సిరిసిల్ల జిల్లా కోర్ట్ జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పి
సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి)
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ప్రేమలత ని సోమవారం రోజున కోర్ట్ ప్రాంగణంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కని అందజేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఐపీఎస్.ఈ సందర్భంగా ఇరువురు అధికారులు పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలతో పాటుగా ఎక్కువ సంఖ్యలో ఉన్న కేసులను పరిష్కరించి నేరస్థులకు శిక్షలు పడే దిశగా కృషి చేయాలని చర్చించుకున్నారు.
పలమనేరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గా ఏక గ్రీవంగా ఎన్నికైన న్యాయవాది ఎల్. భాస్కర్ కు ఆదివారం అయన కార్యాలయం లో బి.సి.సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. కృష్ణమూర్తి, వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు పొదల నరసింహులు, బహు జన హక్కుల సాధాన సమితి రాష్ట్ర అధ్యక్షులు గంపల గంగరాజు,వి. ఆర్.ఎస్.ఎస్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల విజయ్ మోహన్, వాల్మీకి సంఘ నాయకులు బి. లక్ష్మన్న, టి. మంజు నాథ్, కొటికి శేఖర్, ఎం. నరసింహులు, బాలాజి లు కలిసి ఘనంగా సన్మానించారు. బడుగు,బలహీన వర్గాల వారికి న్యాయం చేయడంలో ముందుండే వ్యక్తి గా ఎల్. భాస్కర్ కు గుర్తింపు ఉందని పేర్కొన్నారు.
యువత ఈజీ డబ్బులకు అలవాటు పడి బెట్టింగ్ లకు మొగ్గచూపకుడదని,బెట్టింగ్ యాప్ లతో జాగ్రత్తగా ఉండాలని కరకగూడెం ఎస్ఐ రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన యువతను,ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం ఐపియల్ క్రికెట్ వెల విపరీతంగా డబ్బులు చేతులు మారుతున్నాయి ఎవ్వరూ ఒక్కరు బెట్టింగ్ లో డబ్బులు గెలుచుకున్నారు అనే వెర్రితనంతో మీరు అ వలలో చిక్కుకోకండి అని అయన తెలిపారు. అలాగె బెట్టింగ్ యాప్స్,ఆన్లైన్ బెట్టింగ్ అడి ఎంతోమంది యువత ప్రణాలు పోగోట్టుకోవడం మనం చూస్తునే ఉన్నాం ఇటువంటి సంఘటనలు మన మండల పరిధిలో జరగకుండా చూడవలసిన భాద్యత మన అందిరిపై ఉందని ముఖ్యంగా యువత తల్లిదండ్రులు పై ఎక్కువగా ఉందని పిల్లల అవసరాలకు మించి డబ్బులు ఇవ్వకుడాదని అయన తెలిపారు.ఈ బెట్టింగ్ మహమ్మారి వలలో చిక్కుకోని ఎన్నో కుటుంబాలు రొడ్డున్న పడ్డాయని అయన గుర్తుచేశారు.
ఎన్ హెచ్ఆర్సి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా అయిలోని అభిషేక్.
వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి:
మానవ హక్కుల సంఘం సోషల్ మీడియా వరంగల్ జిల్లా కన్వీనర్ గా గీసుగోoడ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన అయిలోని అభిషేక్ ను నియమిస్తూ స్టేట్ చైర్మన్ బద్దిపడిగా శ్రీనివాస్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు.తనపై నమ్మకంతో బాధ్యతను అప్పజెప్పిన నేషనల్ చెర్మెన్,డాక్టర్ మహమ్మద్ యాసీన్, వరంగల్ జిల్లా అద్యక్షులు గంగుల అశోక్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ హెచ్ ఆర్ సి సంస్థలో తన కర్తవ్యాన్ని క్రమశిక్షణతో నెరవేస్తానని తెలిపారు. ఎల్లప్పుడూ రాష్ట్ర అధ్యక్షులు వారికి జిల్లా తోటి సభ్యులకు అన్ని విధాలుగా సహకారం అందజేస్తానని అన్నారు. పేద ప్రజల తరఫున చట్టపరమైన దిశలో మానవ హక్కుల చర్యలో తోడ్పాటును నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఆపదలో ఉండే ఈ వ్యక్తికైనా ఎన్ హెచ్ ఆర్ సి ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.
బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట మార్చ్ 24(నేటిదాత్రి).
