కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అందజేయాలి.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అందజేయాలి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

 

గత సీజయన్ లో రైతు భరోసా ఇవ్వని రైతులకు వెంటనే రైతు బరోసా డబ్భులు ఇవ్వాలని బిఆర్ఎస్ నర్సంపేట మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో అధ్యక్షుడు నామాల సత్యనారాయణ మాట్లాడుతూ గతకాలం సీజన్ లో రైతులకు రైతు భరోసా కేవలం 3 ఎకరాలలోపు ఉన్న కొందరు రైతులకు మాత్రమే రైతు భరోసా వేశారని ఇప్పుడు వానాకాలం సీజన్ మొదలు అవుతుందని అన్నారు.గౌరవ తెలంగాణ తోలి ముఖ్యమంత్రి కేసిఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో రైతు బందును సమయానికి రైతుల ఖాతాలో వేసి రైతులకు అదుకున్నారని పేర్కొన్నారు. నేడు ముఖ్యమంత్రి ఓక సీజన్ రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేశాడని ఆరోపించారు.ఎలాంటి అంక్షలు లేకుండా రైతు భరోసా బాకి ఉన్న రైతులకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహరాములు,మోతే జైపాల్ రెడ్డి,మోతే పద్మనాభ రెడ్డి,కోమల్ల గోపాల్ రెడ్డి,బండారి రమేష్,మోటూరి రవి,కోడారి రవి,తాల్లపెల్లి రాం ప్రసాద్,భూక్య వీరన్న,కడారి కుమారస్వామి,పెద్ది శ్రీనివాస్ రెడ్డి,వళ్ళల కర్ణకార్,అల్లి రవి,మర్ద నవీన్,సంగెం శ్రీకాంత్,చిప్పు రాజు తదితరులు ఉన్నారు.

జంగాలపల్లి MPPS పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం.

జంగాలపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం

ప్రభుత్వ బడులలో పిల్లలను చదివిద్దాం బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం

నేటి ధాత్రి చర్ల

 

 

 

 

 

చర్ల మండల కేంద్రంలోని ఎంపీపీస్ జంగాలపల్లి పాఠశాలలో శుక్రవారం నాడు బడిబాట కార్యక్రమంలో భాగంగా సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించి చిన్నారుల భవిష్యత్తును వెలుగులతో నింపాలని ఉపాధ్యాయులు కోరారు ప్రభుత్వ బడిలో చదువుకుంటాం కానీ ప్రైవేట్ బడిలో డబ్బుతో చదువును కొంటాం డబ్బులు ఎవరికీ ఊరికే రావు ప్రభుత్వ బడిలో విలువలతో కూడిన చదువుకొని మంచి ఉన్నత చదువులు చదివి అనుభవమున్న ఉపాధ్యాయులు ఉంటారు విశాలమైన తరగతి గదులు మధ్యాహ్న భోజనం వారానికి 3 గుడ్లు మూడు రోజులు రాగి జావ ఉచిత పాఠ్య పుస్తకాలు ఉచితంగా దుస్తులు ఇవ్వబడతాయి అని ఉపాధ్యాయులు గ్రామాల్లోని పిల్లల తల్లిదండ్రులకు వివరించారు ఇకనైనా ప్రైవేటు స్కూళ్లపై మక్కువ మాని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే రామలక్ష్మి ఉపాధ్యాయులు సకినం బాలకృష్ణ అంగన్వాడీ టీచర్ పద్మ పిల్లల తల్లితండ్రులు గ్రామస్తులు  పాల్గొన్నారు

ఉత్తమ చిత్రానికి రూ. 10 లక్షలు.

ఉత్తమ చిత్రానికి రూ. 10 లక్షలు

 

గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవానికి హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ఈ వేడుకను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమైంది.

 

 

 

 

 

 

  • ప్రత్యేక అవార్డుకు రూ. 10 లక్షల నగదు బహుమతి
  • ఉత్తమ ద్వితీయ, తృతీయ చిత్రాలకు రూ. 7, 5 లక్షలు
  • ఉత్తమ నటుడికి, ఉత్తమ నటికి చెరో రూ. 5 లక్షలు
  • నేడు గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వేడుక

గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవానికి హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ఈ వేడుకను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమైంది.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డుల విజేతలకు అందజేసే నగదు బహుమతిని భారీగా పెంచింది.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజు సహా పలువురు చిత్ర ప్రముఖులు పాల్గొననున్నారు.
కాగా, గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల జాబితాను ఇటీవలె ప్రకటించారు.
2014 నుంచి 2023 వరకు ప్రతి ఉత్తమ చిత్రానికి హీరో, హీరోయిన్‌, దర్శకుడు, నిర్మాతలకు కలిపి నాలుగు అవార్డులను ప్రదానం చేస్తారు.
ఇలా ప్రతి ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలకు అందజేస్తారు. 2024వ సంవత్సరానికి ప్రకటించిన అన్ని అవార్డులను కూడా బహూకరిస్తారు.
వీటితోపాటు 2024వ సంవత్సరం నుంచి రఘుపతి వెంకయ్య, బీఎన్‌ రెడ్డి, ఎన్టీఆర్‌, పైడి జైరాజ్‌, కాంతారావు, చక్రపాణి పేర్లతో ప్రత్యేక అవార్డులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది.
ఈ ఆరు ప్రత్యేక అవార్డుల్లో ఒక్కో అవార్డుకు రూ.పది లక్షల చొప్పున, మూడు ఉత్తమ చిత్రాలకు వరుసగా రూ. 10, 7, 5 లక్షల చొప్పున అందజేయనుంది.
అదేవిధంగా ఉత్తమ నటుడు, ఉత్తమ నటికి రూ.5 లక్షల చొప్పున అందజేయనున్నారు. 14 సంవత్సరాల విరామం తర్వాత సినిమా నటీనటులను, సాంకేతిక నిపుణుల ప్రతిభను ప్రోత్సహించే సంప్రదాయానికి తెలంగాణ ప్రభుత్వం తిరిగి శ్రీకారం చుట్టడం పట్ల అవార్డుల గ్రహీతలు, సినిమా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, విజేతలకు సీఎం రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు.
తెలంగాణ కళారంగంలో వేగుచుక్కలాంటి గద్దర్‌ పేరిట వివిధ విభాగాల్లో సినిమా కళాకారులకు అవార్డులు అందించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

థగ్‌లైఫ్‌ మూవీ బ్యాన్‌ కోర్టులో విచారణ.

 థగ్‌లైఫ్‌ మూవీ బ్యాన్‌ కోర్టులో విచారణ…

కర్ణాటకలో థగ్‌లైఫ్‌ సినిమా విడుదలకు సంబంధించి నమోదైన పిటిషన్‌లు సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టులో శుక్రవారం ఒకే రోజు విచారణకు వచ్చాయి.

థగ్‌లైఫ్‌ హీరో కమల్‌ హాసన్‌ బెంగళూరులో జరిగిన ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో.

కర్ణాటకలో థగ్‌లైఫ్‌ సినిమా విడుదలకు సంబంధించి నమోదైన పిటిషన్‌లు సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టులో శుక్రవారం ఒకే రోజు విచారణకు వచ్చాయి.
థగ్‌లైఫ్‌ హీరో కమల్‌ హాసన్‌ బెంగళూరులో జరిగిన ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.
కమల్‌ క్షమాపణ చెప్పకపోతే థగ్‌లైఫ్‌ సినిమాను రాష్ట్రంలో విడుదల చేయనివ్వబోమని కన్నడ సంఘాలు హెచ్చరించాయి.
కర్ణాటక చలనచిత్ర వాణిజ్యమండలి కూడా ఈ మేరకు తీర్మానం చేసింది.
దీన్ని ప్రశ్నిస్తూ, సినిమా నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ మన్మోహన్‌ ధర్మాసనం విచారించింది.
సినిమా విడుదలకు అభ్యంతరాలు తెలియజేయాలని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.

