తెలంగాణ జాగృతి మహిళాసమాఖ్య రాష్ట్ర.!

తెలంగాణ జాగృతి మహిళాసమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలుగా మారిపెల్లి మాధవి

ప్రగతి గ్రామైఖ్య సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం

మరిపెడ నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా విఓఎ ఉద్యోగుల సంఘం,మరిపెడ మండల కమిటీ,ప్రగతి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో చిల్లంచర్ల గ్రామంలో తెలంగాణ జాగృతి మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు మారిపెల్లి మాధవి కి ఘనంగా సన్మానించినారు. జాగృతి వ్యవస్థపాక అధ్యక్షురాలు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మే,16, 2025 న మాధవిని నూతనంగా రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించారు. ఈ సందర్భంగా గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. వి ఓ ఎ రంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బలమైనా నిర్మాణం చేసిన పనితనాన్ని గుర్తించిన కవిత ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు కవితక్క కు కృతజ్ఞతలు తెలిపారు.

Women’s

తనకిచ్చిన బాధ్యతను అలుపెరుగకుండా,మహిళల అభివృద్ధికి, మహిళలను అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లడానికి తన వంతు పాత్ర ఎప్పటికీ ఉంటుందని గుర్తు చేశారు,మహిళల సమస్యల మీద పోరాడుతనని, సమాజంలో మహిళపై జరిగే అఘైత్యాలు, అరాచకాలని జాగృతి తరుపున అరికడతామని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ఐకెపి వివోఏల మరిపెడ మండల అధ్యక్షులు రాంపల్లి వెంకన్న గౌడ్,కొండూరు వెంకటయ్య, నాగంజన చారి,నూక రవి, వీరన్న, శాంత కుమారి, జాగృతి నాయకులు గంధసిరి వేణు,నాగిరెడ్డి, దోమల సోమయ్య, ఈరగాని ఉపేందర్,సిరాజ్,మురళి, నూక సురేష్,వివో సభ్యులు శిరీష, రేఖ కేతమ్మ, బొల్లు రమణ, ఆశ, బొల్లు హైమా, రేఖా లింగమ్మ, మౌనిక, శోభ, ఉప్పమ్మ, వినోద, మంజుల, యాకమ్మ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version