నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో శుక్రవారం మహాత్మ జ్యోతిరావు ఫూలే 198వ జయంతి వేడుకలను.. బిసి సబ్ ప్లాన్ సాధన కమిటీ.. ఆధ్వర్యంలో ఘనంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. జ్యోతిరావు పూలే గొప్ప సంఘసంస్కర్త అని, పేద పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేశారన్నారు. నిరుపేద పిల్లల విద్యా దేశ భవిష్యత్తుకు పునాది అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్, నాయకులు రాంభూపాల్ రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్య కృష్ణ గౌడ్ , జిల్లా ఉపాధ్యక్షులు రాఘవేందర్ గౌడ జిల్లా సురేందర్ గౌడ కార్యవర్గ సభ్యులు నరేడ్ల శేఖర్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు బాబీ దేవ్, రూరల్ మండల అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్, యువ మోర్చ జిల్లా కార్యదర్శి ధన్నోజు నరేష్ చారి, రాజశేఖర్ పాల్గొన్నారు.
మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా బిఆర్ఎస్ పట్టణ సీనియర్ నాయకులు శనిగరపు నవీన్, గొర్రె రాజు,పట్టణ యూత్ ప్రధాన కార్యదర్శి దుప్పటి సుజయ్ రణదేవ్,సీనియర్ నాయకులు మార్క రఘుపతి,మొలుగూరి శ్రీనివాస్,మక్సుద్,పెర్వల రమేష్ పూలే విగ్రహానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ
ఆధునిక యుగంలో కుల నిర్మూలన ఉద్యమాలకు బీజం నాటిన సామాజిక విప్లవ యోధుడు,సత్య శోధక సమాజ్ వ్యవస్థాపకుడు,ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనే సామాజిక భావనను పెంపొందించిన దార్శనికుడు అని అన్నారు.జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు.
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సిరిసిల్ల సాహితి సమితి కార్యనిర్వాహణలో ఘనంగా వేడుకలు జరిగినది. సాహితి సమితి అధ్యక్షులు జనపాల శంకరయ్య మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన జ్యోతిరావు పూలే అని జ్యోతిరావు పూలే భావితరాలకు ఆశ కిరణం అనిజ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా సాహితీ సమితి కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, కవి రచయిత జుకంటి జగన్నాధం, మాజీ గ్రంధాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, సిరిసిల్ల సీనియర్ సిటిజన్ అధ్యక్షులు చేపురి బుచ్చయ్య, గుండెల్లి వంశీ, ఎండి ఆఫీజ్, గజ్జెల్లి సత్యనారాయణ, అంకారపు రవి,కవులు రచయితలు పాల్గొన్నారు.
మహాత్మ జ్యోతిరావు పూలే కు కలెక్టర్ ఘన నివాళి సిరిసిల్ల, ఏప్రిల్ -11(నేటి ధాత్రి):
మహాత్మ జ్యోతిరావు పూలే కు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ హాజరై జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ మనోహర్ రావు, డీపీఆర్ఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండలో ఒక విద్యాసంస్థలో గిరిజన విద్యార్థిని ఆత్మహత్య గొప్పఉదాహరణ
ఒత్తిడిని పెంచే విద్య వికాసానికి దోహదం చేయదు
పోటీ పరీక్షల కోచింగ్ పేరుతో వేలం వెర్రి పోకడలు
చెడ్డు చెడే కాలానికి కుక్కమూతి పిందెల చందం
మన విద్య ఎటువైపు పోతున్నది?
నరకానికి దారితీస్తున్న ప్రైవేటు విద్య
కట్టడిలేకపోతే పుట్టుకొచ్చేది చేవలేని తరం మాత్రమే
సామాజిక అవగాహన లేని విద్య అనర్థం
ర్యాంకు తాత్కాలికం, వికాసం శాశ్వతం
ప్రైవేటు విద్యాసంస్థలపై నియంత్రణ లేకపోవడం వల్ల జరిగే అనర్థాలకు ఉదాహరణగా హన్మ కొండలోని ఏకశిల జూనియర్ కళాశాలలో ఒక గిరిజన విద్యార్థిని మృతి నిలిచింది. ఆత్మహత్మ గా యాజమాన్యం చెబుతోంది. అయితే యువమోర్చా సభ్యులు మాత్రం కళాశాల యాజమాన్యం పెట్టిన టార్చర్ భరించలేకే అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు. నిజంగా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా, పోలీసులు ఏవిధ మైన పంచనామా జరుపకుండా ఏకంగా ఎం.జి.ఎం. మార్చురీకి ఏవిధంగా చేర్చారని వారు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రుల కడుపుకోతను ఎవరు తీరుస్తారు? నిజానికి ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల రూపంలో కోట్లాది రూపాయలు పిల్లల తల్లి దండ్రులనుంచి ముక్కుపిండి వసూలు చేయడమే కాకుండా, ర్యాంకుల పేరుతో విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడిని కలుగజేస్తున్నాయన్నది మాత్రం సత్యం. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం జరుగుతున్న తంతే ఇది. కానీ విద్య కా ర్పొరేటీకరణ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా కిమ్మనడంలేదు. విద్యాసంస్థల యజమానులు ఒక దశకు చేరుకొని వివిధ బ్రాంచ్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత తమ సంస్థల్లో జరుగుతున్న కార్యకలాపాలను బయటకురాకుండా వుండేందుకు, మీడియా, అధికార్లు, పోలీసులను గుప్పిట్లో పెట్టు కొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. మీడియా ప్రధాన ఆదాయ వనరు ప్రకటనలు. ఈ నేపథ్యంలో ప్రధాన స్రవంతి మీడియాకు కోట్లాది రూపాయల విలువైన ప్రకటనలను ఏటా ఇస్తూ, తమ సంస్థల్లో జరిగే అవకవకలు ప్రచురణ లేదా ప్రసారం కాకుండా జాగ్రత్త పడుతున్నాయి. అంతేకాదు పోలీసుల్లో అవినీతి అధికారులకు, ఇతర సంబంధిత ప్రభుత్వ అధికార్లకు కూడా తగినంత ముట్టజెప్పి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడమే కాదు, విద్యార్థులపై చదువు పేరుతో విపరీతమైన ఒత్తిడి పెంచడం వల్ల దీన్ని తట్టుకోలేని విద్యార్థులు అఘాయిత్యాలకు పాల్పడు తున్నారన్నది ప్రధానంగా వస్తున్న అభియోగం.