ప్రియాంకను అనుకున్నారు రకుల్‌ను తీసుకున్నారు.

ప్రియాంకను అనుకున్నారు.. రకుల్‌ను తీసుకున్నారు

 

భారతీయ చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘రామాయణ’. రణబీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు నితిశ్‌ తివారి భక్తిశ్రద్ధలతో రూపొందిస్తున్నారు.

 

భారతీయ చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘రామాయణ’. రణబీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు నితిశ్‌ తివారి భక్తిశ్రద్ధలతో రూపొందిస్తున్నారు. వివాదాలకు తావు లేకుండా, విజువల్‌ వండర్‌గా ‘రామాయణ’ చిత్రాన్ని రూపొందించడానికి కృషి చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ చాలా కాలం క్రితమే మొదలైనా గత ఏడాది నవంబర్‌ నెలలో అధికారికంగా వివరాలు వెల్లడించారు. సాయిపల్లవి సీతగా, రావణుడిగా కన్నడ హీరో యశ్‌, సన్నీ డియోల్‌ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణునిగా, కాజల్‌ అగర్వాల్‌ మండోదరిగా, లారా దత్తా కైకేయిగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంతో జరుగుతోంది. ఇక ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర శూర్పణఖ. రామ, రావణ యుద్ధం జరగడానికి కారణమైన ఈ పాత్రను రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పోషించనున్నారు. ఆమె కంటే ముందు ఆ పాత్ర కోసం ఎవరిని సంప్రదించారో తెలుసా? పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ప్రియాంక చోప్రాను. ఆమె శూర్పణఖ పాత్ర పోషిస్తే అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ‘రామాయణ’ చిత్రానికి అదనపు ఆకర్షణ అవుతుందని దర్శకనిర్మాతలు భావించారు. అయితే తనకున్న ఇతర కమిట్‌మెంట్స్‌ వల్ల ఆ పాత్ర చేయలేనని ప్రియాంక చెప్పడంతో అప్పుడు రకుల్‌ను ఈ అవకాశం వరించింది. ప్రియాంక చోప్రా ఇప్పుడు మహేశ్‌, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా రామాయణగాథ స్ఫూర్తితో రూపొందుతుండడం విశేషంగా పేర్కొనాలి.

ఎయిరిండియాలోనే మంచు లక్ష్మీ ప్రయాణం ఆమె ఏమన్నారంటే.

ఎయిరిండియాలోనే మంచు లక్ష్మీ ప్రయాణం ఆమె ఏమన్నారంటే…

అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానం కుప్పకూలిన రోజే మంచు లక్ష్మీ ఎయిరిండియా విమానంలో లండన్‌కు వెళ్లారు.

అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్‌ ఇండియా (Air india Plain) విమానం కుప్పకూలిన రోజే మంచు లక్ష్మీ (manchu lakshmi Prasanna) ఎయిరిండియా విమానంలో లండన్‌కు వెళ్లారు. దీంతో ఆమె ఎలా ఉన్నారో ఆరా తీశారు అభిమానులు. మెసేజ్‌లు చేశారు.  అయితే తాను క్షేమంగా ఉన్నానంటూ మంచు లక్ష్మి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.  ‘‘ఫ్లైట్‌ దిగిన తర్వాత ప్రమాదం గురించి తెలిసి దిగ్ర్భాంతికి గురయ్యాను. నేను ఎలా ఉన్నానో కనుక్కోవడం కోసం ఎన్నో ఫోన్లు, మెేసజ్‌లు వస్తూనే ఉన్నాయి. నేను, మా అమ్మాయి అదేరోజు ముంబయి నుంచి లండన్‌కు ఎయిరిండియా విమానంలో ప్రయాణం చేశాము. దేవుడి దయ వల్ల మేము సేఫ్‌గా చేరుకున్నాం. అక్కడికి వెళ్లిన వెంటనే ఈ ప్రమాదం గురించి తెలిసి ఉలిక్కిపడ్డాను.
ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరం. విద్యార్థులు కూడా మృతి చెందారని తెలిసి నా హృదయం ముక్కలైంది. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మన ప్రాణాలు క్షణంలో ముగిసిపోతాయనడానికి ఈ ప్రమాదం ఒక ఉదాహరణ. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ అని మంచు వీడియోలో పేర్కొన్నారు. ఈ నెల 12న జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా ఆస్పత్రి, నివాస సముదాయం లోని ప్రజలు కొంత మంది మరణించినట్లు చెప్పారు.

బాసిల్‌కు బన్నీ గ్రీన్‌సిగ్నల్‌.

 బాసిల్‌కు బన్నీ గ్రీన్‌సిగ్నల్‌…

 

పుష్ప అంటే ఇంటర్నేషనల్‌’ అంటూ పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్‌లానే ఇప్పుడు ఆయన ఇమేజ్‌ కూడా ఇంటర్నేషనల్‌ లెవల్‌కు వెళ్లింది. దాంతో ఆయనతో సినిమాలు చేయబోయే దర్శకులు.

పుష్ప అంటే ఇంటర్నేషనల్‌’ అంటూ పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్‌లానే ఇప్పుడు ఆయన ఇమేజ్‌ కూడా ఇంటర్నేషనల్‌ లెవల్‌కు వెళ్లింది. దాంతో ఆయనతో సినిమాలు చేయబోయే దర్శకులు అంటూ రోజుకో పేరు తెరపైకి తెస్తున్నాయి సోషల్‌ మీడియా వర్గాలు. తాజాగా అల్లు అర్జున్‌ను డైరెక్ట్‌ చేయబోతున్న దర్శకుల జాబితాలో మలయాళ డైరెక్టర్‌ బాసిల్‌ జోసెఫ్‌ పేరు చేరింది. ఆయనతో ఓ సినిమా చేసేందుకు బన్నీ ఎస్‌ చెప్పారంటూ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. బాసిల్‌ చెప్పిన కథ అల్లు అర్జున్‌కు బాగా నచ్చిందని, త్వరలోనే వీరి కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వస్తుందనేది ఆ వార్తల సారాంశం. బాసిల్‌ జోసఫ్‌ నటుడిగా, దర్శకుడిగా మలయాళ పరిశ్రమలో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అయితే అవేవీ అల్లు అర్జున్‌ స్థాయికి తూగేవి మాత్రం కావు. కాబట్టి ఈ ప్రచారంలో నిజానిజాలేమిటో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అల్లు అర్జున్‌ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.

 రాజాసాబ్‌కు కష్టం టీమ్‌ హెచ్చరిక.

 రాజాసాబ్‌కు కష్టం టీమ్‌ హెచ్చరిక…

ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్‌ కామెడీ హారర్‌ ఫిల్మ్‌ ‘ది రాజా సాబ్‌’. ఇప్పుడీ చిత్రానికి  లీకుల కష్టం మొదలైంది. టీజర్‌లోని కొన్ని విజువల్స్‌ను నెట్టింట లీక్‌ చేశారు. దీనిపై టీమ్‌ స్పందించింది.