గుడి కడితే బిచ్చగాళ్ళు తయారవుతారు అని మాట్లాడి హిందూ మతాన్ని అగౌరవ పరిచిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఈరోజు ఒక మతాన్ని గౌరవిస్తూ మరో మతాన్ని వ్యతిరేకించడం చాలా విడ్డూరంగా ఉందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుని విమర్శించారు.
ఒక మతం కి చెందిన ఓట్లను ప్రామాణికంగా తీసుకొని వాళ్లని మాత్రమే ఓటర్లుగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా మార్చుకుంటూ మిగతా మతాలను కులాలను పట్టించుకోకుండా వారికోసం విందులు ఏర్పాటు చేసి ప్రభుత్వ ధనాన్ని వాడుకొని విందులు ఇవ్వడం వల్ల వారి స్వలాభాన్ని మాత్రమే చూసుకుంటున్నారు తప్ప మిగతా మతాల వారిని మిగతా కులాల వారిని నియోజకవర్గ ప్రజలుగా వారి ఓటర్లుగా భావించడం లేదని కుందూరు మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మరియు ఎమ్మెల్యే గారిని విమర్శించారు.
నియోజకవర్గంలో ఎన్నో కులాలు మతాలు ఉన్న వారందరినీ కలుపుకొని పోకుండా కేవలం ఒక వర్గాన్ని వారి ఓటర్లుగా సృష్టించుకోవడం విడ్డూరంగా ఉందని మహేందర్ రెడ్డి అన్నారు.
గ్రామాల్లో కులాల వారిగా వారి వారి కులదేవతలను మొక్కుకుంటూ ఎన్నో పండుగలు జరుపుకుంటున్న వారి కోసం విందులు ఏర్పాటు చేసిన సందర్భాలు లేవు కానీ ఒక వర్గం కోసం ఎంపీ గారు ఎమ్మెల్యే గారు విందులు ఏర్పాటు విందులు ఇవ్వడం వారి ఓటు బ్యాంకు రాజకీయానికి నిదర్శనం అని కుందూరు మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.
ఇప్పటికైనా మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీ చేసే మోసాలను గమనించి వారికి చేస్తున్న అన్యాయాలను గుర్తించి కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థానిక సంస్థల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని వారికి విజ్ఞప్తి చేశారు.
నియోజకవర్గంలోని హిందూ బంధువులంతా ఒకటై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ధ్యేయంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మహేందర్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.
కలెక్టర్ చేతులమీదుగా ఉత్తమ సర్వీస్ అవార్డు అందుకున్న రాసమళ్ళ కృష్ణ
పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లాలోని కేఎంసి మరియు టిబి ఆఫీసర్ హిమబిందు ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవ సందర్భంగా ఉత్తమ సర్వీస్ చేసినందుకుగాను పరకాల మండలంలోని మళ్ళక్కపేట గ్రామానికి చెందిన రేడియోగ్రాఫర్ రాసమల్ల కృష్ణకి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అభినందిస్తూ ఉత్తమ సర్వీస్ అవార్డు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా డిఎంహెచ్ఓ అప్పయ్య,లలిత దేవి తదితరులు పాల్గొన్నారు.
ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించడానికి ఆకాశానికి నిచ్చెన వేద్దామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలను దేశ్ పాండే ఫౌండేషన్ బృందంతో కలిసి ఆయన సందర్శించారు.
