విద్యార్థులు, యువత డ్రగ్స్‌ కు దూరంగా ఉండాలి .

ఉత్తమ సమాజ నిర్మిద్దాం
విద్యార్థులు, యువత డ్రగ్స్‌ కు దూరంగా ఉండాలి : వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్‌
డ్రగ్స్‌,గంజాయి నిర్మూలనలో భాగస్వామ్యం కావాలి : ఎస్సై రాజు
మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

వర్దన్నపేట (వరంగల్‌ జిల్లా ) ,నేటిధాత్రి:

 

 

వర్ధన్నపేట పట్టణంలో ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (జూన్‌ 26) సందర్భంగా (యాం టీ డ్రగ్‌ డే )సందర్భంగా మత్తుపదార్థాల నిర్మూలన వారోత్సవాలలో భాగంగా
వెస్ట్‌ జోన్‌ జనగాం, మరియు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో వర్ధన్నపేట అంబేద్కర్‌ విగ్రహం వద్ద నుండి బస్టాండ్‌ వరకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించే ర్యాలీ విద్యార్థులు, పోలీస్‌ అధికా రులతో కలిసి ఇవాళ (గురువారం) నిర్వహించబడిరది. ప్రజలను ఆకట్టుకుంటూ ఆలోచింప చేసేలా ఉన్న గంజాయి రహిత సమాజం-మనందరి బాధ్యత డ్రగ్స్‌కి నో చెప్పండి,ఆరోగ్యమే అసలైన సంపద వంటి ఫ్లకార్డ్స్‌, నినాదాలు చేశారు.డ్రగ్స్‌,గంజాయిని నిర్మూలించేందుకు బాధ్యత గల పౌరులుగా వ్యవహరించి డ్రగ్స్‌,గంజాయి నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని ప్రజలు,యువతకు పిలుపుని చ్చారు .
అనంతరం వారు మాట్లడుతూ. విద్యార్థులు, యువత డ్రగ్స్‌ కు దూరంగా ఉండి పక్కా ప్రణాళిక ప్రకారం చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. డ్రగ్స్‌ ను వినియోగించి సమాజానికి ఇబ్బంది కలిగించే పౌరులుగా మారవద్దని పేర్కొన్నారు. డ్రగ్స్‌ వినియోగంతో మెదడు, కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతింటాయని రాను రాను ఆరోగ్యం క్షీణిస్తుందని వివరించారు. డ్రగ్స్‌ వినియోగంతో శారీరకంగానే కాకుండా మానసిక ఇబ్బందులు, సామాజిక రుగ్మతలు తలెత్తుతాయని తెలిపారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ డ్రగ్స్‌ తో కలిగే నష్టాలపై అవగాహన ఉండి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్‌ కు దూరంగా ఉంటూ ఉత్తమ సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్‌ , ఎస్సై రాజు , పోలీస్‌ సిబ్బంది, విద్యార్థులు , ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేద్దాం ఎక్సైజ్ ఎస్సై రబ్బాని.

మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేద్దాం ఎక్సైజ్ ఎస్సై రబ్బాని

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేద్దామని భూపాలపల్లి ఎక్సైజ్ ఎస్సై రబ్బాని అన్నారు.పట్టణ భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎక్సైజ్ ఎస్సై రబ్బాని హాజరై పలు సూచనలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలు నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని,గంజాయి, డ్రగ్స్ తదితర మాదకద్రవ్యలను వినియోగించిన,సరఫరా చేసిన, నిల్వ ఉంచిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మాదకద్రవ్యలను వినియోగించడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి అన్నారు.మాదకద్రవ్యలను సరఫరా చేసిన నేరంగా పరిగణించి కేసు చేపడుతమని విద్యార్థులకు చెప్పారు. మాదకద్రవ్యలకు దూరంగా ఉండాలని,విద్యార్థులు చదువు పై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఎవరైనా మాదకద్రవ్యాలు వాడుతున్నాట్టు మీ దృష్టికి వచ్చినట్లయితే వెంటనే పోలీసులకు, మీ గురువులకు చెప్పి మాదకద్రవ్యాల నిరోధానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎక్సైజ్ ఎస్సై రబ్బానీ & సిబ్బంది,
జంగేడు ఉన్నత పాఠశాల హెచ్ఎం అశోక్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version