ప్రభాస్‌ (Prabhas) హీరోగా మారుతి (Maruthi) దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్‌ కామెడీ హారర్‌ ఫిల్మ్‌ ‘ది రాజా సాబ్‌’. (The raja saab) జూన్‌ 16న ఈ సినిమా టీజర్‌ విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఇప్పుడీ చిత్రానికి  లీకుల కష్టం మొదలైంది. టీజర్‌లోని కొన్ని విజువల్స్‌ను నెట్టింట లీక్‌ చేశారు. దీనిపై టీమ్‌ స్పందించింది.
లీక్‌ కంటెంట్‌ను షేర్‌ చేసే వాళ్లపై  కఠిన చర్యలు తీసుకుంటామని టీమ్‌ హెచ్చరించింది. ఎవరైనా ‘రాజాసాబ్‌’ కంటెంట్‌కు సంబంధించిన అనధికారక వీడియోలు, ఫొటోలు, షేర్‌ చేస్తే వారి సోషల్‌ మీడియా అకౌంట్‌ను తక్షణమే నిలిపివేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. సినిమాటిక్‌ అనుభూతి అందించేందుకు చిత్రబృందం ఎంతో కష్టపడుతోందని దానికి అందరూ సహకరించాలని కోరింది.
ప్రభాస్‌ నటిస్తున్న తొలి హారర్‌ చిత్రమిది. దీంతో అందరి దృష్టి ఈ చిత్రంపై ఉంది. డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. టీజర్‌ను ఈ నెల 16న విడుదల చేయనున్నట్లు టీమ్‌ ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్‌లో ఈవెంట్‌ చేయాలను కుంటున్నారని తెలిసింది. మాళవిక మోహనన్‌, నిధీ అగర్వాల్‌, రిద్థికుమార్‌ కథానాయికలు. సంజయ్‌దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. 

ఖరీఫ్ సాగులో రైతులు బిజీ బిజీ.

ఖరీఫ్ సాగులో రైతులు బిజీ బిజీ

వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు

సేద్యం పనుల్లో రైతులు బిజీ బిజీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

గుకోసం రైతులు సేద్యం పనుల్లో బిజీబిజీగా మారారు. మండ లంలో రెండు వేల హెక్టార్లకు పైగా సాగు విస్తీర్ణం ఉందని వ్యవసాయాధి కారులు పేర్కొంటున్నారు జహీరాబాద్ నియోజకవర్గం జహీరాబాద్ ఝరాసంగం మొగుడంపల్లి కోహిర్ న్యాల్కల్ మండలంలో నాలుగు రోజులుగా వర్షాలు కురు స్తుండటంతో వ్యవసాయ పొలాల్లో ట్రాక్టర్ల సాయంతో దుక్కిళ్లు చేస్తున్నారు. పొలాల్లో, గట్టుపై పెరిగిన పిచ్చిమొక్కలు, రాళ్లు తొలగించడంలో రైతులు నిమగ్నమయ్యారు. ఈ యేడాది ముందస్తు వర్షాలు కురవడంతో వేరుశనగ పంట సాగుచేసేందుకు మండలంలోని రైతులు ఆసక్తి చూపుతున్నారు.

గోదాం లవద్ద సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలి.

గోదాం లవద్ద సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలి

బురదమయం అవ్వడంతో బస్తాలు దింపడంలో ఇబ్బదులను ఎదుర్కొంటున్నాం

ఏఐటియూసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంకదాసరి అశోక్

పరకాల నేటిధాత్రి

 

 

 

 

పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లోగల గోదాంల వద్ద సీసీ రోడ్లను వేయించాలని ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంకదాసరి అశోక్ అన్నారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ 2014-15వ సంవత్సరంలో పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో 5000 మెట్రిక్ టన్నుల గోదాంను నాబార్డ్ వారి సహకారంతో 3,00,00 లక్షలతో నిర్మించడం జరిగిందని గోదాంలో సరైన సౌకర్యాలు లేక కొన్ని సంవత్సరములు ఖాళీగా ఉన్న గోదాంను కార్మికులామంతా కలిసి సివిల్ సప్లై డిఎం,ఆర్ఎం లకు కలిసి గోదాంలు కాలిగా ఉంటున్నాయని వాటిలో పీడీఎస్ బియ్యాన్ని దింపినటైతే మాకు కూలి దొరుకుతుందని మా పరిస్థితిని వెళ్ళబుచ్చగా 2025లో జనవరి మాసంలో వాళ్లతో అగ్రిమెంట్ ఒప్పందం చేసుకొని 5,000 మెట్రిక్ టన్నుల గోదాంలో బియ్యం దింపడం జరిగింది.

కార్మికుల కష్టాలు తీరుతున్నాయానుకునే సమయంలో వర్షాకాలం సమీపిస్తున్న వేల అసలైన సమస్య ఎదురైందని గోదాం చుట్టూ సీసీ రోడ్లు లేక నానా అవస్థలు పడుతున్నామన్నారు.

గతంలో వర్షాకాలంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడిందని గోదాం చుట్టూ లోతట్టు ప్రాంతం అవ్వడంతో నీరు నిల్వవుండి బురద మయంగా మారిందని పిడిఎస్ బియ్యంతో వచ్చే లారీలు దిగబడుతున్నాయని, బస్తాలు మోయాలంటే కష్టంగా ఉన్నదని,బియ్యం బస్తాలు దూరం మోయవలసి వస్తుందని దానివల్ల మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నామన్నారు.

 

CC roads

 

 

గోదాం చుట్టూ సీసీ ఏర్పాటు చేసి మా కార్మికుల కష్టాలను తీర్చాలని ప్రభుత్వాన్ని అధికారులను కార్మిక సంఘం తరుపున కోరుతున్నామని తెలిపారు.

కార్మిక నాయకులు ప్రధాన కార్యదర్శి నాగేళ్లి శంకర్,కోగిల శంకరయ్య,రేణిగుంట్ల రాజయ్య,కోడపాక ఐలయ్య,కోట యాదగిరి,బొట్ల భద్రయ్య,కోడపాక చిరంజీవి,శ్రీపతి రాజయ్య, శ్రీపతి కుమార్,కోగిల కైలాసం,జన్ను పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

అక్షరాభ్యాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించిన.

అక్షరాభ్యాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ప్రాథమిక పాఠశాల న్యాల్కల్ మండల రేజింతల్ గ్రామంలో ప్రధానోపాధ్యాయులు సఫియా సుల్తానా అధ్యక్షతన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నూతనంగా 1 వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సఫియా సుల్తానా ఉపాధ్యాయులు జ్యోతి, మానస, ఏ ఏ పి సి చైర్మన్ రామేశ్వరీ, మాజీ ఎంపీటీసీ నల్లవల్లి మల్లిక, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఆమ్మదాబాద్ విమానం ప్రమాదం లో మృతులకు.

ఆమ్మదాబాద్ విమానం ప్రమాదం లో మృతులకు నివాళులు అర్పించిన గణేష్ వాకింగ్ టీమ్

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమానము ప్రమాదంలో మృతి చెందిన ప్రజలు గుజరాత్ మాజీ సీఎం మృతి చెందిడము పట్ల వనపర్తి గణేష్ వాకింగ్ గ్రూప్ సబ్యుల అధ్యర్య ములో రాజవారి బంగ్లాలో నివాళులర్పించామని అధ్యక్షులు గోనూర్ వెంకటయ్య ఒక ప్రకటనలో తెలిపారు రాజాపేట సుదర్శన్ రెడ్డి దొంత అశోక్ వాకింగ్ టీము సబ్యులు నివాళులర్పించారు

సిపిఐ 18వ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.

సిపిఐ 18వ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

భూపాలపల్లి నేటిధాత్రి:

సిపిఐ 18వ పట్టణ మహాసభలను పురస్కరించుకొని సిపిఐ ఎల్బీనగర్ శాఖ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని వాల్ పోస్టులను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు సోత్కు ప్రవీణ్ కుమార్, గురిజాల సుధాకర్ రెడ్డి,మాతంగి రామచందర్, రాయ మల్లు, కత్తెర శాల, పత్తి వేణుగోపాల్ సంపత్ తదితరులు పాల్గొన్నారు

సంకెళ్లు వేస్తున్న సెల్ ఫోన్.

