థగ్లైఫ్ మూవీ బ్యాన్ కోర్టులో విచారణ…
కర్ణాటకలో థగ్లైఫ్ సినిమా విడుదలకు సంబంధించి నమోదైన పిటిషన్లు సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టులో శుక్రవారం ఒకే రోజు విచారణకు వచ్చాయి.
థగ్లైఫ్ హీరో కమల్ హాసన్ బెంగళూరులో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో.
కర్ణాటకలో థగ్లైఫ్ సినిమా విడుదలకు సంబంధించి నమోదైన పిటిషన్లు సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టులో శుక్రవారం ఒకే రోజు విచారణకు వచ్చాయి.
థగ్లైఫ్ హీరో కమల్ హాసన్ బెంగళూరులో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.
కమల్ క్షమాపణ చెప్పకపోతే థగ్లైఫ్ సినిమాను రాష్ట్రంలో విడుదల చేయనివ్వబోమని కన్నడ సంఘాలు హెచ్చరించాయి.
కర్ణాటక చలనచిత్ర వాణిజ్యమండలి కూడా ఈ మేరకు తీర్మానం చేసింది.
దీన్ని ప్రశ్నిస్తూ, సినిమా నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్ను న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం విచారించింది.
సినిమా విడుదలకు అభ్యంతరాలు తెలియజేయాలని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.