ఘనంగా కొల్లూరులో 11వ తెలంగాణ ఆవిర్భావ ధీనోత్సవ వేడుకలు.

ఘనంగా కొల్లూరులో 11వ తెలంగాణ ఆవిర్భావ ధీనోత్సవ వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

కొల్లూరులో తెలంగాణ ఆవిర్భావ ధినోస్తవా వేడుకలను పంచాయతీ కార్యాలయం మరియు పాఠశాల ఆవరణలో గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు…ఇట్టి కార్యక్రమములో మాజీ ఎంపిటిసి సి హెచ్ రాజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు డప్పూరు సంగమేష్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్,యుత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్,మాజీ వార్డ్ సభ్యులు ఎం విష్ణు,సామాజికవేత్త దంరాజ్ గౌడ్,ఫీల్డ్ అసిస్టెంట్ సి సుబాకర్,పాఠశాల ఉపాధ్యాయురాలు అక్షర,అంగన్‌వాడీ టీచర్ సంఘమణి, సి శకుంతల,సి నర్సిములు రిపోర్టర్,సి డేవిడ్,సతీష్ గౌడ్, సి ప్రకాష్, సి సంజీవులు, సాయి గౌడ్,దేవదాస్,నర్సిములు,అనిల్, గ్రామ పెద్దలు సి హెచ్ రాములు పంతులు,ఎం రాములు, ఎం బాలప్ప, లక్ష్మయ్య,సంగప్ప మరియు యువకులు,విద్యార్థులు పాల్గోని భారత దేశ త్రివరణ పథకాన్ని ఎగురవేసి తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి శుభకాంక్షలు తెలియజేసారు.

తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోఎమ్మెల్యే.

తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోఎమ్మెల్యే కలెక్టర్ ఎస్పీ

వనపర్తి నేటిధాత్రి :

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలోవనపర్తి ఎమ్మెల్యే మె గారెడ్డి జిల్లాకలెక్టర్ ఆదర్శ్ సురబి ఎస్పీ రావుల గీరీదర్ మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ అధికారులు పాల్గొన్నారు జరుపుకున్నారు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో  జెండా ఎగరవేశారు

తెలంగాణ అవతరణ దినోత్సవము వేడుకలు.

వేములపల్లిలో తెలంగాణ అవతరణ దినోత్సవము వేడుకలు అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం …
గ్రామ శాఖ అధ్యక్షులు ఆరేళ్ల రమేష్

మొగుళ్ళపల్లి నేటిధాత్రి:

భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని వేములపల్లి బి ఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఆరేళ్ల రమేష్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో జెండా ఆవిష్కరణ జరిపారు గ్రామ శాఖ అధ్యక్షులు మాట్లాడుతూ అమరవీరుల త్యాగ ఫలితం తోనే తెలంగాణ రాష్ట్రం కల సహకారం అయిందని, నీళ్లు, నిధులు, నియామకాలతో మొదలెట్టిన తెలంగాణ ఉద్యమం, సకలజనులు సబ్బండవర్ణాల కలయికతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. దశాబ్దాలుగా 1969 నుండి 2014 వరకు వివిధ దశలో సాగిన తెలంగాణ ఉద్యమంలో వేలాదిమంది ఆత్మహత్య చేసుకున్నారుప్రత్యేక తెలంగాణ అంశంపై 2017 శ్రీకృష్ణ కమిటీ ఎప్పటి ఆరు ప్రతిపాదనలు చేసి ఆ ప్రతిపాదనలు జూలై 2013 జూలై 31 తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది 2013 అక్టోబర్ 3న కేంద్రం మండలి ఆమోదం లభించగా 2014 ఫిబ్రవరి 13 తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతు లోకసభలో ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొంది 2014లో ఉమ్మడి రాష్ట్ర విభజన ఆదేశిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వికరణ చట్టం 2014 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు లేదా తెలంగాణ బిల్లు అని ప్రవేశపెట్టింది 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించాక 2014 దేశంలో 29వ రాష్ట్రంగా నూతన రాష్ట్రంగా ఆవిర్భవించింది . తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ అని 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటంలో తెలంగాణ సాధించారని ఉద్యమ సారధి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించింది అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి పోచంపల్లి రమేష్ ఎండి రహీం బండారి తిరుపతి బీసీ సంఘం అధ్యక్షులు భాష బోయిన శ్రీశైలం వికలాంగుల అధ్యక్షులు రమేష్ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కరీంనగర్ నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట మార్కెట్ కమిటీ ఆద్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేణి తిరుమల తిరుపతి ముదిరాజ్. ఈకార్యక్రమంలో వైస్ చైర్మన్ పిండి సత్యం రెడ్డి, డైరెక్టర్ లు బడుగు ఎల్లయ్య, మ్యాకల స్వామి, జక్కుల బాబు, కుంబాల రాజేశం, వేణుగోపాల్ రెడ్డి, కోట్ల మల్లేశం, మార్కెట్ సిబ్బంది, రాజేశం, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

నాగారం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నాగారం నేటిదాత్రి:

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం నాగారం మున్సిపల్ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు నాగారం మున్సిపల్ కమిషనర్ రాజేందర్ కుమార్ జాతీయ జెండా ఎగురవేశారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో నాగారం మాజీ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు అనిత సుధాకర్ రెడ్డి, లావణ్య శ్రీనివాస్, సుమిత్ర సురేష్, మాజీ కోఆప్షన్ మెంబర్ షఫీ, మాజీ వార్డ్ మెంబర్ శ్రీనాథ్ గౌడ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కొత్తగూడలో స్వరాష్ట్ర తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

కొత్తగూడలో స్వరాష్ట్ర తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరణ చేసిన వజ్జ సారయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు.