సంకెళ్లు వేస్తున్న సెల్ ఫోన్…

వీడియో గేమ్స్ తో, యూట్యూబ్ లతో కాలం గడిపేస్తున్న యువత…

చాటింగ్, వీడియో కాలింగ్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్న వైనం…

సెల్ ఫోన్ తో సందడి కోల్పోతున్న ఉమ్మడి కుటుంబం…

యువత పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న నిపుణులు…

నేటి ధాత్రి గార్ల:

నేటితరం యువతకు సెల్ ఫోన్ సంఖ్యలు వేస్తుంది యువతలో ఆధునికత అరుదైన రుగ్మతను తెచ్చిపెట్టింది. యువతరం పై స్మార్ట్ ఫోన్ ప్రభావం ఎక్కువగా పడుతుంది. సమాచార మార్పిడి భావ ప్రకటన స్వేచ్ఛ తదితర అంశాలలో సామాజిక మాధ్యమం కీలక పాత్ర పోషిస్తుంది. విజ్ఞానాన్ని పెంచడంతోపాటు అంతే అనర్ధాన్ని తెచ్చిపెడుతుంది. నేటి యువత సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, స్నాప్ చాట్ లకు బానిసలవుతున్నారు. కొంతమంది వాటిని మోసాలు బ్లాక్ మెయిల్ చేసేందుకు వినియోగిస్తున్నారు. ఈ తరం సోషల్ మీడియాలకు బానిసలుగా మారడంపై మానసిక నిపుణుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. సామాజిక సాధనాలకు బానిస అవుతున్న యువత రోజంతా భోజనం లేకున్నా భరించగలుగుతున్నారు. కానీ ఐదు నిమిషాలు ఇంటర్నెట్ అందుబాటులో లేకుంటే అసహనానికి గురవుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా ఓ చెయ్యి స్మార్ట్ ఫోన్ పైనే ఉంటుంది. షేరింగ్, లైక్, కామెంట్ ఈ క్షణం ఇదే ప్రపంచంగా యువత, పెద్దలు గడిపేస్తున్నారు. ఇందులో మంచి కంటే చెడు వైపు మొగ్గు చూపే వాటి సంఖ్య అధికంగా ఉండటమే ఆందోళన కలిగించే అంశం. కొందరు సామాజిక మాధ్యమాల్లో ముందుకెళ్తుంటే మరికొందరు వీడియో గేమ్స్ తో, యూట్యూబ్ లతో కాలం గడిపేస్తున్నారు. గతంలో నెట్ దొరకాలంటే నానా అవస్థలు పడేవారు. ప్రస్తుత త్రిజి,ఫోర్ జి,ఫైజి సేవలతో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటా ప్యాకేజీలు దొరకడంతో నెట్ వినియోగం పెరిగిపోయింది. యువత చాటింగ్, వీడియో కాలింగ్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉమ్మడి కుటుంబం భారతీయుల ప్రత్యేకం. ఒకప్పుడు రాత్రి భోజనాలు అయ్యాక అంతా ఓ చోట కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు.ఇంట్లో నలుగురు ఉన్న ఇల్లంతా సందడిగా కనిపించేది. ఇప్పుడు నలుగురు ఉన్న చోట కూడా మౌనం రాజ్యమేలుతుంది. పిల్లలు నిత్యం ల్యాబ్ ట్యాబ్, సెల్ ఫోన్లతో గడుపుతున్నారు. ఆ సమయంలో ఇబ్బంది కలిగిస్తే కోపంతో ఊగిపోతారు. చదువును సైతం నిర్లక్ష్యం చేస్తారు. కొంతమంది తల్లిదండ్రులను ఎదిరిస్తున్నారు. చాలామంది విజ్ఞానం కోసం వినియోగించకుండా కొత్త పరిచయాలు, కొత్త స్నేహం కోసం వెతుకుతుంటారు. ఇలాంటి వారి పట్ల తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

క్రేజ్ పెంచుతున్న చీనాబ్ వంతెన

Jammu-kashmir chenab నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన ఇప్పుడు విమాన ప్రయాణికుల్లోనూ అత్యంత ఆసక్తిని నింపుతోంది. ఈనెల 6న ప్రధాని నరేంద్రమోదీ ప్రారం భించిన ఈ వంతెనను నింగిలోనుంచే క్లిక్ మనిపించేందుకు ప్రయాణికులు ఆసక్తి కనబరుస్తున్నారు. “ఇటీవల జమ్ము-కశ్మీర్లో ఆకర్షణీయమైన లోయల ఎగువన విహరించే ప్రతి విమానం… ఓ అద్భుతాన్ని వీక్షిస్తోంది. లోహ విహంగం చీనాబ్ లోయకు దగ్గరైనప్పుడు “మీ కింద ప్రపంచం లోనే అతిపెద్దదైన రైల్వే ఆర్చి వంతెన… chenab నది వంతెన’ అనే ప్రకటన వెలువడుతుంది. వెంటనే ప్రయాణికులు కిటికీల దగ్గరకు పరుగెడుతున్నారు. ఈ అద్భుత నిర్మాణాన్ని తమ సెల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోల రూపంలో భద్రపరచుకుంటున్నారు. ఈ వంతెనను వారు గర్వకారణంగా భావిస్తున్నారు’ అని రైల్వే బోర్డు సమాచార, ప్రచార విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పేర్కొన్నారు.

దేశంలో వేగంగా శరవేగంగా రైల్వే ప్రాజెక్టులు

బహుళ ప్రజామోదం పొందిన వందేభారత్‌ రైళ్లు

గత పదేళ్లలో విస్తృతంగా మౌలిక సదుపాయాల వృద్ధి

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద 1300 స్టేషన్ల పునరభివృద్ధి