ఈ విద్యాసంస్థలు దోపిడీ ఒకరకంగా వుండదు! ఒక్కమాటలో చెప్పాలంటే బహుముఖ దోపిడీ అనాలి. అడ్మిషన్ల దగ్గరినుంచి, పుస్తకాలు, స్పెషల్ ఫీజులు, యూనిఫామ్లు…ఈవిధంగా వివిధ రకాల పేర్లతో తల్లిదండ్రులనుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తాయి. అదేమంటే విద్యాసంస్థ నిర్వహణకు ఇవన్నీ అవసరమన్న ధోరణి బాగా పెరిగిపోయింది. ప్రభుత్వ పాఠశాల విద్యపై తల్లిదండ్రులకు ఆసక్తి నశించి, తమ పిల్లలకు మంచి ర్యాంకులు రావాలని, గొప్ప స్థాయికి చేరుకోవాలనే ఆశలతో ఉన్న ఆస్తులను కూడా ఖాతరు చేయకుండా తమ పిల్లల చదువుకోసం ఖర్చు చేయడానికి వెనుకాడటంలేదు. ప్రైవేటు విద్యావ్యాప్తికి ప్రధాన కారణం ఈవిధమైన తల్లిదండ్రుల బలహీనతే. గతంలోని తరాల్లో ప్రైవేటు స్కూళ్లు లేవు. అన్నీ ప్రభుత్వ పాఠశాలలే. మాతృభాషలో విద్యను అభ్యసించి, పైచదువులు చదివి గొప్ప స్థానాలు పొందినవారెందరు లేరు? కానీ నేడు ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్లున్నా నాణ్యమైన విద్య అందడంలేదన్న కారణంగా తల్లిదండ్రులు ప్రైవేటు విద్యను ఆశ్రయిస్తున్నారంటే ఇక్కడ ఎవరిని తప్పుపట్టాలి?
తల్లిదండ్రులకు తమ పిల్లలు చక్కగా చదువుకుంటున్నారన్న విషయం కేవలం వారికి వచ్చే మా ర్కుల సరళిని బట్టే తెలుస్తుంది. చాలా ప్రైవేటు స్కూళలో విద్యార్థికి ఎక్కువ మార్కులు ఇవ్వడం ద్వారా తల్లిదండ్రులను బురిడీ కొట్టించడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే డిటెన్షన్ విధానం అమల్లో లేకపోవడంల్ల పదోతరగతికి వచ్చేవరకు ప్రశాంతంగా వెళ్లిపోతుంది. ఇక అక్కడి నుంచి విద్యార్థులపై వత్తిడి పెరుగుతుంది. ఇంటర్లో ఎంసెట్, ఈసెట్, జెఈఈ వంటి పోటీపరీక్షలకు హాజరు కావాల్సి వుండటంతో విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. దీనికితోడు ఆయా ప్రైవేటు విద్యాసంస్థలు ర్యాంకులకోసం టార్చర్ పెట్టడం ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి.
విచిత్రమేమంటే, రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖలు కలిగిన విద్యాసంస్థల యాజమాన్యాలు, రాజకీ యంగా, మీడియా, అవినీతి అధికార్లు, పోలీసులతో కుమ్మక్కయి అసలు తమ విద్యాసంస్థలో ఏం జరుగుతున్నదీ బయటకు వెల్లడి కాకుండా జాగ్రత్త పడుతుంటాయి. గతంలో విద్యాసంస్థ యాజమాన్యాలు, ఏవైనా అవకతవకలు బయటపడినప్పుడో లేదా ఆత్మహత్యల వంటి సంఘటన జరిగినప్పుడో సంబంధిత ప్రభుత్వ శాఖల అధికార్లకు ఏదోవిధంగా ముట్టజెప్పి బయటపడటం జరిగేది. వీరి పలుకుబడి నేపథ్యంలో నిరుపేదలైన తల్లిదండ్రులు తమ కష్టార్జితాన్ని, పిల్లలను కోల్పోయి ప్రశ్నించలేని దుస్థితిని ఎదుర్కొనడాన్ని మించిన దురదృష్టం మరోటుండదు. మీడియాను ప్రకటనటల ద్వారా తమదారికి తెచ్చుకుంటున్న యాజమాన్యాలు, అవినీతి పోలీసులు, అధికార్లకు అవసరమైనంత ముట్టజెప్పడం సర్వసాధారణమైపోయింది. ఈ పాఠశాల యాజమాన్యాల్లో కొందరు వివిధ రాజకీయ పార్టీ లకు కొమ్ము కాయడం ద్వారా పబ్బం గడుపుకుంటుంటారు. మరికొందరు పార్టీలకు పార్టీఫండ్ లను సమకూర్చడం ద్వారా కూడా తమపై ఈగవాలకుండా జాగ్రత్తపడుతుంటారు. ఇంకా పై స్థాయికి చేరుకున్న వారు, ఏకంగా రాజకీయాల్లోకే ప్రవేశిస్తారు. ఆవిధంగా అధికారం చేతిలోవుంటే అన్నీ వాటికవే చక్కబడిపోతాయన్న సత్యం వారికి బాగా అవ గాహన అయినప్పటికీ, ఆ స్థాయికిచేరుకోవడానికి వారికి కొంత సమయం అవసరం. ఇప్పుడు వరంగల్ జిల్లాకు చెందిన ఒక వి ద్యాసంస్థల యజమాని ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తు న్నారు. ఎవరైనా ఏరంగంలోనైనా ఎదగాలనుకోవడంలో తప్పులేదు. కానీ వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు రాజకీయాన్ని ఉపయోగించే విధానమే ఇక్కడ తప్పు!