కొత్తగూడ నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని కొత్తగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క సూచనల మేరకు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గ్రామ కమిటీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించినారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు త్రివర్ణ పతాకం జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు తధానంతరం వారు మాట్లాడుతూ…
జూన్ 2 స్వరాష్ట్ర స్వప్నం సాకారం అయిన రోజు
ఆరున్నర దశాబ్దాల ఆకాంక్షలు నెరవేరిన రోజు
నాలుగున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవ నినాదం
ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితం
అలుపెరగని పోరాటాలతో సాధించిన అంతిమ విజయం
అసాధ్యభావనను, సుసాధ్యాం చేసిన శుభదినం స్వేచ్ఛ, సమానత్వం, సంక్షేమం, అభివృద్ధితో విరాజిల్లుతున్న మన ప్రజాపాలనకు నిలువెత్తు నిదర్శనం..తెలంగాణ ప్రజల కాంక్షను తీర్చిన తల్లి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ..రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి,
కొత్తగూడ బ్లాక్ అధ్యక్షులు సుంకరబోయిన మొగిలి.
లావణ్య వెంకన్న జిల్లా నాయకులు,
బానోత్ విజయ రూప్సింగ్ ఎక్స్ ఎంపీపీ & జిల్లా ప్రధాన కార్యదర్శి.
పులుసం పుష్పలత ఎక్స్ జెడ్పిటిసి.
బిట్ల శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి.
ఇర్ప రాజేశ్వర్ మండల అధికార ప్రతినిధి.
బోయినేని ప్రశాంత్ రెడ్డి యూత్ మండల అధ్యక్షులు.
వల్లపు రంజిత్ జిల్లా ఓబీసీ నాయకులు.
నోముల ప్రశాంత్ యాదవ్ జిల్లా యూత్ నాయకులు
సిరిగిరి సురేష్ మండల సోషల్ మీడియా.
కే దాసుప్రసాద్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు.
బోడ ఈరియా నాయక్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు.
కట్రోజు బిక్షపతి బీసీ సెల్ మండల నాయకులు.
శిరబోయిన సాయి
యాదగిరి కిరణ్.
మెకానిక్ కృష్ణ. జితేందర్ తదితరులు పాల్గొన్నారు

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

నేటి ధాత్రి గార్ల:

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎసిఎస్ కార్యాలయంలో జాతీయ జెండాను సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ,నీళ్లు, నిధులు,నియామకాల కోసం ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని అన్నారు.అమరుల ఆకాంక్షలు, ఆశయాల కోసం సకల జనులందరూ కృషి చేయాలని ఆయన కోరారు.స్వరాష్ట్రము కోసం అసువులు బాసిన తెలంగాణ అమరవీరులందరికీ నివాళులు అర్పించారు. పోలీస్ స్టేషన్ లో ఎస్సై రియాజ్ పాషా, తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద విశ్వ జంపాల,తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శారదా, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మంగమ్మ జెండా ఆవిష్కరణ చేశారు.ఈ యొక్క కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ గంగావత్ లక్ష్మణ్ నాయక్,సొసైటీ డైరెక్టర్ శీలంశెట్టి ప్రవీణ్ నాయుడు, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు కందునూరి శ్రీనివాస్,కడియం వెంకన్న, సొసైటీ సీఈవో వెంకటేశ్వర్లు, గిన్నారపు మురళి తారక రామారావు, భూక్యా నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వ విప్ ఘన నివాళి.

తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వ విప్ ఘన నివాళి

సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పాత బస్టాండ్ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద, తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మరియు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలోజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప తిరుపతిరెడ్డి,తదితరులు నివాళులు అర్పించారు.

మల్లీ గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

మల్లీ గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా న్యాల్కల్ మండల్ మల్లీ గ్రామ పంచాయతీ కార్యాలయం & అంగన్వాడి కేంద్రం జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జట్గొండ మారుతీ మాజీ సర్పంచ్ బాబురావు మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి మాజీ వార్డు సభ్యులు సిద్ధారెడ్డి తాత్కాలిక పంచాయత్ కార్యదర్శి జై సింగ్ సిఏ నర్సారెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ అంబిక అంగన్వాడీ టీచర్లు వసంత సుకుమారి ఆశ వర్కర్లు జగదేవి శివలీల పంచత్ కార్మికులు చంద్రయ్య డేవిడ్ గణపతి సంగమ్మ చిన్నమ్మ కన్నమ్మ మైనార్టీ నాయకులు అఖిల్ స్వామి దాస్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ.

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ పట్టణం లోని క్యాంప్ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా ను ఆవిష్కరించిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు గా ఈ సంద్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగం అజరామరమైనది.ఉద్యమానికి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ స్పూర్తిగా నిలిచింది స్వరాష్ట్రంలో సగర్వంగా జీవిస్తున్నామంటే. అందుకు అమర వీరుల త్యాగాలే కారణం.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ.
ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప , మాజి మున్సిపల్ చైర్మన్ అల్లాడి నర్సింలు , సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,యువ నాయకులు మిథున్ రాజ్,మాజి మొగుడంపల్లి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు సురేష్ ,నాయకులు బరూర్ దత్తత్రి,వెంకట్, సాగర్,దీపక్ ,సందీప్,నిఖిల్,ప్రశాంత్ రెడ్డి,బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

‘‘అణువంత రూపం’’ కాదు…’’హనుమంతుడి స్వరూపం’’!

