ఈనెల 30 న దీక్షకు అనుమతిఇవ్వండి
ఉద్యమకారుల ఫోరం సిఐ కు వినతిపత్రం అందజేత
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో
ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుని పిలుపుమేరకు శాయంపేట మండల అధ్య క్షుడు ఇమ్మడిశెట్టి రవీందర్ ఆధ్వర్యంలో సిఐ శాంతి దీక్ష (శాంతియుత నిరసన) అనుమతి కొరకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేనిఫెస్టో పెట్టి నటువంటి హామీలు నెరవేర్చా లని ఉద్యమకారులకు ఇచ్చి నటువంటి హామీలను నెర వేర్చాలని ఈనెల 30న మండల కేంద్రంలో శాంతి దీక్ష ఒక రోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్ర మంలో ముఖ్య అతిథులుగా ఉద్యమకారుల ఫోరం హను మకొండ జిల్లాఅధ్యక్షుడు పొడి శెట్టిగణేష్, జిల్లా ఉపాధ్యక్షులు గిద్దమారిసురేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు గిద్దమారి రామన్న, జిల్లా నాయకుడు గంట శ్యాం సుందర్ రెడ్డి ,మండల ప్రధాన కార్యదర్శిచల్లాశ్రీనివాస్ రెడ్డి శాయంపేట మండల నాయ కులు ఎండిరఫీ తుమ్మ ప్రభా కర్ ,దుంపల మహేందర్ రెడ్డి,మండల కోశాధికారి కాను గుల నాగరాజు, దూదిపాల జోగిరెడ్డి పాల్గొన్నారు.