ప్రపంచక్షయ దినోత్సవం సందర్బంగా.!

ప్రపంచ క్షయ దినోత్సవం సందర్బంగా అవగాహన కార్యక్రమం
టీ.బీ నియంత్రణలో అందరూ పాలు పంచుకోవాలి
జిల్లాలో పటిష్టంగా కార్యాచరణ అమలు
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ప్రపంచ టీ.బీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి):

 

సిరిసిల్ల జిల్లాలో క్షయ (టీ.బీ.) నియంత్రణలో అందరూ పాలు పంచుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. ప్రపంచ టీ.బీ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై ప్రారంభించారు.

Awareness program

ముందుగా టీబీ నియంత్రణ ప్రతిజ్ఞను ఉద్యోగుల అందరితో చేయించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు, నర్సింగ్ కళాశాలలో నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో విజేతలకు కలెక్టర్ ప్రశంస పత్రాలను పంపిణీ చేశారు.

Awareness program

ఈ సందర్భంగా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. టీ.బీ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. టీ.బీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు, జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి టీబీ లక్షణాలు ఉన్నవారిని గుర్తించాలని, వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయించాలని పేర్కొన్నారు. టీబీ పేషెంట్ల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వైద్యం, మందులు ఇప్పించాలని కలెక్టర్ ఆదేశించారు.  టీ.బీ రహిత గ్రామాలుగా శివంగాలపల్లె, అనంతపల్లి, రామన్నపేట, కంచర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని కలెక్టర్ వెల్లడించారు. ఇందుకు కృషి చేసిన వైద్యులు, సిబ్బందిని అభినందించారు. మిగతా వైద్యులు, సిబ్బంది వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని పిలుపు ఇచ్చారు.అంతేకాకుండా ఈ కార్యక్రమంలో డీ.ఎం అండ్ హెచ్. ఓ రజిత, జీ.జీ.హెచ్. సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version