ఇదిలావుండగా ప్రైవేటు విద్యాసంస్థల్లో కేవలం ర్యాంకులపైనే దృష్టి కేంద్రీకరించడం వల్ల విద్యా ర్థులకు వారివారి స్థాయికి తగిన సాధారణ పరిజ్ఞానం కొరవడుతోంది. జ్ఞాపకశక్తిపైనే దృష్టి తప్ప సృజనాత్మకతకు చోటుండటంలేదు. ఒకప్పుడు ఇంటర్మీడియట్ స్థాయిలో పోటీ పరీక్షలకు అవసరమైన కోచింగ్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఏకంగా పాఠశాల స్థాయినుంచే సివిల్ సర్వీస్ వంటి అత్యుతన్న పోటీపరీక్షలకు అవసరమైన ప్రమాణాలతో విద్యాబోధన అంటూ కొత్త ప్రచారాలు మొదలయ్యాయి. అసలు ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో విద్యార్థుల అవగాహనా శక్తి ఎంత? అనేది పట్టించుకునే దిక్కే లేదు. వేలంవెర్రిగా కోర్సులు పెట్టడం, తల్లిదండ్రులు అనుసరించడం. ఈవిధంగా విద్య వ్యాపార స్థాయినుంచి, కార్పొరేట్ స్థాయిని కూడా దాటిపోయిందనుకోవాలి. ఇక పిల్లల భవిష్యత్తేమిటి? వారి జీవితంలో చదువు, ర్యాంకులు, పోటీలు తప్ప ఆటలు, వినోద కార్యక్రమాలకు అవకాశమే లేని జైలు జీవితాన్ని ప్రైవేటు విద్యావిధానం వారికి అందిస్తోంది. నిజంగా ఇది చాలా దారుణం. జీవితంలో అత్యంత ఆనందమయంగా పరిగణించే బాల్యం, చదువును బోధన పేరుతో ఒక పెద్ద ‘సంకెల’గా మార్చివేశారు. ఇక్కడ తల్లిదండ్రులు డబ్బులు ఖర్చు పెట్టి మరీ తమ పిల్లలకు జైలు జీవితానికి పరిమితం చేస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో శారీరక స మతుల్యాభివృద్ధి దెబ్బతింటోంది. వత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడితే బైటికి రాకుండా డబ్బుతో అందరినీ కట్టిపడేస్తున్నారు. అందమైన భవిష్యత్తంటూ రంగురంగుల మాయా ప్రపంచాన్ని చూపుతూ పిల్లల్ని చదువు చట్రంలో విద్యార్థులను బిగించి ప్రైవేటు విద్యాసంస్థలు ఊపిరాడ కుండా చేస్తున్నాయి.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఏ చిన్న పొరపాటు లేదా సంఘటన జరిగినా మీడియా, వివిధ రాజకీయ పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు ఒక్కసారిగా వాలిపోతారు. నానా యాగీ చేస్తారు. ఇదే ప్రైవేటు సంస్థల విషయానికి వస్తే ఒక్కరు మాట్లాడరు!! ఇదెక్కడి దారుణం! అంతేకాదు తమ విద్యా వ్యాపారాన్ని పెంచుకోవడానికి, ప్రభుత్వ విద్యపై ఎన్నిరకాలుగా దుష్ప్రచారం చేయాలో అన్నిర రకాలుగా చేస్తారు. కారణం ప్రభుత్వ విద్యాసంస్థలు ఖాళీ అయితేనే కదా, ప్రవేటు సంస్థలు కళకళలాడేది!! ఇందులో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల పాత్రకూడా విస్మరించలేం. వీరిలో కొందరు ప్రవేటు విద్యాసంస్థలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తారనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. చిన్నపిల్లల్లో మనోవికాసం పెరగకపోవడానికి ప్రైవేటు విద్యే ప్రధాన కారణం! విద్యార్థి సర్వతో ముఖాభివృద్ధికి పాఠశాల, కళాశాలల వాతావరణం దోహదం చేయాలి తప్ప, ఒక మూస విధా నంతో విపరీతమైన ఒత్తిడిని పెంచుతూ, చివరకు వారి ఆత్మహత్యలకు దోహదం చేసిదిగా విద్య వుండకూడదు!
