సమయానికి తెరుచుకొని పాఠశాల
విధి నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఉద్యోగులు
కేసముద్రం/ నేటి దాత్రి
కేసముద్రం మున్సిపల్ మండలంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ రోజురోజుకు మరి అధ్వానంగా తయారవుతున్నాయని ప్రభుత్వ పాఠశాలలో కొలువులు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుండా విధులలో అలసత్వం వహిస్తున్నారని, సమయానికి పాఠశాలల తలుపులు తెరుచు కోవడం లేదని విద్యార్థుల మాటలు వినబడుతున్నాయి, మండల విద్యాశాఖ అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులకు మెమొలు జారీ చేసినప్పటికీ ఉపాధ్యాయుల విధి నిర్వహణలో మార్పు కనిపించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. మండలంలో పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు స్థానికంగా ఏ ఒక్కరు ఉండకుండా సుదూర ప్రాంతాల నుంచి కొన్ని రవాణా సౌకర్యాలు రైలుబండ్లు మరియు ఆర్టీసీ బస్సుల ద్వారా నిత్యం రాకపోకలు జరుగుతున్నప్పటికీ ఎవరు ప్రశ్నించేవారు లేక ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. స్థానికంగా ఉండకుండా ఇలా రోజు వచ్చి పోయే క్రమంలో ట్రైన్లు బస్సులు ఆలస్యంగా నడవడం సహజం, కానీ విధులు నిర్వహించే ఉద్యోగులు సమయానికి రాక ట్రైన్ ఎప్పుడు వస్తే అప్పుడే వీరి పాఠశాల సమయపాలనగా భావిస్తూ విడుదల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు విద్యావేత్తలు మేధావులు ప్రశ్నిస్తున్నారు.
తల్లి తండ్రి దైవం గురువు వీరు అత్యున్నతమైన స్థానం కలిగిన వారిని, గురువుకు అత్యున్నతమైన గౌరవం ఈ సమాజంలో ఉందని అంతటి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఆ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు అద్దకారం అయిపోతుందని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు చదువులలో వెనుకబడిపోతున్నారని పలువురు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. అదేవిధంగా గురువారం కేసముద్రం మున్సిపల్ లోని దానసరి ఎస్టి కాలనీ గల ప్రాథమిక పాఠశాల సమయానికి తలుపులు తెరుచుకోక విద్యార్థులు సమయానికి పాఠశాల చేరుకొని గేటు బయట ఎదురుచూస్తున్న సంఘటన చోటుచేసుకుంది, ఉదయం 7:40 నిమిషములకు పాఠశాలకు రావలసిన ఉపాధ్యాయులు సమయానికి రాక గేటు తాళాలు తీసేవారు లేక విద్యార్థిని విద్యార్థులు గేటు బయటే కూర్చుని ఉపాధ్యాయుల రాక కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారని, ఒక ఉపాధ్యాయురాలు మాత్రమే పాఠశాలకు ఆలస్యంగా చేరుకోవడం జరిగింది, ఇంకో ఉపాధ్యాయులు మాత్రం నేను ఈరోజు రావడం లేదని లీవ్ లో ఉన్నానని ఫోన్ ద్వారా వివరణ ఇవ్వటం జరిగింది, ఈ స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సమాచారం తెలియజేయగా మాకు ముందస్తు సమాచార లేదని తెలిపారు. ఇలా విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల పనితీరు మండల విద్యాశాఖ అధికారులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్య గోచారం కాకుండా చూడాల్సిన విద్య శాఖ అధికారులు ఇలాంటి ఉపాధ్యాయుల పట్ల కఠిన నిర్ణయాలు పాటించి చర్యలు తీసుకోవాలని ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.