జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో అంబేద్కర్ భవనం వద్ద అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా జ్యోతిరావు పూలే ఫోటో కు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

రాజేందర్ మాట్లాడుతూ సుప్రసిద్ధ భారతీయ సామాజిక కార్యకర్త ఆలోచనపరుడు కుల వ్యతిరేక సంఘసంస్కర్త అని అన్నారు. అంటరానితనం నిర్మూలన కోసం మహిళలు అనగారిన కులాల ప్రజలలో విద్య వ్యాప్తికి కృషిని కొనసాగించారని వారి సేవలను గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు తిక్క సంపత్,కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఓరుగంటి కృష్ణ,నాయకులు దూడపాక శ్రీనివాస్,రజనీకాంత్,సంపత్,శివకుమార్ యూత్ నాయకులు పాల్గొన్నారు._

జ్యోతిరావు పూలే గొప్ప సంఘసంస్కర్త.

జ్యోతిరావు పూలే గొప్ప సంఘసంస్కర్త

కల్వకుర్తి/నేటి ధాత్రి

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో శుక్రవారం మహాత్మ జ్యోతిరావు ఫూలే 198వ జయంతి వేడుకలను.. బిసి సబ్ ప్లాన్ సాధన కమిటీ.. ఆధ్వర్యంలో ఘనంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. జ్యోతిరావు పూలే గొప్ప సంఘసంస్కర్త అని, పేద పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేశారన్నారు. నిరుపేద పిల్లల విద్యా దేశ భవిష్యత్తుకు పునాది అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్, నాయకులు రాంభూపాల్ రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్య కృష్ణ గౌడ్ , జిల్లా ఉపాధ్యక్షులు రాఘవేందర్ గౌడ జిల్లా సురేందర్ గౌడ కార్యవర్గ సభ్యులు నరేడ్ల శేఖర్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు బాబీ దేవ్, రూరల్ మండల అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్, యువ మోర్చ జిల్లా కార్యదర్శి ధన్నోజు నరేష్ చారి, రాజశేఖర్ పాల్గొన్నారు.

జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘన నివాళి.

జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘన నివాళి

పరకాల నేటిధాత్రి

మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా బిఆర్ఎస్ పట్టణ సీనియర్ నాయకులు శనిగరపు నవీన్, గొర్రె రాజు,పట్టణ యూత్ ప్రధాన కార్యదర్శి దుప్పటి సుజయ్ రణదేవ్,సీనియర్ నాయకులు మార్క రఘుపతి,మొలుగూరి శ్రీనివాస్,మక్సుద్,పెర్వల రమేష్ పూలే విగ్రహానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ

ఆధునిక యుగంలో కుల నిర్మూలన ఉద్యమాలకు బీజం నాటిన సామాజిక విప్లవ యోధుడు,సత్య శోధక సమాజ్ వ్యవస్థాపకుడు,ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనే సామాజిక భావనను పెంపొందించిన దార్శనికుడు అని అన్నారు.జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు.

మహాత్మ జ్యోతిరావు పూలే కు కలెక్టర్ ఘన నివాళి.

మహాత్మ జ్యోతిరావు పూలే కు కలెక్టర్ ఘన నివాళి
సిరిసిల్ల, ఏప్రిల్ -11(నేటి ధాత్రి):

 

మహాత్మ జ్యోతిరావు పూలే కు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ హాజరై జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ మనోహర్ రావు, డీపీఆర్ఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version