ్ గుండ సరోజ, బొల్లం సోని, బియ్యాల ఉపేందర్, కొండు బానేష్, అక్కేపల్లిబాబు సార్, రత్నం రాజం ,తిరుపతి గౌడ్, మంతెన రమేష్, బండారి శంకర్, బోర్ల సమ్మయ్య, గోలేటి రాజలింగు, నస్పూరి తిరుమలేష్, గుండ ప్రశాంత్, అంబాల ప్రభుదాస్ నస్పూరి సందీప్ తదితరులు పాల్గొన్నారు.

కరకగూడెం పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్

కరకగూడెం పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్

ఆదివాసీ యువతకు వాలీబాల్ కిట్లు ,మరియు దోమతెరలు పంపిణీ

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.నేటిధాత్రి..

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కరకగూడెం మండలంలోని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు అశ్వాపురంపాడు వలస ఆదివాసి గ్రామము మరియు అనంతారం గ్రామము లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ఈ ప్రోగ్రాం అనంతరం యువతకు వాలీబాల్సు మరియు వారి కుటుంబాలకు దోమతెరలను (ఎన్జీవో సహకారంతో) అందించిన తర్వాత ఏడుల్లబయ్యారం సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆదివాసీ ప్రజలు మావోయిస్టులకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించవద్దని తెలిపారు.ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తూ అభివృద్ధి దిశగా పయనించాలని తెలిపినారు.అభివృద్ధిని అడ్డుకునే మావోయిస్టులకు సహకరించవద్దని తెలిపారు.మావోయిస్టులవి కాలం చెల్లిన సిద్ధాంతాలని తెలిపినారు. యువత,పిల్లలు విద్య ద్వారానే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు.అసాంఘీక శక్తులకు సహకరించి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ అనవసరంగా కేసులు,జైలు పాలు కావద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో. ఏడుల్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్ఐ పివిఎన్ రావ్ మరియు స్పెషల్ పార్టీ టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు

ఈనెల 30 న దీక్షకు అనుమతిఇవ్వండి

ఈనెల 30 న దీక్షకు అనుమతిఇవ్వండి

ఉద్యమకారుల ఫోరం సిఐ కు వినతిపత్రం అందజేత

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రంలో
ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుని పిలుపుమేరకు శాయంపేట మండల అధ్య క్షుడు ఇమ్మడిశెట్టి రవీందర్ ఆధ్వర్యంలో సిఐ శాంతి దీక్ష (శాంతియుత నిరసన) అనుమతి కొరకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేనిఫెస్టో పెట్టి నటువంటి హామీలు నెరవేర్చా లని ఉద్యమకారులకు ఇచ్చి నటువంటి హామీలను నెర వేర్చాలని ఈనెల 30న మండల కేంద్రంలో శాంతి దీక్ష ఒక రోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్ర మంలో ముఖ్య అతిథులుగా ఉద్యమకారుల ఫోరం హను మకొండ జిల్లాఅధ్యక్షుడు పొడి శెట్టిగణేష్, జిల్లా ఉపాధ్యక్షులు గిద్దమారిసురేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు గిద్దమారి రామన్న, జిల్లా నాయకుడు గంట శ్యాం సుందర్ రెడ్డి ,మండల ప్రధాన కార్యదర్శిచల్లాశ్రీనివాస్ రెడ్డి శాయంపేట మండల నాయ కులు ఎండిరఫీ తుమ్మ ప్రభా కర్ ,దుంపల మహేందర్ రెడ్డి,మండల కోశాధికారి కాను గుల నాగరాజు, దూదిపాల జోగిరెడ్డి పాల్గొన్నారు.

వనపర్తి ఆవోప ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు !

వనపర్తి ఆవోప ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు పంపిణీ

వనపర్తి నెటిదాత్రి:

 

