వందశాతం పన్నులు వసూలు చేయాలి

వందశాతం పన్నులు వసూలు చేయాలి

పంచాయితీ కార్యదర్శులకు డీఎల్ పీఓ రాజీవ్ కుమార్ ఆదేశాలు జారీ.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

గ్రామ పంచాయితీల పరిధిలోని వివిధ రకాల పన్నులు వంద శాతం వసూల్ చేయాలని నర్సంపేట డివిజనల్ పంచాయితీ అధికారి రాజీవ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.గురువారం దుగ్గొండి మండల కేంద్రంలో గల
మండల పరిషత్ కార్యాలయంలో డివిజనల్ పంచాయతీ అధికారి కే రాజీవ్ కుమార్ పంచాయతీ కార్యదర్శులతో ఎంపీఓ శ్రీధర్ గౌడ్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డీఎల్ పీఓ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ
ట్రేడ్ లైసెన్సులు, సెల్ టవర్లు, ఇంటి పన్నులు, నల్ల పన్నులు వంద శాతం వసూలు చేయాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ రికార్డులన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శులు,సిబ్బంది పాల్గొన్నారు.

వంద శాతం పన్నులు వసూళ్ళు చేయాలి.

వంద శాతం పన్నులు వసూళ్ళు చేయాలి.
డివిజనల్ పంచాయతీ అధికారి రాజీవ్ కుమార్.

నర్సంపేట,నేటిధాత్రి:

గ్రామాల్లోని అన్ని రకాల పన్నులను ఈ నెల పదిలోపు వంద శాతం వసూళ్లు చేయాలని డివిజనల్ పంచాయతీ అధికారి రాజీవ్ కుమార్ ఆదేశించారు.
దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామపంచాయతీ కార్యాలయంలో మండలం పరిదిలో గల పంచాయతీ కార్యదర్శులతో డివిజనల్ పంచాయతీ అధికారి సమీక్షా సమావేశం నిర్వహించారు.మండల పంచాయతీ అధికారి శ్రీధర్ గౌడ్ అధ్యక్షతన జరుగగా రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ఇంటి పన్నులు,నల్లా పన్నులు వసూల్ చేయాలని అన్నారు. డంపింగ్ యార్డ్ లలో వర్మికాంపోస్ట్ ప్రిపరేషన్ ప్రాపర్ గా చేయాలని పేర్కొన్నారు.ఎండాకాలంలో గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version