MLA
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ గా తెలంగాణ రాష్ట్రం లోని డిగ్రీ కళాశాలలో ప్రథమ స్థానంలో నిలపాలన్నదే తన ఆశయం అన్నారు. చివరి సంవత్సరం డిగ్రీ చదువుతున్న 500 విద్యార్థులకు మందికి దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రీజనింగ్, ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ లలో శిక్షణ ఇస్తారని, వారు డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఏదేని సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశ్ పాండే ఫౌండేషన్ వారి శిక్షణ మీకు ఉపయోగపడుతుంది అని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, దేశ్ పాండే ఫౌండేషన్ బృందం ప్రవీణ్ ముత్యాల, శేఖర్, విశ్రాంత ప్రిన్సిపాల్ మురళీమోహన్, ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రోఫెసర్ వి.రాజేంద్రప్రసాద్, నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, గుండా మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
ఆనందోత్సాహాల మధ్య కళాధార పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం
నేటి ధాత్రి కథలాపూర్
ఆనందోత్సవాల మధ్య కళాధార పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు. కథలాపూర్ మండల కేంద్రంలోని కళాధార పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఆనందోత్సవాల మధ్య జరిగాయి. ముఖ్యఅతిథిగా కోట్ల సిఐ సురేష్ బాబు హాజరై ప్రసంగించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులకు కూడా కష్టపడి విద్యార్థులకు మంచి బోధన అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. తహసిల్దార్ వినోద్ కుమార్ మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వసతులతో కూడిన విద్యా సంస్థ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కథలాపూర్ ఎస్ఐ నవీన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించవచ్చు అన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో పాఠశాల చైర్మన్ గడ్డం భూమారెడ్డి, డైరెక్టర్ గడ్డం దివాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ కమలాకర్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ పట్టణంలో ఆదివారం డీసీసీ కార్యాలయంలో జై బాపు.. జై భీమ్..జై సంవిధాన్ కార్యక్రమ సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు డా.చల్లా వంశీచంద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్చర్ల నియోజకవర్గంలోని రాజాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తెర కృష్ణయ్య మినహా .. మిడ్జిల్, జడ్చర్ల, బాలానగర్, ఉర్కొండ, జడ్చర్ల, నవాబుపేట మండలాల అధ్యక్షులు హాజరు కాలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ కార్యక్రమానికి గైర్హాజర్ కావడం వ్యక్తిగత కారణమా.. పార్టీపై అలక? అని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ సంస్థగత సిద్ధిపేట జిల్లా కౌన్సిల్ మెంబర్
భారతీయ జనతా పార్టీ భీమదేవరపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో గత బిఆర్ఎస్ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు కూడా 30 పడకల హాస్పటల్ గురించి అనేక సార్లు ఉద్యమాలు నిరాహార దీక్షలు చేపట్టి కరోనా సమయం లో మండలం లో అంబులెన్సు లేకపోతే పోరాడి ఆ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి అంబులెన్సు తెచ్చింది బీజేపీ భీమదేవరపల్లి మండల శాఖ అని మరిచిపోవద్దు అని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి 15 నెలలు అవుతున్నా భీమదేవరపల్లి మండల ప్రజల కోసం కనీసం 30 పడకల హాస్పటల్ ను కేటాయించాలని భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ మధ్యకాలం లో హన్మకొండ సిద్ధిపేట హైవే రోడ్డు పై మండల ప్రజలకు హాస్పటల్ కావాలని ధర్నా కార్యక్రమం చేయడం జరిగినది. అయినా ఇప్పటి వరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించడం లేదు. మండల పేద బడుగు బలహీన వర్గాలు దాదాపు 50 వేల జనాభా ఉన్నా మండలానికి ఒక ఎండి డాక్టర్ కానీ. ఒక గైనాకలాజిస్ట్ కానీ ఎమర్జెన్సీ డాక్టర్ లేకుండా మండల ప్రజలు అల్లాడిపోతున్నారు
బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో అడ్వకేట్ వెంకన్నకు ఘన సన్మానం
#నెక్కొండ ,నేటి ధాత్రి:
మండలంలోని గొట్లకొండ గ్రామానికి చెందిన యువ అడ్వకేట్ మాలోతు వెంకన్న జాదవ్ ను బి ఆర్ఎస్ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ గుంటుక సోమయ్య, మాజీ వైస్ ఎంపీపీ సారంగం, వాగ్య నాయక్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను మాలోతు వెంకన్న జాదవ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గుంటుక సోమయ్య మాట్లాడుతూ గిరిజన బిడ్డగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఎగ్జామ్స్ లో వెంకన్న ఉత్తీర్ణత సాధించడం ఎంతో సంతోషమని అన్నారు. ఈ కార్యక్రమంలో పసునూటి లక్ష్మీనారాయణ, రెడ్యానాయక్, శ్రీను, లింగం నాయక్, తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల మండల కేంద్రంలోని అంగన్వాడీ నెంబర్ వన్ సెంటర్ లో సూపర్వైజర్ జయప్రద ఆదేశాల మేరకు విద్యార్థుల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శీలపాక నాగరాజు వనితల కుమారుడు సాహసమిత్ర పుట్టినరోజు సోమవారం నిర్వహించగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉష కంపెనీ అసిస్టెంట్ సేల్స్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ మెండు వెంకట్ పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ స్వీట్లను పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్ల నుండి అందుతున్న పౌష్టికాహారాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంగన్వాడి సెంటర్లో ఆట పాటల విద్యతో విద్యార్థుల భవితవ్యాన్ని సక్రమంగా తీర్చిదిద్దడానికి అంగన్వాడీ టీచర్స్ ఆయాలు చేస్తున్నటువంటి కృషిని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల సంధ్యారాణి ఆయా లావణ్య తదితరులు పాల్గొన్నారు.
