వందశాతం పన్నులు వసూలు చేయాలి
పంచాయితీ కార్యదర్శులకు డీఎల్ పీఓ రాజీవ్ కుమార్ ఆదేశాలు జారీ.
నర్సంపేట,నేటిధాత్రి:
గ్రామ పంచాయితీల పరిధిలోని వివిధ రకాల పన్నులు వంద శాతం వసూల్ చేయాలని నర్సంపేట డివిజనల్ పంచాయితీ అధికారి రాజీవ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.గురువారం దుగ్గొండి మండల కేంద్రంలో గల
మండల పరిషత్ కార్యాలయంలో డివిజనల్ పంచాయతీ అధికారి కే రాజీవ్ కుమార్ పంచాయతీ కార్యదర్శులతో ఎంపీఓ శ్రీధర్ గౌడ్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డీఎల్ పీఓ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ
ట్రేడ్ లైసెన్సులు, సెల్ టవర్లు, ఇంటి పన్నులు, నల్ల పన్నులు వంద శాతం వసూలు చేయాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ రికార్డులన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శులు,సిబ్బంది పాల్గొన్నారు.