అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ ర్యాలీ.

అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ ర్యాలీ

జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ రమేష్ బాబు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

గురువారం అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని
జిల్లా కేంద్రంలో ని డా బిఆర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణం నుండి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వరకు నిర్వహించిన అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ ర్యాలీ లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే
తదితరులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ భూతాన్ని సమాజం నుండి తరిమేయాలని పిలుపునిచ్చారు.
తల్లి దండ్రులు పిల్లల అలవాట్లును నిశితంగా గమనించాలని, డ్రగ్స్ కు అలవాటుపడ్డ వారిలో వచ్చే మార్పులను గుర్తించడం సులువైన పని అని అన్నారు. ఇంటి నుండే మార్పు మొదలవ్వాలని తెలిపారు. డ్రగ్స్ భూతాన్ని తరిమేయడంలో సహాయం కావాల్సిన వారు జిల్లా న్యాయసేవాధికార సంస్థను కానీ పోలీసు శాఖను సంప్రదించాలని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ డ్రగ్స్ ను తరిమేయడంలో ప్రతి ఒక్కరి బాగస్వామ్యం అవసరమని అన్నారు. మత్తుపదార్థాల నిర్మూలన కోసం కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దిలీప్ కుమార్ నాయక్, అడీషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, అడీషనల్ కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి , అడీషనల్ ఎస్పి నరేష్ కుమార్, సింగరేణి జి.ఎం.రాజేశ్వర్ రెడ్డి, సంక్షేమ అధికారి మల్లీశ్వరి , ఎక్సయిజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ , విద్యా శాఖ అధికారి రాజేందర్, అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస చారి, ప్రధాన కార్యదర్శి శ్రావణ్ రావు, డి.ఎస్పి సంపత్ రావు, సూర్యనారాయణ, విద్యార్థులు వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version