* మాజీ మంత్రి జ్ఞాపకార్థం చేర్యాల లో చలివేంద్రం ఏర్పాటు
చేర్యాల నేటిధాత్రి…
వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందయమని చేర్యాల మున్సిపల్ కమిషనర్ చుంచు నాగేందర్ అన్నారు. సోమవారం చేర్యాల పట్టణ కేంద్రంలోని స్థానిక అంగడి బజారు లో మాజీ మంత్రి నిమ్మ రాజారెడ్డి -రమాదేవి జ్ఞాపకార్థం ఆయన మనవడు నిమ్మ నిఖిల్ రెడ్డి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా మున్సిపల్ కమిషనర్ నాగేందర్, నిమ్మ శ్రీనివాస్ రెడ్డి-అనిత కుమారుడు నిమ్మ నిఖిల్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ నాగేందర్ మాట్లాడుతూ. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన నిఖిల్ రెడ్డి ని అభినందిస్తున్నట్లు చెప్పారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని వారు అన్నారు. ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధాన రోడ్డు మార్గం కావడంతో నిత్యం ప్రయాణికుల రద్దీ ఉంటుందని, వేసవికాలంలో ప్రయాణికుల దాహం తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు యువజన నాయకుడు నిమ్మ నిఖిల్ రెడ్డి తెలిపారు. బాటసారులు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మండలంలోని గుండ్రపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉద్యమకారుడు గాండ్ల ఓదెలు గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం మృతిచెందగా విషయం తెలుసుకున్న నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి ఓదేలు మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ మార్కెట్ చైర్మన్ హరీష్ రెడ్డి, నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల ప్రసాద్, గుండ్రపల్లి కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు శివకుమార్, కాంగ్రెస్ మండల నాయకులు రావుల మైపాల్ రెడ్డి, చల్ల పాపిరెడ్డి, కనపర్తి రమేష్, ఇటికల సంజీవయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
తంగళ్ళపల్లి మండలం చిన్న లింగాపూర్ గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు గుర్రం రవీందర్ రెడ్డి మాజీ ఎంపిటిసిబై రీ వేణి రాముఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదల కుటుంబాల వైద్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో అండగా ఉంటుందని చిన్న లింగాపూర్ గ్రామంలోని లబ్ధిదారులకు మహిమల రాజయ్యకు 60 వేల రూపాయలు గుర్రం ప్రసాద్ రెడ్డికి 45 వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ అందజేశామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు రావడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ప్రభుత్వ విప్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి పీకే మహేందర్ రెడ్డి కి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కి కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి చెక్కుడు రావడానికి చెక్కులు రావడానికి కృషిచేసిన వారికి నాయకులకు గుర్రం ప్రసాద్ రెడ్డి మహిమల రాజయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ మంద నారాయణ గౌడ్ బోలవే ని అనిల్ రేగుల ఎల్లయ్య పిట్ల పరుశురాములు వంతడుపుల బాలరాజు బోల వేణి హరీష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
తండ్రి జ్ఞాపకార్థం శివాలయ పునర్నిర్మాణానికి కసిరెడ్డి బ్రదర్స్ విరాళం.