`ఎవరికి వారే దస్తావేజులు పూర్తి చేసుకునేందుకు మార్గం
`మధ్య వర్తుల జోక్యం లేకుండా ప్రక్రియ పూర్తికి మార్గ నిర్దేశనం
`అవకతవకలు జరగకుండా పూర్తి భరోసాతో ఆస్థులు భద్రం
`స్థిరాస్తుల మీద ప్రజలకు ఎలాంటి భయం లేకుండా కొత్త నిర్ణయం
`ఏడాది క్రితమే చెప్పిన నేటిధాత్రి
`ఇలాంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ రాబోతోందని చెప్పిన నేటిధాత్రి
`ప్రజలకు మేలు జరగాలన్నదే మంత్రి ‘‘పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి’’ ఆలోచన
`ఎన్ని ఒత్తిళ్లొచ్చినా వెనుకడుగు వేయకుండా అమలు చేస్తున్న ‘‘మంత్రి’’
`అవాంతరాలు ఎన్ని ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతున్న ‘‘మంత్రి పొంగులేటి’’
`సరికొత్త రిజిస్ట్రేషన్ విధానంపై ప్రజల ప్రశంసలు
`మంత్రి ‘‘పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి’’ కి జనం నుంచి అందుతున్న అభినందనలు
`రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సమూల మార్పులకు మంత్రి ఆదేశం
`త్వరలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు
`రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలకు అందుబాటులోకి మరిన్ని సేవలు
`కార్యాలయాలలో గౌరవంగా ప్రజలకు సౌకర్యాలు
హైదరాబాద్,నేటిధాత్రి:
భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో రాష్ట్రప్రభుత్వం విప్లవాత్మకమైన ఆవిష్కరణను తీసుకొచ్చింది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిరచి, కొత్త తరహా రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టింది. గతంలో ఎదురైన అనుభవాలు,సవాళ్లు, ఇబ్బందులు అదిగమించి, ఎలాంటి సమస్యలు భవిష్యత్తులో ఎదురుకాకుండా కొత్త తరహా విధానాన్ని తీసుకొచ్చింది. అందు కోసం రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పట్టుదల, కృషి ఫలించింది. ప్రజలకు రిజిస్ట్రేషన్ విషయంలో ఎలాంటి బాధలు భవిష్యత్తులో ఎదురుకావొద్దన్న మంచి ఉద్దేశ్యంతో ఈ తరహా విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రయోగాత్మకమైన విధానం మూలంగా ఎవరికీ ఎలాంటి సమస్యలు ఎదురుకావు. ప్రజల స్ధిరాస్ధుల విషయంలో గందరగోళానికి తావుండదు. పైగా ఒకరి భూములు, మరొకరు ఎట్టిపరిస్ధితుల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఆస్కారం లేదు. వీలు అసలే కాదు. ఇకపై భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో చిన్న చిన్న పొరపాట్లకు కూడా తావులేని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిరచి రిజిస్ట్రేషన్లు చేయడం గొప్ప మార్పుగా చెప్పుకోవచ్చు. ఈ విధానం త్వరలో వస్తుందని నేటిధాత్రి ఏడాది క్రితమే చెప్పింది. సమీప భవిష్యత్తుల సులభతరమై, పకడ్భంధీ రిజిస్ట్రేషన్కు అవసరమైన నూతన విధానం అందుబాటులోకి రానున్నదని నేటిధాత్రి చెప్పడం జరిగింది. ఇప్పుడు అది వాస్తవ రూపం దాల్చింది. గతంలో రిజిస్ట్రేషన్ల విషయంలో నిత్యం వివాదాలు ఎదురౌతూ వుండేవి. ఇకపై అలాంటి సమస్యలన్నింటికీ చెక్ పడనున్నది. అక్రమాలకు తావులేకుండా, సజావుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుంది. అంతే కాదు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొన్ని నిమిషాల్లోనే పూర్తికానున్నది. రోజుల తరబడి రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పనిలేదు. అదికారులను బ్రతిమిలాడుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు జరిగినా, మళ్లీ మళ్లీ ప్రజలు పదే పదే కార్యాలయం చుట్టూ తిరిగి అలసిపోవాల్సి వుండదు. అధికారులకు ఇబ్బంది లేకుండా,ప్రజలకు సమస్యలు తలెత్తకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానం వచ్చేసింది. ఇదంతా ఇంత త్వరగా పూర్తి కావడానికి అమలులోకి రావడానికి మంత్రి పొంగులేటి కృషిని ప్రభుత్వ వర్గాలు కొనియాడుతున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ కొత్త టెక్నాలజీ ఎంతో దోహడపడుతుంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా వేగవంతమౌతుంది. నేటి నుంచి ఈ స్లాట్ బుకింగ్ అమలలోకి వచ్చింది. మొదటి దశలో 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ కొత్త తరహా ఆవిష్కరణ జరిగింది. దశలవారిగా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం అమలులోకి రానున్నది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అతి వేగంగా కావడమే కాకుంగా, అవినీతి ఆస్కారం లేకుండా వుంటుంది. ఇప్పుడున్న విమర్శలకు భవిష్యత్తులో వినేఅవకాశం వుండదు. ప్రజలకు లంచాల బెడద కూడా వుండదు. ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే ఇకపై దస్తావేజుల తయారీ కోసం ప్రజలు ఎవరి మీద ఆధాపడాల్సిన పని వుండదు. మధ్యవర్తులైన దళారుల చేతుల్లో మోస పోవడం అసలే వుండదు. ఎవరికి వారు స్వంతంగా దస్తావేజులుతయారు చేసుకునేందుకు వెబ్సైట్ ఏర్పాటుచేశారు. అందుకోసం ఒక మాడ్యూల్ ప్రవేశపెట్టారు. ఇది కూడా ఐచ్చికంగానే వుంటుంది. ఎందుకంటే గతంలో దస్తావేజుపైన అమ్మిన, కొన్న వాళ్ల సంతాకాలు, రిజిస్ట్రార్ సంతకాల కోసం ఇలా కార్యాలయం చుట్టూ తిరగడానికే సమయం చాల పట్టేది. ఇకపై ఆ గందరగోళం అంతా వుండదు. రిజిస్ట్రేషన్లో ఎలాంటి జాప్యానికి తావుండదు. ఒక్కసారి దస్తావేజులు పూరణ పూర్తి చేసి, స్లాట్ బుక్ చేస్తే ఇచ్చిన సమయానికి కార్యాలయానికి వెళ్తే సరిపోతుంది. పదినిమిషాల్లోపు రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఈ ప్రక్రియలో కూడా ఆదార్ ఇ` సంతకం ప్రవేశపెడుతున్నారు. ఈనెల చివరి లోగా ఈ సైన్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. గతంలో రెండు రెండుసార్లు రిజిస్ట్రేషన్ల వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యేవి. ఆ భూములు ఎవరివో తెల్చుకోలేక సతమతమయ్యేవారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇకపై భవిష్యత్తులో అలాంటిసమస్యలు వుండకపోవచ్చు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చట్టం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే డబుల్ రిజిస్ట్రేషన్ గోల ప్రతి రోజూ ఎక్కడో అక్కడ వుంటూనే వుంటుంది. అసలైన లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరుగుతూ వచ్చేది. భూమిని నమ్ముకొని తరతరాలుగా ఆధారపడుతున్న వారే కాదు, రియలెస్టేట్లో స్ధలాలు కొన్న వారికి ఈ డబుల్ రిజిస్ట్రేషన్ల వల్ల కేసులు, ఘర్షణలు జరుగుతుండేవి. ఆ కుటుంబాలు ఆర్ధికంగా చితికిపోయేవి. రూపాయి రూపాయి కూడబెట్టుకున్నవారి భూములను ఇతరులు అసలు యజమానులకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిసి ప్రాణాలు పోగొట్టుకున్నవారు కూడా వున్నారు. కుటుంబాలు వీధినపడ్డ వారున్నారు. ఇకపై అలాంటి సమస్యలు ఏ కుటుంబం ఎదుర్కొకుండా కొత్త చట్టం తీసుకొచ్చేందుక ప్రభుత్వం సిద్దమౌతోంది. ఈ విషయంలో చాలా రాష్ట్రాలు కొన్ని ప్రత్యేకమైనచట్టాలను అమలు చేస్తున్నాయి. వాటిన్నింటినీ అధ్యయం చేసి, అందుల్లో ఉత్తమైన చట్టాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమౌతోంది. తెలంగాణలో కూడా త్వరలో ఈ చట్ట సవరణ చేపట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో కసరత్తు జరగుతోంది. అధికారుల అద్యయనం సాగుతోంది. రిజిస్ట్రేషన్ చట్టంలో వున్న సెక్షన్ 22కు అదనంగా 22`బి తీసుకురానున్నారు. దీని వల్ల ఇకపై డబుల్ రిజిస్ట్రేషన్ అనేదానికి ఆస్కారం లేకుండా వుంటుంది. అవసరమైనంత సిబ్బంది లేకుండా ఇబ్బందులుపడుతున్న కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని కూడా నియమించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. దాంతో స్టాట్విధానంలో జరిగే వేగవంతమైన రిజిస్ట్రేషన్ కోసం అదనపు ఉద్యోగుల వల్ల ఏక కాలంలో ఎక్కువ రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకే రోజు, ఒకే సమయంలోఎక్కువ దస్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం సమర్పించడం వల్ల జరిగే జాప్యాన్ని సునాయాసంగా అధిగమించేందుకు వీలౌతుంది. అదనపు ఉద్యోగుల నియామకం కూడా తొలుత మేడ్చల్`మల్కాజిగిరి, కుత్భుల్లాపూర్లో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లతోపాటు, ఇతర సిబ్బందిని నియమించనున్నారు. దీని వల్ల కుత్భుల్లాపూర్లో 144 స్టాట్స్ ఏకకాలంలో అందుబాటులోకి వస్తాయి. తెలంగాణలోని 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలోవున్న 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు త్వరలోఈ విధానాన్ని విస్తరిస్తే ఇక రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాల వేగవంతమౌతుంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రభుత్వ భవనాలు కూడా నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటి వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే ఎక్కువగా వున్నాయి. చాలీ చాలని సౌకర్యాలతో వుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఇన్ని సంవత్సరాలైనా సొంత భవానాలు లేకపోవడం గమనార్హం. అద్దె ఇళ్లలో కార్యాలయాలు వుండడం వల్ల ప్రజలు అనేకు సమస్యలు ఎదుర్కొనే వారు. కార్యాలయంలో నిలుచులేక, కార్యాలయం సమీపంలో వున్న చెట్ల నీడన ఎదురుచూస్తూ వుండేవారు. వానొచ్చినా, ఎండ కాచినా రోజలు తరబడి ఎదురుచూడాల్సిన పరిస్దితులు కూడా వుండేవి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరే రిజిస్ట్రేషన్లు. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం సమకూర్చే ప్రజలు కార్యాలయంలో కనీసం నిలబడే పరిస్దితి వుండదు. మంచి నీటి సౌకర్యం వుండదు. ఉద్యోగులు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలను కసురుకుంటూ, చీదరించుకంటూ వుండే విధానానికి త్వరలో స్వస్తి పలుకనున్నారు. కొత్త కార్యాయాలను నిర్మాణం చేసుకొని, రిజిస్ట్రేషన్లకోసం వచ్చే ప్రజలకు కూర్చునేందుకు సౌకర్యాలు కల్పించనున్నారు. అంతే కాదు అక్కడికి వచ్చిన ఉద్యోగులు ప్రజలను గౌరవంగా చూసుకునే విధానం తీసుకురానున్నారు. ఇప్పుడు రిజిస్ట్రార్ కార్యాలయంలో కనీసం మాట్లాడుకునే వీలు కూడా వుండదు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ప్రజలకు స్వేచ్చాయుత వాతావరణం కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వుండేలా చూస్తున్నారు. ప్రజలకు గౌరవం కల్పించనున్నారు. కొత్త విధానం వల్ల అవినీతి తగ్గుతుంది. కొత్త కార్యాలయాల వల్ల ప్రజలకు గౌరవం దక్కుతుంది. రిజిస్ట్రేషన్ల ప్రకియ చాలా వేగంగా మారుతుంది.
మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మున్సిపల్ కార్యాలయంలో ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా పథకం మరియు ప్రధానమంత్రి సురక్ష ప్రమాద బీమా పథకాన్ని మున్సిపల్ కార్మికులకు చేయించినారు కమిషనర్ మాట్లాడుతూ 18 నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నవారు సంవత్సరానికి రూపాయలు 436 & 20 ప్రమాద బీమా చేయించుకున్నచో రెండు లక్షల ఇన్సూరెన్స్ పొందవచ్చును ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోవచ్చుని తెలిపినారు మున్సిపల్ కార్మికులకు అండగా ఉంటామని తెలిపినారు ప్రతి నెలకు ఒకసారి పారిశుద్ధ్య కార్మికులకుహెల్త్ చెకప్ చేయిస్తామని తెలిపినారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యక్షుడు బర్ల లక్ష్మణ్ శ్రీకాంత్ ముజీబ్ సిఎస్పి బి గంగాజల నిజాం అశోక్ వీ నరేష్ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
*గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన సినీ నటుడు సప్తగిరి తల్లి చిట్టమ్మ..
*సినీ నటుడు సప్తగిరి నివాసానికి వెళ్లి పరామర్శించిన..
*ఎమ్మెల్యేలు పులివర్తి నాని మురళి మోహన్..
తిరుపతి(నేటి ధాత్రి) ఏప్రిల్ 11:
తిరుపతి రూరల్ మండలం ఓటేరు పంచాయతికి చెందిన సినీ నటుడు సప్తగిరి తల్లి చిట్టమ్మ గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం నాడు సినీ నటుడు సప్తగిరి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యేలు పులివర్తి నాని మురళి మోహన్ అనంతరం సప్తగిరిని ఓదార్చి ధైర్యంగా ఉండాలని తెలిపిన ఎమ్మెల్యేలు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
అంగన్ వాడీ కేంద్రానికి రూ.5 వేల విలువైన కూలర్ అందజేత…
గర్భిణీ స్త్రీలు,పిల్లలకు రక్తహీనత గురించి అవగాహన..
కేసముద్రం/ నేటి ధాత్రి
వేసవి కాలం నేపథ్యంలో చిన్నారుల సౌకర్యార్థం కేసముద్రం మున్సిపల్ కేంద్రం, పాత బజారు లోని అంగన్ వాడీ కేంద్రానికి చెందిన పలువురు చిన్నారుల తల్లిదండ్రులు రూ.5 వేల విలువైన కూలర్ ను విరాళంగా అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. అదేవిధంగా పోషణ్ పక్వాడ్ వారోత్సవాల్లో భాగంగా గురువారం అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలు,బాలింతలు, చిన్నారులకు రక్తహీనత, హ్యాండ్ వాష్ ,పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అంగన్ వాడీ కేంద్రానికి కూలర్ బహుకరించిన చిన్నారుల తల్లిదండ్రులకు అంగన్వాడీ టీచర్ ఈ.రాజమణి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయ, అంగన్ వాడీ టీచర్ ఈ. రాజమణి, నాగనబోయిన సునితావెంకటేశ్వర్లు, ముత్యాల నాగమణి, ముల్క చంద్రకళ,వెలుగు సీఏ దొడ్డ అనసూర్య, వద్ది సౌమ్య, వద్ది ఉదయ, మహమ్మద్ నగ్మా, మహ్మద్ జహీరా,బి.శిరీష, ఆశా సుజాత, ఆయా అరుణ తదితరులు పాల్గొన్నారు.
యుద్ద ప్రాతిపదికన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అమర్చిన సింగరేణి…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల రాజీవ్ చౌక్ ఏరియాలో సింగరేణి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ గురువారం మధ్యాహ్నం పేలడంతో విద్యానగర్, భగత్ సింగ్ నగర్ ఏరియాలలో గల సింగరేణి క్వార్టర్స్ కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తక్షణమే స్పందించిన సింగరేణి యాజమాన్యం నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేసి కార్మికుల సౌకర్యార్థం నూతన ట్రాన్స్ఫార్మర్ ను వెంటనే అమర్చడంతో కార్మికులు సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల కొరకు అహర్నిశలు పాటుపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని కార్మికులు వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ పునరుద్ధరణలో సింగరేణి ఇంజనీర్ సదానందం, ఎలక్ట్రిషన్లు తిరుమలరావు, ముస్తాఫ్ అలీ, కాంతారావు, సంపత్ తదితర సింగరేణి మజ్దూర్లు పాల్గొన్నారు.
ఎమ్. పి.పి.ఎస్ కల్వల పాఠశాల లో ఈరోజు 5వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కళ్లెం వీరారెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి, గౌరవ అతిథిగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్ విచ్చేయడం జరిగింది. ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి విద్యార్థులను మంచి విద్యావంతులు గా మార్చి, భావి భారత పౌరులు గా తీర్చి దిద్దడంలో ఉపాధ్యాయుల కృషి వెలకట్టలేనిది. ఈనాడు ప్రభుత్వ పాఠశాల లో చదువు కున్న వారే నేడు గొప్ప స్థానంలో వున్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాల లో చదివించాలని పిలుపునిచ్చారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్ మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాలలో సర్వతోముఖ అభివృద్ధికి పాటు పడటం కేవలంప్రభుత్వ పాఠశాల తోనే సాధ్యం అని, ప్రభుత్వ విద్యా రంగం ను బలోపేతం చేయాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కళ్లెం వీరారెడ్డి మాట్లాడుతూ ఇంగ్లీష్ భాషను ఒక భాష లాగే చూడాలని, సబ్జెక్టు కు ఆపాదించవద్దని, మాతృభాష లోనే ఎక్కువ విషయావగాహనను, జ్ఞానాన్ని పొందదగలరని అన్నారు. ఇంగ్లీష్ మీడియం విద్య అని విద్యార్థులను ఏ భాష సరిగా రాకుండాచేస్తున్నారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినిీ ఉపాధ్యాయులైన గోపి, స్వరూప, హరిక్రిష్ణ, క్రిష్ణ,శ్రీదేవి, మోహనకృష్ణ, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తలిదండ్రులు ,విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యుత్తు వినియోగదారుల సమస్యలు 45 రోజుల్లో పరిష్కరిస్తాము.
