అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం చేయండి.

అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం చేయండి

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు ప్రెస్ క్లబ్ లో రేపు జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ద వేడుకల్లో భాగంగా ఈరోజు ప్రెస్ క్లబ్ లో ఆయుష్ యునాని డిస్పెన్సరీ యోగా శిక్షకులు బీ.శ్రీనివాస్ మాట్లాడుతూ భారత ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు 2014లో జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగినది. అందుకు రేపు సిరిసిల్ల జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రభుత్వం నుండి జరుపుతూ స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యార్థులు, యువకులు, అధికారులు, నాయకులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరడం జరిగినది. నేటి పరిస్థితుల్లో మానవ జీవన గమనానికి యోగా ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటిదని తెలిపారు. రేపు జరగబోయే యోగా దినోత్సవం విజయవంతం చేయవలసిందిగా కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆయుష్ యునాని డిస్పెన్సరీ యోగా శిక్షకులు బీ.శ్రీనివాస్,మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, బెల్లాజి శ్రీనివాస్,దూస రమేష్. ఉప్పరపల్లి విజయ్. వడ్నాల శ్రీనివాస్. కోడం రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version