చిట్యాల, నేటిధాత్రి :
భక్తి, శక్తి, ముక్తి మానవ జీవితంలో పరమ పద సోపానాల్లాంటివని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామ వాస్తవ్యులు కసిరెడ్డి కృష్ణారెడ్డి, కసిరెడ్డి రత్నాకర్ రెడ్డిలు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో పురాతన శివాలయం శిథిలావస్థకు చేరడంతో..ఆ శివాలయాన్ని కూల్చివేసి..నూతన శివాలయ పునర్నిర్మాణానికి కసిరెడ్డి బ్రదర్స్ కంకణ బద్దులయ్యారు. గ్రామస్తులనంతా ఏకం చేసి..విరాళాలు సేకరిస్తూ..శివాలయం పునర్నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వారి తండ్రి కీ: శే: కసిరెడ్డి పురుషోత్తం రెడ్డి స్మారకార్థం రూ.1,50,516 రూపాయల విరాళం అందించి వారి భక్తి భావాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భక్తి భావం వలన ప్రజల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని, ఈర్ష్య, ద్వేషం, అసూయ లాంటి దుర్గుణాలు తొలగిపోయి, భగవత్ సాహిత్యం వలన మనిషి మనసులో ప్రశాంతత పెరిగి సద్గుణాలు కలుగుతాయని, తద్వారా గ్రామస్తులందరి మధ్యన మంచి సంబంధాలు ఏర్పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో శివాలయం అర్చకుడు రఘునందన్, గ్రామ ప్రముఖులు సర్వ శరత్ కుమార్, అనగాని రాజయ్య, మందల రాఘవరెడ్డి, చెక్క నర్సయ్య, కొక్కుల సారంగం తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ నగరంలోని దేశాయ్ పేట్ రోడ్ కళ్యాణి నగర్ కాలనీ వాసులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు తమ కాలనీ లోని కుటుంబ సభ్యులంతా ఆరెపల్లి సమీపంలో ఏ ఎన్ ఆర్ గార్డెన్స్ లో కలుసుకొని అట పాటలతో సందడి చేసారు…
Spiritual gathering
ఈ సందర్బంగా కళ్యాణి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గోలి చెన్నారెడ్డి మాట్లాడుతూ ఐకమత్యం తో ఉండడం వాళ్ళ అందరు సంతోషంగా ఉంటారని కాలనీ లో ఆహ్లాదా వాతావరణం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమం లో పాల్గొన్నా కుటుంబ సభ్యులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమం లో కళ్యాణి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గోలి చెన్న రెడ్డి కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి కోశాధికారి మధు సుధన్..
Spiritual gathering
గౌరవ అధ్యక్షులు హరినాథ్ సలహాదారులు చిర్ల మల్ల రెడ్డి కాలనీ వాసులు కొండల్ రావు సంతోష్. తిరుపతి రెడ్డి వెంకట్ రెడ్డి.రామ సుబ్బారెడ్డి .వెంకట్ గౌడ్.రాంరెడ్డి రాజేందర్ రెడ్డి తుమ్మ ప్రభాకర్ రెడ్డి .సూరం ప్రతాప్ రెడ్డి. శివ కుమార్.వసంత్ కుమార్.చంద్ర శేఖర్ జయ పాల్ రెడ్డి పల్లం కుమారస్వామి తుమ్మ శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
ప్రపంచ క్షయ దినోత్సవం సందర్బంగా అవగాహన కార్యక్రమం టీ.బీ నియంత్రణలో అందరూ పాలు పంచుకోవాలి జిల్లాలో పటిష్టంగా కార్యాచరణ అమలు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ప్రపంచ టీ.బీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్
సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి):
సిరిసిల్ల జిల్లాలో క్షయ (టీ.బీ.) నియంత్రణలో అందరూ పాలు పంచుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. ప్రపంచ టీ.బీ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై ప్రారంభించారు.
Awareness program
ముందుగా టీబీ నియంత్రణ ప్రతిజ్ఞను ఉద్యోగుల అందరితో చేయించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు, నర్సింగ్ కళాశాలలో నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో విజేతలకు కలెక్టర్ ప్రశంస పత్రాలను పంపిణీ చేశారు.
Awareness program
ఈ సందర్భంగా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. టీ.బీ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. టీ.బీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు, జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి టీబీ లక్షణాలు ఉన్నవారిని గుర్తించాలని, వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయించాలని పేర్కొన్నారు. టీబీ పేషెంట్ల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వైద్యం, మందులు ఇప్పించాలని కలెక్టర్ ఆదేశించారు. టీ.బీ రహిత గ్రామాలుగా శివంగాలపల్లె, అనంతపల్లి, రామన్నపేట, కంచర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని కలెక్టర్ వెల్లడించారు. ఇందుకు కృషి చేసిన వైద్యులు, సిబ్బందిని అభినందించారు. మిగతా వైద్యులు, సిబ్బంది వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని పిలుపు ఇచ్చారు.అంతేకాకుండా ఈ కార్యక్రమంలో డీ.ఎం అండ్ హెచ్. ఓ రజిత, జీ.జీ.హెచ్. సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తులు కనిపించడం లేదనే ఫిర్యాదులపై కేసు నమోదు చేసిన పోలీసులు.
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఇద్దరు వేర్వేరు వ్యక్తులు కనిపించడం లేదని కచ్చిన పిర్యాదులపై కేసు నమోదు చేసినట్లు జహీరాబాద్ పట్టణ ఎస్సై ఎం. కాఠినార్ యాకర్ తెలిపారు.