ఎన్ పి డీ సీ ఎల్ ఫోరం చైర్ పర్సన్ వేణుగోపాల చారి.
చిట్యాల,నేటిధాత్రి
చిట్యాల మండలంలోని సమస్త విద్యుత్ వినియోగదారుల సమావేశం గురువారం (10/04/2025) రోజున చిట్యాల రైతు వేదిక లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక టి జీ జి ఆర్ ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది. టి జీ ఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్పషన్ తెలిపారు. ఈ లోకల్ కోర్టులో లూస్ లైన్ లు, మిడిల్ పోల్స్, అగ్రికల్చర్ సర్వీస్ లు మొదలగు వాటికి సంబంధించి విద్యుత్ వినియోగదారులు రాతపూర్వకంగా తమ ఫిర్యాదులు 14 అందిఒంచినట్టు తెలిపారు. ఫిర్యాదులు ఉదయం. గం: 10:30 నుండి మధ్యాహ్నం గం:01:00 వరకు స్వీకరించి ఇట్టి ఫిర్యాదులను 2 అక్కడే పరిష్కరించి మిగతావి కేసులు రిజిస్టర్ చేసి 45 రోజులలో పరిష్కరించ్త్అమ్అని టీఎస్ టి జీ ఎన్ పి డి సి ఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్పషన్ తెలిపారు. చైర్పషన్- ఎన్ వి వేణుగోపాల చారి ఫోరం ఫైనాన్స్ – ర్. చరణ్ దాస్ ఫోరం ఇండిపెండెంట్ అభ్యర్థి – రామ రావు ఫోరం టెక్నికల్ అభ్యర్థి – K. రమేష్ ఎస్ ఈ – మల్చూర్ ఏఓ – రాజ్ కుమార్ డీ ఈ – పాపి రెడ్డి ఏ డీ ఈ- సందీప్ పాటిల్ ఏ ఈ లు – చంద్రశేఖర్, మణిదీప్, సంజయ్ సబ్ ఇంజనీర్ లు – సుమంత్, వెంకటేశ్, శ్రీనివాస్ విద్యుత్ సిబ్బంది మరియు విద్యుత్ వినియోగదారుల పాల్గొన్నారు .
మొగుడంపల్లి మండలంలోని అంగన్వాడీ కేంద్రంలో గురువారం ఘనంగా స్కూల్ డే వేడుకలు, గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెడికల్ ఆఫీసర్ సింఫోనియా, అంగన్వాడి సూపర్వైజర్ సద్గుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు తప్పకుండా పంపించాలని తల్లిదండ్రులను కోరారు. అదేవిధంగా మెనూ ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం అందించాలని టీచర్లను ఆదేశించారు.
విధి నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఉద్యోగులు
కేసముద్రం/ నేటి దాత్రి
కేసముద్రం మున్సిపల్ మండలంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ రోజురోజుకు మరి అధ్వానంగా తయారవుతున్నాయని ప్రభుత్వ పాఠశాలలో కొలువులు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుండా విధులలో అలసత్వం వహిస్తున్నారని, సమయానికి పాఠశాలల తలుపులు తెరుచు కోవడం లేదని విద్యార్థుల మాటలు వినబడుతున్నాయి, మండల విద్యాశాఖ అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులకు మెమొలు జారీ చేసినప్పటికీ ఉపాధ్యాయుల విధి నిర్వహణలో మార్పు కనిపించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. మండలంలో పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు స్థానికంగా ఏ ఒక్కరు ఉండకుండా సుదూర ప్రాంతాల నుంచి కొన్ని రవాణా సౌకర్యాలు రైలుబండ్లు మరియు ఆర్టీసీ బస్సుల ద్వారా నిత్యం రాకపోకలు జరుగుతున్నప్పటికీ ఎవరు ప్రశ్నించేవారు లేక ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. స్థానికంగా ఉండకుండా ఇలా రోజు వచ్చి పోయే క్రమంలో ట్రైన్లు బస్సులు ఆలస్యంగా నడవడం సహజం, కానీ విధులు నిర్వహించే ఉద్యోగులు సమయానికి రాక ట్రైన్ ఎప్పుడు వస్తే అప్పుడే వీరి పాఠశాల సమయపాలనగా భావిస్తూ విడుదల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు విద్యావేత్తలు మేధావులు ప్రశ్నిస్తున్నారు.