`ఒడిదొడుకులెన్ని వున్నా ఒకే ఒక్కడు రేవంత్‌!

`కాంగ్రెస్‌ ను కష్టకాలంలో ఆదుకున్నాడు.

`రవ్వంత అన్న కళ్ల ముందు కొండంత ఎదిగాడు.

revanth reddy

`అణువంత అనుకున్న వారి ముందు హనుమంతుడై దడ పుట్టిస్తున్నాడు.

`కాంగ్రెస్‌ కు సంజీవనీ అయ్యాడు.

`కేసీఆర్‌ కు ఎదురు తిరిగాడు.

`కేసీఆర్‌ ను ఎదిరించి నిలిచాడు.

`కేసులకు వెరవలేదు. జైలుకు భయపడలేదు.

`లక్ష్యం ముందు సమస్యలను చీపురుపుల్లలనుకున్నాడు.

`చిందరవందర రాజకీయాన్ని చక్కదిద్దాడు.

`తెలంగాణ రాజకీయాలలో ఎదురులేని స్థాయికి ఎదిగాడు.

`ఎవరినైనా ఎదిరించి నిలబడి తొడగొట్టాడు.

`కేసీఆర్‌ ను పడగొడతానని మీసం మెలేశాడు.

`ఏడాదిన్నర పాలన కూల్‌గా నడిపించాడు.

`బీఆర్‌ఎస్‌ కు సున్నం పెట్టి, సున్నా చుట్టించాడు.

`బీఆర్‌ఎస్‌ రాజకీయాన్ని నిలువునా మింగేశాడు.

`తెలంగాణ రాజకీయాలలో బీఆర్‌ఎస్‌ ఉనికి ప్రశ్నార్థకం చేశాడు.

`కారులో కుదుపులు కాంగ్రెస్‌ కు కలిసొచ్చేలా చేశాడు.

`కేసీఆర్‌ లాంటి నాయకుడిని కేసులతో వణికిస్తున్నాడు.

`కేసీఆర్‌ కు భయం అంటే ఏమిటో రుచి చూపిస్తున్నారు.

`పార్టీని మొత్తం తన కంట్రోల్‌ లోకి తెచ్చుకున్నాడు.