వనపర్తి పట్టణ ఆ వో ప ఆధ్వర్యంలో గోపాల్పేట్ మండల కేంద్రం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అదేవిధంగా చాకల్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు పంపిణీ చేశామని వనపర్తి పట్టణ అవపా అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవోప ఆధ్వర్యంలో ఎన్నో స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేపడుతున్నామని అందులో భాగంగా ప్రతి సంవత్సరం బ్యాగులు పంపిణీ చేస్తున్నామని ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశామని ఆయన పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ ఆవోప ప్రధాన కార్యదర్శి ఎల్ రవికుమార్ ఆర్థిక కార్యదర్శి సంబు వెంకటరమణ పట్టణ ఆర్యవైశ్య సంఘం సీనియర్ నాయకులు గోనూరు వెంకటయ్య ప్రసాద్ రావు కటకం శ్రీధర్ భాస్కర్ శివ బాలేశ్వర్ పోలిశెట్టి మురళి కండే భాస్కర్ రత్న కుమార్ దోమ శివ సాయి నాగరాజ్ బి పరమేశ్వర్ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని కలకొండ శ్రీనివాసులు తెలిపారు .ఈ మేరకు వనపర్తి పట్టణ అవో ప వారికి ఉపాధ్యాయులు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో !

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు TGSWR గురుకుల కళాశాల చిన్న బోనాల నందు డిజిటల్ పేమెంట్స్ మరియు సైబర్ నేరాల పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.

 

 

ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారి జయరాజ్ మాట్లాడుతూ ,బ్యాంకింగ్ సేవలను సులభంగా డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు అని,యూపీఐ పేమెంట్,ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎటిఎం లావాదేవీలను వినియోగించుకోవాలని అన్నారు.అలాగే వెంకటరమణ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ బెట్టింగ్ అప్స్,లెండింగ్ అప్స్,ఫేక్ వెబ్సైట్లు ,డిజిటల్ అరెస్టు వంటి సైబర్ నేరాల బారిన పడకుండా అన్ని రకాల లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి అన్నారు.సైబర్ నేరానికి గురైతే 1930 కాల్ చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంకు అధికారులు అబ్దుల్ రెహమన్ గారు,జిల్లా లీడ్ బ్యాంకు అధికారి మల్లికార్జున్ ,కళాశాల ప్రిన్సిపాల్ జసిమిన్ థెరిస్సా ,ఆర్ధిక అక్షరాస్యత కౌన్సిలర్స్ పాల్గొనడం జరిగినది.

మాదక దవ్యాల నిర్మూలనకు విద్యార్థులు కృషి చేయాలి

మాదక దవ్యాల నిర్మూలనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలి*
మొగులపల్లి నేటి ధాత్రి

 

మొగుళ్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మొగులపల్లి ఎస్సై బి అశోక్ ఆదేశాలతో ఏఎస్ఐ రాజేశం మత్తు పదార్థాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏఎస్ఐ రాజేశం మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలి విద్యార్థులు మత్తు పదార్థాలు బానిసైతే జీవితాలు సర్వ నాశనం అయితాయని వారు మాట్లాడుతూ మత్తు పదార్థాలను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. డ్రగ్స్ కు దూరంగా ఉండి విలువలతో కూడిన జీవితాన్ని నిర్మించుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విద్యార్థులు దేశ భవిష్యత్తుకు ఆధారం విద్యార్థుల అభివృద్ధి దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందని విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో నివేది ఏ స్థితిలోనైనా డ్రగ్స్ కు పొరపాటున కూడా అటువైపు వెళ్ళకూడదు , ఎవరైనా మత్తు పదార్థాలకు బానిసైన లేదా మాదకద్రవ్యాల గురించి సమాచారం తెలంగాణ గవర్నమెంట్ చేపట్టిన టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు కాల్ చేసి తెలుసుకోవచ్చు అన్నారు. డ్రగ్స్ కి సంబంధించిన సమాచారాన్ని అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అదేవిధంగా విద్యార్థులతో సే నోటు డ్రగ్స్ pledge చేయించారు , మరియు స్థానిక పోలీస్ స్టేషన్ లో am an యాంటీ డ్రగ్ సోల్జర్ selfi point ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా వివరించి విద్యార్థులు మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కానిస్టేబుల్స్ విజయ్ వినోద్ పాల్గొన్నారు

చదివిన పాఠశాలపై మమకారంతో.!