ఇంటి నుండి వెళ్లిన భర్త తిరిగి రాలేదని, ఆచూకీ కనుక్కోవాలని మహిళ పిర్యాదు చేసిందని ఎప్ని యం. కాశీనాధ్ యాదవ్ తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా బహీరా బాద్ పట్టణం రాంనగర్ నివాసి అయిన హాసిల్యాండ్ మోసిన్ (19), ఆటో డ్రైవర్ ఈ నెల 17న ఉదయం 10 గంటల సమయంలో టీన్ 157637 సంబరు గం లో తీసుకుని అద్దెలో హైదరాబాద్ వెళ్ళాడు.
హైదరాబాద్ కి ఆర్థిలో వెళ్లిన తన భర్త ఇంత వరకు ఇంటికి రాలేదని పాసిల్యాండ్ మోసిన భార్య పాస్ బ్యాండ్ సహారా పాలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది.
పిర్యాదు తీసుకున్న ఎసీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.కూతురు కనిపించడం లేదని తల్లి పిర్యాదు తన రెండవ కూతుడు రాథోడ్ ని రుషా (24) కనిపించ డం లేదని తల్లి రాథోడ్ కవిత భర్త విక్కి బహీరాబాద్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసింది.
జహీరాబాద్ పట్టణం రాంనగర్ లో తాము నివాసం ఉండే ఇంటి నుండి ఈ.నెల 14వతేదీ ఉదయం 10 గంటల 300 మిషముల సమయంలోబయటికి వెళ్లి తిరిగినాలేనని పిర్యాదులో పిర్యాదురాలు పేర్కొన్నది.
కవిత ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుసున్నట్లు జహీరాబాద్ పట్టణ ఎస్ఐ యం కాశీనాధ్ తెలిపాడు.
వరంగల్ జిల్లా నెక్కొండ కు చెందిన ఇంటర్నేషనల్ ఆస్ట్రో ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత, జ్యోతిష వాస్తు పండితులు శ్రవణ్ శాస్త్రి బూరుగుపల్లికి ఉగాది పురస్కారం ప్రధానం చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వాస్తు,జ్యోతిష పండితులతో విశ్వజ్యోతి జ్యోతిష విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో ఆదివారం జరిగిన జ్యోతిష సమ్మేళనంలో శ్రవన్ శాస్త్రిని సత్కరించారు.లబ్దప్రతిష్టులైన జ్యోతిష వాస్తు పండితులు, బహు జ్యోతిష గ్రంథ రచయితలు డాక్టర్ పుచ్చా శ్రీనివాసరావు , లక్కావజ్జుల విజయ సుబ్రహ్మణ్య సిద్ధాంతి, ఆదిపూడి శివ సాయిరాం, విశ్వ జ్యోతి జ్యోతిష విజ్ఞాన సంస్థ చైర్మన్ డ్యాగం విశ్వనాథం ,ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీకాంత్ శర్మ ల సమక్షంలో జ్యోతిర్మిత్ర అవార్డును, ఉగాది పురస్కారం అందించి శాలువా కప్పి సన్మానించి అభినందించారు.
Vishwajyoti Jyotisha
నెక్కొండ ప్రాంతంలో జ్యోతిష వాస్తు రంగాలలో సేవలు అందిస్తూ ఇప్పటికే ప్రఖ్యాత ఇంటర్నేషనల్ ఆస్ట్రో ఎక్సలెన్స్ అవార్డు, బెస్ట్ సైంటిఫిక్ ఆస్ట్రాలజర్ అవార్డు, జ్యోతిష వాస్తు బ్రహ్మ,, జ్యోతిష పరిహార భాస్కర, బెస్ట్ వేదిక్ ఆస్ట్రాలజర్ అవార్డు లను అందుకున్న శ్రవన్ శాస్త్రి తాజాగా ఉగాది పురస్కారాల్లో సత్కారం పొందారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత శ్రవన్ శాస్త్రి మాట్లాడుతూ ఉగాది పురస్కారాల్లో ప్రముఖ పండితుల సరసన తన సేవలను గుర్తించి సత్కరించడం సంతోష మన్నారు. ఈ పురస్కారం వాస్తు జ్యోతిష రంగాల్లో తన బాధ్యతను మరింత సెంచుతున్నదన్నారు. ఈ సందర్భంగా పలు వాట్స్అప్ గ్రూప్లో లలో శ్రవణ శాస్త్రికి అభినందనలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నట్లుగా నెక్కొండ ప్రజలు ట్రీట్ చేయడం గమనార్థం.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.