98 శాతం బ్రాడ్‌గేజ్‌ విద్యుదీకరణ పూర్తి

కశ్మీర్‌ను దేశంతో అనుసంధానించిన చీనాబ్‌ వంతెన

రైల్వే స్టేషన్లలో ప్రధానమంత్రి జన ఔషది కేంద్రాలు

డెస్క్‌,నేటిధాత్రి:
జార్ఖండ్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో రైలు అనుసంధానతను పెంచేందుకు వీలుగా ప్రధానమంత్రి నరేందమ్రోదీ నేతృత్వంలోని ఆర్థికవ్యవహారాల మంత్రిమండలి కమిటి (సీసీఈఏ) రూ.6405 కోట్ల విలువైన రెండు ప్రధాన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు బుధవారం ఆమోదం తెలిపింది. కమిటీ ఆమోదించిన ప్రాజెక్టులు కొడెమా`బర్కాఖానా (133కి.మి)డబ్లింగ్‌ మరియు బళ్లారి`ఛిగ్జాజూర్‌ డబ్లింగ్‌ (185కి.మి).
కొడెమా`బర్కాఖానా డబ్లింగ్‌:
ఇది పాట్నారాంచీ మధ్య మరింత వేగంగా సమర్థవంతమైన రైల్‌ లింక్‌ను ఏర్పరుస్తుంది. ఈ మార్గంలో రద్దీని తగ్గించడమే కాకుండా, సరుకు రవాణాతో పాటు ప్రయాణికుల రైళ్లు ఎటువంటి ఆలస్యం లేకుండా గమ్యాలను చేరుకోవడానికి ఈ లైన్‌ దోహదం చేస్తుంది.
బళ్లారి`ఛిగ్జాజూర్‌ డబ్లింగ్‌
ఈ రైల్వేలైన్‌ బళ్లారి నుంచి కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపు రం జిల్లాల మధ్య అనుసంధానతను పెంచుతుంది. ఈ రెండు ప్రాజెక్టులు రaార్ఖండ్‌, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ఏడు జిల్లాలను కవర్‌ చేస్తాయి. అంతేకాదు భారతీయ రైల్వేలు మరో 318 కిలోమీటర్ల దూరం విస్తరించడమే కాదు, 1408 గ్రామాలకు రైలు కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ మొత్తం గ్రామాల జనాభా 28.19లక్షలు! బగ్గు, ముడి ఇనుము, ఉక్కు, సిమెంట్‌, రసాయన ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా మరింత శీఘ్రంగా కొనసాగ గలదు. అంతేకాదు ఈ ప్రాజెక్టుల వల్ల ఏటా మరో 49 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా సాధ్యం కాగలదు. ఇదే సమయంలో తక్కువ ఖర్చు, పర్యావరణ హితంగా రవాణా కొనసాగడం ఈ ప్రాజెక్టులో ప్రధానాంశం. ఈ ప్రాజెక్టుల వల్ల 52కోట్ల లీటర్ల డీజిల్‌ వినియోగం రైల్వేలకు తగ్గడమే కాదు, 264 కోట్ల కిలోల కర్బన ఉద్గారాలను నిరోధించవచ్చు. అంటే ఇది 11కోట్ల మొక్కలను నాటినదానికి సమానం.
తిరుపతి` పాకాలాకాట్పాడి రైల్వేలైన్‌
104 కిలోమీటర్ల దూరం వుండే ఈ రైల్వే లైన్‌కు 2025, ఏప్రిల్‌ 9న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ లైన్‌ నిర్మాణానికి రూ.1332కోట్లు ఖర్చు కాగలదని అంచనా. అయితే ఇదే నెల 4వ తేదీన కేంద్ర కేబినెట్‌, రూ.18,658 కోట్ల విలువైన మౌలిక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇవి మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన 15 జిల్లాలను కవర్‌ చేస్తాయి.
ఈ ప్రాజెక్టులను ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్‌ ప్లాన్‌ కింద చేపడుతున్నారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా బహుళ విధాల రవాణావ్యూహాలను అమలు పరచడం ద్వారా, నిరంతర అనుసంధాన కలిగించడం ప్రధాన ఉద్దేశం. మౌలిక సదుపాయాల విస్తరణ ద్వారా ఆత్మనిర్భర భారత్‌ను సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఇటువంటి ప్రాజెక్టులను దేశవ్యాప్తంగా చేపడుతోంది.
గత పదేళ్లలో మౌలిక సదుపాయాల వృద్ధి
గత పదేళ్ల కాలంలో భారత్‌లో మౌలిక సదుపాయాల వృద్ధి అద్భుతమైన రీతిలో కొనసాగిందనే చెప్పాలి. వీటివల్ల దేశంలో భౌతిక అనుసంధానత పెరగడంతో పాటు, తక్కువ ఖర్చు, పర్యావరణ హితమైన రీతిలో రవాణా సదుపాయాలను కల్పించడం జరుగుతోంది. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రగతి, ప్రధానమంత్రి గతిశక్తి, నేషనల్‌ లాజిస్టిక్‌ పాలసీ, భారత్‌మాల, సాగరమాల మరియు ఉడాన్‌ వంటి ప్రాజెక్టులు దేశంలో అనుసంధానతను మరింతగా పెంచాయి. వీటిల్లో ప్రధానమంత్రి గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ను 2021, అక్టోబర్‌ 13న కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని ఆర్థిక జోన్లను బహుళ నమూనా మౌలికసదుపాయాల ద్వారా అనుసంధానత పెంచడం ప్రధాన లక్ష్యం. ఈ సమీకృత వేదిక కింద ఇప్పటివరకు రూ.100 లక్షల కోట్లను సమర్థవంతంగా వినియోగించగలిగారు. ఈ పథకం కింద రైల్వేలు, రోడ్లు, పోర్టులు, నీటి ప్రయాణమార్గాలను అభివృద్ధి చేస్తున్నారు.
రైల్వేల్లో ఇటీవలి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి చీనాబ్‌ వంతెన. ఇది ప్రపంచంలోనే అతి ఎతైౖన వంతెన. ఇక రెండది అంజిఖడ్‌ బ్రిడ్జి. ఇది మొట్టమొదటి రైల్వే కేబుల్‌ వంతెన. ఈ రెండిరటిని జూన్‌ నెలలో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. చీనాబ్‌ వంతెన ఎత్తు 359 మీటర్లు కాగా, దీనికోసం 1315 మీటర్ల పొడువున నిర్మించిన ఆర్క్‌ బ్రిడ్జిని ఉక్కుతో నిర్మించారు. ఇది పెనుగాలులను, పెద్ద విస్ఫోటాలను తట్టుకోగలదు. వీటి తర్వాత చె ప్పుకో దగింది కొత్త పంబన్‌ వంతెన. ఇది భారత్‌లో నిర్మించిన మొట్టమొదటి వర్టికల్‌ లిఫ్ట్‌ కలిగిన సముద్ర రైలు వంతెన. ఇది రామేశ్వరం ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో కలుపుతుంది. చెప్పు కోవాల్సిన మరో పెద్ద రైలు ప్రాజెక్టు కోసి రైల్‌ మహాసేతు. 2020, సెప్టెంబర్‌ 18న ప్రధాని న రేంద్రమోదీ దీన్ని ప్రారంభించారు. ఇది భారత్‌`నేపాల్‌ సరిహద్దులో అత్యంత కీలకమైన వంతెన!
వందేభారత్‌ రైళ్లు
ఇవి అత్యాధునిక సదుపాయాలతో కూడిన సెమీ హైస్పీడ్‌ రైళ్లు. ప్రస్తుతం ఇవి దేశంలోని 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 333 జిల్లాలను అనుసంధానిస్తున్నాయి. ప్రస్తుతం దే శంలో 68 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు (136 సర్వీసులు) నడుస్తున్నాయి. మొత్తం 400 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను తయారుచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇక నాన్‌`ఎసి కేటగిరీకి చెందిన అమృత్‌ భారత్‌ రైళ్ల నిర్మాణం ప్రస్తుతం చెన్నైలోని ఐ.సి.ఎఫ్‌.లో జరుగుతోంది. ప్రస్తుతం దేశంలో మూడు అమృత్‌భారత్‌ రైళ్లు (ఆరు సర్వీసులు) నడుస్తున్నాయి. నమోభారత్‌ ర్యాపిడ్‌ రైళ్లు తక్కువ దూరాల్లో వుండే నగరాల మధ్య నడుపుతారు. వీటినే ఇంటర్‌`సిటీ నెట్‌వర్క్‌ కింద పరిగణిస్తా రు. ఇవి కపుర్తలాలోని ఆర్‌సీఎఫ్‌లో తయారవుతున్నాయి. ప్రస్తుతం రెండు నమోభారత్‌ రైళ్లు (రెండు సర్వీసులు) నడుస్తున్నాయి. రాబోయే రెండు మూడు సంవత్సరాల కాలంలో 200 కొత్త వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు, వంద ఆమృత్‌భారత్‌ రైళ్లు, 50 నమోభారత్‌ ర్యాపిడ్‌ రైళ్లు, 17500 జనరల్‌ నాన్‌`ఏసీ కోచ్‌లు దేశవాసులకు అద్బుతమైన ప్రయాణానుభవాన్ని ఇవ్వనున్నాయి.
ఇప్పటివరకు దేశంలో 98శాతం బ్రాడ్‌గేజ్‌ మార్గాల్లో ఎలక్ట్రిఫికేషన్‌ పూర్తయింది. రెండువేల రై ల్వే స్టేషన్లలో సోలార్‌ విద్యుత్‌ సదుపాయం కల్పించారు. రైల్వే స్టేషన్లు, ఇతర భవనాల్లో వంద శాతం ఎల్‌ఇడీ బల్బులను వాడుతున్నారు. ఇక కోచ్‌ల విషయానికి వస్తే 2014 నుంచి ఇప్పటివరకు 37వేల ఎల్‌.హెచ్‌.బి. కోచ్‌ల నిర్మాణం జరిగింది. ఇవి ప్రయాణికులకు మరింత భద్రత కల్పిస్తాయి. 2024`25 ఆర్థిక సంవత్సరంలో 7,134 కోచ్‌ల ఉత్పత్తి జరిగింది. గతంతో పోలిస్తే ఇది 9శాతం అధికం! రైళ్ల భద్రతకు ‘కవచ్‌’ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇది దేశీయంగా తయారైన వ్యవస్థ. రైలు ప్రమాదాలను అరికట్టడంతో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
దేశంలో వంద గతిశక్తి కార్గో టెర్మినల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇది లాజిస్టిక్‌ ఖర్చులను తగ్గించడ మే కాకుండా, మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు ఇది అనుకూలం. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద దేశంలో 1300 స్టేషన్లను పునరభివృద్ధి చేస్తున్నారు. మొత్తం 68 రైల్వేస్టేషన్లలో ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో తక్కువ ధరకే మందులు అందుబాటులో వుంటాయి.

కొలువుకన్నా..విరమణ మిన్న! కొలువు వద్దు..విరమణ ముద్దు!

-ఐదేండ్ల బాండ్లైనా తీసుకుంటాం.

-రిటైర్మెంట్‌ దగ్గరలో వున్న ఉద్యోగుల మనోగతం.

-లంచాలు తీసుకోకుండా వుండలేం?

-రేవంత్‌ ఏసీబీ దాడులు తట్టుకోలేము.

-ఇరుక్కొని ఇబ్బందులు పడలేం.

-మొదటికే మోసం తెచ్చుకోలేం.

-బలవంతంగా కొలువు చేయలేం.

-రాజకీయాల ఒత్తిడి భరించలేం.

-చే జేతులా ముదిమి వయసులో కష్టాలు కొని తెచ్చుకోలేం.

-హాయిగా రిటైర్మెంట్‌ మెంటు కోరుకుంటున్నాం.

-రాజకీయ నాయకులు చెప్పినట్లు వినలేం

-కాదనుకొని ఈ వయసులో ట్రాన్స్‌ఫర్లకు బలి కాలేం.

-అనేక రకాల అనారోగ్యాల బారిన పడి వున్నాం.

-కుటుంబానికి దూరంగా వుండి బతకలేం.

-ట్రాన్స్‌ఫర్ల బారిన పడి ఈ వయసులో ఒంటరి జీవితాలు అనుభవించలేం.

-కనికరించండి..విముక్తి ప్రసాదించండి.

-రిటైర్మెంట్‌ దగ్గరలో వున్న ఉద్యోగుల వేడుకోలు.