`సమిష్టి ప్రభుత్వానికి కొత్త నిర్వచనం చెబుతున్నాడు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రాజకీయమంటే మాటలు కాదు. ఎదురీతలు. నిలదీతలు. పడిగాపులతో కూడిన ఎదురుచూపులు. ఎవరు ఎప్పుడు ఎంత ఎదుగుతారో..ఎవరు ఎక్కడ ఆగిపోతారో అన్నది తెలిసే ముచ్చట కాదు. కాకపోతే రాజకీయం అంటే కాలం కలిసి రానప్పుడు రాజీ పడాలి. కాలాన్ని తనవైపు తిప్పుకొని ఎగిరిపడాలి. తనంతటి వారు లేరని నిరూపించుకోవాలి. నాయకులకు ఆశలుండాలి. లక్ష్యాలుండాలి. తాను ఎమ్మెల్యే కావాలనుకంటే సరిపోదు. అయినా అవకాశాలు రాకపోవచ్చు. అందుకే రాజకీయాల్లో అవకాశాల కోసం ఎంత వెంపర్లాడాలో..అంతే వాసిగా కొట్లాడి కూడా సాదించాలి. అప్పుడు నాయకుడు, మహా నాయకుడౌతారు. రాజ్యం ఏలే శక్తిని కూడగట్టుకుంటాడు. పాలకుడై పాలిస్తాడు. అలాంటి వారిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒకరు. మహా సముద్రం లాంటి కాంగ్రెస్‌ పార్టీలో నాయకుడు కావడం అంటే ఏటికి ఎదురీదడమే..గెలిచి నిలవాటంటే ఎన్నో అవరోధాలు ఎదుర్కొవాలి. అందర్ని కలుపుకుపోవాలి. అందరి చేత నాయకుడని జేజేలు కొట్టించుకోగలగాలి. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యమెక్కువ. ఎదిగేవారిని ఎవరు లాగుతారో తెలియదు. నిచ్చెన మీద వున్నవారిని ఎవరు కిందకు తోస్తారో తెలియదు. అలాంటి పార్టీలో అందర్నీ దాటుకొని ముందుకు వెళ్లడం అంటే పరుగుపందెం కన్నా పెద్ద ప్రయత్నమే చేయాలి. అందర్నీ నెట్టేసుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే కాంగ్రెస్‌లో గెలుపు. అప్పుడే కాంగ్రెస్‌లో పదవులు. నాయకుడి విలువ ప్రతిపక్షంలో వున్నప్పుడు తెలుస్తుందని అంటారు. నాయకుడు కావాలనుకున్నప్పటి నుంచి అలుపెరగని పోరాటం చేసే వారు మాత్రమే ముఖ్యమంత్రి స్దాయికి చేరుకుంటారు. అలాంటి వారిలో కీలకంగా చెప్పుకోవాల్సిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఒక్కడుగా రాజకీయం మొదలు పెట్టారు. ఒక్కడుగా అడుగులేశాడు. ఒక్కడుగానే విజయాలు సొంతం చేసుకున్నాడు. ఒంటి చేత్తో కాంగ్రెస్‌ను గెలిపించి ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులకు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వానికి ఎంతో తేడావుంది. సిఎం. రేవంత్‌ రెడ్డి, మూడు దశాబ్ధాల క్రితం ఈ స్దాయి నాయకుడై వుంటే, ఇప్పటికే దేశ ప్రధాని అయ్యేవారు. ఒకప్పుడు ముఖ్యమంత్రులుగా పని చేసిన వారికి పెద్ద చాలెంజ్‌లు లేవు. ఇప్పుడున్న పధకాల గోల లేదు. ప్రభుత్వమంటే పని చేసుకుంటూ పోవడం తప్ప, ప్రజలకు ఇప్పుడిస్తున్న సంక్షేమ పధకాలతో కూడిన పూర్తి స్ధాయి మ్యానిపెస్టోలు వుండేవి కాదు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ప్రతి ఇంటికి ఏదో ఒకరకమైన ప్రభుత్వ పధకం అందాల్సిందే. అందని వారిని వాటిని అర్హులను చేయాల్సిందే. వారికి కూడా ప్రభుత్వ పధకాలు అందేందుకు కృషి చేయాల్సిందే. కాని గతంలో ఒకటో, రెండో పధకాలు మాత్రమే వుండేది. అందులో రేషన్‌ తప్ప మరే పథకాలు కనిపించేవి కాదు. ప్రతిపక్షాల నుంచి పెద్దగా ఒత్తిడి వుండేది కాదు. కాని రాజకీయాలు మాత్రం ఎప్పుడూ ఎండాకాలంలో ఉక్కపోతలా వుండేది. ప్రతి నాయకుడు ముఖ్యమంత్రి కావాలనుకునేంత రాజకీయం నెరిపేవారు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఏడాది కాలం కూడా సరిగ్గా పాలన సాగించలేని ఉద్దండ నాయకులు కూడా వున్నారు. అందులో మర్రి చెన్నారెడ్డి, మాజీ ప్రధాని పవి. నర్సింహారావు లాంటి వారు కూడా వున్నారు. కాంగ్రెస్‌ రాజకీయ చరిత్రలో అత్యధిక సీట్లు సాధించిన పి.వి. నర్సింహారావు కూడా పదమూడు నెలలు పాలన సాగించేందుకు ఆపసోపాలు పడ్డారు. మర్రి చెన్నారెడ్డి లాంటి నాయకుడు కూడా దినదిన గండంగానే పాలన సాగించారు. వారందరితో పోలిస్తే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాజకీయం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు. ప్రతిపక్షంలో వున్నప్పుడు రేవంత్‌ రెడ్డి పడినన్ని రాజకీయ కష్టాలు, కక్షలు ఏ నాయకుడు అనుభవించలేదు. నిత్యం నరకం చూశారు. అయినా కేసిఆర్‌ను ఎదరించి నిలిచారు. పోరాడి ప్రజా క్షేత్రంలో కేసిఆర్‌ను మట్టి కరింపించారు. రాజకీయాల్లో ఆరోపణలు మరీ దారుణమైన స్ధితికి బిఆర్‌ఎస్‌ నాయకులు దిగజార్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొలేక వ్యక్తిత్వ హననం చేసేవారు. ఆయన ఆహార్యం మీద ఆరోపణలు చేసేవారు. అయినా రేవంత్‌ రెడ్డి చిరునవ్వుతో వాటిని