Education
తల్లి తండ్రి దైవం గురువు వీరు అత్యున్నతమైన స్థానం కలిగిన వారిని, గురువుకు అత్యున్నతమైన గౌరవం ఈ సమాజంలో ఉందని అంతటి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఆ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు అద్దకారం అయిపోతుందని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు చదువులలో వెనుకబడిపోతున్నారని పలువురు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. అదేవిధంగా గురువారం కేసముద్రం మున్సిపల్ లోని దానసరి ఎస్టి కాలనీ గల ప్రాథమిక పాఠశాల సమయానికి తలుపులు తెరుచుకోక విద్యార్థులు సమయానికి పాఠశాల చేరుకొని గేటు బయట ఎదురుచూస్తున్న సంఘటన చోటుచేసుకుంది, ఉదయం 7:40 నిమిషములకు పాఠశాలకు రావలసిన ఉపాధ్యాయులు సమయానికి రాక గేటు తాళాలు తీసేవారు లేక విద్యార్థిని విద్యార్థులు గేటు బయటే కూర్చుని ఉపాధ్యాయుల రాక కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారని, ఒక ఉపాధ్యాయురాలు మాత్రమే పాఠశాలకు ఆలస్యంగా చేరుకోవడం జరిగింది, ఇంకో ఉపాధ్యాయులు మాత్రం నేను ఈరోజు రావడం లేదని లీవ్ లో ఉన్నానని ఫోన్ ద్వారా వివరణ ఇవ్వటం జరిగింది, ఈ స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సమాచారం తెలియజేయగా మాకు ముందస్తు సమాచార లేదని తెలిపారు. ఇలా విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల పనితీరు మండల విద్యాశాఖ అధికారులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్య గోచారం కాకుండా చూడాల్సిన విద్య శాఖ అధికారులు ఇలాంటి ఉపాధ్యాయుల పట్ల కఠిన నిర్ణయాలు పాటించి చర్యలు తీసుకోవాలని ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
సంగారెడ్డి: పొట్టిపల్లి సిద్దేశ్వర స్వామి జాతర మహోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జాతరకు సంబంధించిన గోడపత్రికను మహామండలేశ్వర్, శ్రీ దత్తగిరి ఆశ్రమం బర్దిపూర్లో పీఠాధిపతి డాక్టర్ మహంత్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో దేవస్థాన ఆలయం సభ్యులు పాల్గొన్నారు.
ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను హరించడానికే వక్ఫ్ సవరణ బిల్లును తెచ్చారని ఇది మైనారిటీలను అణిచివేసే రాజ్యాంగ వ్యతిరేక బిల్లని దేశ వ్యాప్తంగా ముస్లింల మనోభావాలు దెబ్బతీయడమే లక్ష్యంగా వక్ఫ్ బిల్లు తీసుకురావడం జరిగిందన్నారు.దేశ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయే ఒక దుశ్చర్యఅని ఈ బిల్లు ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పా మరొకటి కాదని,వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేయడం కోసమే ఈ పన్నాగం పన్నుతున్నారని అన్నారు.వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశంలో 20 కోట్ల మంది ముస్లింలు ఆందోళనలు చేస్తున్నా వారి ఆవేదన వినకుండా బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్య విద్రోహ చర్య అని ఈ బిల్లును కేంద్రం వెంటనేఉపసంహరించుకోవాలని మున్సిపల్ మాజీ కో ఆప్షన్ సభ్యులు ముఫీనా ఫాతిమా హమీద్ డిమాండ్ చేసారు.
బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూధన్ రెడ్డి
పరకాల నేటిధాత్రి
మంగళవారం రోజున బిఆర్ఎస్ పరకాల మండల పార్టీ అధ్యక్షులు చింతిరెడ్డి మధుసుధన్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలనీ ఈ మహోత్తర కార్యక్రమానికి పల్లెలు పట్టణాల ప్రజలు కదిలిరావాలని ఈ సభతో రాష్ట్రంలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందనే సత్త చూపించాలని కోరారు.
మండల పరిధిలోని చల్మెడ గ్రామ శివారులో నీ తిరుమల స్వామి ఆలయ భూమిలో 33 / 11 కెవి సబ్ స్టేషన్ ను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గురువారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ చల్మెడ గ్రామ ప్రజలకు రైతులకు నాణ్యమైన విద్యుత్తు అందించాలనే ఉద్దేశంతో సబ్ స్టేషన్కు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామని ధనిక, పేద తారతమ్యాలు లేకుండా అందరూ సన్నబియ్యమే తినాలని ప్రభుత్వము రేషన్ షాపుల ద్వారా అందరికీ సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు. తిరుమల స్వామి ఆలయాన్ని కూడా త్వరలోనే అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దర్ రమ్యశ్రీ, ఎంపీడీవో రాజిరెడ్డి, ఎస్ ఇ శంకర్, డి ఈ లు గరుత్మంతా రాజు, చాంద్ పాషా, ఏడి ఆదయ్య , ఏఈ గణేష్, తాజా మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ రమేష్, పంజా మహేందర్ , మారుతి, వెంకటేష్ గౌడ్ , నజీరుద్దీన్ , ముత్యం రెడ్డి, తుమ్మల రమేష్ ,కాకి రాజయ్య ,బాజ రమేష్, సత్యనారాయణ రెడ్డి, దేశెట్టి సిద్ధ రాములు , మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రమావత్ వినోద్ , మసూద్ ,రవీందర్ రెడ్డి, అందే స్వామి, బొమ్మెన మల్లేశం, లక్ష్మణ్, భూపతి రెడ్డి, రాజేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని కల్వరీ గుట్ట మీద నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు మరియు వాటర్ ట్యాంక్ కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కల్వరీ గుట్ట పైకి వచ్చి ప్రార్థనలు నిర్వహించుకునే క్రైస్తవ సోదరులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సీసీ రోడ్ ను అలాగే తాగునీటి సౌకర్యం కొరకు వాటర్ ట్యాంక్ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. భక్తులకు ఇన్నాళ్లు రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు బెక్కెరి మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జాజిమొగ్గ నరసింహులు, క్రిస్టియన్ మైనారిటీ పట్టణ అధ్యక్షులు సామ్యూల్ దాసరి , కల్వరీ ఎంబీ చర్చి పాస్టర్ మరియు చైర్మన్ ఎస్.వరప్రసాద్, వైస్ చైర్మన్ జాకబ్, సెక్రెటరీ డేవిడ్, రాజు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ నియోజకవర్గం హన్వాడ మండలంలోని టంకర, వేపూర్ గ్రామాల్లో MGNREGA పథకం క్రింద రూ.44.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ ను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి రోడ్లు, రవాణా, కమ్యునికేషన్, ఆరోగ్య సదుపాయాలు, విద్యాసంస్థలు, విద్యుత్ ఏర్పాటు వంటివి గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన చాలా ముఖ్యం అని ఎమ్మెల్యే అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.