చదివిన పాఠశాలపై మమకారంతో..తన కుమారునికి అదే పాఠశాలలో అడ్మిషన్ ఇప్పించి అందరికీ ఆదర్శంగా నిలిచిన తల్లి

-తల్లిని సన్మానించిన ఉపాధ్యాయ బృందం
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

తాను పేదింటి కుటుంబంలో పుట్టినప్పటికీ..ప్రైవేట్ చదువులను చదివించలేని తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని, ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించిన విద్యా కుసుమం మిరిపూరి నాగరాణి అందరికీ ఆదర్శంగా నిలిచిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామానికి చెందిన మిరిపూరి మంజుల-సమ్మయ్య దంపతుల కుమార్తె నాగరాణి నిరుపేద కుటుంబంలో పుట్టింది. పేదరికం చదువుకు అడ్డం కాదనే విషయాన్ని ప్రపంచానికి చాటింది. చిన్నప్పటినుండి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత విద్యనభ్యసించింది. ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం పొందింది. ప్రస్తుతం తాను చిన్నప్పుడు చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో తన కుమారునికి అడ్మిషన్ ఇప్పించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ప్రైవేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలలే క్రమశిక్షణకు నిలయాలని, మనం కష్టపడి చదివితే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని మిరిపూరి నాగరాణి నిరూపించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం మిరిపూరి నాగరాణిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తోటపల్లి మహేష్, ఉపాధ్యాయులు నాగేందర్, సురేందర్, శ్రీధర్, సునీతా దేవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

టీబి ముక్త్ భారత్ అభియాన్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వండి.

టీబి ముక్త్ భారత్ అభియాన్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వండి

★డాక్టర్ రమ్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్/ఝరాసంగగం: గురువారం రోజు టీబి ముక్త్ భారత్ అభియాన్‌ను వాస్తవంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఝరాసంగం మండల వైద్యాధికారి రమ్య మాట్లాడుతూ, ‘టీబి-ముక్త్ భారత్ అభియాన్’ కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మరియు ఈ ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చడం అన్ని పౌరుల విధి అని అన్నారు. ఎందుకంటే మన దేశంలోని అన్ని ఇతర అంటు వ్యాధుల కంటే టిబి అత్యధిక మరణాలకు కారణమవుతుంది. ప్రపంచ జనాభాలో భారతదేశంలో 20 శాతం కంటే కొంచెం తక్కువ మంది ఉన్నారని, కానీ ప్రపంచంలోని మొత్తం టిబి రోగులలో 25 శాతానికి పైగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. 

citizens

ఇది ఆందోళన కలిగించే విషయం. టిబి బారిన పడిన వారిలో ఎక్కువ మంది సమాజంలోని పేద వర్గాల నుండి వచ్చారని కూడా ఆమె గుర్తించారు..టిబి ముక్తి కార్యక్రమం కింద, జీర్లపల్లి, తుమ్మనపల్లి, కప్పాడ్ మరియు నర్సాపూర్ గ్రామాల నుండి అనుమానిత టీబి కేసులను 102 మరియు ఆర్ బి ఎస్ కే వాహనంలో ఛాతీ ఎక్స్ రే కోసం జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు అన్నారు.

అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ ర్యాలీ.

అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ ర్యాలీ

జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ రమేష్ బాబు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

గురువారం అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని
జిల్లా కేంద్రంలో ని డా బిఆర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణం నుండి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వరకు నిర్వహించిన అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ ర్యాలీ లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే
తదితరులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ భూతాన్ని సమాజం నుండి తరిమేయాలని పిలుపునిచ్చారు.
తల్లి దండ్రులు పిల్లల అలవాట్లును నిశితంగా గమనించాలని, డ్రగ్స్ కు అలవాటుపడ్డ వారిలో వచ్చే మార్పులను గుర్తించడం సులువైన పని అని అన్నారు. ఇంటి నుండే మార్పు మొదలవ్వాలని తెలిపారు. డ్రగ్స్ భూతాన్ని తరిమేయడంలో సహాయం కావాల్సిన వారు జిల్లా న్యాయసేవాధికార సంస్థను కానీ పోలీసు శాఖను సంప్రదించాలని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ డ్రగ్స్ ను తరిమేయడంలో ప్రతి ఒక్కరి బాగస్వామ్యం అవసరమని అన్నారు. మత్తుపదార్థాల నిర్మూలన కోసం కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దిలీప్ కుమార్ నాయక్, అడీషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, అడీషనల్ కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి , అడీషనల్ ఎస్పి నరేష్ కుమార్, సింగరేణి జి.ఎం.రాజేశ్వర్ రెడ్డి, సంక్షేమ అధికారి మల్లీశ్వరి , ఎక్సయిజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ , విద్యా శాఖ అధికారి రాజేందర్, అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస చారి, ప్రధాన కార్యదర్శి శ్రావణ్ రావు, డి.ఎస్పి సంపత్ రావు, సూర్యనారాయణ, విద్యార్థులు వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్ గంజాయి వాడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

