కథ విని ఉద్వేగానికి లోనయ్యా..

కథ విని ఉద్వేగానికి లోనయ్యా

‘ఒక సినిమా అంగీకరించే ముందు కథలో ప్రేక్షకులను కదిలించే బలమైన భావోద్వేగాలు ఉన్నాయా, లేవా? అని చూస్తాను. ‘జూనియర్‌’ సినిమా స్ర్కిప్ట్‌ నాకు బాగా నచ్చింది. కథ విని ఉద్వేగానికి లోనయ్యా….

‘ఒక సినిమా అంగీకరించే ముందు కథలో ప్రేక్షకులను కదిలించే బలమైన భావోద్వేగాలు ఉన్నాయా, లేవా? అని చూస్తాను. ‘జూనియర్‌’ సినిమా స్ర్కిప్ట్‌ నాకు బాగా నచ్చింది. కథ విని ఉద్వేగానికి లోనయ్యా. బలమైన భావోద్వేగాలతో పాటు ప్రేమ, కుటుంబ విలువలతో సినిమా ఆద్యంతం హృద్యంగా ఉంటుంది’ అని సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌ అన్నారు. గాలి జనార్ధన్‌రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. రాధాకృష్ణ దర్శకత్వంలో రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈ నెల 18న ‘జూనియర్‌’ విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన సెంథిల్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు. ‘దర్శకుడు రాధాకృష్ణ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. కొత్త హీరోకు ఇలాంటి సినిమా చేయడం కొంచెం కష్టమే. కానీ కిరీటి ఒక సవాల్‌గా తీసుకొని ఈ సినిమా కోసం కష్టపడిన తీరు నాకు నచ్చింది. ఈ సినిమాలో పాటలతో పాటు కిరీటీ, శ్రీలీల జంట చేసిన డాన్స్‌లను ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు. కిరీటి మంచి నటుడు, అద్భుతమైన డాన్సర్‌. సెట్స్‌లో చాలా కష్టపడ్డాడు. తొలి చిత్రం ‘జూనియర్‌’తోనే ఆయన ప్రేక్షకులను ఆకట్టుకుంటాడనే గట్టి నమ్మకం ఉంది. ఒక మంచి సినిమా అందించాలనే తపనతో నిర్మాతలు ఈ సినిమా తీశారు’ అని చెప్పారు.

రేపటి ప్రజావాణి రద్దు హనుమకొండ జిల్లా కలెక్టర్.

రేపటి ప్రజావాణి రద్దు: హనుమకొండ జిల్లా కలెక్టర్

హనుమకొండ, నేటిధాత్రి.

హనుమకొండ కలెక్టరేట్లో ఈ నెల 7వ తేదీన నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ ఒక ప్రకటనలో తెలిపారు.

కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగే స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

ప్రజలు గమనించి ప్రజావాణికి రాకూడదని తెలిపారు.

థగ్‌లైఫ్‌ మూవీ బ్యాన్‌ కోర్టులో విచారణ.

 థగ్‌లైఫ్‌ మూవీ బ్యాన్‌ కోర్టులో విచారణ…

కర్ణాటకలో థగ్‌లైఫ్‌ సినిమా విడుదలకు సంబంధించి నమోదైన పిటిషన్‌లు సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టులో శుక్రవారం ఒకే రోజు విచారణకు వచ్చాయి.

థగ్‌లైఫ్‌ హీరో కమల్‌ హాసన్‌ బెంగళూరులో జరిగిన ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో.

కర్ణాటకలో థగ్‌లైఫ్‌ సినిమా విడుదలకు సంబంధించి నమోదైన పిటిషన్‌లు సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టులో శుక్రవారం ఒకే రోజు విచారణకు వచ్చాయి.
థగ్‌లైఫ్‌ హీరో కమల్‌ హాసన్‌ బెంగళూరులో జరిగిన ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.
కమల్‌ క్షమాపణ చెప్పకపోతే థగ్‌లైఫ్‌ సినిమాను రాష్ట్రంలో విడుదల చేయనివ్వబోమని కన్నడ సంఘాలు హెచ్చరించాయి.
కర్ణాటక చలనచిత్ర వాణిజ్యమండలి కూడా ఈ మేరకు తీర్మానం చేసింది.
దీన్ని ప్రశ్నిస్తూ, సినిమా నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ మన్మోహన్‌ ధర్మాసనం విచారించింది.
సినిమా విడుదలకు అభ్యంతరాలు తెలియజేయాలని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version