ఈవీఎం గోదాములను పరిశీలించిన..

ఈవీఎం గోదాములను పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో జిల్లా గోదాములను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా,ఆదనవు కలెక్టర్ సంధ్యారాణితో కలసి శనివారం పరిశీలించారు.కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని జిల్లా ఈవీఎం గోదాములను కలెక్టర్ తనిఖీ చేసి,ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ గోదాంలకు సంబంధించిన రికార్డులు, కట్టుదిట్టమైన భద్రత చర్యలు,సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించి వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ తనిఖీలో తహసీల్దార్ ఇక్బాల్,నాయబ్ తహసీల్దార్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎం, వివి ప్యాట్ గోదామును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు.

ఈవీఎం, వివి ప్యాట్ గోదామును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు.

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

జిల్లాలోని ఈవీఎం, వివి ప్యాట్ గోదామును జిల్లా ఎన్నికల అధికారి అండ్ కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం పరిశీలించారు.
భద్రతా ఏర్పాట్లు, గోదాం నిర్వహణ, సీసీ కెమెరాల పనితీరు, రౌండ్ ది క్లాక్ మానిటరింగ్ తదితర అంశాలను ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు గోదాములో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని, అన్ని చర్యలు సక్రమంగా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈవీఎంల భద్రత విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, పటిష్ట పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు
అనంతరం తనిఖీ రిజిస్టర్ లో సంతకం చేశారు
ఈ తనిఖీలో ఎన్నికల విభాగం డిటి అబ్బాస్, ఐటి పర్సన్ నవీన్
రాజకీయ పార్టీల ప్రతినిధులు బీజేపీ నుండి మునీందర్, సీపీఎం నుండి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version