స్వీకరించేవారు. అంతే దాటిగా విమర్శలు చేసిన వారిని కూడా మాటలతో తూటాలు పేల్చేవారు. చాల మంది బిఆర్‌ఎస్‌ నాయకులు అధికారంలో వున్నప్పుడు రేవంత్‌ రెడ్డి మీద చేసిన ఆరోపణలు అన్నీ ఇన్ని కావు. పైగా అణవంత రెడ్డి, రవ్వంత రెడ్డి అంటూ హేళన చేసేవారు. ఇప్పుడు ఆ నాయకుడు రేవంత్‌ రెడ్డి కొండంత కనిపిస్తున్నాడు. ఒక్కక్కరి వెన్నులు వణకు పుట్టిస్తున్నాడు. ఎన్ని ఒడుదొడుకులైనా ఆనాడు ఎదుర్కొన్నాడు. ఇప్పుడూ ఎదురీదుతూనే వున్నారు. సహజంగా ఏ నాయకుడైనా అధికార పార్టీలో చేరి పదవులు పొందాలనుకుంటారు. నాయకుడిగా ఒక్కొ మెట్టు ఎదుగాలనుకుంటారు. అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాజకీయం విభిన్నం. ఆయన రాజకీయం ప్రత్యేకం. అందుకే తన మొదటి ఎంపిక ప్రతిపక్షంలో వున్న పార్టీనే ఎంచుకున్నారు. ఇండిపెండెంటుగానే జడ్పీటీసి అయ్యారు. ఇండిపెండెంటుగానే ఎమ్మెల్సీ అయ్యారు. 2007 ప్రతిపక్షంలో వున్న తెలుగుదేశంలో చేరారు. 2009లో ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలోనే వుంది. 2014లో తెలుగుదేశంలోనే వున్నాడు. అప్పుడూ ప్రతిపక్ష పాత్రనే పోషించారు. ఎందుకంటే ఆయన పదవులు ఎవరి దయాదాక్షిణ్యాల మీద పొందాలనుకోలేదు. కాంగ్రెస్‌లో చేరినా ఆ పార్టీ ప్రతిపక్షంలోనే వుంది. ఆ పార్టీ అప్పుడు నిజానికి కాంగ్రెస్‌ పార్టీ కష్టకాలంలోనే వుంది. భవిష్యత్తులో పుంజుకుంటుందన్న నమ్మకం లేని స్దితిలోనే వుంది. అలాంటి సమయంలోనే కాంగ్రెస్‌లో అడుగుపెట్టారు. పార్టీకి కొండంత అండగా నిలిచారు. పార్టీలో ఎదురయ్యే సమస్యలనే కాదు, అప్పటి పాలకపక్షం నుంచి ఎదురైన ఇబ్బందులను గుండె ధైర్యంతో ఎదుర్కొన్నారు. పాలమూరు పులి బిడ్డ అని నిరూపించుకున్నారు. ఒకనాడు అణువంత అన్నవారి ముందు హనుమంతుడంతై, వారికి దడి దడ పుట్టిస్తున్నాడు. కాంగ్రెస్‌కు సంజీవని అయ్యారు. పార్టీని నిలబెట్టేందుకు అనేక కష్టాలు పడ్డారు. ఆఖరుకు తన కూతురు పెళ్లిని కూడా కళ్ల నిండా చూడలేనంత కష్టాన్ని అనుభవించాడు. పదే పదే కేసిఆర్‌ పాలనలో జైలు జీవితాన్ని అనేక సార్లు భరించారు. కేసులకు ఏనాడు భయపడలేదు. జైలు జీవితం గురించి చింత చెందలేదు. ఎన్ని నిర్భంధాలనైనా సరే అవలీలగా ఎదుర్కొన్నాడు. ప్రజల హృదయాలను గెల్చుకున్నాడు. కాంగ్రెస్‌ పెద్దల నమ్మకం చూరగొన్నాడు. బలమైన ముఖ్యమంత్రి కేసిఆర్‌ అని ప్రచారం సాగుతున్న వేళ కేసిఆర్‌కు ఎదరించి నిలిచాడు. ప్రతి పధకాన్ని ఎండగట్టాడు. కాళేశ్వరం నిర్మాణంలో అవకతవకలు , అక్రమాలు జరుగుతున్నాయని ఆనాడే గొంతెత్తి నినదించాడు. తెలంగాణ సొమ్మును బిఆర్‌ఎస్‌ నాయకులు నీళ్లలా కొల్లగొడతున్నారని ప్రజలను చైతన్యం చేశారు. మల్లన్న సాగర్‌ ప్రాంతాల్లో నిర్వాసితులకు అండగా వున్నారు. ప్రభుత్వంతో కొట్లాడి వారికి పరిహారం అందేందుకు కృషి చేశారు. ఎన్ని అవాంతరాలెదురైనా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ప్రతి సమస్యను పూచిక పుల్లతో సమానమనుకున్నాడు. తాను ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యం వైపు వడివడిగా అడుగులు వేశాడు. ఓ వైపు కేసిఆర్‌ను ఎదుర్కొంటూనే, మరో వైపు కాంగ్రెస్‌లో వున్న చిందర వందర రాజకీయాన్ని చక్కదిద్దారు. ఇప్పుడున్న తెలంగాణ రాజకీయాల్లో ఎదురులేని నేతగా ఎదిగారు. తిరుగులేని శక్తిగా మారారు. తన రాజకీయం ముందుకు కేసిఆర్‌ లాంటి నాయకుడి నాయకత్వాన్నే తుత్తునీయం చేశాడు. తనకు ఎదురు వచ్చే వారందరినీ ఎదరించాడు. కేసిఆర్‌ను ఒక దశలో తొడగొట్టి సవాలు చేశాడు. కేసిఆర్‌ ను పడగొడతానని మీసం మెలేశాడు. జైలుకెళ్లిన సమయంలో కూడా బెబ్బులిలా గర్జించాడు. ఎన్ని సవాళ్లు ఎదురౌతున్నా ఏడాదిన్న కాలం పాటు కూల్‌గా పాలన సాగిస్తున్నాడు. బిఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజల చేత సున్నం పెట్టించి, సున్నా చుట్టేలా చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే బిఆర్‌ఎస్‌ను నిలువునా మింగేశాడు. తెలంగాణ దాటి దేశ రాజకీయాలను ఏలుతామని ప్రగల్భాలు పలికిన వారి రాజకీయ ఉనికినే ప్రశ్నార్ధం చేశాడు. ఇల్లు దాటలేని పరిస్దితి తెచ్చాడు. కేసిఆర్‌ లాంటి నాయకుడిని కూడా కేసులతో వణికిస్తున్నాడు. ఎవరికీ భయపడడని గొప్పలు చెప్పుకునే కేసిఆర్‌కు భయం ఏమిటో రుచి చూపిస్తున్నాడు. దినదినం వణుకు అంటే ఎలా వుంటుందో చూపిస్తున్నాడు. పార్టీని తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాడు. ప్రజా ప్రభుత్వానికి నిజమైన నిర్వచనం చెబుతున్నాడు.

