జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘన నివాళి
పరకాల నేటిధాత్రి
మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా బిఆర్ఎస్ పట్టణ సీనియర్ నాయకులు శనిగరపు నవీన్, గొర్రె రాజు,పట్టణ యూత్ ప్రధాన కార్యదర్శి దుప్పటి సుజయ్ రణదేవ్,సీనియర్ నాయకులు మార్క రఘుపతి,మొలుగూరి శ్రీనివాస్,మక్సుద్,పెర్వల రమేష్ పూలే విగ్రహానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ
ఆధునిక యుగంలో కుల నిర్మూలన ఉద్యమాలకు బీజం నాటిన సామాజిక విప్లవ యోధుడు,సత్య శోధక సమాజ్ వ్యవస్థాపకుడు,ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనే సామాజిక భావనను పెంపొందించిన దార్శనికుడు అని అన్నారు.జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు.