దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి.

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి )

 

 

ఈనెల మే 20వ తారీఖున జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంబంధించిన సమ్మె నోటీసును వివిధ సంబంధిత అధికారులకు ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా బిఆర్టియు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎన్నో ఏండ్లుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా చేసి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ వ్యవస్థకు వత్తసు పలుకుతూ కార్మిక సంక్షేమాన్ని విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలో లక్షలాదిమంది ఉపాధి పొందుతున్న వివిధ పరిశ్రమల మీద అనేక ఆంక్షలు.నిబంధనలు పెట్టి కార్మికుల ఉపాధిని దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం సిగ్గుచేటు అన్నారు. కార్మిక సంఘాల ఏర్పాటు లేకుండా కార్మికుల హక్కుల కోసం ఎటువంటి సమ్మెలు చేయకుండా ఎనిమిది గంటల పని దినాన్ని తుంగలో తొక్కి చట్టాల సవరణ చేయడం బాధాకరమన్నారు.
కార్మికులకు ఉద్యోగ భద్రత
పని భద్రత మరియు కనీస వేతనాల అమలు లాంటివి లేకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసేదాకా కార్మికులంతా ఐక్య పోరాటం చేయవలసిన అవసరము ఉందని అన్నారు.
ఈ సమ్మె అంతం కాదని ఆరంభం మాత్రమే అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు ఆలంబిస్తే రాబోయే ఎన్నికల్లో కార్మికులు మీకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కడారి రాములు. సిఐటియు నాయకులు
అన్నల్ దాసు గణేష్. ఐఎన్టీయూసీ నాయకురాలు గొట్టే రుక్మిణి. కార్మిక నాయకులు చిట్యాల మధు తదితరులు పాల్గొన్నారు.

ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి.

మే 15-18 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతిలో జరగనున్న ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి
ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి భామండ్ల పల్లి యుగంధర్, రాష్ట్ర సమితి సభ్యులు బోనగిరి మహేందర్

కరీంనగర్, నేటిధాత్రి:

 

మే 15-18 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతిలో జరగనున్న ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపెళ్లి యుగంధర్, రాష్ట్ర సమితి సభ్యులు బోనగిరి మహేందర్ పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో పోస్టర్ విడుదల చేయడంజరిగింది. ఈసందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి భామండ్లపెళ్లి యుగంధర్ రాష్ట్ర సమితి సభ్యులు బోనగిరి మహేందర్ లు సంయుక్తంగా మాట్లాడుతూ భారతదేశంలో యువజన సామర్థ్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రధానంగా దేశంలో నిరుద్యోగ సమస్య అధికమైందని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కాలయాపన చేయడం మూలంగానే దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు పోవడం లేదని వారు విమర్శించారు. ఉపాధి ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయకుండా ఏప్రభుత్వం కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేవని వారు అన్నారు. పాలకులు ఎంతసేపటికీ ప్రైవేట్, కార్పొరేట్ పెట్టుబడిదారీ వ్యవస్థలపైనే ఆధారపడటం ద్వారా దేశ ఆర్థిక సమతుల్యత సాధ్యం కాదని వారు అన్నారు. ఈ చర్యల మూలంగా దేశంలో గత పది సంవత్సరాలుగా వందలాది ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడ్డాయని, దేశంలో రోజురోజుకూ నిరుద్యోగ సైన్యం పెరుగుతోందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే 2025 మే 15-18వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలో జరగనున్నాయని, ఈమహాసభలలో ప్రధానంగా నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు, పాలకుల విధానాలు తదితర అంశాలపై బోధనలు, చర్చలు, తీర్మానాల ద్వారా నిర్ణయాలు ఉంటాయని, ఈజాతీయ మహాసభలకు దేశం నలుమూలల నుండి సుమారు ఎనిమిది వందల మంది డెలిగేషన్ నాయకత్వం పాల్గొంటారని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఎనభై మంది డెలిగేషన్ పాల్గొంటున్నట్లు, మే15న తిరుపతిలో జరగనున్న మహాసభల ర్యాలీ, బహిరంగ సభకు వెయ్యి మంది పాల్గొంటున్నట్లు వారు తెలిపారు.
ఈపోస్టర్ ఆవిష్కరణలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు వెంకటేష్, చిన్న సదాశివ్, అవినాష్, రమేష్ , దామోదర్, అఖిల్, మురళి, భాస్కర్, రవి, రమేష్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

సిట్టింగ్ సక్సెస్..?

సిట్టింగ్ సక్సెస్..?

ఐదు ఆరు లోజుల మకాం,లో అంత సెటిల్.!?

ఆ హోటల్ లో అధికారికి కలిసిన కాంట్రాక్టర్లు.!?

ఇక మండలంలో ఇసుక క్వారీలో అక్రమ వసూళ్లకు గ్రీన్ సిగ్నల్.

పలుగుల 8, 9, మరో రెండు ఇసుక రీచ్ లో పెంచిన అక్రమ వసూళ్ల రూపాలు.

ఆగని కుంట్లం గోదావరి నుండి పక్క జిల్లా క్వారీకు ఇసుక రవాణా.

నేటి ధాత్రి చెప్తూనే వస్తుంది, అక్రమాలకు సూత్రధారి టిజిఎండిసి.

ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఇసుక అక్రమాల పై విచారణకు అదేశిచాలి.

మహదేవపూర్- నేటి ధాత్రి:

 

 

మండలంలో అక్రమ వసూళ్ల వ్యవహారం టి జి ఎం డి సి చీకటి ఒప్పందాలతో, అక్రమ వసూళ్లలో ఇసుక రీచులు రెట్టింపు ఉత్సాహం కనబరుస్తూ, లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రభుత్వ నిబంధనలను టీజీఎండిసి అధికారులు, కాసులకు కక్కుర్తి పడి, సీక్రెట్ సెట్టింగ్ ల వ్యవహారాలను కొనసాగిస్తూ, అక్రమ ఇసుక రవాణా అక్రమ వసూళ్ల వ్యవహారం, దర్జాగా కొనసాగేలా ప్రోత్సహించడం జరుగుతుంది. అనేక ఇసుక రీచ్ లో అక్రమాల సాక్షాలు తెరపైకి వచ్చిన, చర్యలు తీసుకోవాల్సిన టిజిఎండిసి, గుట్టుచప్పుడు కాకుండా కాంట్రాక్టర్లకు మూలాఖాత్ అయి, చీకటి ఒప్పందాలతో ఇసుక రీచుల్లో ఇసుక క్వాంటిటీ పూర్తయ్యే వరకు, చూసి చూడనట్టుగా ఉండి అక్రమ వసూళ్లకు పరోక్షంగా మద్దతు తెలపడం, ఇప్పటికీ అక్రమ వ్యవహారాలు అదనపు ఇసుక రవాణా చేసిన ఉసుక్ పల్లి ఒకటి, పలుగుల పుసుపల్లి 6, పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లు జరిపి తమ క్వాంటిటీని సమాప్తం చేసుకున్నారు, కానీ టి జి ఎం డి సి మాత్రం చర్యలకు శశి మీరా అంది. ఓ అధికారి మండలంలో గుట్టుచప్పుడు కాకుండా సెట్టింగులు నిర్వహించుకొని, పక్క జిల్లా కు సంబంధించిన, రీచులు కూడా గోదావరిలో అక్రమ రోడ్డును నిర్మించి, హద్దులు దాటి ఇసుక రవాణా చేస్తుంటే, పీజీఎండిసి నిశ్శబ్దం, కేవలం అధికారులు సెట్టింగులు కొరకే పరిమితం కావడంతో, మండలంలో ఇసుక క్వారీల అక్రమాలు మరింత పెరగడానికి ప్రధాన కారణం.

సిట్టింగ్ సక్సెస్..?

మండలంలో ఇసుక క్వారీల అక్రమాలు హద్దు అదుపు లేకుండా కొనసాగుతున్న క్రమంలో, టీజీఎండిసి అధికారులు, ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుండా అక్రమాలను అడ్డుకట్ట వేయాల్సిన టీజీఎండిసి, ఇసుక కాంట్రాక్టర్ల తో సెట్టింగులు జరుపుకొని ఇసుక రీచ్ లో అక్రమాలకు పోస్ట్చాయిస్తున్నారని అధికారి వారం రోజులపాటు “గ్రీన్ ప్రాంతం” ముఖం వేసి కాంట్రాక్టర్లకు తమ వద్దకు పిలుచుకొని సెట్టింగ్ సక్సెస్ చేసుకోవడం జరిగిందని మండలంలో ప్రస్తుతం ఆ అధికారి గ్రీన్ ప్రాంతంలో వారం రోజుల మాఖామ్ చర్చనీయంగా మారింది. ప్రస్తుతం మండలంలో పెద్ద మొత్తంలో కొనసాగుతూ భారీ ఇసుక లారీల్లో ఇసుక రవాణా చేస్తున్న క్వారీల కాంట్రాక్టర్లు అధికారికి వద్దకు వెళ్లి సెట్టింగులు సక్సెస్ చేసుకున్నట్లు సమాచారం, సెట్టింగ్ సక్సెస్ కావడంతో అధికారి తిరిగి వెళ్లిపోవడం జరిగిందని తెలుస్తుంది.

ఐదు ఆరు లోజుల మకాం,లో అంత సెటిల్.!?

టీజీఎండిసి ఉన్నత అధికారి మండలంలో గ్రీన్ ప్రాంతం వద్ద, సుమారు ఐదు నుండి ఆరు రోజుల ముఖం వేసి పలు ఇసుక క్వారీలకు సంబంధించి కాంట్రాక్టర్లతో సెట్టింగ్ చేసుకున్నట్లు సమాచారం, ఐదు రోజుల మాఖం లో అంత సెట్టింగ్ కావడంతో ఆ అధికారి, ఇసుక క్వారీల పై చర్యలు విచారణ లాంటి ఏమీ చేయకుండా, వెళ్లిపోవడం జరిగిందని విశ్వ నీయ సమాచారం. టీజీఎండిసి అధికారి ఇసుక అక్రమాలు చేపడుతున్న ఇసుక క్వారీలను సందర్శించి, లారీల డ్రైవర్ల తో అదనపు వసూళ్లపై వివరాలు సేకరించడం, ఇసుక రీచ్ ల వద్ద కాంటాలను పరిశీలించడం, వి విల్ పై ఉన్న ఇసుక టన్నులు, లారీలకు కాంట ఇచ్చిన రసీదులు ఇలాంటివి పరిశీలించాల్సిన అవసరం బాధ్యత ఆ అధికారి చేయవలసి ఉంటుంది, కానీ నామమాత్రంగా ఒకరోజు దగ్గర్లోని రెండు ఇసుక క్వారీలకు వెళ్లి తిరిగి తమ గ్రీన్ ప్రాంతానికి వచ్చి, సుమారు ఐదు నుండి ఆరు రోజుల ముఖంలో అంత సెట్టింగ్ చేసుకొని వెళ్లిపోవడం జరగడంతో, టి జి ఎం డి సి అధికారుల ప్రోత్సాహంతోనే, ఇసుక రీచ్ లో అక్రమ వసూళ్ల వ్యవహారం కొనసాగుతుందని స్పష్టం అవుతుంది.

 

TGMDC

ఆ హోటల్ లో అధికారికి కలిసిన కాంట్రాక్టర్లు.!?

ప్రస్తుతం మండలంలో కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణా లో తమ సత్తా చాటుతున్న పలువుల 8, 9, మహాదేవపూర్పుచుపల్లి 1, తోపాటు మరికొన్ని ఇసుక క్వారీల కాంట్రాక్టర్లు, ఆ అధికారి ఉన్న గ్రీన్ ప్రాంతానికి వెళ్లి, కలవడం జరిగిందని సమాచారం. ఇక టీజీఎండిసి ఉన్నత అధికారి, విధులు ఎక్కడ నిర్వహించాడు, ఆ హోటల్ విధులు నిర్వహించే కేంద్రం, ఇసుక రీచులను తనిఖీ చేయాల్సిన ఆ అధికారి, ఆ గ్రీన్ ప్రాంతంలో, ఎందుకు మఖాం వేసినట్టు, వారం రోజులపాటు అధికారి మాఖామ్, ఇసుక క్వారీల అక్రమాలకు స్థిరపడిందా, అలాంటి వ్యవహారం ఏమీ కొనసాగలేదు. కానీ కాంట్రాక్టర్లు మాత్రం అందరూ ఆ హోటల్లో అధికారిని కలవడం ఎందుకు జరిగింది. ఏదైనా అధికారి వస్తే కార్యాలయంలో, విధి నిర్వహణ చేయడం జరుగుతుంది కానీ గ్రీన్ ప్రాంతంలో, కాంట్రాక్టర్లను పీల్చుకోవడం, టీజీఎండిసి గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం కొనసాగిస్తూ, అక్రమాలకు ప్రోత్సహిస్తూ నుండి అనడానికి దీనికంటే పెద్ద సాక్ష్యం మరిన్ని ఉండదు.

ఇక మండలంలో ఇసుక క్వారీలో అక్రమ వసూళ్లకు గ్రీన్ సిగ్నల్.

ఇక మండలంలో ఇసుక క్వారీల అక్రమాలకు గ్రీన్ సిగ్నల్ దొరికినట్టే, దానికి మరో సాక్ష్యం ఉన్నత అధికారి కాంట్రాక్టర్లకు ఓ హోటల్లో గుట్టుచప్పుడు కాకుండా పిలుచుకొని తమ సెట్టింగులు సక్సెస్ చేసుకోవడం జరిగిందన్న సమాచారమే సాక్ష్యం. ఆ అధికారితో సెట్టింగ్ అనంతరం, మహాదేవపూర్ పుసుపుపల్లి ఒకటి ఇసుక క్వారీలో గతంలో 700 రూపాయలు వసూలు చేసే ఈ క్వారీ గత రెండు రోజుల నుండి వెయ్యి రూపాయలు సీరియల్ పేరుతో వసూలు చేస్తుంది. ఇక ఇదే క్రమంలో పలువుల 8 ,9, గత వారం రోజులుగా 100 నుండి 150 లారీల వరకు ఈ రెండు క్వారీలు పెద్ద మొత్తంలో లారీలు ఇసుక రవాణా చేయడం జరిగింది. ప్రస్తుతం మండలంలో 11 క్వారీలు నిర్వహణలో ఉన్నప్పటికీ వీటిలో, పలువుల 8 ,9, మహాదేవపూర్ పుసుపుపల్లి వన్, రీచ్ ల్లో అక్రమ వసూళ్లకు మరింత రెట్టింపు ఉత్సాహంతో వసూళ్ల పరంపరను సాగిస్తున్న సాగిస్తున్నాయి.

 

TGMDC

 

ఆగని కుంట్లం గోదావరి నుండి పక్క జిల్లా క్వారీకు ఇసుక రవాణా.

టి జి ఎం డి సి ఇసుక అక్రమాల వ్యవహారం పై కనీస చర్యలు తీసుకోకపోవడం, అందిస్తాయి అధికారులు కాంట్రాక్టర్లకు వత్తాసు పలకడం, టీజీఎండిసి నిబంధనలకు తుంగలో తొక్కి అక్రమ వ్యవహారాలను టీజీఎండిసి అధికారులు ప్రోత్సహిస్తున్నారని సాక్షాలు తెరపైకి వచ్చిన కూడా చర్యలు తీసుకోకపోవడమే, ఇసుక కాంట్రాక్టర్లు ఇసుక క్వారీలో అక్రమాలు, మైనింగ్ శాఖ క్వారీలకు ఇచ్చిన నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రీచుల నిర్వహణ కొనసాగించడం జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు, తాజాగా మంచిర్యాల జిల్లా ఎర్రయిపేట పేరుతో నిర్వహించబడుతున్న ఇసుక కాంట్రాక్టర్, టీజీఎండిసి నిబంధనలను తుంగలో తొక్కి, నడి గోదావరిలో అక్రమంగా రోడ్డు నిర్మించి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని కుంట్లం గ్రామ శివారు వద్ద ఉన్న గోదావరి నుండి ఇసుకను రవాణా, చేయడం జరుగుతుంటే టీజీఎండిసి అధికార యంత్రాంగం, గోదావరిలో అక్రమ రోడ్డు నిర్మిస్తే రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ ఏలాంటి చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్టుగా వివరించడం, ఇసుక క్వారీ అంటేనే అధికారులకు ,”కన్ఫామ్ కమిట్మెంట్” అనే విధంగా మారింది. అందుకే ఏమో ఇసుక క్వారీల్లో అక్రమాలు, సరిహద్దులు దాటి ఇసుక తోడుతున్న ఎవరు పట్టించుకునే పరిస్థితి లేకపోయింది.

నేటి ధాత్రి చెప్తూనే వస్తుంది, అక్రమాలకు సూత్రధారి టిజిఎండిసి.

గత నెల ఏప్రిల్ 4వ తేదీ నుండి నేటి ధాత్రి వరుస కథనాలతో పి జి ఎం డి సి కింది స్థాయి అధికారి నుండి ఉన్నత స్థాయి అధికారి వరకు, ఇసుక వారిల్లో జరుగుతున్న అక్రమాలకు క్రియాశీలక పాత్ర పోషిస్తూ, సూత్రధారి టీజీఎండిసి శాఖ అని సాక్షాలతో పైకి తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ ఉన్నత అధికారులు టి జి ఎం డి సి మేనేజింగ్ డైరెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ మైనింగ్, దృష్టి సాధించకపోవడం కిందిస్థాయి అధికారులకు మరింత బలాన్ని చేకూర్చి, టి జి ఎం డి సి ఇసుక రీచ్ ల వద్ద ఉన్న సిబ్బంది నుండి మొదలుకొని ఉన్నత అధికారుల వరకు, చీకటి ఒప్పందాలు విచారణ పేరుతో హోటల్లో ముఖం వేసి కాంట్రాక్టర్లను పిలిపించుకొని సెటిల్మెంట్ చేసుకోవడం జరిగింది అన్నా తాజా సమాచారం, వీటిని పరిగణంలోకి తీసుకుంటే టీజీఎండిసి ఇసుక రీచుల అక్రమాలకు సూత్రధారి అని చెప్పడానికి సందేహ పడాల్సిన అవసరం లేదు.

 

TGMDC

ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఇసుక అక్రమాల పై విచారణకు అదేశిచాలి.మండల ప్రజలు.

ఇసుక అక్రమ వ్యవహారాలపై చర్యలు తీసుకోవడంలో టి జి ఎం డి సి విఫలం కావడం జరిగింది. అక్రమ వ్యవహారాలపై అనేక సాక్షాలతో, తేరపై కి తీసుకువచ్చిన అధికార యంత్రాంగం, టీజీఎండిసి ఉన్నత అధికారులు స్పందించకపోవడం, ఇసుక కాంట్రాక్టర్లు అక్రమాల్లో మరింత రెట్టింపు ఉత్సాహం కొనసాగించడం జరుగుతుంది. ప్రభుత్వ నిబంధనలకు ఇసుక రీచుల్లో నేటికీ అమలు కాకుండా, ఇసుక రీచుల్ల క్వాంటిటీ అయ్యేవరకు టీజీఎండిసి చీకటి ఒప్పందంతో, కాంట్రాక్టర్లకు శాఖ సిబ్బంది ద్వారా వసూలు చేయించి ఇవ్వడం లాంటి కొనసాగించడం తో రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుక వ్యవహారంపై ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చేలా ఇప్పటికే టీజీఎండిసి వివరించడం జరిగింది. టి జి ఎం డి సి ఇసుక అక్రమాలపై ఇక చర్యలు తీసుకునే పరిస్థితి లేదని ప్రజలకు కూడా స్పష్టం కావడం జరిగింది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఇసుక అక్రమాల వ్యవహారంపై దృష్టి సాధించి, రెవెన్యూ విజిలెన్స్ శాఖలను ఆదేశించి విచారణ చేపట్టి, ఇప్పటికీ పెద్ద మొత్తంలో అక్రమాలు చేపట్టిన క్వారీలపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

మేడే కార్యక్రమాలను విజయవంతం చేయండి.!

“మేడే” కార్యక్రమాలను విజయవంతం చేయండి

సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపు

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి ):

ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చంద్రంపేట ఏరియాలో ప్రపంచ కార్మిక దినోత్సవం 139 “మే డే” కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను సి.ఐ.టి.యు జిల్లా కార్యదర్శి కోడం రమణ ఆవిష్కరించారు. అనంతరం తాను మాట్లాడుతూ కార్మిక వర్గం , కష్టజీవులు పోరాడి హక్కులు సాధించిన రోజు “మే డే” అని అన్నారు.
సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండల వ్యాప్తంగా “మేడే” కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని మే 1 వ. తేదీన ఉదయం 8 గంటలకు చంద్రంపేట ఏరియాలో సి.ఐ.టి.యు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఉదయం 10 గంటలకు సిరిసిల్ల పట్టణం బి.వై. నగర్ లోని జెండా చౌరస్తా వద్ద “మే డే” అమరవీరుల చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించి భారీ బహిరంగ సభ , భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇట్టి “మేడే” కార్యక్రమాలు , వేడుకలలో పవర్లూమ్ , వార్పిన్ , వైపని అనుబంధ రంగాల కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు గుండు రమేష్,సబ్బని చంద్రకాంత్, రమేష్, శ్రీను, నర్సయ్య, శ్రీకాంత్, వైపని వర్కర్స్ యూనియన్ నాయకులు ఎక్కల్ దేవి జగదీష్,చెముటి రాము , మ్యాన రాజు,గడుదాస్ వేణు,ఇమ్మశెట్టి లక్ష్మణ్,మిట్టపల్లి ప్రసాద్,బోగ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

ఛలో వరంగల్ సభను విజయవంతం చేద్దాం..

ఛలో వరంగల్ సభను విజయవంతం చేద్దాం
ఐనవోలు మండల బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ తంపుల మోహన్

 

బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఐనవోలు మండలంలోని బిఆర్ఎస్ సైనికులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలనీ ఐనవోలు మండల బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ తంపుల మోహన్ పిలుపునిచ్చారు.ఈ సభ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుందని
ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న వరంగల్ సభ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుందని అభివర్ణించాడు.రామాయణంలో రాముని కోసం రామదండు లంకకు ఏవిధంగా బయలుదేరిందొ అదేవిధంగా మన అధినేత కెసిఆర్ కోసం మన గులాబీదండు అలాగే బయలుదేరాలని మోహన్ పిలుపునిచ్చారు.ఆదివారం జరగబోయే సభలో మన అధినేత కెసిఆర్ సందేశం కోసం యావత్ తెలంగాణ సమాజం ఎదురుచూస్తుందనారు.
420 హామీలతో ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టిన కాంగ్రెస్ కు ఈసభతో వెన్నులో వణుకు పుట్టా లనని అన్నారు.
జాతీయ పార్టీలతో తెలంగాణకు ఒరిగిందేమిలేదని
తెలంగాణ కోసం పుట్టిన మన పార్టీతోనే తెలంగాణకు అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
మన రాష్ట్రం- మన పార్టీ అనే నినాదంతో ముందుకు సాగాలని మోహన్ పిలుపునిచ్చారు.

ఓరుగల్లు మహా సభను విజయవంతం చేద్దాం.

ఓరుగల్లు మహా సభను విజయవంతం చేద్దాం

బిఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గంట కళావతి

పరకాల నేటిధాత్రి

ఊరు వాడా ఉప్పెనలా కదులుదాం ఓరుగల్లు మహా సభను విజయవంతం చేద్దాం అని పరకాల పట్టణ బిఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గంట కళావతి పిలుపునిచ్చారు.27న వరంగల్ ఎల్కతుర్తిలో జరుగుతున్న బిఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబి సైనికులు కదిలి రావాలని కోరారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి కనీ విని ఎరుగని రీతిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పరకాలను అభివృద్ధి చేశారని తెలిపారు. అలాంటి అభివృద్ధి ప్రదాత ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లాలో బిఆర్ఎస్ రజతోత్సవ సభను ఈ నెల 27న నిర్వహిస్తున్నారని ఆ సభకు ప్రతి ఒక్కరు వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి.

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

 

నడికూడ,నేటిధాత్రి:

 

చరిత్రలో నిలిచేలా రజతోత్సవ సభను గ్రామ గ్రామన పండుగ వాతావరణం ఇప్పటికే సిద్ధమవుతున్న పల్లెలు పట్టణాలు దేశంలోనే అతిపెద్ద సభగా రికార్డుసృష్టించే అవకాశం ఈ సభను విజయవంతం చేయాలి ఈ నేల 27 న ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సుమారు 1300 ఎకరాల సువిశాల ప్రదేశంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయిని బీఆర్ఎస్వి నడికూడ మండల అధ్యక్షులు దురిశెట్టి వెంకటేష్ తెలిపారు. నడికూడ మండలంలోని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు,రైతులు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు.

గోర్ మాటీ సదస్సును విజయవంతం చేయండి.!

గోర్ మాటీ సదస్సును విజయవంతం చేయండి

ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్

మరిపెడ నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో లంబాడీల ఐక్య వేదిక డోర్నకల్ నియోజక వర్గ కమిటీ ఆధ్వర్యం లో భవ సంగ్ మహారాజ్ మరియు దండి మ్యారాయా యాడీ మాకుల క్షేత్రం లో జరిగే గోర్ మాటీ ఆత్మ గౌరవ సదస్సు కు యొక్క పోస్టర్ ను ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామ్ చందర్ నాయక్ ను ఐక్య వేదిక బృందం కలిసి పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది ఈ సమావేశానికి అందరూ హాజరు అయి విజయవంత చేయాలి అని పిలుపు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భముగా లంబాడీల ఐక్య వేదిక ఆధ్వర్యం లో జరిగే సప్త భవాని మాతలు , 6 గురు జాతి గురువులు, బాలాజీ మహారాజ్, భవసంగ్ మహారాజ్, బుడియ బాపు, లింగ మసంద్, లోక మసంద్ ల భోగ్ భండార్ కార్య క్రమానికి జాతి గురువులు, సాధువులు, సంతువులు, బావాలు, భగత్ ల చేతుల మీదుగా మాత్రమే జరిగే భోగ్ కార్య క్రమానికి హాజరు అయ్యి శనివారం ఏప్రిల్ 26 న జరిగే మాకుల భవసంగ్ మహారాజ్ వెంకటేశ్వర స్వామి వారి బండ్లు తిరిగే కార్య క్రమానికి అందరూ హాజరు అవ్వాలని పిలుపు ఇచ్చారు.ఈ కార్య క్రమం లో జాదవ్ రమేష్ నాయక్ లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త అలాగే పూజారుల సంఘం నాయకులు బానోత్ సీతారాం నాయక్,రవి నాయక్ గూగులోత్ ,మరిపెడ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పెండ్లి రఘువీరా రెడ్డి, యుగంధర్ రెడ్డి,భట్టు నాయక్, మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు బోడ రవి నాయక్ జిల్లా విద్యార్థి విభాగం సమన్వయ కర్త బాసు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

రజతోత్సవ సభను విజయవంతం చేయండి.!

బి.ఆర్.ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయండి

సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని 37వ వార్డులో మాజీ కౌన్సిలర్ రెడ్డి మాధవి రాజు ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్ల పట్టణంలో డప్పు సప్పులతో ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి ఆహ్వాన పత్రికను అందించి కుటుంబ సమేతంగా తేది:27-4-24 ఆదివారం రోజున జరగబోయే భారత రాష్ట్ర సమితి పార్టీ 25వ వేడుకల సందర్భంగా రజతోత్సవ సభను విజయవంతం చేయవలసిందిగా కోరడం జరిగినది. అంతే కాకుండా భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాటలు విని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సవినాయంగా వార్డు ప్రజలను కోరుతూ ఆహ్వాన పత్రిక అందించడం జరిగినది.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధి గా భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాజా మాజీ చేనేత, జౌలి మరియు టెక్స్ టైల్స్ కార్పొరేషన్ అధ్యక్షులు గూడూర్ ప్రవీణ్, సిరిసిల్ల పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు బత్తుల వనజ రమేష్, 37.వ వార్డు బి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి,కూరపాటి భూమేష్, బూత్ అధ్యక్షులు వేముల తిరుపతి, మహిళా విభాగం వార్డు అధ్యక్షులు ముదారపు లలిత రాజేశం, కమిటీ సభ్యులు, ఎక్కల దేవి శ్యామల, గంగుల సదానందం, మచ్చ సురేష్, గాజుల ఎల్లయ్య, జిందం రాజేశం, బోద్దుల రమేష్, పచ్చనూరు తిరుపతి, గజ్జల లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను.!

వరంగల్ ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను విజయవంతం చేయాలి. 

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

వరంగల్ ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు నాయకులకు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు
మాజి మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు

Silver Jubilee Celebration

బిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ మండల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే, మాట్లాడుతూ.ఈనెల 27న ఎల్కతుర్తి బిఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు తరలిరావాలని ,ఎల్కతుర్తిలో జరుగనున్న రజతోత్సవ సభలో కేసీఆర్‌ తెలంగాణ ప్రజల భవిష్యత్‌ గురించి దిశా నిర్దేశం చేయనున్నారని, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Silver Jubilee Celebration

ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,పెంట రెడ్డి,
జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,పాక్స్ చైర్మన్ మచ్చెందర్,బీసీ సెల్ మండల అధ్యక్షులు అమిత్ కుమార్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు హీరు రాథోడ్,మైనార్టీ మండల అధ్యక్షులు వహీద్,మండల పార్టీ జనరల్ సెక్రటరీ మోహన్ రెడ్డి,మాజి సర్పంచ్ లు చిన్న రెడ్డి,విజయ్ ,అబ్రహం,మాజి ఎంపీటీసీ లు బస్వరాజు,రాములు,శంకర్,గ్రామ పార్టీ
అధ్యక్షులు,నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభను.!

భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభను విజయవంతం చేయండి. 
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రలో తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశలో 27న జరిగే 25 వసంతల రజతోత్సవ చలో వరంగల్ సభకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి అధిక సంఖ్యలో ప్రజలను కార్యకర్తలను వచ్చి విజయవంత చేయవలసిందిగా కోరారు ఈ సమావేశం లో ముఖ్యఅతిథులుమాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్, వేములవాడ నియోజకవర్గం ఇంచార్జ్ చల్మెడ లక్ష్మి నరసింహరావు మరియు, మాజీ జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి జెడ్పి వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సిరిసిల్ల మాజీ మున్సిపల్ చైర్మన్ జిందం కళ చక్రపాణి, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి బొల్లి రాంమోహన్ కుంబాల మల్లారెడ్డి నాగరాజు, యాదవ్ వివిధ మండలాల మాజీ జెడ్పిటీలు, ఎంపిటిసీలు సర్పంచ్ లు కౌన్సిలర్స్లు కార్యకర్తలు పాల్గొన్నారు.

27 న రజతోత్సవ సభను విజయవంతం చేయండి.

27 న రజతోత్సవ సభను విజయవంతం చేయండి

బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోతె కర్ణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండలం కొండాపూర్ వెంకటేశ్వర్ పల్లె గ్రామాలలోభూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహా సభకు అధిక సంఖ్యలో పాల్గొనేలా కార్యకర్తల ను సమాయత్తం చేస్తూ రోజు ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న గణపురం మండల పార్టీ మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి

రజతోత్సవ సభను విజయవంతం చేయండి.

రజతోత్సవ సభను విజయవంతం చేయండి

మహిళా ప్రధాన కార్యదర్శి సాంబరాజు జ్యోతి

పరకాల నేటిధాత్రి

 

 

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయ వంతం చేయాలని పరకాల పట్టణ మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి సాంబరాజు జ్యోతి పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా జ్యోతి మాట్లాడుతూ నిధులు,నీరు,నియామకాల్లో అనే నినాదలతో 25 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిందన్నారు.తెలంగాణ సాధన కోసం బీఆర్ఆఎస్ పుట్టిందని అన్నారు.పార్టీ ఏర్పాటు నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా అడుగులు వేసిందని రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ పోరాడారని గుర్తుచేశారు.పరకాల పట్టణం నుండి సభకు నాయకులు,మహిళా నాయకురాళ్లు,కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి.

బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి.
మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కలపెల్లి చందర్ రావు

నేటిధాత్రి అయినవోలు :-

 

 

 

 

వర్ధన్నపేట నియోజకవర్గం అయినవోలు మండలం ఉడుతగూడెం గ్రామంలో శనివారం టిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు తోట రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన టిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నందనం సొసైటీ వైస్ చైర్మన్ తక్కలపల్లి చందర్ రావు మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన ఎలుకతుర్తి ఎక్స్ రోడ్డులో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రచతోత్సవ సభకు గ్రామంలో అధిక సంఖ్యలో హాజరై సభ విజయవంతం అయ్యేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని రానున్న రోజుల్లో బి. ఆర్. ఎస్. అధినేత కేసీఆర్ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతున్నారని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ టిఆర్ఎస్ ఇన్చార్జి కట్కూరి రాజు మండల నాయకుడు కొమురయ్య, దేవదాసు ఆకారపు యాదవ రెడ్డి ప్రతాపరెడ్డి చంద్రారెడ్డి సుదర్శన్ రెడ్డి రమేష్ నరేష్ రవి వీరస్వామి రవి యాదగిరి శీను అనిల్ మల్లయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

రజితోత్సవ సభను విజయవంతం చేయండి

రజితోత్సవ సభను విజయవంతం చేయండి

జైపూర్,నేటి ధాత్రి :

లక్షలాదిగా తరలి వచ్చి బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ శ్రేణులు కోరారు.స్థానిక నియోజకవర్గం కోటపల్లి మండలంలోని సర్వాయిపేట గ్రామంలో బీఆర్ఎస్ చలో వరంగల్ బహిరంగ సభ వాల్ పోస్టర్లను శుక్రవారం విడుదల చేశారు.చలో ఎల్కతుర్తి,వరంగల్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లలలో భాగంగా వివిధ కార్యక్రమాలు నియోజవర్గ పరిధిలో చేపడుతున్నమన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి మాజీ పార్లమెంటు సభ్యులు,మాజీ ప్రభుత్వ విప్,బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 27 న వరంగల్ లో జరిగే బహిరంగ సభకు లక్షలాదిగా జనం తరలి రావాలన్నారు.పార్టీ ఏర్పడి విజయవంతంగా రెండు దశాబ్దాల నర పూర్తయిన సందర్భంగా 25 సంవత్సరాల గులాబీ పండుగ వేడుకల్లో ప్రతి ఒక్కరూ తరలి రావాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.ఉద్యమ స్ఫూర్తితో ఓరుగల్లుకు దండై కదులుదామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా బాపు నాయక్,రాజ్ కుమార్ యాదవ్,దుర్గం రాజేందర్,దుర్గం సంపత్,సప్ప భాస్కర్,జిమిడి సాగర్,దుర్గం రోహిత్,జిమిడి చంద్రయ్య,బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

రజితోత్సవ సభను విజయవంతం చేయండి..

రజితోత్సవ సభను విజయవంతం చేయండి
– పోస్టర్ ఆవిష్కరణ
– టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

బిఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన జరిగే పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయడానికి సిరిసిల్ల తెలంగాణ భవన్లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రజతోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరించంకోవడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ 27వ తేదీన జరిగే పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయడానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యధికంగా హాజరుకావాలని కోరడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, రాష్ట్ర నాయకులు గూడూరి ప్రవీణ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య,సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ,మ్యాన రవి, ఎండి సత్తార్, బొల్లి రామ్మోహన్, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, టిఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.

సిపిఐ 11వ మహాసభను జయప్రదం చేయండి.

సిపిఐ కరీంనగర్ నగర11వ మహాసభను జయప్రదం చేయండి.

సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు

కరీంనగర్, నేటిధాత్రి:

 

ఈనెల 18వ తేదీన సిపిఐ కరీంనగర్ నగర పదకోండవ మహాసభ నగరంలోని గణేష్ నగర్ లో గల బద్ధం ఎల్లారెడ్డి భవన్ లో ఉదయం 10:30 గంటలకు జరగనుందని ఈయొక్క మహాసభకు నగరంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మహా సభను విజయవంతం చేయాలని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజులు కోరారు. ఈయొక్క మహాసభకు ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామిలు హాజరై ప్రసంగిస్తారని వారు తెలిపారు. ఈయొక్క నగర మహాసభలో కరీంనగర్ నగరంలోని అరవైవ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయుటకు కార్యకర్తలను సంసిద్ధం చేయడం జరుగుతుందన్నారు. నగరంలో గత రెండు సంవత్సరాలుగా అభివృద్ధి పనులు అటకెక్కాయని గత ప్రభుత్వం ఆగ మేఘాల మీద అనేక పనులను శంకుస్థాపనలు చేసి వదిలేసిందని చాలా ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని ఎన్నికల ముందు చెప్పి పూర్తిగా మరిచిపోయారని ఆరోపించారు. స్మార్ట్ సిటీ పనుల్లో పూర్తిగా అవినీతి అక్రమాలు జరిగాయని, మానేర్ రివర్ ఫ్రంట్ తీగల వంతెన పనుల్లో పూర్తిగా నాణ్యత లోపించి రోడ్డు పూర్తిగా ధ్వంసమవుతుందని గత మున్సిపల్ పాలకవర్గం పూర్తిగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డందని భూకబ్జాలు, ఇండ్లు కడితే కమిషన్లు, ఇంటి నెంబర్ కు డబ్బులు తీసుకుని నానా రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టారని ఈసమస్యలతో పాటు నగరంలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాల కోసం రేషన్ కార్డుల కోసం అర్హులైన వారికి పెన్షన్ల కోసం రానున్న కాలంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్ళుటకు ఈమహాసభ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం, ఆరు గ్యారెంటీలు అర్హులైన వారికి అందే వరకు ఉద్యమాలతో ఒత్తిడి తీసుకువచ్చి పేద ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందే వరకు పోరాట కార్యాచరణ చేస్తామని సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు తెలిపారు. ఈమహాసభ నగర ప్రజల దశ దిశ మార్చేందుకు ఉపయోగపడుతుందన్నారు. కావున నగర ప్రజలు మహాసభలో అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.

సిపిఐ కరీంనగర్ నగర11వ మహాసభను జయప్రదం చేయండి.

సిపిఐ కరీంనగర్ నగర11వ మహాసభను జయప్రదం చేయండి.

సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

ఈనెల 18వ తేదీన సిపిఐ కరీంనగర్ నగర పదకోండవ మహాసభ నగరంలోని గణేష్ నగర్ లో గల బద్ధం ఎల్లారెడ్డి భవన్ లో ఉదయం 10:30 గంటలకు జరగనుందని ఈయొక్క మహాసభకు నగరంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మహా సభను విజయవంతం చేయాలని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజులు కోరారు.

ఈయొక్క మహాసభకు ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామిలు హాజరై ప్రసంగిస్తారని వారు తెలిపారు. ఈయొక్క నగర మహాసభలో కరీంనగర్ నగరంలోని అరవైవ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయుటకు కార్యకర్తలను సంసిద్ధం చేయడం జరుగుతుందన్నారు.

నగరంలో గత రెండు సంవత్సరాలుగా అభివృద్ధి పనులు అటకెక్కాయని గత ప్రభుత్వం ఆగ మేఘాల మీద అనేక పనులను శంకుస్థాపనలు చేసి వదిలేసిందని చాలా ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని ఎన్నికల ముందు చెప్పి పూర్తిగా మరిచిపోయారని ఆరోపించారు.

Congress

స్మార్ట్ సిటీ పనుల్లో పూర్తిగా అవినీతి అక్రమాలు జరిగాయని, మానేర్ రివర్ ఫ్రంట్ తీగల వంతెన పనుల్లో పూర్తిగా నాణ్యత లోపించి రోడ్డు పూర్తిగా ధ్వంసమవుతుందని గత మున్సిపల్ పాలకవర్గం పూర్తిగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డందని భూకబ్జాలు, ఇండ్లు కడితే కమిషన్లు, ఇంటి నెంబర్ కు డబ్బులు తీసుకుని నానా రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టారని ఈసమస్యలతో పాటు నగరంలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాల కోసం రేషన్ కార్డుల కోసం అర్హులైన వారికి పెన్షన్ల కోసం రానున్న కాలంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్ళుటకు ఈమహాసభ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం, ఆరు గ్యారెంటీలు అర్హులైన వారికి అందే వరకు ఉద్యమాలతో ఒత్తిడి తీసుకువచ్చి పేద ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందే వరకు పోరాట కార్యాచరణ చేస్తామని సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు తెలిపారు. ఈమహాసభ నగర ప్రజల దశ దిశ మార్చేందుకు ఉపయోగపడుతుందన్నారు. కావున నగర ప్రజలు మహాసభలో అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం…

బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం…

బిఆర్ఎస్ నియోజక వర్గ ఇన్చార్జి రాజా రమేష్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

ఈనెల 27న ఎల్కతుర్తి లో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ రాజా రమేష్ అన్నారు.బుదవారం రామకృష్ణాపూర్ పట్టణంలో సభకు సంబంధించి కేసీఆర్ వాల్ రైటింగ్ తో ప్రజలను, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.అనంతరం రాజా రమేష్ మాట్లాడుతూ..

BRS Silver Jubilee Celebration

మున్సిపాలిటీలోని 14,15,17,18,20 వార్డు లలో వాల్ పోస్టర్లను అంటించడం అంటించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కంభగోని సుదర్శన్ గౌడ్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామిడి కుమార్, బడికల సంపత్,ఆలుగుల సత్తయ్య,మాజీ కౌన్సిలర్లు పోగుల మల్లయ్య,బోయినపల్లి అనిల్ రావు,రేవెల్లి ఓదెలు, జిలకర మహేష్,పారుపల్లి తిరుపతి,గడ్డం రాజు, చంద్రమౌళి, లక్ష్మారెడ్డి,రంగరాజు,పైతారి ఓదెలు,మేకల రమేష్,వేనంక శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రామిడి లక్ష్మీకాంత్,ఆశనవేణి సత్యనారాయణ,టైలర్ రాజు,చంద్ర కిరణ్,కుర్మ దినేష్,దేవి సాయి కృష్ణ, శివ,మణి, గోనె రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం.

ప్రజలారా కథం కథం తొక్కి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం

-మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఛలో వరంగల్ సభను విజయవంతం కొరకు పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్య టిస్తున్నారు.ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను జయ ప్రదం చేసే దిశగా ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ 2001 ఏప్రిల్ 27 నాడు కెసిఆర్ ఆ రోజు తన పదవికి రాజీనామా చేసి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను చూసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉంటే లాభం లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతున్నటు వంటి ఒక లక్ష్యం తోటి కేసిఆర్ పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టి 24 సంవత్సరాలు పూర్త యి 25వ సంవత్సరాల్లో అడు గుపెడుతున్న సందర్భంగా పార్టీ రజతోత్సవ సభను నిర్వ హించాలని చెప్పి నిర్ణయం చేసి, అది కూడా మనం నా భూతో నా భవిష్యత్ అనేలా పెద్ద సభను నిర్వహిస్తున్నాం.

BRS party’s

 

భవిష్యత్ లో ఇంత పెద్ద మొత్తంలో ఎవరూ నిర్వహించ లేరు. మరి ప్రజలు కూడా ఆవిర్బవాసభకు రావడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకతను చవిచూసినటు వంటి ప్రభుత్వాలు ఉండవు, దానికి కారణమేంటంటే అమ లు కానీ హామీలు ఇచ్చి, హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నటు వంటి తీరు ప్రజలలో అసహనానికి గురిచేస్తుంది.కేసిఆర్ అధికా రంలో ఉన్నప్పుడు ఏ స్కీమ్స్ అయితే అమలు అయినవో వాటినే అమలు చేస్తున్నారు. ఎట్లా ఉన్నది పరిపాలన అంటే మరి అనుభవం లేని పరిపా లన, అసమర్ధ పరిపాలన, చేత గాని వ్యవహారం ఇవన్నీ చేసు కుంటుప్రజల దగ్గరికి వస్తే అర్థం చేసుకున్నారు.ప్రజలు కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రకంగా మా యొక్క జీవితాలు అద్భుతంగా ఉన్నాయి.

ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగింది అని నేడు పునరాలోచించుకుంటున్నారు. ఎప్పుడైనా సామెత ఉంటాది పాలు ఇచ్చే గేదెను కాదని దున్నపోతును తెచ్చుకున్నట్టు ఉంది అన్న చందనంగా ప్రజలు చర్చించుకుంటున్నారు.రేపు ఎన్నిక ఏదైనా ఎగిరేది బిఆర్ ఎస్ జెండానే గెలిచేది బిఆర్ ఎస్ అభ్యర్దులే.

ఈ ఏప్రిల్ 27న జరగబోయే మన సభా తెలం గాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయి. కాబట్టి మిత్రులారా కథం కథం తొక్కి బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయ వంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version