తెలంగాణ చేనేత కార్మిక సంఘం.

తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా జమ్మికుంట వాసి పెండం సర్వేశం ఎన్నిక
హర్షం వ్యక్తం చేసిన జమ్మికుంట చేనేత సంఘాలు

జమ్మికుంట నేటిధాత్రి:

హైదరాబాద్ (ముగ్దం మోహినుద్దీన్ భవన్) లో జరిగిన తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి సమావేశంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మునిసిపాలిటీ పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన పెండెం సర్వేశం ను రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ సందర్భంగా సర్వేశం గురువారం జమ్మికుంట లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చేనేత పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో ఉండి కార్మికులు పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేతన్నలను చిన్నచూపుచూస్తున్నా
యని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పెట్టి చేనేత పరిశ్రమను దెబ్బతీసిందని ఇప్పటికైనా జిఎస్టి తొలగించాలని, రద్దు చేసిన చేనేత పథకాలను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు జరపాలని సహకార సంఘాల రుణాలతో సహా నేతన్నల కు అన్ని రకాల రుణాలను మాఫీ చేయాలని, సహకార సంఘాలకు,టెస్కోకు ఎన్నికలు నిర్వహించలని కోరారు. పెద్దమొత్తంలో నిధులు కేటాయించి చేనేత కార్మికులకు చేతినిండా పనులు కలిగించి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు లభించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. చేనేత కార్మికులకు ఇల్లు నిర్మించుకోవడానికి రూ.6 లక్షలు ఇవ్వాలని, కార్మికులకు నెలకు రూ. 5000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేనేత సమస్యల పరిష్కారానికి రానున్న కాలంలో కార్మికులను చైతన్య పరిచి ఉద్యమాలు
చేస్తామని చెప్పుకొచ్చారు. తను ఎన్నికకు సహకరించిన సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు, ప్రధాన కార్యదర్శి పాశికంటి లక్ష్మీనరసయ్య లతో పాటు ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో చేనేత కార్మిక సంఘం నాయకులు జమ్మికుంట మండల చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు మాటేటి సమ్మయ్య, నాయకులు బొమ్మకంటి మహేంద్ర చారి, ఈవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డా౹౹ఎ. చంద్రశేఖర్, మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్
టీపీసీసీ అద్యక్షులు & ఎమ్మెల్సీ, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సతీష్ మాదిగ,నారాయణ్. పాల్గొన్నారు.

జర్నలిస్టుల ఫోరం రజతోత్సవజాతరను జయప్రదం చేద్దాం.

తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవ జాతరను జయప్రదం చేద్దాం.

రజతోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.

హైదరాబాద్ జలవిహార్ రజతోత్సవ సభకు తరలిరావాలి.

టీయూడబ్ల్యూజె జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా.

“నేటిధాత్రి”, వేములవాడ.

 

తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవ సంబరాల పోస్టర్ ను రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్, వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా మంగళవారం యూనియన్ ప్రతినిధుల మధ్య ఆవిష్కరించారు.

తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవ సభ కు జర్నలిస్టు సమాజం పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని టీయూడబ్ల్యూజె రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా పిలుపునిచ్చారు.

టీజెఎఫ్ ఆవిర్భావ దినోత్సవం ఈనెల 31 వ తేదీన 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ జలవిహార్ లో నిర్వహించే రజతోత్సవ సభకు జిల్లా నుండి జర్నలిస్ట్ సోదరులు పెద్ద ఎత్తున కదలి రావాలని విజ్ఞప్తి చేశారు.

మంగళవారం టీజేఎఫ్ రజతోత్సవాల సంబంధిత పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

2001 మే నెలలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమే ఊపిరిగా టీజెఎఫ్ ఆవిర్భవించిందని గుర్తు చేశారు.

ఆనాడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందు వరుసలో నిలబడి రాష్ట్రం సాధించడంలో కీలక భూమిక పోషించిందన్నారు.

టీజెఎఫ్ ఏర్పడి 25 సంవత్సరాలు, పూర్తి అవుతున్న సందర్బంగా
హైదరాబాద్ లోని జలవిహార్ లో ‘జర్నలిస్ట్ ల జాతర ‘ను నిర్వహిస్తున్నారని, ఈ జాతరకు అన్నీ రాజకీయ పార్టీల ముఖ్యలు హాజరవుతారన్నారు.

హైదరాబాదులోని జలవిహార్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలన్నారు.

ఈ జాతరకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి జర్నలిస్టు సోదరులు హాజరుకావాలని కోరారు.

టీయూడబ్ల్యూజే -H143 రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ అధ్యక్షతన రజతోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో టెంజు జిల్లా అధ్యక్షులు ఇరుకుల్ల ప్రవీణ్ కుమార్, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సామల గట్టు, వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, యూనియన్ సీనియర్ ప్రతినిధులు గరదాస్ ప్రసాద్, పరకాల ప్రవీణ్, చల్ల ప్రసాద్ రెడ్డి తంగళ్ళపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వెంగల శ్రీనివాస్ తో పాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టు సోదరులు పాల్గొన్నారు.

తెలంగాణ జాగృతి మహిళాసమాఖ్య రాష్ట్ర.!

తెలంగాణ జాగృతి మహిళాసమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలుగా మారిపెల్లి మాధవి

ప్రగతి గ్రామైఖ్య సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం

మరిపెడ నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా విఓఎ ఉద్యోగుల సంఘం,మరిపెడ మండల కమిటీ,ప్రగతి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో చిల్లంచర్ల గ్రామంలో తెలంగాణ జాగృతి మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు మారిపెల్లి మాధవి కి ఘనంగా సన్మానించినారు. జాగృతి వ్యవస్థపాక అధ్యక్షురాలు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మే,16, 2025 న మాధవిని నూతనంగా రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించారు. ఈ సందర్భంగా గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. వి ఓ ఎ రంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బలమైనా నిర్మాణం చేసిన పనితనాన్ని గుర్తించిన కవిత ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు కవితక్క కు కృతజ్ఞతలు తెలిపారు.