-ఇప్పటికే చాలామంది నిజాయితీగల ఉద్యోగులు నిరవదిక సెలవల్లో ఉన్నారు

హైదరాబాద్‌,నేటిధాత్రి
ఈ కొలువులు మాకొద్దు మహా ప్రభో అని కొంత మంది ఉద్యోగులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రిటైర్మెంట్‌కు దగ్గరగా వున్న ఉద్యోగులు కొందరు తమ ఆంతరంగికుల వద్ద చెప్పుకుంటున్నారు. రిటైర్‌ మెంటు దగ్గరగా వున్న ఉద్యోగులు చాల మందిది ఇదే అభిప్రాయం అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడు రిటైర్మెంట్‌వయసు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయన్న వార్త వారిలో కొంత కలవరం సృష్టిస్తోంది. ఇప్పటికే గత ప్రభుత్వం పెంచింది. అదే పెద్ద భారమనుకుంటే, మళ్లీ ఈ ప్రభుత్వం మరింత పెంచే ఆలోచనలు చేస్తుందన్న వార్తలు వారిని విస్మయానికి గురి చేస్తున్నాయి. ఆందోళణకు గురి చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే రిటైర్‌ మెంటుకు దగ్గరగా వున్న సమయంలో ఎలాంటి పొరపాట్లు జరిగినా మొదటికే మోసం వస్తుంది. పైగా ఇంత కాలం అదీ ఇదీ తీసుకోవడానికి అలవాటు పడిపోయిన వారు కూడా వున్నారు. ఇప్పుడు కూడా ఏదీ లేకుండా పనిచేయలేకపోతున్నాం. మరో వైపు రాష్ట్ర సర్కారు ఏసిబి దాడుల నేపధ్యం కూడా తోడౌతుంది. మరో వైపు రాజకీయ నాయకుల ఒత్తిళ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. పని చేసినా కష్టమే..చేయకపోయినా కష్టమే! చేస్తే ఊరికే చేయొద్దని అంటారు. చేస్తే తప్పంటారు. రాజకీయ నాయకులు తెచ్చే పనుల్లో ఎంత నిజాయితీ వుంటుందో అందరికీ తెలిసిందే. చేయకపోతే వారు ఊరుకోరు. చేయమని చెప్పే ధైర్యం మాకు లేదు. ఇచ్చింది తీసుకొని పనిచేయాలంటే భయమేస్తోంది. ఎక్కడ ఏసిబికి చిక్కి చిక్కుల్లో పడతామేమే అన్న భయం వెంటాడుతోంది. ఈ వయసులో లేని పోసి సమస్యలు తెచ్చుకోవడం ఇష్టం లేదు. ఇష్టం లేని పనులు చేయలేక, నాయకులకు ఎదురు చెప్పలేక ఓ వైపు సతమతమౌతున్నాం. ప్రతి వారు వచ్చిన పని చేయమని బెదిరించేవారు తయారయ్యారు. నీతిగా పనిచేయాలంటే కొన్ని పనులు కావు. అవినీతికి పాల్పడితే ఎప్పుడు పట్టుబడతామో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం ఏసిబికి మరింత పవర్స్‌ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిబ్బందిని పెంచే కసరత్తు కూడా జరుగుతోంది. ఏ క్షణానికి ఏం జరుగుతుందో అర్దం కాకుండా వుంది. బాదితుల పక్షాన నిలిస్తే నాయకులు ఊరుకోరు. నాయకుల పక్షాన తప్పు చేస్తే బాధితులు సహించరు. ఇద్దరి మధ్య నలిగిపోతూ పనిచేయలేని పరిస్దితి ఎదురౌతోంది. నాయకులు చెప్పినట్లు వినకపోతే ట్రాన్స్‌ఫర్లు తప్పని సరి. ఇప్పుడున్న పరిస్దితుల్లో ట్రాన్స్‌ఫర్లను ఆహ్వానించలేం. ఎక్కడికో ట్రాన్స్‌ఫర్‌ చేస్తే వెళ్లలేం. కుటుంబాన్ని వదిలేసుకొని వెళ్లే పరిస్దితి లేదు. రకరకాల అనారోగ్య సమస్యలతో బాదపడుతున్నాం. కుటుంబ సభ్యుల్లో కూడా ఏదో రకమైన అనారోగ్య సమస్యలు వుంటున్నాయి. ఎక్కడికో ట్రాన్స్‌ఫర్‌ చేస్తే అక్కడికి కుటుంబంతో వెళ్లే పరిస్దితి కనిపించడం లేదు. ఒంటరిగా ఆ ప్రాంతానికి వెళ్లి వుండే అవకాశంలేదు. ఏ క్షణం ఎలా వుంటుందో ఆరోగ్య పరిస్దితులు అనే భయం కూడా వెంటాడుతోంది. దాంతో పనులు చేయలేకపోతున్నాం. కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా భార్యభర్తల వయసు ఎలాగూ 55 దాటివుంటుంది. భర్త ఉద్యోగి అయితే అతని వెంట కుటుంబాన్ని వదిలేసి వెళ్లలేని పరిస్థితి. భర్త ఉద్యోగం చేసే స్ధలాలకు భార్య వెళ్తే పిల్లలను చూసుకోవడం కష్టంగా మారుతుంది. ఎక్కడికో మారు మూల మండలాలకు ట్రాన్స్‌ఫర్‌ అయితే ఆ నరకం చెప్పనలవి కానిది. ఇన్ని సమస్యల మధ్య ఉద్యోగం చేయడం అవసరమా? అనే పరిస్దితుల్లో వున్నామని చాల మంది ఉద్యోగులు తెలిసిన వారి ముందు గోడు వెళ్లబోసుకుంటున్నారు. పరిస్ధితులను బట్టి మెదులుకోవాలి. నాయకుల తీరును బట్టి మసలుకోవాలి. ఉద్యోగ వర్గాలపై రాజకీయ నాయకుల జోక్యం విపరీతంగా పెరిగిపోయింది. రియల్‌ వ్యాపారం పెరిగిన తర్వాత మా కష్టాలు మాకు వున్నాయి. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు వుంటుంది. ఆ సమయంలో ఇచ్చే దాన్ని తీసుకోకుండా వుండలేం. నాయకులు వచ్చిన పుణ్యానికి చేయకు? అంటారు. తీసుకుంటే పుణ్యానికి చేస్తున్నావా? అని నిలదీస్తారు. బాధితులు వచ్చి నానా బూతులు తిడుతుంటారు. అన్యాయం చేస్తున్నారని కేసులు పెడుతుంటారు. వాటన్నింటినీ ఈ వయసులో ఎదుర్కొనే శక్తి లేదు. పొరపాటో, గ్రహపాటో ఎదురైతే, పుసుక్కున ఏసిబికి చిక్కితే జైలు జీవితం అనుభవించలేం. అలాగని బలవంతంగా కొలువులు చేయలేకపోతున్నాం. వయసు మీద పడుతోంది. ఒత్తిడితో మానసిక ఆందోళలకు గురయ్యే పరిస్తితి వుంటోంది. రాజకీయ నాయకులు తర్వాత ఆదుకోవడం అంటూ ఏమీ వుండదు. వాళ్ల పని వారు చేయించుకొని వెళ్తారు. చేతులు దులుపుకుంటారు. పొరపాట్లు చేయించి, మాకేం సంబందం అంటారు. ఉద్యోగులను ఇరికిస్తుంటారు. వారికి ఆ స్వేచ్చ వుంది. ఉద్యోగులకు ఆస్వేచ్చ లేదు. చేతులు దులుపేసుకుంటా? చట్టం వదిలిపెట్టదు. ఎరక్కొపోయి, ఈ వయసులో ఇరుక్కోవడం ఎందుకు? అన్న ప్రశ్నలే వారి మెదల్లోలో మెదులుతున్నాయి. రిటైర్‌ మెంటు ఇచ్చేయండి. ఇప్పటికిప్పుడు ప్రబుత్వ ఇవ్వాల్సిన నిదులు ఇవ్వకపోయినా బాండ్లు ఇచ్చినా తీసుకుంటాం. అది ఐదేళ్లకు ఇచ్చిన సరిపెట్టుకుంటాం. కాని ఈ ఉద్యోగాలు మేం చేయలేం. పని ఒత్తిడి నుంచి విముక్తి కల్పించండని కోరుతున్నారు. హాయిగా రిటైర్‌ మెంటు తీసుకొని ముదిమి వయసులో ఎంతో కొంత సంతోషంగా వుంటామంటున్నారు. నాయకులు చెప్పే ప్రతి పనిని చేయలేకపోతున్నాం. కనికరించండి. విముక్తి ప్రసాదించండి? అని కొంత మంది అదికారులు కోరుతున్నారు. ఇలాంటి పరిస్దితులను తాళలేక చాలా మంది రిటైర్‌ మెంటుకు దగ్గరగా వున్న ఉద్యోగులు లాంగ్‌ లీవ్‌లు పెట్టుకొని ఇంటి వద్ద వుంటున్నారు. ఎప్పుడు రిటైర్‌ మెంటు ఇచ్చినా సంతోషమే అంటున్నారు. ఇప్పటికిప్పుడు ప్రకటించినా ఆనందంగా తప్పుకుంటామంటున్నారు. చాలా మంది రిటైర్‌ మెంటుకు దగ్గరగా వున్న ఉద్యోగులు లాంగ్‌ లీవుల్లో వుండడం వల్ల, చాలా కార్యాలయాల్లో ఇన్‌చార్జిలు బాద్యతలు నిర్వహిస్తున్నారు. రెండు మూడేళ్ల సర్వీసు వున్న ఉద్యోగులు కొలువులకు వెళ్లాలంటే భయపడుతున్నారు. పదేళ్ల కాలంగా గత ప్రభుత్వ పార్టీ నాయకులు చెప్పినవి చేయాల్సి వచ్చింది. పదేళ్లుగా అదికారంలో లేకపోవడంతో ఈ పార్టీ నాయకుల పనులు మళ్లీ చేయాలంటే చేయలేకపోతున్నారు. గతంలో ఏమేం చేశారో మాకు తెలుసంటూ ఈ పార్టీ వాళ్లు బెదిరిస్తున్నారు. వాళ్లు చెప్పినట్లు చేసినప్పుడు మేం చెప్పినట్లు ఎందుకు చేయరంటూ కోపం ప్రదర్శిస్తున్నారు. కాదంటే మీ అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ ఒత్తిళ్లను తట్టుకోవడం కన్నా, నాలుగు రోజులు హాయిగా బతకాలంటే రిటైర్‌మెంటు ఒక్కటే దారి అని నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇది అందరి ఉద్యోగుల మనోగతం మాత్రం కాదు. కొంత మంది రిటైర్‌మెంటుకు అతి సమీపంలోవున్న ఉద్యోగుల ఆవేదన మాత్రమే. వారి ఆందోళనలో న్యాయం వుందా? లేదా? అనేది వారు తేల్చుకోవాలి. ఇంత కాలం పనిచేసి, ఇప్పుడు తప్పుకుంటామని చెప్పడం ఎంత వరకు న్యాయమో కూడా వాళ్లే ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా వ్యవస్ధలను అందరూ కలిసి భ్రష్టు పట్టించారన్నది మాత్రం ముమ్మాటికీ నిజం. తమ దాకా వస్తే ముఖం చాటేస్తారన్నది వాస్తవం. తప్పుకొని తాము మంచి వాళ్లమని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుందన్నది మరింత నిజం.

మిల్లర్‌ జగన్‌పై త్వరలోనే చర్యలు: కమిషనర్‌ చౌహాన్‌

`రైతులను మోసం చేసిన వారికి శిక్ష తప్పదు

`ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ను అభినందించిన కమిషనర్‌ చౌహాన్‌