డ్రగ్స్ గంజాయి వాడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి జిల్లా ఎస్పీ

వనపర్తి నెటిదాత్రి :

 

 

 

వనపర్తి జిల్లాలో నిషా కొరకు ఎవరైనా డ్రగ్స్ గంజాయి వాడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు 100 1908 పోలీసులకు సమాచారం ఇస్తే వెంటనే డ్రగ్స్ గాన్ oజాయ్ వాడే వారిపై చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు . యువకులు విద్యార్థులు డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలు వాడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన కోరారు . విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో వారిని చదివించి ఉన్నత స్థాయికి ఎదగాలని వారి నమ్మకాలను దుర్వినియోగం చేయవద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి విద్యార్థులకు సూచించారు మరక ద్రవ్యాలు వాడరాదని ర్యాలీ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి జిల్లా ఎస్పీ రావుల గరీధర్ పోలీస్ డి సి ఆర్ సి ఉమా మహేశ్వరరావు వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు సీఐ కృష్ణయ్య కొత్తకోట సీఐ రాంబాబు జిల్లా అధికారులు సుధీర్ రెడ్డి సుధారాణి క్రీడల అధికారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

నర్సంపేట పట్టణంలో చినుకు పడితే చిత్తడే.

నర్సంపేట పట్టణంలో చినుకు పడితే చిత్తడే..

నాళాలు ఆక్రమణతో రోడ్ల పైన వర్షపు నీరు..

చిన్న వానపడితే చాలు చెరువులను తలపిస్తున్న ప్రధాన రహదారులు

నర్సంపేట నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలో ప్రధాన రహదారులు చినుకు పడితే చిత్తడిగా మారుతున్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారులపై ఉన్న దుకాణ యాజమానులు ఎక్కడికక్కడ నాళాలు ఆక్రమించడంతో చిన్న వానకే రోడ్ల పైన నీళ్ళు నిలిచి చెరువులను తలపించే పరిస్థితి నెలకొన్నది. మున్సిపాలిటీ అధికారుల కలిసన్నల్లో కడుతున్న నూతన భవనాల పట్ల చర్యలు తీసుకోకపోవడం వలన నాళాలు ఎక్కడికక్కడ ఆక్రమణకు గురైతూ వర్షం పడితే చాలు చెరువులను తలపించే విధంగా నర్సంపేట పట్టణంలోని ప్రధాన రహదారులు మారుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. 

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ఆర్డిఓ ఆఫీస్ కి వెళ్లే రోడ్డు, బస్ స్టేషన్ నుండి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే రోడ్డు, అంబేద్కర్ సెంటర్ నుండి మల్లంపల్లి వైపు వెళ్లే జాతీయ రహదారి, ఎక్కడ ఎక్కడ నాళాలు ఆక్రమించడంతో రోడ్లపై వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయని పట్టణ ప్రజలు బాటసారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు అక్కడ నాలాలను కూల్చివేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఈవీఎం, వివి ప్యాట్ గోదామును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు.

ఈవీఎం, వివి ప్యాట్ గోదామును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు.

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

జిల్లాలోని ఈవీఎం, వివి ప్యాట్ గోదామును జిల్లా ఎన్నికల అధికారి అండ్ కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం పరిశీలించారు.
భద్రతా ఏర్పాట్లు, గోదాం నిర్వహణ, సీసీ కెమెరాల పనితీరు, రౌండ్ ది క్లాక్ మానిటరింగ్ తదితర అంశాలను ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు గోదాములో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని, అన్ని చర్యలు సక్రమంగా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈవీఎంల భద్రత విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, పటిష్ట పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు
అనంతరం తనిఖీ రిజిస్టర్ లో సంతకం చేశారు
ఈ తనిఖీలో ఎన్నికల విభాగం డిటి అబ్బాస్, ఐటి పర్సన్ నవీన్
రాజకీయ పార్టీల ప్రతినిధులు బీజేపీ నుండి మునీందర్, సీపీఎం నుండి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version