Women’s

తనకిచ్చిన బాధ్యతను అలుపెరుగకుండా,మహిళల అభివృద్ధికి, మహిళలను అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లడానికి తన వంతు పాత్ర ఎప్పటికీ ఉంటుందని గుర్తు చేశారు,మహిళల సమస్యల మీద పోరాడుతనని, సమాజంలో మహిళపై జరిగే అఘైత్యాలు, అరాచకాలని జాగృతి తరుపున అరికడతామని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ఐకెపి వివోఏల మరిపెడ మండల అధ్యక్షులు రాంపల్లి వెంకన్న గౌడ్,కొండూరు వెంకటయ్య, నాగంజన చారి,నూక రవి, వీరన్న, శాంత కుమారి, జాగృతి నాయకులు గంధసిరి వేణు,నాగిరెడ్డి, దోమల సోమయ్య, ఈరగాని ఉపేందర్,సిరాజ్,మురళి, నూక సురేష్,వివో సభ్యులు శిరీష, రేఖ కేతమ్మ, బొల్లు రమణ, ఆశ, బొల్లు హైమా, రేఖా లింగమ్మ, మౌనిక, శోభ, ఉప్పమ్మ, వినోద, మంజుల, యాకమ్మ తదితరులు పాల్గొన్నారు.

గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో కౌన్సిలింగ్.!

తెలంగాణా గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు

పత్రికా ప్రకటన

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి) :

 

 

ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఇంటర్ లో
2005- 26 . విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు తెలంగాణా గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల, ఇందిరమ్మ కాలనీ (గా). పం). సిరిసిల్ల లో ST బాలికల నుండి ధరఖాస్తులు ఇహ్వానిస్తున్నామని ప్రాంతయ సమ్వన్వయ అధికారి D. S. వెంకన్న ఒక ప్రకటనలో
తెలియజేసారు. ఆసక్తి గల అభ్యర్ధులు కళాశాల నందు మే 16న నిర్వహించే కౌన్సిలింగ్ అన్ని ఓరిజినల్ (TC, బోనాఫైడ్, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్, రెసిడెన్సి, డేట్అఫ్ బర్త్, మొదలగునవి మొగునని దృవీకరణ పత్రంలో పాటు, ఒక సెట్ జిరాక్స్ తీసుకొని వచ్చి అడ్మిషన్లు పొందవచ్చని, కళాశాల ప్రిన్సిపల్ తెలియజేశారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ : 9032170654, 8333925362

పేదల వైద్యానికి భరోసా .!

పేదల వైద్యానికి భరోసా

◆౼ తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్
యన్. గిరిధర్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సీఎంఆర్ఎఫ్ పేదల వైద్యానికి భరోసా కల్పిస్తుందని తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి అన్నారు.ఆదివారం రోజున జహీరాబాద్ టౌన్ ఆదర్శనగర్ కాలనీ వారి గెస్ట్ హౌస్ లో జహీరాబాద్ మండలం హుగ్గెల్లి గ్రామానికి చెందిన యం.బస్వరాజు (లబ్ధిదారుడు) గారి తనయుడు కి తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  .ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పి.నాగిరెడ్డి,రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి,యూత్ న్యాల్కల్ మండల అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్ గౌడ్,రంగా అరుణ్,నాగు చౌహన్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సబ్సిడీ లోన్స్‌పై కొత్త కొర్రిలు మానుకోవాలి.

తెలంగాణ సబ్సిడీ లోన్స్‌పై కొత్త కొర్రిలు మానుకోవాలి

నిరుద్యోగ యువతకు భరోసా కల్పించాలి
బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పూరెల్ల శ్రీకాంత్ గౌడ్ డిమాండ్

రామడుగు నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ లోన్ పథకాల్లో కొత్త కొర్రిలు రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ రామడుగు మండల ప్రధాన కార్యదర్శి పూరేల్ల శ్రీకాంత్ గౌడ్ మండల కేంద్రంలో ఒక ప్రకటన ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా పూరెల్ల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాస్ పథకం కింద సబ్సిడీ లోన్ సిబిల్ స్కోర్ కారణం లేకుండా ఇవ్వాలని కరోనా మహమ్మారి సమయంలో అనేకమంది యువత రుణ వాయిదాలు చెల్లించ లేకపోయిన నేపథ్యంలో వారి సిబిల్ స్కోర్లు దెబ్బతిన్నాయని దీంతో ఇప్పుడు వారు ప్రభుత్వం ద్వారా ఇచ్చే సబ్సిడీ లోన్లకు కూడా అనర్హులవుతున్నారు. కరోనా సమయంలో ఉద్యోగాలు పోయి ఆర్థికంగా నష్టపోయి, ఇప్పుడు మళ్లీ స్థిరపడేందుకు ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని పొందేందుకు ప్రయత్నిస్తే సిబిల్ అడ్డంకిగా మారుతోందని నిరుద్యోగ యువతకి ఆదరణగా ప్రభుత్వం సిబిల్ స్కోర్ తప్పనిసరి కాకుండా ప్రత్యామ్నాయ ప్రమాణాలను పరిశీలించాలని, ప్రభుత్వ పథకాల ఉద్దేశ్యం ఆర్థికంగా వెనుకబడిన యువతకు సహాయం చేయడమేనని, సిబిల్ అడ్డుగా మారకూడదని పూరెల్ల శ్రీకాంత్ గౌడ్ ప్రభుత్వాన్ని పత్రిక ముఖముగా కోరుతున్నారు.