`అందరికీ ఖమ్మం జిల్లా అధికారులు ఆదర్శం

`ఉద్యోగులకు కర్తవ్య నిర్వహణ ముఖ్యం

`అక్రమార్కులకు సహకరిస్తే సహించేది లేదు

`ఎంత పెద్ద స్థాయిలో వున్నా ఉపేక్షించేది లేదు

`నిజాయితీ మిల్లర్లను వేదిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు

`అక్రమార్కల చిట్టా అంతా నా దగ్గర వుంది

`త్వరలో అక్రమార్కుల పని కాలం ముందుంది

`అక్రమ మిల్లర్‌ నుంచి రికవరీ దేశంలోనే మొదటి సారి

`ఈ విషయం ప్రపంచానికి చెప్పిన నేటిధాత్రికి కృతజ్ఞతలు

`తెలంగాణలో ఎక్కడ రైతుకు అన్యాయం జరిగినా సహించడం జరగదు

`చిన్న మిల్లర్లు తమకు ఏ సమస్య వున్నా నేరుగా కలవొచ్చు

`తమ సమస్యలు నిర్భయంగా చెప్పుకోవచ్చు

`మిల్లర్‌కు సమయమివ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధం

`మధ్యాహ్నం తర్వాత అప్పాయిమెంట్‌ పొందొచ్చు

`ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు

`నేటిధాత్రి దిన పత్రిక కు కమీషనర్‌ ప్రత్యేక ధన్యవాదాలు

`రైతుల పక్షాన అక్షర పోరాటానికి అభినందనలు

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రైతుల వడ్లను మాయం చేసినట్లు ఆరోపణలున్న హన్మకొండ జిల్లాకు చెందిన మిల్లర్‌ జగన్‌పై త్వరలోనే చర్యలుంటాయని సివిల్‌ సప్లయ్‌ శాఖ కమీషనర్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో ఆయన మాట్లాడుతూ ఎప్పటికైనా రైతులను మోసం చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. త్వరలోనే చర్యలుంటాయన్నారు. నీతిగా చేయాల్సిన వ్యాపారంలో కొంత మంది అక్రమాలకు పాల్పడుతుంటారన్నారు. గతంలో పెద్దగా పట్టించుకోకపోవడంతో,పై స్థాయి దాక వివరాలు అందకపోవడంతో వారి ఆటలు సాగాయి. దురదృమేమంటే కొంత మంది అధికారుల ప్రోద్బలం కూడా అక్కడక్కడ తోడవ్వడంతో అక్రమాలకు అవకాశం కలిగింది. కాని పరిస్థితులు మారాయి. ఎప్పటిలాగే ఇప్పుడూ తమ ఆటలు చెల్లుతాయనుకుంటే పొరపాటు. ఇప్పుడు చేసిన తప్పులే కాదు, గతాన్ని కూడా తవ్వి తీసే పని మొదలౌతుంది. హన్మకొండ జిల్లానే కాదు, రాష్ట్రంలో ఏఏ జిల్లాలలో ఇలాంటి వ్యవహారాలు సాగుతున్నాయో కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరుగుతోందన్నారు. ఇకపై రైతులను, ప్రభుత్వాన్ని మోసం చేసే మిల్లర్‌ను ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు. అంతేకాకుండా అక్రమార్కులకు సహకరించిన అధికారులకు కూడా శిక్ష తప్పదు. రైతులను మోసం చేయడం చిన్న తప్పు అనుకుంటున్నారు. కానీ పెద్ద నేరమని తెలియక చేసినా? తెలిసి చేసినా శిక్షార్హులౌతారు. రైతులను మోసం చేసిన జగన్‌ను గుర్తించిన ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ను అభినందించిన కమీషనర్‌ చౌహాన్‌ అభినందించారు. ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ లాంటి అధికారులుంటే ఒక్క వడ్ల గింజ కూడా మోసం జరగదన్నారు. ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సునిశిత పరిశీలనా జ్ఞానాన్ని కమీషనర్‌ చౌహాన్‌ అబ్బురపడిపోయారు. అధికారులకేం తెలుసు అని కొంత మంది అక్రమ మిల్లర్లు ఇలాంటి దుష్ట పన్నాగాలు పన్నుతుంటారు. కానీ ఉద్యోగ నిర్వహనలో శాఖల్లో మెలకువలు తెలుసుకొని ముందుకెళ్లే అధికారులు కూడా వుంటారని రుజువైంది. ఏది ఏమైనా ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ చూపిన చొరవ అభినందనీయమన్నారు. ఆయనతో పాటు ఖమ్మం జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారులందరినీ కమీషనర్‌ చౌహాన్‌ అభినందించారు. అధికారులు సమిష్టిగా, నీతి వంతంగా, కార్యదక్షత చూపిస్తే ఎంతో బాగుంటుందన్నారు. ఖమ్మం జిల్లా అధికారుల టీం వర్క్‌ భేష్‌ అన్నారు. అందరికీ ఖమ్మం జిల్లా అధికారులు ఆదర్శమయ్యారని కొనియాడారు. ఏ శాఖ ఉద్యోగులైనా సరే తమ కర్తవ్య నిర్వహణ ముఖ్యమని సూచించారు. ఇకపై అధికారులెవరైనా సరే అక్రమార్కులకు సహకరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎంత పెద్ద స్థాయిలో వున్నా ఉపేక్షించేది లేదన్నారు. ఇక నీతి, నిజాయితీ వ్యాపారం చేసే మిల్లర్లను అధికారులు ఎవరైనా వేదిస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వానికి అలాంటి మిల్లర్‌ తోడే అవసరమన్నారు. రైతులను మోసం చేసే వారిని పక్కన పెట్టుకొని, నీతిగా వ్యాపారం చేసే మిల్లర్లను ఇబ్బందుల పాలు చేయొద్దని హెచ్చరించారు. ఎవరైతే అక్రమ మిల్లర్లు ముద్రపడ్డారో, వారికి సహకరిస్తున్నారో అలాంటి వారి చిట్టా అంతా నా దగ్గర వుందన్నారు. త్వరలోనే కార్యచరణ వుంటుందన్నారు. అక్రమ మిల్లర్‌ నుంచి రికవరీ దేశంలోనే మొదటి సారి అనే విషయాన్ని వెలులోకి తెచ్చిన నేటిధాత్రి దిన పత్రికను చౌహాన్‌ అభినందించారు. ఈ విషయం ప్రపంచానికి చెప్పిన నేటిధాత్రికి కృతజ్ఞతలు అన్నారు. ఇకపై తెలంగాణలో ఎక్కడ రైతుకు అన్యాయం జరిగినా సహించడం జరగదు. ఎక్కడైనా తెలంగాణ వ్యాప్తంగా చిన్న చిన్న మిల్లర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని నేటిధాత్రి దృష్టికి వచ్చినా వివరాలు అందించాలని కోరారు. అంతే కాకుండా నా వద్దకు నేరుగా రాలేక, ఇబ్బందులు పడుతున్న వారిని మీరు చొరవ తీసుకొచ్చినా సరే అని నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుకు విజ్ఞప్తి చేశారు. మిల్లర్లు ఇకపై తమకు ఏ సమస్య వున్నా నేరుగా కలవొచ్చు అని కూడా కమీషనర్‌ స్పష్టం చేశారు. తన కార్యాలయానికి తమ సమస్యలు నిర్భయంగా చెప్పుకోవచ్చన్నారు. తెలంగాణలో వున్న మిల్లర్లందరికీ సమయమివ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధమని చెప్పారు. అయితే మధ్యాహ్నం తర్వాత అప్పాయిమెంట్‌ పొందవచ్చని సూచించారు. అధికారులెవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం నేటిధాత్రి దిన పత్రిక కు కమీషనర్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ,
రైతుల పక్షాన అక్షర పోరాటానికి అభినందనలు తెలిపారు.

కామారెడ్డిపల్లి గ్రామంలో భూ భారతి రేవన్యూ సదస్సు.

కామారెడ్డిపల్లి గ్రామంలో భూ భారతి రేవన్యూ సదస్సు

 

పరకాల నేటిధాత్రి

 

 

శుక్రవారం రోజున మండలంలోని కామారెడ్డి పల్లి గ్రామంలో భూ భారతి రేవన్యూ సదస్సునుఎమ్మార్వో విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని,ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.రైతులు,ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ అశోక్ రెడ్డి,సర్వేయర్ విజయ్ కుమార్,రేవన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

అంగన్వాడి కేంద్రంలో అమ్మ మాట – అంగన్వాడి బాట కార్యక్రమం.

జైపూర్ అంగన్వాడి కేంద్రంలో అమ్మ మాట – అంగన్వాడి బాట కార్యక్రమం

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ అంగన్వాడి కేంద్రం1లో ఫ్రీ స్కూల్ పిల్లలకి స్వాగతం పలుకుతూ శుక్రవారం ర్యాలీ నిర్వహించారు.అలాగే విద్యార్థులకు అక్షరాభ్యాసం చేపించి అంగన్వాడి కేంద్రంలో ప్రీ స్కూల్ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది.3 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలను తప్పకుండా అంగన్వాడి కేంద్రంలో చేర్పించాలని సూచించారు.అంగన్వాడి కేంద్రంలో ఉచిత భోజనం,ఉచిత విద్య,ఉచిత వసతులను విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ మనోరమ,ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,సూపర్వైజర్ కవిత,అంగన్వాడి టీచర్స్ సరిత,ఉమాదేవి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version