నర్సంపేట పట్టణంలో చినుకు పడితే చిత్తడే.

నర్సంపేట పట్టణంలో చినుకు పడితే చిత్తడే..

నాళాలు ఆక్రమణతో రోడ్ల పైన వర్షపు నీరు..

చిన్న వానపడితే చాలు చెరువులను తలపిస్తున్న ప్రధాన రహదారులు

నర్సంపేట నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలో ప్రధాన రహదారులు చినుకు పడితే చిత్తడిగా మారుతున్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారులపై ఉన్న దుకాణ యాజమానులు ఎక్కడికక్కడ నాళాలు ఆక్రమించడంతో చిన్న వానకే రోడ్ల పైన నీళ్ళు నిలిచి చెరువులను తలపించే పరిస్థితి నెలకొన్నది. మున్సిపాలిటీ అధికారుల కలిసన్నల్లో కడుతున్న నూతన భవనాల పట్ల చర్యలు తీసుకోకపోవడం వలన నాళాలు ఎక్కడికక్కడ ఆక్రమణకు గురైతూ వర్షం పడితే చాలు చెరువులను తలపించే విధంగా నర్సంపేట పట్టణంలోని ప్రధాన రహదారులు మారుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. 

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ఆర్డిఓ ఆఫీస్ కి వెళ్లే రోడ్డు, బస్ స్టేషన్ నుండి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే రోడ్డు, అంబేద్కర్ సెంటర్ నుండి మల్లంపల్లి వైపు వెళ్లే జాతీయ రహదారి, ఎక్కడ ఎక్కడ నాళాలు ఆక్రమించడంతో రోడ్లపై వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయని పట్టణ ప్రజలు బాటసారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు అక్కడ నాలాలను కూల్చివేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version