జైపూర్ అంగన్వాడి కేంద్రంలో అమ్మ మాట – అంగన్వాడి బాట కార్యక్రమం
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ అంగన్వాడి కేంద్రం1లో ఫ్రీ స్కూల్ పిల్లలకి స్వాగతం పలుకుతూ శుక్రవారం ర్యాలీ నిర్వహించారు.అలాగే విద్యార్థులకు అక్షరాభ్యాసం చేపించి అంగన్వాడి కేంద్రంలో ప్రీ స్కూల్ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది.3 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలను తప్పకుండా అంగన్వాడి కేంద్రంలో చేర్పించాలని సూచించారు.అంగన్వాడి కేంద్రంలో ఉచిత భోజనం,ఉచిత విద్య,ఉచిత వసతులను విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ మనోరమ,ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,సూపర్వైజర్ కవిత,అంగన్వాడి టీచర్స్ సరిత,ఉమాదేవి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.