తెలంగాణ పరువుతీస్తున్న సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ పరువుతీస్తున్న సీఎం రేవంత్ రెడ్డి..

చెప్పుల దొంగగా అభివర్ణించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

*తెలంగాణను దివాలా రాష్ట్రంగా చిత్రీకరించిన రేవంత్ *

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాజ ద్రోహం కేసుపెట్టాలి..

ప్రజలు,ఉద్యోగుల మధ్య విబేధాలు సృష్టిస్తూ సీఎం సలహాలు

తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి.

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

చెప్పుల దొంగల్లాగా ఢిల్లీలో తనను బ్యాంకర్లు చూస్తున్నారని ఒక ముఖ్యమంత్రి స్వయంగా అభివర్ణించుకోవడం దురదృష్టకరం దేశం ముందు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల పరువుతీస్తున్నారని తెలంగాణ ఉద్యమనేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.ఒక ముఖ్యమంత్రి దేశ రాజదాని డిల్లీలో చెప్పుల దొంగగా కనబడితే స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేలు,ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.గత కెసిఆర్ ప్రభుత్వం, ఎఫ్ఆర్బిఎం కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే అప్పులు చేయడం జరిగిందని, దేశంలో తెలంగాణ కన్న 28 రాష్ట్రాలు ఎక్కువగా అప్పులు చేశాయి. మిగతా రాష్ట్రాలలో ఈ పరిస్థితి లేనప్పుడు తెలంగాణకే ఈ స్థితి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే అని పేర్కొన్నారు.ఎన్నికల ముందు అధికారం కోసం అడ్డగోలు 420 హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అపరిచితుడిలా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.
తను తెలంగాణలో లేనట్టుగా తనకేమి తెలియనట్టుగా కొత్తగా ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది. దివాలా చేసింది. ఆనా పైసా రావడం లేదు. అని చెప్పడం అనేది ఇచ్చిన హామీల నుండి తప్పించుకోవడం కోసం ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.సోమవారం ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు విన్నాక ఈ రాష్ట్రంలో ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకచ్చి పనులుచేయలేని పరిస్థితి ఉంది.ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి కీలకమైన పథకాల అమలు కూడా కష్టసాధ్యమే అనిపిస్తుందని ఆయన చెప్పారు.
రాబోయే రోజుల్లో ఇతర దేశాలు,రాష్ట్రాల నుండి తెలంగాణలో కంపెనీలలో పెట్టబడులు పెట్టకుండా ఉద్యోగాల కల్పన జరగకుండా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సూచిస్తున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు ఎక్కడ నిలదీస్తారో,ఎదురు తిరుగుతారో అనే భయంతో పరిపాలన చేతకాదు. హామీలు అమలు చేయలేము అని మూడున్నర సంవత్సరాల ముందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు.ఇందిరమ్మ ఇండ్లు ,యువ వికాసం, మహాలక్ష్మి, రైతు భరోసా,రుణమాఫీ,కళ్యాణ లక్ష్మి తులం బంగారం,పెన్షన్ల పెంపు లాంటి పథకాల అమలుపైన ప్రజలు ఇప్పటికే నమ్మకాన్ని కోల్పోయారని తెలిపారు.
దేశంలోనే అత్యధిక జీడీపీని కలిగి దేశానికి అత్యధికంగా జీఎస్టీ చెల్లించే స్థాయికి ఎదిగిన తెలంగాణను నేడు అప్పులు పుట్టని రాష్ట్రంగా మారిందని చెప్పడం తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటమే దివాలా రాష్ట్రంగా చిత్రీకరించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివాలా కోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు.పరిపాలన అనుభవం లేని ముఖ్యమంత్రి,మంత్రులకు రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదని వీరిపైన రాజద్రోహం కేసుపెట్టాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది డిమాండ్ చేశారు.
ఎన్నికలకు ముందు ఉద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళ సేవలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఉద్యోగులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టారని,మేనిఫెస్టోలో వారికి ఇచ్చిన హామీలను అమలుపట్ల అడగడం నేరమా అని ప్రశ్నిస్తూ ఉద్యోగుల కోసం సంక్షేమ పథకాలు ఆపమంటారా అని చెప్పడం ప్రజలకు ఉద్యోగులకు మధ్య విభేదాలు సృష్టించడమే సీఎం రేవంత్ రెడ్డి పని అని అవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ సాధనలో ఉద్యోగుల పాత్ర కీలకమైందని వారి హక్కుల సాధనకు ప్రతిపక్షంగా బిఆర్ఎస్ పార్టీ వెంట ఉంటుందని వెంటనే ఉద్యోగులతో చర్చలు జరిపి వారి డిమాండ్లను నెరవేర్చాలని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రభుత్వాన్ని సవాల్ చేశారు.

శ్రీ దుర్గామాత & ఉరడమ్మ మాతల…!

శ్రీ దుర్గామాత & ఉరడమ్మ మాతల విగ్రహాల ప్రతిష్ఠాపన,ధ్వజస్తంభం మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్,

◆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

కోహీర్ మండలం లోని చింతల్ ఘట్ గ్రామంలో మంగళవారం శ్రీ దుర్గామాత & ఉరడమ్మ మాతల విగ్రహాల ప్రతిష్ఠాపన,ధ్వజస్తంభం మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.అనంతరం కార్యక్రమ నిర్వాహకులు వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈకార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్,కోహీర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాంలింగా రెడ్డి,జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి,మాజీ యం.పి.టి.సి మల్లన్న పాటిల్,అశ్విన్ పాటిల్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version